transfers
-
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
జీవో 317 బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జీవో–317 కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్ కేటగిరీ, పరస్పర బదిలీలు, అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బదిలీలను డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో జీవో–317, జీవో–56 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతిచ్చింది. ఇక భార్యాభర్తలు ఒకేచోట! రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే భార్యాభర్తలను ఒకవేళ వే ర్వేరు లోకల్ కేడర్లకు కేటాయిస్తే కేడర్ మార్పును కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకా శం కల్పిస్తామని జీవో–317లో ప్రభుత్వం పేర్కొంటోంది. పాలనావసరాలు, ఖాళీలకు లోబడి భార్యాభర్తలిద్దరినీ ఒకే కేడర్కు కేటాయిస్తామని హామీ ఇ చ్చింది. కొన్ని శాఖల్లో దీన్ని అమలు చేయలేదు. చాలామంది ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద కేడర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రివర్గం ఈ అంశాన్ని పరిశీలించి ఖాళీలకు లోబడి గరిష్టంగా సాధ్యమైనంత వరకు కేడర్ మార్పునకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, సిఫార్సులను సేకరించి డిసెంబర్ 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పరస్పర బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ.. ఒకే శాఖలో ఒకే కేటగిరీ పోస్టులను కలిగిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు లోకల్ కేడర్లలో పనిచేస్తుంటే వారిని ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్కు పరస్పర బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా మళ్లీ కొత్తగా పరస్పర బదిలీలకు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక వెబ్పోర్టల్ (po2018mutualtransfers. telangana.gov.in) ను రూపొందించింది. ఎప్పటిలోగా ఈ బదిలీలను పూర్తి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఒకే యాజమాన్యం కింద ఒకే కేటగిరీ పోస్టులో ఉండి ఒకే సబ్జెక్టును ఒకే మీడియంలో బోధిస్తున్న ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్కు పరస్పర బదిలీకి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానికసంస్థల పాఠశాలల్లోని బోధనేతర ఉద్యోగులను పరస్పర బదిలీల్లో భాగంగా మరో లోకల్ కేడర్ పరిధిలోని సంబంధిత జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల్లోని పాఠశాలలకు మాత్రమే బదిలీ చేస్తామని తెలిపింది. పరస్పర బదిలీల కింద వచ్చే ఉద్యోగులను కొత్త లోకల్ కేడర్ సీనియారిటీ జాబితాలో చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంకును కేటాయిస్తామని స్పష్టం చేసింది.అనారోగ్య కారణాల కిందబదిలీలకు పచ్చజెండా.. ఆరోగ్య కారణాల కింద ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్కు బదిలీ కోరుతూ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల కార్యదర్శులు పరీక్షించి అర్హులైన ఉద్యోగుల కేడర్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 70 శాతం, ఆపై వైకల్యం కలిగిన ఉద్యోగులు, కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు ఉద్యోగులు, కేన్సర్ బాధిత ఉద్యోగులు, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయం మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు కేడర్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పించాలని కోరింది. మానసిక వైకల్యంగల పిల్లలు కలిగిన ఉద్యోగులను వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. డిసెంబర్ 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని కోరింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్బుక్లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్బుక్లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
విద్యాశాఖలో భారీగా మార్పులు!
సాక్షి, అమరావతి: విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతోపాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులను సైతం మార్చనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), ఆర్జేడీలకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి కార్యాలయం... అధికారుల మార్పుపై తుది ఫైల్ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు) డైరెక్టర్గా బదిలీ చేస్తారని తెలిసింది. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్గా ఉన్న దేవానందరెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డిని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తారని సమాచారం. అలాగే కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్లలో ఒకరిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా నియమించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డి, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ గంగాభవానీలను సమగ్ర శిక్షకు బదిలీ చేస్తారని సమాచారం. మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్గా ఇంటర్ విద్యలో పని చేస్తున్న శ్రీనివాసరావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వర్రావును ఇంటర్ విద్యకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం బదిలీ చేయనున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా డీఈవో తప్ప మిగిలిన 25 జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆరు నెలల క్రితమే మార్చారు. అయినా ఇప్పుడు మరోసారి వీరందరికీ స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
ఆమ్రపాలికి షాక్.. 9 మంది ఏఐఎస్లు ఏపీకి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్కు బదులుగా తెలంగాణ కేడర్కు కేటాయించాలన్న ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్కు బదులు ఏపీ కేడర్కు కేటాయించాలన్న మరో ముగ్గురు ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులనూ తిరస్కరించింది.తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతోపాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు షంషేర్ సింగ్ రావత్, జి.అనంతరాము ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తూ తమను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించి వారిద్దరినీ ఏపీలోనే కొనసాగాలని ఆదేశించింది. మిగిలిన వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రానికి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడింది. వివాదం నేపథ్యం ఇది... రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏఐఎస్ అధికారుల కేటాయింపులను కేంద్రం చేపట్టింది. ఐఏఎస్ అధికారులు సోమేశ్కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం. ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్లను ఏపీ కేడర్కు.. హరికిరణ్, జి. సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్కు కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. అయితే ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ ఆయా ఐఏఎస్, ఐపీఎస్లు గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వారి వాదనలు విన్న ట్రిబ్యునల్.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పుతో మారిన పరిస్థితి.. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017, 2018లో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. సోమేశ్ కుమార్ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ కేటాయింపును రద్దు చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలని 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది.. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను సమర్ధించింది.. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్న సోమేశ్కుమార్ ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.ఈ తీర్పును నాటి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్ల కేటాయింపులపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకొని గతంలో జరిపిన తుది కేటాయింపులపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వివాదంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది.ఆ అధికారుల విజ్ఞప్తులపై కేంద్రం నిర్ణయం తీసుకొనే వరకు వారందరినీ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ అధికారుల తుది కేటాయింపులపై పునఃపరిశీలన కోసం హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ శాఖ మాజీ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ దీపక్ ఖండేకర్తో ఆ శాఖ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా అధికారుల నుంచి కమిటీ వినతిపత్రాలను స్వీకరించడంతోపాటు వారితో వ్యక్తిగతంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అనంతరం ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరిస్తూ డీవోపీటీకి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను డీవోపీటీ ఆమోదించింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్ అధికారులు 1..మల్లేల ప్రశాంతి 2. వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి 3. ఎ.వాణీ ప్రసాద్, ముఖ్యకార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ 4. డి.రోనాల్డ్ రోస్, ఇంధన శాఖ కార్యదర్శి 5. కాటా ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలంగాణకు కేటాయించాలన్న విజ్ఞప్తి తిరస్కరించడంతో ఏపీలోనే కొనసాగనున్న ఐఏఎస్ అధికారులు.. 1. షంషేర్ సింగ్ రావత్, స్పెషల్ సీఎస్, ఏపీ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) 2.జి.అనంతరాము, స్పెషల్ సీఎస్, ఏపీ అటవీ శాఖ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు 1.అంజనీకుమార్, డీజీ, రోడ్ సేఫ్టీ ఆథారిటీ 2. అభిలాష భిస్త్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏపీ నుంచి తెలంగాణకు రానున్న ఐఏఎస్ అధికారులు... 1.శివశంకర్ లోతేటి – వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ 2. శ్రీజన, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్ 3. సి.హరికిరణ్ -
ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ముగ్గురు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్కుమార్ను ధర్మవరం కమిషనర్గా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వి.మల్లికార్జునను ప్రొద్దుటూరుకు మార్చారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు కమిషనర్గా ఉన్న జి.రఘునాథరెడ్డిని బాపట్ల కమిషనర్గా నియమించారు. ఈ స్థానంలో పనిచేస్తున్న వి.నిర్మల్ కుమార్ను కేంద్ర ఆరి్థక శాఖ (సీసీఏఎస్)కు పంపారు. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
కాసులిస్తేనే నచ్చిన చోటు
రాష్ట్రంలో అధికారికంగా బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసినప్పటికీ పరిశ్రమల శాఖలో కీలక పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తికాలేదు. పైసలు ఇస్తేనే బదిలీ ఆర్డర్లు ఇస్తామంటూ కీలకస్థాయి అధికారి బేరం పెట్టడంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. జనరల్ మేనేజర్ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల బదిలీల వరకు ఎన్నడూ లేనివిధంగా గడువు ముగిసినా ఆర్డర్లు జారీ చేయకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించిన వారికి నచ్చిన చోటకు బదిలీ చేస్తూ పాత తేదీ (బ్యాక్ డేట్)తో ఉత్తర్వులు ఇస్తామంటూ ఉద్యోగులతో నేరుగా బేరాలు సాగిస్తుండటంతో జిల్లాస్థాయి అధికారులు లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తం ఎప్పటినుంచో బదిలీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆర్డరు కాపీని తొక్కిపెట్టారంటూ ఒక ఉద్యోగి వాపోయారు. ఈ విధంగా పైస్థాయి అధికారి నేరుగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్లు చేసి అడగడం ఇప్పటివరకు ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసారి నేరుగా ఆయనే ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. సాక్షి, అమరావతిగృహ నిర్మాణ శాఖలో కాసుల పంట గృహ నిర్మాణ శాఖలో సాధారణ బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండించాయి. సీనియారిటీ, స్పౌజ్ వంటి నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ సిఫార్సులు, వసూళ్లకు పెద్దపీట వేశారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. తన ఓఎస్డీ ద్వారా కీలక ప్రజాప్రతినిధి వసూళ్లకు తెరలేపారు. ఓఎస్డీ నేరుగా డీఈ, ఈఈ, ఎస్ఈలకు ఫోన్లు చేసి వసూళ్ల వ్యవహారం చక్కబెట్టినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆపైన ముట్టచెప్పిన వారికే కోరిన స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు, డబ్బు ఇవ్వని వారికి అప్రాధాన్య పోస్టుల్లోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టింగ్ కావాల్సిన చోట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు తీసుకోవడం కోసం అక్కడ కూడా రూ.లక్షల్లోనే ఉద్యోగులు ముట్టజెప్పారు. రాజకీయ సిఫార్సులు, డబ్బు చెల్లించిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడం కోసం ఏడాది, రెండేళ్ల క్రితం నియమించిన వారిని వేరే చోటకు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆదివారంలోగా బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే, సిఫార్సులు, వసూళ్ల ఆధారంగా కోరుకున్న చోట ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో సోమవారానికి తుది జాబితా గృహ నిర్మాణ శాఖకు అందినట్టు తెలిసింది. పోరుబాటలో ఇంధన శాఖ ఉద్యోగులు! విద్యుత్ సంస్థల్లో బదిలీలకు ముందే సిఫారసు లేఖలు ఇచ్చిన వైనం బయట పడటంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు కనీస అర్హత ఉన్నవారికే సిఫారసులను అన్వయించేలా తీవ్రంగా కసరత్తు చేశారు. అయినప్పటికీ.. తాము అనుకున్న విధంగానే బదిలీలు జరగాలని, తమ సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి నేతలు పట్టుబట్టారు. ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ వారిని ప్రతిపాదించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో 22వ తేదీకే పూర్తవ్వాల్సిన బదిలీలు 23న కూడా కొనసాగాయి. డిస్కంలలో జూనియర్ లైన్మెన్ స్థాయి నుంచి డిప్యూటీ ఇంజనీర్ స్థాయి వరకూ వందల మందిని బదిలీ చేశారు.రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. బీసీ, ఓసీ సంఘాల నేతలకు బదిలీ నుంచి మినహాయింపు (ప్రొటెక్షన్) ఇవ్వలేదు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రెండు సంఘాల ఉద్యోగులు సోమవారం ప్రకటించారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్లు కట్టబెట్టారు. పోస్టింగ్ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
మేము చెప్పినట్లు జరగాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు. ఆ మేరకు కొందరికి పోస్టింగ్లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీ దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం రత్నరాజును డిప్యూటీ ఈవోగా నియమించారు. అలాగే మహానందీశ్వర స్వామి దేవస్థానం డీసీ శోభారాణికి.. ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న విజయ రాజును కర్నూల్ ఉరుకుండ నరసింహ ఎర్రన్న స్వామివారి దేవస్థానానికి డీసీ & ఈవోగా నియమించారు.శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం డీసీ, ఈవో డీవీఎల్ రమేష్ బాబును కాకినాడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. ఈ మేరకు మొత్తం 15 మందికి పోస్టింగ్లతో పాటు బదిలీలు జారీస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణ(ఐఏఎస్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదీ చదవండి: దుష్ప్రచారంలో దిట్ట -
పంచాయతీరాజ్లో భారీగా బదిలీలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పంచాయతీరాజ్ శాఖలోని కీలకస్థానాల్లో ఉన్న దాదాపు 200మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు అయినా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 12 జీవోలను జారీ చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదనలు కొనసాగుతుండగా.. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవో స్థానాల్లో ప్రభుత్వం కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.రాష్ట్రంలో మొత్తం 26 విభజిత జిల్లాలు ఉండగా.. అందులో 25 జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు)గా, 22 జిల్లాల్లో డ్వామా పీడీలుగా కొత్త వారిని నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ స్థాయిల్లో ఇద్దరు డీఎల్డీవోలను నియమించింది. ఏడు జిల్లాలో డీఆర్డీఏ అధికారులుగా కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరు కాకుండా రాష్ట్రమంతటా వివిధ ప్రాంతాల్లో పనిచేసే 49 మంది డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల(డీఎల్డీవో)ను బదిలీ చేసింది. ఇంజనీరింగ్ శాఖలో..పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో ఆర్డబ్ల్యూఎస్లో పలువురు ఇంజనీరింగ్ అధికారులకు పదోన్నతులు కల్పించడంతో పాటు భారీగానే బదిలీలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ల (ఎస్ఈ)కు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతులు కల్పించి, ఒకరిని ఈఎన్సీ కార్యాలయంలోనూ, మరొకరిని రాష్ట్ర సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోనే 12 మంది ఈఈలకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్ఈ)గా పదోన్నతులు కల్పించి, వారిలో తొమ్మిది మందిని వివిధ జిల్లాల ఎస్ఈలుగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరితో పాటు 26 మంది ఈఈలను కూడా బదిలీ చేసింది. మరో ఆరుగురు డిప్యూటీ ఈఈలకు ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్డబ్ల్యూఎస్లోనూ ముగ్గురు ఎస్ఈలు, ఎనిమిది మంది ఈఈలను వేర్వేరు స్థానాల్లో ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖలో 13 మందికి స్థానచలనంఅటవీ శాఖలో 13 మంది రాష్ట్ర కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ కన్సర్వేటర్గా పనిచేస్తున్న ఎం.శామ్యూల్ను అనకాపల్లి డీఎఫ్వోగా, కృష్ణాజిల్లా డీఎఫ్వోగా ఉన్న కె.రాజశేఖరరావును ప్రకాశం సోషల్ ఫారెస్ట్ డీఎఫ్వోగా బదిలీ చేశారు. మరికొందరు డీఎఫ్వోలను బదిలీ చేసి పోస్టింగ్లు ఇవ్వగా, కొందరికి పోస్టింగ్లు ఇవ్వలేదు. వాణిజ్యపన్నుల శాఖలో... వాణిజ్యపన్నుల శాఖలో కమిషనర్గా ఉన్న కె.రవిశంకర్కు చీఫ్ కమిషనర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, మరో కమిషనర్ డి.రమేష్కు విజయవాడ అప్పిలేట్ అడిషనల్ కమిషనర్గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ముగ్గురు అడిషనల్ కమిషనర్లతోపాటు ఏడుగురు జేసీలు, 14 డీసీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఉత్తర్వులిచ్చారు.అర్ధరాత్రి కూడా బదిలీల తంతు బదిలీలకు ఆదివారం ఆఖరి రోజు కావడంతో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జోన్–1 పరిధిలో 124 మందిని బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు, పెద్ద ఆలయాల్లో ఆరుగురు ఇంజనీరింగ్ అధికారుల బదిలీకి సంబంధించి ఒక ఉత్తర్వు ఇచ్చారు. -
నచ్చిన వారికి మెచ్చిన చోటు!
వరంగల్ స్థానికత కలిగిన ఓ సబ్ రిజిస్ట్రార్ మెదక్లో పనిచేస్తుండేవారు. ఆయన 317 జీవో కింద మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లారు. ఆ సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని స్టేషన్ కేటాయించాలని, లేదంటే తనకు స్టేషన్ అవసరం లేదని, చిట్స్కయినా, ఆడిట్కయినా పంపాలని ఆ సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానానికి 100 కిలోమీటర్ల అవతలకు బదిలీ చేశారు. హైదరాబాద్కు సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ జీవిత భాగస్వామి అదే జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులోని నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా తనను స్పౌజ్ కోటా కింద పరిగణనలోకి తీసుకుని తగిన స్థానం ఇవ్వాలని సదరు సబ్ రిజిస్ట్రార్ కోరారు. కానీ ఆయన్ను హైదరాబాద్కు మరింత దగ్గరగా బదిలీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ల యూనియన్ పేరుతో చెలామణి అవుతున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులిచ్చి ఏ గ్రేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బదిలీ చేశారు. ఏసీబీ ట్రాప్ రికార్డులు కూడా పట్టించుకోకుండా కావాల్సిన స్థానానికి బదిలీ చేయడం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: సాధారణ బదిలీల్లో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు అధికారుల కనుసన్నల్లో ఈ బదిలీల తంతు జరిగిందని, బదిలీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు విని్పస్తుండగా, తాజాగా నిఘా వర్గాల నివేదికతో బదిలీలు మరింత హాట్టాపిక్గా మారాయి. ఆప్షన్లు ఒకచోటుకు పెడితే మరో చోటుకు బదిలీ చేశారని, సింగిల్ డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపి, జిల్లా కేంద్రాల్లో సీనియర్ అసిస్టెంట్లతో సరిపెట్టారని, స్పౌజ్ కేసులను పట్టించుకోలేదని, జీరో సరీ్వసు అంటూ అందరినీ బదిలీ చేస్తామని చెప్పి చివరకు పరిపాలనా అవసరాలంటూ పది స్టేషన్ల వరకు బదిలీలు చేయలేదని పలువురు సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు.తమకు నచ్చిన వారికి మాత్రం వరుసగా మూడోసారి ఫోకల్ పోస్టింగులు ఇచ్చారని, చార్మినార్ జోన్ పేరుతో కొందరు సబ్ రిజిస్ట్రార్లను ఏ గ్రేడ్ స్టేషన్ల చుట్టూనే తిప్పుతున్నారని, ఇందుకోసం డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డీఐజీల స్థాయిలో సిద్ధమైన జాబితాకు, విడుదలైన బదిలీల జాబితాలకు పొంతన లేకుండా పోయిందని, ఆ ఇద్దరు అధికారులు చక్రం తిప్పి తమ ఇష్టారాజ్యంగా పేర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పైరవీలకు అస్కారమివ్వకుండా రిజి్రస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులకు బాధ్యత అప్పగిస్తే, అడ్డగోలుగా బదిలీలు చేసి అంతా బాగానే జరిగినట్టు ఆయన్ను నమ్మించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. బదిలీలకు కొద్దిరోజుల ముందే వచ్చిన కమిషనర్ను కూడా బురిడీ కొట్టించి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వస్తుండడం గమనార్హం.ఆప్షన్లు ఎందుకు అడిగినట్టో..? సాధారణ బదిలీల్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్లను ఆప్షన్లు అడిగారు. ఈ ఆప్షన్ల వారీగా వారి ప్రాధాన్యతలను తెలుసుకోవడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే. కాగా సబ్ రిజిస్ట్రార్లందరూ తమ అభీష్టం మేరకు ఆప్షన్లు ఇచ్చి ఆయా స్టేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. తీరా బదిలీల జాబితా చూస్తే ఆప్షన్లు ఇచ్చిన స్టేషన్లకు, తమను బదిలీ చేసిన స్టేషన్కు అసలు పొంతన లేకపోవడంతో విస్తుపోవడం బాధిత సబ్ రిజిస్ట్రార్ల వంతయింది. నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా జూనియర్ అసిస్టెంట్లు! రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు జిల్లా రిజిస్ట్రార్లు లేరు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా రిజిస్ట్రార్లు పనిచేస్తుండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు నోడల్ జిల్లా రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి జిల్లా కేంద్రాలకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా పంపడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు జిల్లా కేంద్రాలతో పాటు, కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన మరో జిల్లా కేంద్రానికి బదిలీల తర్వాత కూడా ఇన్చార్జులే సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగుతుండగా, రోజుకు ఒకటో, రెండో డాక్యుమెంట్లు అయ్యే స్టేషన్లకు మాత్రం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను పంపారనే విమర్శలు ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా సన్నిహితులు! బదిలీల్లో అక్రమాలు, అన్యాయాల మాట అటుంచితే.. సాధారణ బదిలీల గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీగా ఉన్న ఏడెనిమిది కార్యాలయాలకు తమకు నచ్చిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను పంపడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్ తూర్పు దిక్కున అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే స్టేషన్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇంకో స్టేషన్తో పాటు ఖాళీగా ఉన్న స్టేషన్లకు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్పై పంపారని, వీరంతా బదిలీల ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన అధికారులకు సన్నిహితులేననే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్ల విషయంలోనూ ఇష్టారాజ్యంగా బదిలీలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. -
బదిలీకి లేఖ.. దండుకోవడమే ఇక
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీల ప్రజాప్రతినిధులు అందినకాడికి దండుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు వారికి రూ. లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఆ కోవలోనే విద్యుత్ శాఖలో కూడా భారీగా డబ్బులు చేతులు మారాయి. అర్హతను, నిబంధనలను బట్టి చేయాల్సిన బదిలీల్లో రాజకీయ నేతల సిఫారసు లేఖలే రాజ్యమేలుతున్నాయి. ఏ ఉద్యోగిని కదపాలన్నా, ఎక్కడికి బదిలీ చేయాలన్నా, ఉన్నచోటనే ఉంచాలన్నా.. ఈ లేఖా్రస్తాన్ని సంధిస్తే చాలు పనైపోతోంది. ఇందుకోసం ఒక్కో పోస్టుకు దాని ప్రాధాన్యతను బట్టి రూ.5 లక్షల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకూ ఉద్యోగులు సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల బదిలీలకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసు లేఖలు, వాటి ఆధారంగా విద్యుత్ సంస్థలు తయారు చేసిన రాజకీయ బదిలీల జాబితాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తమ మాట వినని వారిని వేధించడం, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు వంటి చర్యలను చూస్తున్న ఉన్నతాధికారులకు ఆ పారీ్టల నేతలు చెప్పింది చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. తమకు అనుకూలురైన వారిని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కిస్తోంది. విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించిన ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్లో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న చంద్రానికి మాత్రం ఏపీసీపీడీసీఎల్లోనూ అదే స్థానాన్ని కట్టబెట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉండటంతోనే రెండు డిస్కంలలో ఒకే పోస్టులో కొనసాగుతున్నారు. ఇక బదిలీల కోసం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన ఉద్యోగుల పేర్లతో ప్రత్యేకంగా జాబితాలను సీఎండీలు తయారు చేయించారు. ఆ జాబితాలు దగ్గర పెట్టుకుని బదిలీల ప్రక్రియను జరిపిస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని వారు, ఎవరి నుంచీ రాజకీయ సిఫారసులు తీసుకుని రాలేని వారు దీనివల్ల బలైపోతున్నారు. వారిని అప్రా«దాన్య పోస్టుల్లోకి, ప్రాంతాలకు బదిలీ చేసేస్తున్నారు.ఇవిగో సాక్ష్యాలు » ఏలూరు సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఏఈఈ) రాజమండ్రి డి7 సెక్షన్కు బదిలీ కోసం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీకి ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిఫారసు చేశారు. » విశాఖ సర్కిల్లో ఓ ఏఈఈని రాజమండ్రి సర్కిల్లోని గోపాలపట్నం రూరల్ సెక్షన్కు బదిలీ చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సిఫారసు చేశారు. » మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ ఏఈని ఏలూరు సర్కిల్ నుంచి రాయవరం బదిలీ చేయమని చెప్పారు. » రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ ఏలూరు సర్కిల్ నుంచి ఓ ఏఈఈని సంపత్నగరం పంపమన్నారు. n ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఓ ఏఈని రాజమండ్రి సర్కిల్ నుంచి ఏలూరు సర్కిల్కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. » ఏలూరు సర్కిల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ)ని కొయ్యలగూడెం సబ్ డివిజన్కు మార్చాల్సిందిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎండీకి లేఖ ఇచ్చారు.ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలలో జరుగుతున్న బదిలీలు మొత్తం ఇదే విధంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగానే జరుగుతున్నాయి. (ఆ ఉద్యోగుల పేర్లు, వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల పేర్లతో సహా ‘సాక్షి’ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారి ఉద్యోగ భద్రత దృష్ట్యా ఆ వివరాలను ప్రచురించడం లేదు.)మేమెందుకు తగ్గాలి?బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీసీపీడీసీఎల్కు కొత్త సీఎండీని నియమించినా ఇటీవల బదిలీపై వచ్చిన ఉన్నతాధికారే మొత్తం బదిలీల ప్రక్రియను చూస్తున్నారు. ఈ డిస్కం పరిధిలో ఓ ఎమ్మెల్యేకి మరో ఉన్నతాధికారి స్వయంగా డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్లో ఓ ఉన్నతాధికారి పశి్చమ గోదావరి జిల్లాలో ఉన్న ఓ ఉద్యోగి సాయంతో సొంత వారి చేత వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నారు.రాజమండ్రికి చెందిన ఓ యూనియన్ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నారు. ఇక ఏపీఎస్పీడీసీఎల్లో ఓ ఉన్నతాధికారికి మూడు డిస్కంలతో అనుబంధం ఉండటంతో ప్రజాప్రతినిధులకు అనుగుణంగా వాటిని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు సామాజిక సమీకరణాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులకూ బదిలీలు!
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుత చంద్రబాబునాయుడి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా వివిధ శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకేచోట ఐదేళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా ఐదేళ్లు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే, నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు.. అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలోని ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.మార్గదర్శకాలివే.. » బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి » దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఈ నెల 29, 30 తేదీలో ఆఫ్లైన్ (వ్యక్తిగతంగా హాజరయ్యే విధానం)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిక్వెస్టు బదిలీల ప్రాధాన్యత క్రమం.. » మొదట దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో కనీసం రెండేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులకు మూడో ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్య, భర్తలకు, పరసర్ప అంగీకార బదిలీలకు క్రమ పద్ధతిలో వీలు కల్పించనున్నారు. » గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, మహిళా పోలీసు ఉద్యోగుల బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీల అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు.» విలేజీ సర్వేయర్లకు సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు వ్యవసాయ శాఖ జేడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లకు జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎంలకు జిల్లా డీఎంహెచ్వో, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కంల ఎస్ఈ అ«దీకృత అధికారులుగా వ్యవహరిస్తారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల అ«దీకృత అధికారులుగా ఉంటారు. » 50 ఏళ్ల లోపు వయస్సు ఉద్యోగులనే గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు. » ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకుని, నిరీ్ణత తేదీలో కౌన్సెలింగ్కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. -
‘పటమట’ పాట.. రూ.2 కోట్ల పైమాట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. లావాదేవీలు, ఆదాయం ఎక్కువగా వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పోస్టులపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. ఆ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్గా వచ్చేందుకు ధర నిర్ణయించి వేలం పాట పెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఈ పాటలో ఎవరెక్కువ మొత్తం చెల్లిస్తారో వారిని ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా.. నిబంధనలతో సంబంధం లేకుండా సబ్ రిజిస్ట్రార్లంతా బదిలీలకు ఆప్షన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనధికారిక ఆదేశాలు అందడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెసెంజరు ద్వారా ఉత్తర్వులు అందించి, రిక్వెస్ట్ ఫారాలను వాట్సప్లో పంపారు. బదిలీ అభ్యర్థనలను శుక్రవారం మధ్యాహ్నంలోపు పూర్తిచేసి పంపాలని షరతు విధించారు. వారు బదిలీ కోరుకుంటున్న స్థానాల ఆప్షన్లతోపాటు గతంలో వారు పనిచేసిన సెంటర్లు, వారిపై ఉన్న కేసులు, సర్వీసు తదితర వివరాలన్నింటినీ ఫామ్లో పూర్తిచేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇది తప్పక పాటించాలని ఆదేశించారు. అయితే, ఇది ఎవరు జారీచేశారో ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం. అసలు బదిలీ స్థానాలు గుర్తించకుండా, ఎవరు బదిలీలకు అర్హులో తేల్చకుండా ఆప్షన్లు ఇవ్వాలని సూచించడం బలవంతపు బదిలీలకు ఒత్తిడి చేయడమేనని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది. డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ..ఎక్కువ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిమాండ్ ఉన్న పోస్టులకు గిరాకీ ఏర్పడింది. దీనిని అసరాగా చేసుకుని, చినబాబు కనుసన్నల్లోనే నడిచే టీం ఈ పోస్టులకు «ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది.» ఇందులో మొదటి స్థానంలో విజయవాడ పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు స్టాండర్డ్ ధర రూ.2 కోట్లుగా నిర్ణయించి, అంతకంటే ఎక్కువ ఇచ్చుకునే వారికే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఈ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పోస్టుకోసం గుణదల, కంకిపాడు, రావులపాలెం సబ్రిజిస్ట్రార్లతో పాటు, ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్, ఐజీకి సన్నిహితంగా ఉండే వారూ పోటీపడుతున్నట్లు సమాచారం. » ఇక రెండవ వరుసలో గాంధీనగర్, గన్నవరం, కంకిపాడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు రూ.కోటికి పైగా ధర పలుకుతున్నాయి. ఈ జాబితాలో గుంటూరు జిల్లా మంగళగిరి, నల్లపాడు, గుంటూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.» అలాగే, విజయవాడ పరిధిలోని నున్న, గుణదల, ఇబ్రహీంపట్నం, నందిగామ, బాపులపాడు సబ్ రిజిస్ట్రార్ పోస్టులూ రూ.70 లక్షల వరకు పలుకుతున్నాయి.» విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఇప్పటికే లోపాయకారీగా వేలం పాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది... ఇలా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా ధరలు ఫిక్స్ చేసి బదిలీల బేరసారాలకు తెరలేపారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రిని కూడా డమ్మీచేసి, ఈ బదిలీల వ్యవహారాలను చినబాబే నేరుగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్గదర్శకాలకు భిన్నంగా ‘చిన్నబాబు’ పెద్ద స్కెచ్..నిజానికి.. ఉద్యోగుల సాధారణ బదిలీలకు వీలుగా ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకనుగుణంగా ఆయా శాఖలు మళ్లీ ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చి బదిలీలు జరపాల్సి వుంది. కానీ, రిజస్ట్రేషన్ల శాఖలో ఈ మార్గదర్శకాలు ఇంకా జారీకాలేదు. అయినా, సబ్ రిజిస్ట్రార్లు తాము బదిలీ కోరుకునే స్థానాలకు సంబంధించిన ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి సందేశాలు వచ్చాయి. వీటిని అడ్డంపెట్టుకుని ‘చినబాబు’ టీం పెద్ద స్కెచ్ వేస్తోంది. డిమాండ్ ఉన్న పోస్టుల పేరుతో భారీగా దండుకునేందుకే అందరినీ దరఖాస్తు చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చింది. తద్వారా తమకు కావల్సిన వారిని ఎంపిక చేసుకోవడం, కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఎవరు రేసులో ఉన్నారో తెలుసుకోవడానికే కౌన్సిలింగ్ ముందు ఈ సందేశాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ఆప్షన్లు అడగలేదని, కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిపేటప్పుడు ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు. -
జలమండలిలో కొత్తనీరు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత జలమండలి యంత్రాంగంలో కొత్త నీరు వచ్చి చేరింది. ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన కీలక ఉన్నతాధికారుల పదవీ విరమణ, బదిలీలతో కొత్తవారికి అవకాశం లభించింది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ల వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు క్రితం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరో ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే కీలక విభాగాల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చేయగా, మరో డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సుంకిశాల ఘటనలో మరో ప్రాజెక్టు డైరెకర్లపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సీజీఏ, జీఎం, డీజీఎం స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలగడంతో యంత్రాంగంలో కొత్తదనం వచ్చింది. అంతా అస్తవ్యస్తమే.. మహా నగరంలో తాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయి పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరాలో అడుగడుగునా లీకేజీలు, లోప్రెషర్, కలుíÙత నీటి సరఫరా, లైన్మెన్ల చేతివాటం, నల్లా అక్రమ కనెక్షన్లు, ఎక్కడపడితే అక్కడ పొంగిపొర్లే మురుగు, పగిలిన మ్యాన్హోళ్ల వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఫిర్యాదు చేస్తే కానీ స్పందించని పరిస్థితి నెలకొంది. అడుగడుగు చేతివాటంతో బోర్డుకు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తాగునీటి సరఫరా, సీవరేజ్ చార్జీల బకాయిలు కూడా పెద్దఎత్తున పేరుకుపోయాయి. అంతా ఇష్టానుసారమే.. జలమండలిలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పనితీరు ఇష్టానుసారంగా మారింది. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్, సబ్డివిజన్, సెక్షన్లలో సైతం కనీస సమయపాలన లేకుండా పోయింది.అంతా ఫీల్డ్ విజిట్ అంటూ మధ్యాహ్నం వరకు ఆఫీస్లలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సాధారణ బదిలీలు జరగడంతో సర్కిల్. డివిజన్, సబ్డివిజన్లలో సైతం కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఇప్పటికైనా బోర్డు పాలన యంత్రాంగంతోపాటు సిబ్బంది పనీతీరులో మార్పు వచ్చేనా అనే చర్చ సాగుతోంది. -
పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్ పోలీస్ సిబ్బంది నలిగిపోతున్నారు. -
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
AP: ఉద్యోగుల బదిలీల విధివిధానాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు14) విడుదల చేసింది.బదిలీల జీవో గురువారం విడుదల కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31 వరకు 16 రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
‘పని సర్దుబాటు’ నిర్ణయాన్ని పునరాలోచించాలి
సాక్షి, అమరావతి: జీవో 117 ప్రకారం పనిసర్దుబాటు ద్వారా బదిలీలు జరపాలని ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీటీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోర్ల సుధాకర్, కాళింగిరి కుమార్ విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117ను రద్దు చేయాలని కోరుతున్నా, అదే జీవోతో పని సర్దుబాటు చేస్తే పాఠశాల విద్య మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే జీవో 117, 128 ప్రకారం పనిసర్దుబాటు కోసం ఏఏ కేడర్లలో ఎంతమంది అవసరమో అంతమందిని సర్దుబాటు చేయాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ ఉత్తర్వుల ప్రకారం 98 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలకు గతేడాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించలేదని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి, రమణయ్య తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటు బదిలీలు ఏక పక్షంగా చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. -
పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. -
కొలిక్కిరాని గురుకుల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎటూ తేలకపోతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అత్యధికంగా రెగ్యులర్ టీచర్లున్న ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో టీచర్ పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తూనే.. సమాంతరంగా బదిలీలనూ చేపట్టారు. కానీ కొన్ని గురుకుల పాఠశాలల్లో శాంక్షన్డ్ పోస్టులు, వర్కింగ్ కేటగిరీ సరితూగక పోవడంతో సొసైటీ అధికారులు.. పాఠశాలల వారీగా పోస్టుల మంజూరు లెక్కలను పరిశీలించారు.ఈ సొసైటీ పరిధిలో జీఓ 317 కింద చేసిన కేటాయింపులు కూడా పొంతన లేకుండా ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను డిస్లొకేట్ చేస్తూ కొత్త చోట్ల నియమించారు. ఆ ఉద్యోగులు, బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. అప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ చాలావరకు పూర్తయినా.. కోర్టు స్టే నేపథ్యంలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ఉద్యోగులంతా పాతస్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత నిషేధం అమలవుతుంది. ఆలోపు పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయా? లేదా? అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పరిధిలో.. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో కేటాయింపులపై ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైనార్టీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల సంఖ్య తక్కువే. అన్నీ కొత్త గురుకులాలు కావడం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులంతా కొత్తవారే కావడంతో సులువుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని భావించారు. కానీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం, నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.బదిలీల ప్రక్రియలో తప్పులు కూడా ఇబ్బందిగా మారా యి. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి రెండు పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ అదే సబ్జెక్ట్ వారు ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరికి ఎంచుకున్న ఆప్షన్కు బదులు ఇతర చోట పోస్టింగ్ ఇవ్వడం వంటివీ చోటు చేసుకున్నాయి. -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
ఎస్సీ గురుకులాల్లో ‘డిస్ లొకేటెడ్’ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (టీజీఎస్డబ్ల్యూ ఆర్ ఈఐఎస్) పరిధిలో జరుగు తున్న ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ గందర గోళంగా మారింది. ఈ సొసైటీ పరిధిలోని పలు కేడర్లలోని ఉద్యోగులకు ఓవైపు పదోన్న తులు కల్పిస్తూనే.. మరోవైపు బదిలీల ప్రక్రియ నిర్వహించేలా సొసైటీ కార్యాచరణ రూ పొందించి అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో బదిలీ లు, పదోన్నతులకు అర్హత పొందిన ఉద్యోగుల జాబి తాను ప్రకటించారు. జీఓ 317 అమలులో భాగంగా పలు వురు ఉద్యోగులను వారు పని చేస్తున్న పరిధిని డిస్లొకేట్ చేస్తూ కొత్తగా జోన్లు, మల్టీజోన్లు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. డిస్లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తక్షణమే బదిలీల కౌన్సెలింగ్కు హాజరుకావా లని, లేకుంటే ఖాళీ ల లభ్యతను బట్టి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో డిస్లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు సొసైటీ కార్యాయా నికి చేరుకోవడం.. వారిని డిస్లొకేటెడ్ జాబితా లోకి తీసుకు రావడంపై ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి మొదలైన ఈ పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో డీఎస్ఎస్ భవన్ గురుకుల టీచర్లతో కిక్కిరిసిపోయింది.తారుమారుపై గరంగరం.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్ విధా నం అమల్లోకి రావడంతో ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాయి. గురుకుల సొసైటీలు కూడా ఆ దిశగా కసరత్తు చేసి 2022 సంవత్సరంలో ఉద్యోగులకు జోన్లు, మల్టీ జోన్ల కేటాయింపు చేప ట్టాయి. కానీ విద్యాసంవత్సరం మధ్యలో బోధన, అభ్యసన కార్య క్రమాలకు ఇబ్బందులు తలెత్తు తాయనే భావనతో కేటాయింపుల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టాయి. ప్రస్తుతం గురుకులాలకు కొత్త ఉద్యోగులు వస్తుండడంతో సీనియర్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడుతుండగా... జీఓ 317 కింద డిస్ లొకేటెడ్ అయిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు సొసైటీ చర్యలు మొదలు పెట్టింది. కానీ డిస్లొకేడెట్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగుల కేటాయింపు సమయంలో తామిచ్చిన ఆప్షన్లకు భిన్నంగా తాజాగా కేటాయింపులు జరిపారని, మరోవైపు సంబంధం లేని జోన్లు ఇవ్వడంతో తమతోపాటు పిల్లల భవిష్యత్ తారు మారు అవుతుందని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మినహాయింపు ఇచ్చిన సొసైటీ మిగతా ఉద్యోగులకు స్థానచలనం కల్పించింది. ప్రిన్స్పాల్, జూనియర్ లెక్చరర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలో దాదాపు పదోన్నతులు పూర్తి కాగా, ఆయా కేటగిరీల్లో బదిలీలు సైతం దాదాపు పూర్తి చేసినట్టు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు చెబుతున్నారు.మూడు రోజుల్లో మిగతా కేటగిరీల్లో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రిన్సిపాల్, జేఎల్, పీజీటీ కేటగిరీల్లో మెజారిటీ శాతం బది లీలు పూర్తి చేసిన సొసైటీ... టీజీటీ, లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీ టీచింగ్ స్టాఫ్తోపాటు సొసైటీ పరిధిలోని నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సి ఉంది. బదిలీల ప్రక్రియ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. కానీ ఆలోపు అన్ని కేట గిరీల్లో బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. ఎక్కువ కేటగిరీలు ఉండడంతో రాత్రింబవళ్లు పూర్తి చేసేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. గతవారం రోజులుగా పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి పొద్దు పోయేవరకు కూడా సొసైటీ అధికారులు బదిలీలు, పదోన్నతుల కసరత్తు సాగిస్తుండడం గమనార్హం. -
జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..
జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్ఫర్కు ఆప్షన్ ఇచ్చుకున్నారు.బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.బదిలీలకు 256 మంది ఆప్షన్..జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్ వాచ్మన్, ఎంఎన్ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్మన్, ఫైర్మన్, థియేటర్ అసిస్టెంట్, వాటర్ మెన్, స్వీపర్ తదితరులు డిపార్ట్మెంట్ వారీగా 788 మంది ఉన్నారు.ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్ఫర్లు కోరుకున్నారు.కలెక్టరేట్లో బదిలీ కేటాయింపులుజిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్ కాపీలను అందించనున్నారు.ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్ పంచాయతీ, జూనియర్ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు. -
కక్ష సాధింపు తీరు.. ఇదెక్కడి పాలన చంద్రబాబు..?
-
ఏపీలో 37 మంది ఐపీఎస్ ల బదిలీ
-
ఎన్జీ రంగా వర్సిటీలో రాజకీయ బదిలీలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్షసాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాల పైనా పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు, కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లుగా పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం (ఆంగ్రూ)లో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పని చేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు ఆంగ్రూలో సంబంధిత శాఖామంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బందే లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.ఆంగ్రూ చరిత్రలోనే తొలిసారియూనివర్సిటీలో హెచ్వోడీలనే కాదు.. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నిబంధనలకు పాతరేసి మరీ ఇష్టానుసారం బదిలీ చేస్తుండటంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను కూడా వదిలి పెట్టలేదు. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాల్లోనే 102 మందిని బదిలీ చేశారు. ఇంత మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి అని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ డీన్స్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు యూనివర్శిటీ ఆఫీసర్లు, ముగ్గురేసి చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. మరికొంత మందిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నిబంధనలకు పాతరేసి..సర్వీస్ రూల్స్ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీలు చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నఫళంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రి కల్చరల్ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న 15 మంది అధ్యాపకులు, శాస్త్రవే త్తలను 300 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న పరిశోధన కేంద్రాలు, కళాశాలలకు బదిలీ చేశారని, పైగా వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి బదిలీ చేసిన స్థానాలలో చేరాలని ఆదేశించారని తెలిపారు. గతంలో బదిలీ చేయాలని బతిమిలాడినా పట్టించుకోని వర్శిటీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎడాపెడా బదిలీలు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు మౌఖికంగా ఆదేశించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బదిలీలు చేస్తున్నారని, ఆ స్థానాల్లో నేతలకు అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలను ఇష్టానుసారం బదిలీ చేయడం వలన ఆ ప్రభావం పరిశోధనలపై పడుతుందని చెబుతున్నారు. పవిత్రమైన విద్యాలయాల్లో మితివీురిన రాజకీయజోక్యం సరికాదని విద్యా నిపుణులు హితవు పలుకుతున్నారు. -
ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బదిలీలు
-
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరగా మార్చేద్దాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కీలక స్థానాల్లో తమకు అనుకూలమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐజీలు, డీఐజీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇలా అందరినీ త్వరిత గతిన బదిలీలు చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్కు సన్నితంగా వ్యవహరించిన అధికారులందరినీ గుర్తించాలని, అలాంటి అధికారులు తమకు అవసరం లేదని.. ఎవరెవరు ఏం చేశారో వివరాలు సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మన కోసం (టీడీపీ) పని చేసిన వారిని గుర్తించాలని, అలాంటి వారు రిటైర్ అయినప్పటికీ మరో రకంగా తెచ్చుకుందామని అన్నట్లు సమాచారం. రాజధాని అమరావతిని త్వరతగతిన అభివృద్ధి చేయడం తమ ప్రథమ లక్ష్యం అని, ఇందుకోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది.ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను తిరిగి అమలు చేసే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేసిన ముఖ్య అధికారులను పిలిపిస్తే, తానే స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే గతంలో తాను సీఎంగా ఉండగా తన కార్యాలయంలో పనిచేసిన ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రాజమౌళిని మళ్లీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఇలాంటి మరికొందరు అధికారులతోపాటు రాష్ట్రంలోనే వివిధ శాఖల్లో ఉన్న తమకు అనుకూలమైన వారిని పిలిపించుకుని మాట్లాడి.. వారికి ఏ పోస్టింగులు ఇవ్వాలనే దానిపై సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. వాళ్లను పంపించేద్దాం టీడీపీకి సహకరించని అధికారులను గుర్తించి, వారిని బదిలీ చేయించే విషయంపై కూడా చంద్రబాబు సీఎస్, డీజీపీతో చర్చించినట్లు సమాచారం. వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశారని ఇప్పటికే కొంత మందిని గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ముఖ్య అధికారులందరినీ త్వరగా గుర్తిస్తే.. వారిని బదిలీ చేయడం లేక సెంట్రల్ సర్విసులకు వెళ్లి పోండని చెప్పడం.. లేక ఇక్కడే ఉంటే అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేద్దామని వివరించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరెవరు ఎలా పని చేశారో తనకు తెలుసని, అయినప్పటికీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్ల తర్వాతే అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఉపక్రమిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది. -
తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు
-
AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
సాక్షి,విజయవాడ: ఏపీలో ఇటీవల సస్పెండ్ చేసిన పలువురు పోలీసుల స్థానంలో కొత్త వారిని ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావులకు పోస్టింగ్ ఇచ్చింది.పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్ బాబు, ఎస్బీ సీఐ2గా యు శోభనన్బాబు, కారంపూడి ఎస్సైగా కె.అమీర్, నాగార్జునసాగర్ ఎస్ఐగా ఎం.పట్టాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసులను బాధ్యులను చేస్తూ ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోంది. -
తెలంగాణ అధికారుల బదిలీ
-
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్ల బదిలీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ)మరికొందరు అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా అస్సాం, పంజాబ్ల్లోని జిల్లా పోలీసు చీఫ్లను బదిలీ చేసింది. పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్లలో పనిచేసే అయిదుగురు నాన్ కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు(డీఎంలు), 8 మంది పోలీస్ సూపరింటెండెంట్ల(ఎస్పీలు)ను సైతం బదిలీ చేసింది. జిల్లా స్థాయిలో ప్రధానమైన పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్లు కాని నాన్–క్యాడర్ అధికారులను నియమించడంపై ఈసీ కఠినమైన వైఖరిని తీసుకుంది. -
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్సభ సెగ్మెంట్ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్సభ ఎన్నికలకు ఆర్ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ఆరంభం కానుంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ దృష్ట్యా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ ఉద్యోగుల సర్దుబాటుకు పూనుకున్న విషయం తెలిసిందే. 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబాటు ప్రక్రియకు సంబంధి«ంచిన తేదీల వారీగా షెడ్యూల్ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు ఇలా.. ♦ గురువారం (22వ తేదీ)కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు. ♦ ఈ నెల 24వ తేదీకల్లా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు. ♦ ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. ♦ సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచలనం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ♦ మరోవైపు సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. -
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీ ఆఫీస్లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
TS: రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిన వెంటనే సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాసం -
ఎన్నికల నిబంధనల మేరకే ఐపీఎస్ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసుల నిస్వార్థ సేవలను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలను తీవ్రంగా ఖండించింది. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్యకాదని హితవు పలికింది. పదేపదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అవసరాలకు తగ్గట్లుగా ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీ
హైదరాబాద్: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు బదిలీ కాగా, సుధీర్బాబును హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్జోషిని నియమించారు. రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్ ఈస్ట్జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ సౌత్వెస్ట్ డీసీపీగా ఉదయ్కుమార్రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా మురళీధర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. -
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్స్టేషన్కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్కుమార్కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్స్తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
బదిలీలు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులను మార్చారు. ఇటు ప్రభుత్వ, అటు పోలీస్ యంత్రాంగంలోని సీనియర్ అధికారుల్లో కొందరికి స్థానచలనం కలిగించారు. మరికొందరు ఐఏఎస్ అధికారులు, ఒకట్రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు కూడా జరిగింది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన ఉంటుందని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీలుంటాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన లేదని, పలు కారణాల రీత్యా మరో మూడు నెలల తర్వాతే పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందనే సంకేతాలందుతున్నాయి. ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి రావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీస్థాయిలో బదిలీలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఆరంభ దశలోనే ‘ప్రజాపాలన’ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డితో సహా ఏఐసీసీ కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత నెల 28న ‘ప్రజాపాలన’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని, గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత, వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి. వీటి ఆధారంగా రేషన్కార్డుల పంపిణీ నుంచి 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి వస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి 15 వరకు (100 రోజుల్లో) ఈ ఆరు గ్యారంటీలు అమలు ప్రారంభించాలి. దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత గందరగోళానికి తావిస్తాయనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం. ఈసీ ఏం చేస్తుందో? రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటరుజాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈనెల 6 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలి. అనంతరం సవరణలు చేపట్టి వచ్చే నెల 8న పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి. మరోవైపు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు చేపట్టాలన్నా, ఎన్ని కల కమిషన్కు సమాచారం ఇవ్వాలి. మరోవైపు ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎప్పుడైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఈలోపు కలెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బదిలీలు చేయాల్సి ఉంటుంది. దీంతో కలెక్టర్ల బదిలీల గురించి కూడా సీఎం రేవంత్ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు కూడా ఉండవని, అవసరమైతేనే కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్కు సమాచారమిచ్చి ఈసీ అనుమతి మేరకు బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలు ముగిశాకే.. అన్ని స్థాయిల్లో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్సభ ఎన్నికలు ముగిసేంతవరకు ప్రభుత్వ యంత్రాంగ బదిలీలుండవని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు బదిలీలు చేయలేం కానీ, మొండి ఘటాలను మాత్రం వదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సఖ్యత లేదనే ముద్ర ఉన్న అధికారులకు అడపాదడపా స్థానచలనం కలగవచ్చని, గత ప్రభుత్వానికి అంటకాగారనే ముద్ర ఉన్న అధికారులను కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు. -
ఉద్యోగాలు.. బదిలీలు
లక్డీకాపూల్: ప్రజాభవన్లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు. నా భర్త ఉద్యోగం ఇవ్వండి విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ
-
భారీగా ఐఏఎస్ బదిలీలు
-
ఆంధ్రప్రదేశ్లో 17 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్గా ధ్యాన్చంద్ర విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా జె. శివ శ్రీనివాస్ తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్ విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవోగా మాధవన్ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్గా ఎస్ఎస్ శోభిక సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్ పాడేరు సబ్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి పెనుకొండ సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ కందురకూరు సబ్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరి తెనాలి సబ్కలెక్టర్గా ప్రకార్ జైన్ మార్కాపురం సబ్ కలెక్టర్గా రాహుల్ మీనా ఆదోని సబ్ కలెక్టర్గా శివ్ నారాయణ్ వర్మ రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఎస్.ప్రశాంత్కుమార్లు నియమితులయ్యారు. -
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
-
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
హైదరాబాద్ సీపీ రేసులో నలుగురి పేర్లు
హైదరాబాద్: హైదరాబాద్లో సీపీ కోసం నలుగురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీపీ రేసులో సందీప్ శాండిల్యా, వీవీ శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, శివధర్రెడ్డిలతో కూడిన జాబితాను సీఈసికి సర్కార్ పంపించింది. 17 మంది అడిషనల్ డీజీల పేర్లను కూడా ప్రభుత్వం సీఈసికి ప్రభుత్వం సూచించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానున్న ఆదేశాలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ -
రేపట్నుంచి స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు. అయితే, మల్టీజోన్–2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం మంగళవారం ఆదేశించింది. -
త్వరలో ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా వస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి అధ్యాపక సంఘాల నేతలు గత కొంతకాలంగా బదిలీల కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల విద్యలో బదిలీలు చేపట్టడం, ఈ వ్యవహారం కోర్టు స్టేతో ఆగిపోవడం తెలిసిందే. తాజాగా స్పౌజ్ కేసులను పరిశీలించిన కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాలేజీ సిబ్బందినీ బదిలీ చేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యామంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవల ఇంటర్, కాలేజీ విద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లేక ఐదేళ్లు: 2018 జూన్ నెలాఖరులో సాధారణ బదిలీలు చేపట్టారు. అప్పటి మార్గదర్శకాలను అనుసరించి 500 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2016–17లో జూనియర్ లెక్చరర్స్కు ప్రిన్సిపల్స్గా పదోన్నతులు కల్పించారు. ఈ విధంగా పదోన్నతులు రావడంతో 2018లో జరిగిన బదిలీల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన సర్వీస్ లేకపోవడంతో వారికి బదిలీ అవకాశం రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 317 జీవో అమలు చేశారు. పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ అధ్యాపక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. తాజా నిర్ణయం వల్ల 6 వేల మందికిపైగా న్యాయం జరుగుతుంది. మార్గదర్శకాలపై కసరత్తు: బదిలీలు చేపట్టాలనే యోచన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలపై కూడా స్పష్టత ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి అధికారులకు సూచించినట్టు సమాచారం. 317 జీవో తర్వాత ఏర్పడిన పరిస్థితులు, ఎన్ని సంవత్సరాలను కనీస, గరిష్ట అర్హతగా తీసుకోవాలనే అంశాలపై అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. స్పౌజ్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి జాబితాను, ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశాలపై వివరాలు తెప్పిస్తున్నారు. వచ్చేవారం బదిలీలపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు. -
పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది. బదిలీలకు 50 వేల మంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు? ఆన్డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్రెడ్డి కోరారు. -
రాజకీయ నేతలకు అనుకూలంగానే పోలీసు బదిలీలు.. ట్రాన్స్‘ఫర్’పై ఈసీ దృష్టి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పోలీస్శాఖలో భారీఎత్తున జరిగిన బదిలీలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాంగ్ స్టాండింగ్గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల బది లీకి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోలీస్శాఖ విషయానికి వచ్చేసరికి కొందరు రాజకీయనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విషయం ఈసీ దృష్టికొచ్చింది. ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చిన వారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఉంది. ఈ వ్యవహారంపై మాజీ ఐపీఎస్లతో పాటు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోడ్ అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలు ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈసారి గతానికి భిన్నంగా ఎందుకంటే... పోలీసు విభాగంలో బదిలీలు సర్వసాధారణం. నిర్ణీత కాలపరిమితితో బదిలీలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఒకే పోస్టులో లాంగ్ స్టాండింగ్లో ఉన్న అధికారులతోపాటు, భారీ సంఖ్యలో పదోన్నతుల నేపథ్యంలో నాన్కేడర్ ఎస్పీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు భారీ సంఖ్యలో అధికారులకు స్థానచలనం తప్పలేదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్ హౌస్ఆఫీసర్లుగా ఉండే ఎస్ఐ పోస్టుల నుంచి నాన్కేడర్ ఎస్పీల వరకు అన్నింటిలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైంది. ఓ అధికారి సమర్థత ఆధారంగా కాకుండా ఆయనకు ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడి రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్ లభించింది. ఫోకల్ పోస్టులుగా పిలిచే శాంతిభద్రతల విభాగంతోపాటు మరికొన్ని కీలక వింగ్స్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పోస్టుల్లో బదిలీల బంతాట తమ సామాజికవర్గం కాదనో, విధేయులుగా ఉండరనో, ముక్కుసూటి అధికారులని భావించిన వారి బదిలీల విషయంలో బంతాట తప్పలేదు. పోస్టింగ్ వచి్చనవారు, ఆ పోస్టులో చేరకుండా, చేరినా ఆ సీట్లలో కూర్చోకుండా, కూర్చున్నా ఒక్కరోజు కూడా విధులు నిర్వర్తించకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్దస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పిస్తూ కొత్తగా వచి్చన అధికారులూ బదిలీ అయ్యేలా చేసి తమ పంతం నెగ్గించుకున్నారు. ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలో హైదరాబాద్కు వచి్చన ఎన్నికల సంఘం అధికారులు పోలీసు సహా వివిధ విభాగాలతో భేటీ అయ్యారు. పోలీస్శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా పోస్టుల్లోకి వచి్చన వారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటుందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వీటిలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు నిఘా వర్గాలకు చెందిన వారు ఉంటారని సమాచారం. రాష్ట్రంలో వివాదాస్పదమైన బదిలీల్లో కొన్ని... – మహబూబాబాద్ జిల్లాలోని ఓ డివిజన్లో ముగ్గురు డీఎస్పీలు నాలుగుసార్లు బదిలీ అయ్యారు. ఇవి కేవలం పక్షం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. – నాగర్కర్నూల్ జిల్లాలో ఓ డీఎస్పీ పోస్టింగ్ వివాదాస్పదమైంది. అక్కడకు వచ్చిన అధికారిని కొన్ని రోజుల్లో మార్చేశారు. ఆయన స్థానంలో అక్కడే ఇన్స్పెక్టర్గా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పొంది, రేంజ్కు వెళ్లిన అధికారిని తీసుకొచ్చారు. – నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి ఏడాది క్రితమే డీఎస్పీగా ఓ డివిజన్లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య విభేదాలతో ఈయన బదిలీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పట్టుపట్టి మరీ తనకు అనుకూలమైన పాత అధికారినే తెచ్చుకున్నారు. – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు అనేక పోస్టింగులు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్లోని ఓ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేకపోయారు. చివరకు ఈయన బదిలీ కాగా, నేతలను అనుకూలమైన వ్యక్తికే పోస్టింగ్ వచ్చింది. – వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఓ ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి తన పలుకుబడితే అదే సబ్డివిజన్లోని మరో పోలీస్స్టేషన్కు మారారు. స్థానిక నేతల అండదండలతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. -
భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. సీని యర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, శైలజా రామయ్యర్ల సేవలను ఎంసీఆర్ హెచ్ఆర్డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వెయిటింగ్లో ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ ఇవ్వగా, 1997 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది. అలాగే వెయిటింగ్లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్లు ఇచ్చింది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్గా, సిద్దిపేట అదనపు కలెక్టర్ ము జమిల్ఖాన్కు పెద్దపల్లి కలెక్టర్గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న అనుదీప్ దురిశెట్టికి హైదరాబాద్ కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి కలెక్టర్గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం -
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్గా లోకేశ్ జైశ్వాల్, హరితహారం పీసీసీఎఫ్గా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్గా రామలింగం, జూపార్కుల సంచాలకులుగా వీఎస్ఎన్వీ ప్రసాద్ నియామకం అయ్యారు. భద్రాద్రి డీఎఫ్వో లక్ష్మణ్ రంజిత్ నాయక్ అటవీ అభివృద్ధి సంస్థకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్వోగా కిష్ట గౌడ్ నియామకం అయ్యారు. ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఇలా చేశాను.. కేటీఆర్ కొడుకు హిమాన్షు -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
నిజామాబాద్ జిల్లా పోలీసుల్లో రాజకీయ బదిలీలు
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల బదిలీలకు రాజకీయ రంగు పట్టుకుంది. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గం ప్రజాప్రతినిధి అనుగ్రహం ఉన్నా, బదిలీ ఎప్పుడు జరుగుతుందోనని ఎస్సైలు, సీఐలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో నిజామాబాద్ ఏసీపీగా పని చేసిన వెంకటేశ్వర్ రెండేళ్లు కాకుండానే బదిలీ పై వెళ్లడంతో అప్పుడు పోలీస్వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫా ర్సు లేఖలతో వచ్చినా పూర్తికాలం పని చేస్తామా లేదా అనే సందేహాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, సీఐలు, ఏసీపీల బదిలీలు పరంపర కొనసాగుతునే ఉన్నాయి. పోలీస్శాఖలో రాజకీయరంగు పులుమడంతో జిల్లాలో పోలీసులకు గుర్తింపు లేకుండాపోతుంది. జిల్లా పోలీస్శాఖలో ఎస్సైలు, సీఐలను కొందరు ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బదిలీలు ఉండగా జిల్లాకు కొన్ని రోజుల క్రితం వచ్చిన సీఐలు బదిలీలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధిని కలిస్తే చాలు.. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు జరిగే కార్యక్రమాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు తమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు కాకుండా వేరే నియోజకవర్గ ప్రతినిధిని కలిస్తే చాలు ఆ పోలీస్ అధికారి పోస్టు ఉంటుందా? ఊడుతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారికి చోటుచేసుకుంది. సదరు అధికారికి పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చే వరకు తెలియకపోవడం శోచనీయం. ఈ పోలీస్ అధికారి పరిధిలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ కార్యక్రమంలో సదరు ప్రజాప్రతినిధి వచ్చిన సమయంలో భద్రత కల్పించడంతో వారం తర్వాత బదిలీ వెలువడటం కొసమెరుపు. ఈక్రమంలో ఫిబ్రవరి నుంచి ఏసీపీతోపాటు సీఐ పలువురు బదిలీ అయ్యారు. ఎన్నికల కోసమే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లో పోలీసుశాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడం, తమకు సహకరించడం లేదనే సాకుతో బదిలీలు చేయడం జిల్లాలో కొనసాగుతునే ఉంది. కానీ పోలీస్శాఖ బదిలీల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు పనిచేయడంలో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే జిల్లా పోలీస్కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో పోలీస్శాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతోంది. -
పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!
సాక్షి, అమరావతి : కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది. కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్ పాయింట్ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి. ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో.. ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం -
గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారి దరఖాస్తులు, వాటితోపాటు సమర్పించే వైద్యుల సర్టిఫికెట్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. జిల్లాలో బదిలీలు, అంతర్ జిల్లా బదిలీల కోసం గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ఇలా ఉంది. జిల్లాలో బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తుల పరిశీలనకు తుది గడువు : జూన్ 10 కేటాయించిన మండలాలు,మున్సిపాలిటీలు, తిరస్కరించిన దరఖాస్తుల జాబితా ప్రకటన : జూన్ 12 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ : జూన్ 14, 15 కౌన్సెలింగ్పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల గుర్తింపు: మే 28 బదిలీలకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు: జూన్ 3 దరఖాస్తులను సంబంధిత జిల్లాకు పంపేందుకు గడువు: జూన్ 9 జిల్లా అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ: జూన్ 10 రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి దరఖాస్తులు కార్యదర్శికి సమర్పణ: జూన్ 13 బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ 14, 15 కౌన్సెలింగ్పై అభ్యంతరాల స్వీకరణ : జూన్ 15 నుంచి చదవండి: Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి -
బదిలీలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూపరిపాలన (ల్యాండ్ రెవెన్యూ) శాఖ పరిధిలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధముండే అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించిన మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారుల (ఆర్డీవో) బదిలీలు జరిగాయి. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోల బదిలీలకు సర్వం సిద్ధమైందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండటంతో.. ఈ కార్యక్రమాలు ముగిశాక బదిలీలు ఉంటాయని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. తహసీల్దార్ల బదిలీలపై కొంత కసరత్తు జరిగిందని.. సీఈసీ ఆదేశించిన విధంగా జూలై నెలాఖరుకల్లా ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అంటున్నాయి. 70 శాతం తహసీల్దార్లకు బదిలీ! గత లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీలు జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరినవారు, 317 జీవో ద్వారా స్థానికత ప్రాతిపదికన సర్దుబాటైనవారు మినహా 70% తహసీల్దార్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో తహసీల్దార్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యే అధికారులను అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు.. అదే స్థానాల్లో పనిచేయించుకోవాలని, అనివార్యంగా బదిలీ చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు మేరకు అవసరమైతే దశాబ్ది ఉత్సవాల తర్వాత బదిలీలు ఉంటాయని.. లేదంటే అక్టోబర్ 4 వరకు ఆగాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. పదోన్నతులిస్తేనే సజావుగా ఎన్నికల విధులు రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తేనే ఎన్నికల విధుల నిర్వహణ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా విధులు నిర్వహించడం కోసం 119 మంది డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) స్థాయి అధికారులు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 74 మంది డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డివిజన్లలో పనిచేస్తున్నారు. ఇందులోనూ 19 ఖాళీలున్నాయి. అయితే ఈ 19 ఖాళీలకుగాను 19 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరిండెంట్లకు పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా రిటర్నింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిని కలిపినా మరో 50 మంది వరకు ఆర్వోల కొరత ఉంటుంది. ఇక డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న పలువురు ఇతర శాఖల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వారిని రిటర్నింగ్ అ«ధికారులుగా నియమిస్తే.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా దాదాపు ఏడాది పాటు ఆయా శాఖల్లో పనులకు ఆటంకం కలగనుంది. ఈ క్రమంలో తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా రిటర్నింగ్ అధికారుల కొరత ఏర్పడకుండా ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అంటోంది. 19 మందికి ఆర్డీవోగా పదోన్నతులు రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్లు కె.మహేశ్వర్, ఎం.సూర్యప్రకాశ్, మురళీకృష్ణ, కె.మాధవి, ఎల్.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్రెడ్డి, వి.సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాసరావు, డి.దేవుజా, డి.ప్రేమ్రాజ్, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ పదోన్నతులు పొందారు. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్.. బదిలీలకు సీఎం జగన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్కు దిమ్మతిరిగే సమాధానం ఇదే.. -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు. కాగా, బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా చదవండి: భూమా అఖిలప్రియకు బిగ్ షాక్! -
AP: 50 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల బదిలీల వివరాలు -
ఆంధ్రప్రదేశ్లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
కర్ణాటకలో ఐఏఎస్ vs ఐపీఎస్
-
తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్ నికోలస్, కోరం అశోక్ రెడ్డి, బడుగు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు. ఏడుగురు ఐపీఎస్ల బదిలీ మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే! -
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. 317 జీఓతో చెల్లాచెదురు తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ పోలీసులే.. కానీ.. ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది ఉందని సిక్ లీవ్, ఎర్న్ లీవ్స్ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
41 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–సివిల్ (డీఎస్పీ)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు (పీఈబీ) సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ పోస్టింగ్లు వెంటనే అమల్లోకి వస్తాయని శనివారం డీజీపీ ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే పెద్దసంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలీసు అధికారుల బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వచ్చేనెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రబడ్జెట్ సమర్పణ, వచ్చేనెల 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తర్వాతే పెద్ద ఎత్తున పలు స్థాయిల్లోని ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
Telangana: తొలుత ఎస్ఏలు.. తర్వాత ఎస్జీటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదల కానుంది. షెడ్యూల్ వెలువడినప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు మాత్రం కొంత సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో అనేక సందేహాలు, ఆందోళనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపించే ముందుకెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పౌజ్ కేసులకు పరిష్కారం తీవ్ర వివాదం రేపుతున్న స్పౌజ్ కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు 2,100 మంది వరకూ ఉన్నారు. వీరంతా తమను ఒకే ప్రాంతానికి మార్చాలని ఆందోళనలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బదిలీల్లో 675 మందికి మాత్రమే అవకాశం కల్పించడంతో ఇటీవల పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,600 మందిని ప్రస్తుత బదిలీల్లో చేర్చి, ఇంకా మిగిలిన వారిని డిప్యుటేషన్ ద్వారా కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఖాళీలపై స్పష్టత ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలావుండగా హెచ్ఎంలు ఒకే స్థానంలో పని చేయడానికి సంబంధించిన కాలపరిమితిని 5 నుంచి 8 ఏళ్ళకు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టీచర్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై మిగతా వారిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. డిమాండ్ల సాధనకు టీచర్ల ఆందోళనలు – ముందస్తుగా అదుపులోకి నేతలు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అమలు చేసిన 317 జీవో వివాదాస్పదంగా మారుతోంది. సీనియారిటీ లేకపోవడంతో స్థానికేతర జిల్లాలకు వెళ్ళిన టీచర్లు బదిలీలకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. బదిలీలకు కనీసం రెండేళ్ళ సర్వీస్ నిబంధన సరికాదంటున్నారు. జీరో సర్వీస్ను మార్గదర్శకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఆందోళనలు నిర్వహిస్తున్న 317 జీవో బాధిత ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి చేపట్టారు. ఇంకోవైపు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు (స్పౌజ్లు) ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని స్థానికేతర్లుగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి, వారు కోరుకున్న స్థానిక జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా బదిలీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. కాగా ఆందోళన చేస్తున్న స్పౌజ్ టీచర్లను ఉద్దేశించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ‘టీచర్లా–రౌడీలా’అంటూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు సదానందం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో బాధిత టీచర్లు పిలుపునిస్తే ఏ సంబంధం లేని యూఎస్పీసీ, డీటీఎఫ్ సంఘాల నేతలను అరెస్టు చేయడంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖాళీలు 21 వేలపైనే.. ప్రమోషన్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏలు) పదోన్నతులు పొందే వీలుంది. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1,944 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు. ఇప్పటికే ఖాళీగా ఉన్నవి, పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యేవి కలుపుకొంటే మొత్తం 7,111 వరకూ ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. వీటిల్లో ఎస్జీటీల ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా డీఎస్సీ ద్వారా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎస్జీటీ పోస్టులు 9 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు పొందే వారిని కలుపుకొంటే మరో 5 వేల వరకూ కొత్త ఖాళీలు ఏర్పడతాయి. ఇలా మొత్తంగా 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. -
మాకూ బదిలీలు, పదోన్నతులు.... గురుకుల సిబ్బంది డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పుడు బదిలీలు, పదోన్నతుల మంత్రాన్ని జపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తమ విషయంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తయి ఐదేళ్లు కావస్తోంది. మరోవైపు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చాలామంది గురుకుల టీచర్లకు స్థానచలనం కలిగినప్పటికీ వారింకా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీలు నిర్వహిస్తే తమకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందనే భావన వారిలో ఉంది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో తాజాగా బదిలీలు నిర్వహిస్తే కోరిన చోట పోస్టింగ్ వస్తుందని వారు ఆశిస్తున్నారు. 20వేల మందికి అవకాశం...! మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో 30 శాతం గురుకుల విద్యా సంస్థలు గత నాలుగేళ్లలో ఏర్పాటు చేసినవే. కొత్త గురుకులాల్లో మెజార్టీ టీచర్లు డిప్యుటేషన్ పద్ధతిలో కొనసాగుతుండగా, మరికొందరు కాంట్రాక్టు/తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. ఈ క్రమంలో గురుకులాల్లో బదిలీలు చేపడితే అర్హత ఉన్న టీచర్లకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు గురుకుల ఉద్యోగ సంఘాలు వరుసగా వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో బదిలీల ప్రక్రియ చేపడితే దాదాపు 20 వేల మందికి అవకాశం దక్కుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగులపై పని ఒత్తిడి కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా గురుకులాల్లోనూ బదిలీలు నిర్వహించాలి. అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లకు కూడా పదోన్నతులు కల్పించాలి. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ రిలీవ్
-
టీచర్ల బదిలీల్లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ తగినంత సంఖ్యలో టీచర్లు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. తద్వారా విద్యార్థుల బోధనాభ్యసనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టిన అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. బదిలీల మేరకు రిలీవ్ అయిన టీచర్ల స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే వారిని రిలీవ్ చేస్తున్నారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్లో ఆ టీచర్కు బదిలీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆ టీచర్ను రిలీవ్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇద్దరు ఉన్న స్కూల్లో ఇద్దరికీ బదిలీ అయితే జూనియర్ టీచర్ను రిలీవ్ చేయరాదని పేర్కొంది. ముగ్గురున్న చోట బదిలీలుంటే జూనియర్లయిన ఇద్దరు టీచర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు రిలీవ్ చేయరు. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల స్కూళ్లల్లో టీచర్లు లేరనే మాట రాకుండా.. ముందుగా మారుమూల ప్రాంతాల స్కూళ్లలో ఖాళీలు భర్తీ అయ్యేలా బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు అంశాలను చేర్చింది. జిల్లాల్లోని ప్రస్తుతం భర్తీ అయిన పోస్టులకు సమానంగా ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియను అధికారులు కొనసాగించనున్నారు. మిగిలిన ఖాళీ పోస్టులను అన్ని ప్రాంతాలకూ సమానంగా సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదాహరణకు ఒక జిల్లాలో 5వేల పోస్టులు ఉంటే.. అక్కడ 4,500 మంది టీచర్లు పనిచేస్తుంటే తక్కిన 500 ఖాళీలను ప్రాంతాల వారీగా మొదటి మూడు కేటగిరీలకూ సమానంగా బదలాయిస్తారు. దీనివల్ల ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ప్రయోజనం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల టీచర్లను కూడా బదిలీ చేస్తున్నా.. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్లలో ఒకేసారి ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాంతాల్లోని పాఠశాలల టీచర్లు.. నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి చోట్ల ఆయా స్కూళ్లలో టీచర్లు లేరన్న పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ భర్తీ ఏర్పాట్లు చేశాకే బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేస్తారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకాని పక్షంలో ఐటీడీయేతర ప్రాంతాల్లో బాగా జూనియర్లయిన టీచర్లను ఆయా స్థానాల్లో తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలకు బదిలీ అయిన వారిలో ఎక్కువమంది అనధికారికంగా లేదా అధికారికంగా గైర్హాజరులో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి ఖాళీలను బదిలీల్లో చూపించడం ద్వారా అక్కడి పోస్టుల భర్తీకి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన గ్రేడ్–2 హెచ్ఎంలు బదిలీ దరఖాస్తు చేయకున్నా వారిని కేటగిరీ–4లోని మిగులు పోస్టుల్లో నియమిస్తారు. అక్కడ ఖాళీ లేనిపక్షంలో కేటగిరీ–3లోని స్కూళ్ల ఖాళీల్లోకి పంపుతారు. కన్వర్షన్ కోరుకున్న సబ్జెక్టు టీచర్లకు.. కాగా ఇటీవల సబ్జెక్టు టీచర్ల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆయా సబ్జెక్టులలో అర్హతలున్న వారిని మార్చుకోవడానికి (కన్వర్షన్) అనుమతించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది టీచర్లు ఇలా కన్వర్షన్కు లేఖలు ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపిన వారిని వెంటనే ఆయా సబ్జెక్టుల్లోకి మార్చడంతోపాటు బదిలీకి దరఖాస్తు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బదిలీల ద్వారా సబ్జెక్టు టీచర్లు దాదాపు అన్ని పాఠశాలలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో మిగులు టీచర్లుగా గుర్తించిన వారందరినీ ప్రభుత్వం అవసరమైన స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. ఇప్పుడు బదిలీల్లో ఆయా పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లు నియమితులయ్యే అవకాశం ఉంది. గతంలో కన్నా మెరుగ్గా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి.. రాష్టంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి గతంలో కన్నా మెరుగ్గా ఉంది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రంలో అది 20 కన్నా తక్కువగానే ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (యూడైస్) ప్లస్ గణాంకాల ప్రకారం చూసినా గత ప్రభుత్వాల కన్నా మెరుగ్గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?) -
నేటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ టీచర్ల బదిలీ
-
ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ హైకోర్టుల్లో పనిచేస్తున్న ఏడుగురు న్యాయమూర్తులను వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ డా.డి.నాగార్జున్లతో పాటు ఆంధ్రపదేశ్ నుంచి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్లను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే తమిళనాడు(మద్రాస్) నుంచి మరో ఇద్దరు జడ్జీల బదిలీలకు సిఫార్సు చేసింది. తాజా సిఫార్సుల్లో గతంలో ప్రతిపాదించిన గుజరాత్ న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్.కరియల్ పేరు లేకపోవడం గమనార్హం. కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపితే.. న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 30కి తగ్గనుంది. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. 12 స్థానాలు ఖాళీ ఉంటాయి. హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(హెచ్సీఏఏ) నేతృత్వంలో న్యాయవాదులు జస్టిస్ అభిషేక్రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టడటంతో పాటు ఢిల్లీకి వెళ్లి సీజేఐను కలసి విజ్ఞప్తి చేసినా ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. పలువురికి పదోన్నతి...: ఇదిలా ఉండగా, రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న అనిల్కుమార్ ఉప్మాన్, నుపుర్ భట్తో పాటు మరో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులు రాజేంద్ర ప్రకాశ్ సోనీ, అశోక్కుమార్ జైన్, యోగేంద్రకుమార్ పురోహిత్, భువన్గోయల్, ప్రవీణ్ భట్నాగర్, ఆశుతోష్కుమార్లకు అదే హైకోర్టులో జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ నరేంద్రకుమార్ వ్యాస్, నరేశ్ కుమార్లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది. -
Registrations Department: కుర్చీ వదిలేదేలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించే రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మంది అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. తమకు కాసుల పంట పండుతుండటంతో కొందరు డిప్యుటేషన్ల గడువు ముగిసినా సీట్ల నుంచి కదిలేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్రిజిస్ట్రార్ పదేళ్లుగా అక్కడే పనిచేస్తుండగా మరో జిల్లా కేంద్రంలోని ఓ సబ్రిజిస్ట్రార్కు పోస్టింగ్ ఇచ్చి ఏకంగా 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బదిలీ కాలేదు. ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారు సైతం పదోన్నతులు పొందినా ప్రస్తుత స్థానాలను వదలడం లేదు. ఆయా సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా రాజకీయ అండదండలతో అవే సీట్లలో కొనసాగుతున్నారు. దీంతో ఆమ్యామ్యాలు లేనిదే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దొడ్డిదారి.... పైరవీల రహదారి రాష్ట్రవ్యాప్తంగా 25 మంది వరకు డిప్యుటేషన్లపై కొనసాగుతుండగా ఇటీవలే బంజారాహిల్స్, నార్సింగి, ఉప్పల్, మహబూబ్నగర్ సబ్రిజిస్ట్రార్ల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇలాంటి కార్యాలయాల్లో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్, ఇన్చార్జి పోస్టింగుల కోసం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. డిప్యుటేషన్ పోస్టింగుల కోసం పైరవీలు చేసిన వారే మళ్లీ వాటి రద్దు కోసం ప్రయత్నాలు చేయడం, కీలక బాధ్యతల్లో ఉన్న ఓ మంత్రిపై ఒత్తిడి చేస్తుండటం ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అలాగే జిల్లా రిజిస్ట్రార్ పోస్టింగుల కోసం కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో డీఆర్ పోస్టింగుల కోసం కూడా ప్రభుత్వ పెద్దలపై అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది. బదిలీలు ఏమయ్యాయి? రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి దశాబ్ద కాలం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్రిజిస్ట్రార్ల సాధారణ బదిలీలు జరగ్గా మియాపూర్ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరిని బదిలీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్ కేడర్ అలాట్మెంట్లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటూఇటు అయ్యాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే. ఇక కిందిస్థాయి సిబ్బంది బదిలీలు 2010 తర్వాత జరగనేలేదు. అధికారులు, సిబ్బంది బదిలీల కోసం కొన్ని నెలల కిందటే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం దానిపై నిర్ణయం మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. సుదీర్ఘకాలంగా బదిలీలు జరగకపోవడంతోనే డిప్యుటేషన్ల కోసం పైరవీలు, ఇన్చార్జీల పాలన నడుస్తోందని.. వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. లంచాలివ్వకుంటే అన్నీ కొర్రీలే... చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లలో కొందరు తమకు ‘రావాల్సినవి’అందిన డాక్యుమెంట్లు... ఏజెంట్లు తీసుకొచ్చే డాక్యుమెంట్ల విషయంలో ఒకలాగా, మిగిలిన డాక్యుమెంట్ల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమంటే రిజిస్ట్రేషన్ల చట్టంలోని ఏదో ఒక రూల్ చెప్పి కొర్రీ వేయడం వారికి పరిపాటిగా మారింది. నాలుగు సార్లు ఏదో రకంగా వెనక్కు పంపిస్తే ఐదోసారి తమకు కావాల్సినవి ముట్టజెప్తారనే ధోరణిలోనే సబ్రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారని, ముట్టిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నా పని అయిపోతుందనే చర్చ బహిరంగ రహస్యమే. -
తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ప్రోగ్రెసివ్ రికగనైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూటీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావును శుక్రవారం కలిసింది. 2015 నుంచి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధనకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపింది. రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఒత్తిడైనా.. ఒప్పించడమైనా.. ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల సాధనకు ఇదే సరైన సమయమని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే నేపథ్యం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే నిర్ణయం తమకు కలిసి వస్తుందని టీచర్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది ఉపాధ్యాయులు, 4 లక్షల మంది కుటుంబసభ్యులున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వీరి పాత్ర లేకున్నా, ఎంతోకొంత ప్రభావం ఉంటుందనేది వాస్తవం. దీంతో ప్రభుత్వం ముందున్న తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు పావులు కదుపుతున్నాయి. విద్యాశాఖలో దాదాపు 20 వేల ఖాళీలుండగా, 10 వేల మందికి తక్షణ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకం అవసరం ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు ఏడేళ్లుగా బదిలీలు కోరుకుంటున్నారు. ఎవరి వ్యూహం వారిదే ప్రభుత్వంతో సత్సంబంధాలతో ముందుకెళ్లే సంఘాలు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వారం రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు యత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులు ఇస్తే ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల మరింత సానుకూల ధోరణితో ఉండే వీలుందని సంఘాల వారు నచ్చజెప్పాలనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయొచ్చని, దీంతో లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో నమ్మకం పెరుగుతుందని వివరించాలనే యోచనలో ఉన్నారు. కొన్ని సంఘాలు విపక్షాలతో కలిసి దీన్నో రాజకీయ అంశంగా మలిచే అవకాశం ఇవ్వకూడదనే ధోరణిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాయి. ఇదిలాఉంటే, బదిలీలు, పదోన్నతులపై ఇంతకాలం ఆందోళనలు చేసిన సంఘాలు, వీటిని మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సమయంలో ఆందోళనల తీవ్రత పెరగకూడదనే ఆలోచనలో ఉంటుందని, కాబట్టి తమ పోరాటాలకు తలొగ్గే అవకాశముంటుందని భావిస్తున్నారు. వివరిస్తాం.. సాధిస్తాం బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మొదట్నుంచీ మా సంఘం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వచ్చే వారం మరోసారి ఈ వ్యవహారంపై సర్కార్ పెద్దలను కలిసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. ఉపాధ్యాయ కుటుంబాలకు సర్కార్ సానుకూలంగా ఉందనే సంకేతాలు అందిస్తాం. – బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరాటంతోనే సాధన బదిలీలు, పదోన్నతులు సాధించేందుకు ఇప్పటివరకు ఎన్నో పోరాటాలు చేశాం. ఇప్పుడు దీన్ని మరింత ఉధృతం చేస్తాం. త్వరలోనే ఉపాధ్యాయ ఐక్య పోరాట వేదిక సమావేశమవుతుంది. కలిసి వచ్చే సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. ఉపాధ్యాయ సమస్యల సాధనలో కొత్త తరహా ఆందోళనలు చేపడతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
అటవీ శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్త జిల్లాలకు అనుగుణంగా అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం అక్కడ కొత్తగా అటవీ శాఖాధికారులను నియమించింది. 26 జిల్లాల్లో 32 టెరిటోరియల్ డివిజన్లు, 12 సోషల్ ఫారెస్ట్ డివిజన్లు, వైల్డ్ లైఫ్ డివిజన్లకు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో)లను నియమించింది. ఇందుకోసం ఇప్పుడు పనిచేస్తున్న డీఎఫ్వోలను బదిలీ చేసింది. ఆ డివిజన్లలో ఇతర అధికారులు, సిబ్బందిని కూడా నియమించింది. బుధవారం నుంచి కొత్త డివిజన్ల ప్రకారం అటవీ శాఖ పనిచేయనుంది. అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల స్వరూపం జిల్లాల వారీగా, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా ఉండదు. ఒక జిల్లాలో 3, 4 డివిజన్లు.. కొన్నిచోట్ల 2 జిల్లాలకు కలిపి ఒక డివిజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే జిల్లాల పునర్విభజన సమయంలో అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. అటవీ శాఖ స్వరూపాన్ని బట్టి పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. దీంతో 2 నెలల్లో కసరత్తు చేసి ఇటీవలే అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించారు. వాటి ప్రకారం మంగళవారం సిబ్బందిని బదిలీ చేశారు. ప్రతి జిల్లాకు ఒక డివిజన్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాకు ఒక డివిజన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ఉన్నట్లే జిల్లా అటవీ శాఖాధికారి ఒకరు ఉండేలా చూశారు. ఆయా జిల్లాల్లో ఎక్కువ అడవి ఉంటే అక్కడ అదనంగా డివిజన్లు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా అటవీ శాఖాధికారిని నియమించారు. ఆ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో మరో 3 డివిజన్లు సృష్టించి వాటికి డీఎఫ్ఓలను నియమించారు. జిల్లాలో అటవీ శాఖను సమన్వయం చేసేది పాడేరులోని జిల్లా అటవీ శాఖాధికారే. ఇలా అన్ని జిల్లాలను అటవీ విస్తీర్ణాన్ని బట్టి పునర్వ్యవస్థీకరించారు. ఆ డివిజన్ల ప్రకారం బుధవారం నుంచి పరిపాలన ప్రారంభం కానున్నట్లు అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై. మధుసూదన్రెడ్డి తెలిపారు. -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్గా శిశిర్ అగర్వాల్ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
‘రాబడి’ శాఖల్లో.. బదిలీల కదలిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలక శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, భూపరిపాలన, పన్నుల శాఖల్లో త్వరలోనే బదిలీలు జరగనున్నట్టు తెలిపాయి. ప్రభుత్వ పాలన, ఆదాయ సమీకరణలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు శాఖల్లో చాలా కాలం నుంచి బదిలీలు లేకపోవడం, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తుండటం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం నేపథ్యంలో.. బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. ఒక్కొక్కటిగా.. ఓ కొలిక్కి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో బదిలీలు జరిగి చాలాకాలం అవుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత ప్రాతిపదికన ఇటీవలి కాలంలో జరిగిన మల్టీజోనల్, జోనల్, జిల్లా స్థాయి బదిలీలు, అప్పుడప్పుడు పదోన్నతులు వచ్చినప్పుడు చేసే బదిలీలు మాత్రమే జరిగాయి. కానీ పూర్తిస్థాయి సాధారణ బదిలీలు జరగలేదు. రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే దశాబ్ద కాలం నుంచీ ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లు కూడా ఉన్నారు. పన్నుల శాఖలో కూడా ఏళ్ల తరబడి పాతుకుపోయిన ‘వసూల్ రాజా’లు కీలక ప్రాంతాలను అంటిపెట్టుకుని వదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ బదిలీలు లేకపోవడంతో వారికి ప్రయోజనకరంగా మారింది. పలుచోట్ల అధికారులు కార్యాలయాలకు ðవెళ్లకుండానే.. సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బందితో వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కీలకమైన భూపరిపాలన శాఖ, ఎక్సైజ్ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవలి పదోన్నతుల సమయంలో కొందరికి స్థాన చలనం కలిగిందే తప్ప.. సాధారణ బదిలీలు లేవు. ఈ శాఖలన్నింటిలో బదిలీలు అనివార్యమనే చర్చ జరుగుతోంది. కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు నిజానికి చాలా కాలం నుంచీ ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. బదిలీలపై నిషేధం అమల్లో ఉండటం, ఎత్తివేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రక్రియ ముందుకు పడలేదు. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్లశాఖ బదిలీలపై దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్లు ఎక్కడెక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? వారిపై ఏమైనా కేసులు న్నాయా? చర్యలు పెండింగ్లో ఉన్నాయా? అనే వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఇక పన్నుల శాఖలో వీలైనంత త్వరగా బదిలీల ప్రక్రియ పూర్తికావాలని, లేకుంటే ఆదాయ వనరుల సమీకరణపై ప్రభావం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశించుకున్న రాబడి లక్ష్యం పూర్తి కావాలంటే.. ఐదారు నెలల ముందే బదిలీలు జరగాలని, అధికారులు కొత్త స్థానాల్లో కుదురుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారని పేర్కొంటున్నాయి. ఇప్పుడు జరగకుంటే ఎన్నికల తర్వాతే! ఈ ఏడాదిలో బదిలీలు జరగకపోతే.. వచ్చే ఏడాది ఎన్నికలతో బదిలీలకు అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక ఆదాయ శాఖల్లో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
దక్షిణ డిస్కంలో బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. సబ్ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్ విభాగంలో జేఏఓల కేడర్ వరకు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల ఉద్యోగుల బదిలీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 30 నాటికి మూడేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఒకేచోట పనిచేసే వారిని బదిలీ చేయనున్నారు. సీని యారిటీ ప్రాతిపదికగా మొత్తం ఉద్యోగుల్లో 40% మందికి మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్లు పేర్కొంది. బదిలీకానున్న వారి జాబితాను ఈనెల 13న డివిజనల్/సర్కిల్ కార్యాలయాలకు అందజేయనున్నారు. జాబితాపై 17 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, విజ్ఞప్తులుంటే 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 28లోగా బదిలీలపై ఉత్తర్వులు జారీ కానుండగా.. బదిలీ అయిన ఉద్యోగులు 30న రిలీవ్ కావాలని సంస్థ ఆదేశించింది. -
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఆమేరకు విధించిన బ్యాన్ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. చదవండి: (CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్) -
బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
-
AP: బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త
తాడేపల్లి: ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్పై సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
విద్యుత్ సంస్థల్లో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్కో, ట్రాన్స్కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు. ట్రాన్స్కో, జెన్కోలో మార్గదర్శకాలిలా.. ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు. ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు. పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు డిస్కంలలో నిబంధనలు ఇలా.. ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు.. విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు. -
వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు పోస్టింగ్ లు ఇవ్వాలని, వెంటనే సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్లకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపించారు. వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 498 మంది ఉద్యోగులు పదోన్నతులు పొంది దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వలేదన్నారు. మరోవైపు ఐదేళ్ల నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ కూడా పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
ప్రమోషన్లు, బదిలీలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఆశలపై విద్యాశాఖ ఈ ఏడాది కూడా నీళ్లు చల్లినట్టే కన్పిస్తోంది. పదోన్నతులు, బదిలీలపై ఇంతకాలం హడావుడి∙చేసిన అధికారులు మళ్లీ చల్లబడ్డారు. జిల్లాస్థాయిలో సీనియారిటీ జాబితాలతో ముసాయిదాలు సిద్ధం చేసినా, షెడ్యూల్ విడుదలకు విద్యాశాఖ సుముఖంగా కన్పించడం లేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద సోమవారం జరిగిన సమావేశంలో పలువురు అధికారులు పదోన్నతులు, బదిలీలపై అనేక సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ తేనెతుట్టెను ఇప్పుడు కదిలించకపోవడమే మంచిదని ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా 317 జీవో అమలుకావడంతో ఈ అంశం వెనక్కివెళ్లింది. తాజాగా జూన్ చివరి నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగించాలని విద్యాశాఖ నిర్ణయించి, ముందుకు కదిలింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) వరకూ ప్రమోషన్లకు ఎలాంటి సమస్యలూ లేవని భావించి, ముందుగా దీన్ని చేపట్టాలనుకున్నారు. హెచ్ఎంలు, ఎంఈవో, డీఈవోల భర్తీ, పదోన్నతుల ప్రక్రియలో అనేక సమస్యలు విద్యాశాఖను భయపెడుతున్నాయి. ఇవన్నీ పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమని ఉన్నతాధికారులు మంత్రికి సూచించినట్టు సమాచారం. దీంతో మంత్రి కూడా వెనక్కితగ్గారని తెలిసింది. ఇచ్చేదుంటే షెడ్యూల్ ఏది? ప్రమోషన్లు ఇచ్చే విషయంలో పురోగతి ఉంటే, ఏప్రిల్ చివరి నాటికే షెడ్యూల్ విడుదల కావాలి. ఆ తర్వాత మే రెండో వారం నుంచి ప్రక్రియ మొదలవ్వాలి. జూన్లో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీలు చేయాలి. కానీ ఇప్పటివరకు షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టుల విషయంలో కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకూ ఈ పోస్టులు ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు (నేరుగా నియమించబడ్డవారు) దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ మంత్రి అనేక దఫాలు చర్చలు జరిపినా, పెద్దగా ప్రయోజనం లేదు. అసలీ కేసులకు సంబంధించి కోర్టులోనూ విద్యాశాఖ అవసరమైన కౌంటర్ పత్రాలు దాఖలు చేయలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. అదీగాక, జూన్ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత బదిలీలు చేయడం, పదోన్నతుల ద్వారా కొత్త టీచర్లు స్కూళ్లకు వస్తే విద్యార్థులకు సాంకేతికంగా ఇబ్బందిగా ఉండే వీలుంది. దీంతో ప్రమోషన్లు, బదిలీలు ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విద్యాశాఖ నుంచి బలంగా విన్పిస్తోంది. ఉద్యమమే శరణ్యం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బుధవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. కమిటీ సోమవారం సమావేశమై ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసినట్టు యూటీఎఫ్ నేత చావా రవి చెప్పారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక టీచర్లు నష్టపోతున్నారని, సర్కార్ స్పందించకపోవడంతోనే ఉద్యమించాల్సి వస్తోందన్నారు. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలి టీఎంఎస్టీఏ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సంఘం (టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. దీనిపై మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్తో కలిసి, సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మే నెల సగం గడిచినా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
షెడ్యూల్ ఇవ్వకుండానే.. సైలెంట్గా టీచర్ల పదోన్నతుల జాబితాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులపై మళ్లీ కదలిక వచ్చింది. సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు సీనియారిటీ ప్రాతిపదికన జాబితాలు సిద్ధం చేస్తున్నారు. వాటిని అనధికారికంగా ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్లకు పంపి.. డ్రాఫ్ట్ (ముసాయిదా జాబితా)గా భావించాలని చెప్తున్నారు. అయితే ఈ పదోన్నతుల జాబితాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లు, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ) మాత్రమే ఉండటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. షెడ్యూల్ విడుదల చేయకుండానే ముసాయిదా సీనియారిటీ జాబితాలు రూపొందించడం ఏమిటని.. అందరికీ పదోన్నతులు ఇవ్వడంపై విద్యాశాఖ ఎందుకు దృష్టిపెట్టడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఉన్న చిక్కులన్నీ పరిష్కరించాలని కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆందోళనబాట పట్టాలని పలు సంఘాలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పర్యవేక్షణ పోస్టులు లేనట్టేనా? రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల మంది టీచర్లున్నారు. ఇందులో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదో న్నతి పొందాల్సినవారు 8,500 మంది ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్(హెచ్ఎం) గా ప్రమోషన్ పొందాల్సినవారు 2 వేలకుపైగా ఉం టారు. వీరికి పదోన్నతులు కల్పించడంపై ఎలాంటి చిక్కులూ లేవని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే హెచ్ఎంల నుంచి ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతులు కల్పించడమే సమస్య అంటున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఉన్న టీచర్లకూ ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులు ఇవ్వాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు నిబంధనల ప్రకారం విద్యాశాఖ నేరుగా రిక్రూ ట్చేసుకున్న ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకే ఆ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సం ఘం స్పష్టంచేస్తోంది. దీనిపై విద్యామంత్రి వద్ద రెండుసార్లు చర్చలు జరిగాయి. అయినా ఏమీ తేల లేదు. ఈ కారణంతో ప్రస్తుతం హెచ్ఎంలకు పదో న్నతులు కల్పించే అవకాశం లేదని భావిస్తున్నారు. జాబితాలు అందరికీ పంపాలి షెడ్యూల్ ఇవ్వకుండానే పదోన్నతులకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయడం సరికాదు. టీచర్లు అందరికీ జాబితాలు పంపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముందు పదోన్నతులు, బదిలీలకు ఉన్న కోర్టు చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. –చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎంల పదోన్నతులూ ముఖ్యమే రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యావ్యవస్థ సక్రమంగా పనిచేయడం కష్టం. సాకులు చూపి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం సరికాదు. ప్రధానోపాధ్యాయులు ఎంతోకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా వాయిదా వేస్తే వారిలో సహనం నశిస్తుంది. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బదిలీలకూ సమస్యే.. పదోన్నతులు, బదిలీలను ఏకకాలంలో చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అన్నిస్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే తప్ప బదిలీలు చేయడం సాధ్యమయ్యే పనికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఆ తర్వాత ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని.. ఏప్రిల్ నెలాఖరుకే ఈ మేరకు షెడ్యూల్ ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. కానీ ఈ ప్రక్రియకు ఏదో అడ్డంకి వస్తుండటంతో.. ప్రస్తుతం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఇలాగైతే బదిలీలు ఎప్పుడు చేపడతారని, ఎలా చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. జూన్లో బడుల రీఓపెనింగ్ ఉంటుందని... ఇప్పటికీ పదోన్నతులపై స్పష్టత ఇవ్వకుండా, కోర్టు వివాదాలు, ఇతర సమస్యలను తేల్చకుండా బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే 317 జీవోకు సంబంధించి 6 వేల అప్పీళ్లు విద్యాశాఖ ముందున్నాయని.. స్పౌజ్ కేసులను పరిష్కరించలేదని గుర్తు చేస్తున్నాయి. -
తెలంగాణలో భారీగా జిల్లా కోర్టు జడ్జిల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పోస్టుల్లో నియమితులైన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. పేరు పనిచేస్తున్న స్థానం బ దిలీ అయిన స్థానం 1.ఎస్.శశిధర్రెడ్డి - లేబర్ కోర్టు పీఓ జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 2.ఇ.తిరుమలాదేవి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ 3.బీఆర్ మధుసుధన్రావు - ప్రిన్స్పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ చైర్మన్–వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 4.జీవీ సుబ్రమణ్యం - రిజిస్ట్రార్–జుడిషియల్-1 హైకోర్టు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్–1 చైర్మన్ 5.బి.పాపిరెడ్డి - జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 6.సీహెచ్కే భూపతి - డైరెక్టర్–రాష్ట్ర జుడిషియల్ అకాడమీ - జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 7.టి.శ్రీనివాసరావు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 8.జీవీఎన్ భరతలక్ష్మి - చైర్మన్–ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ - లేబర్ కోర్టు పీఓ 9.సీహెచ్ రమేశ్బాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి - ప్రిన్స్పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ కేసులు 10.బి.సురేశ్ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 11.ఎం.నాగరాజు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నల్లగొండ - అధనపు జిల్లా సెషన్స్ జడ్జి–పెద్దపల్లి 12.బి.ప్రతిమ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల 13.టి.రఘురాం - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి(ఫాస్ట్ట్రాక్)–మేడ్చల్ 14.ఎన్.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల 15.బి.గౌతం ప్రసాద్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 16.కే.శైలజ - చైర్పర్సన్, ఎల్ఆర్ఏటీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 17.పి.నారాయణబాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–బోధన్ 18.జి.నీలిమ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ జిల్లా జడ్జి హోదాలో వాణిజ్య వివాదాల కోర్టు 19.జి.రాజగోపాల్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి ప్రిన్స్పల్ స్పెషల్ జడ్జి–ఎస్పీఈ, ఏసీబీ కేసులు 20.కే.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ 21.ఎన్ఎన్ శ్రీదేవి - ప్రిన్స్పల్ ఫ్యామిలీ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి 22.హుజాయబ్ అమద్ ఖాన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి 23.ఏ.జయరాజు - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నల్గొండ 24.కే.కుష - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి 25.బోయ శ్రీనువాసులు- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్కోర్టు 26.ఎస్వీపీ సూర్యచంద్రకళ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి– బోధన్ ఫ్యామిలీ కోర్టు–ఎల్బీనగర్ 27.పి.నీరజ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ 28.ఎం.జాన్సన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి 29.టి.జయలక్ష్మి - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ట్రాక్–జనగామ 30.లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ - స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - చైర్మన్–ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్ 31.జి.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 32.జి.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–పోక్సో కేసులు - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ 33.పి.ముక్తిద - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ - అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జి 34.బకరాజు శ్రీనివాసరావు - స్పెషల్ సెషన్స్ జడ్జి–అట్రాసిటీ అగైనెస్ట్ వుమెన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ 35.సీవీఎస్ సాయిభూపతి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సత్తుపల్లి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబుబాబాద్ 36.ఎం.భవాణి - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ 37.కే.అరుణకుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 38.డి.మాధవీకృష్ణ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కరీంనగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 39.కే.మారుతీదేవి - ఫ్యామిలీ కోర్టు జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మెదక్ 40.ఎస్.సరిత - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ 41.కే.జయంతి - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి–మేడ్చల్ - ప్రిన్స్పల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి–సికింద్రాబాద్ 42.వినోద్కుమార్ - అదనపు స్పెషల్ జడ్జి–ఎస్పీ అండ్ ఏసీబీ కేసులు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 43.కుమార్ వివేక్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కూకట్పల్లి - అదనపు జిల్లా జడ్జి –కరీంనగర్ 44.ఎం.పద్మజ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ట్రాక్ నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 45.పి.లక్ష్మికుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ కరీంనగర్ 46.ఎం.సతీశ్కుమార్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ట్రాక్ కరీంనగర్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 47.ఎన్.రోజరమణి - అదనపు స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 48.టి.అనిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ మెదక్ - అదనపు మెట్రోపాలిటన్ స్పెషల్ జడ్జి–హైదరాబాద్ 49.మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం - అదనపు జిల్లా జడ్జి–ఎల్బీ నగర్ 50.కే.ఉమాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 51.బి.అపర్ణాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు(ఫాస్ట్ ట్రాక్) 52.సీహెచ్ పంచాక్షరీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ట్రాక్, నిజామాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి నిజామాబాద్ 53.జే.కవిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ జనగామ - అదనపు మెట్రోపాలిటన్ సెసన్స్ జడ్జి హైదరాబాద్ 54.పి.ఆనీరోజ్ క్రిస్టియన్- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ - జడ్జి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు–పోక్సో 55.ఎన్.సంతోష్కుమార్ - పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు–గద్వాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్నగర్ -
ఒక్కరు మినహా అందరు ఈడీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమూల ప్రక్షాళనకు ఎండీ సజ్జనార్ నడుం బిగించారు. ఒక్కరు మినహా అందరు ఈడీలనూ బదిలీ చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లను మార్చేశారు. 11 మంది ఆర్ఎంలు అటూ ఇటూ మారిపోయారు. త్వరలో మరో బదిలీ ఉత్తర్వు కూడా వెలువడనుంది. డీవీఎంలను, దాదాపు 70 మంది డీఎంలను బదిలీ చేయనున్నట్టు సమాచారం. డీవీఎం పోస్టులతో ఉపయోగం లేదని, ఆ పోస్టుల్లోని అధికారులను వేరే అవసరాలకు వాడుకోవాలని ఎండీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కొందరు తప్ప మిగతా డీవీఎంలను మారుస్తారని సమాచారం. ఆపరేషన్స్ ఈడీగా మునిశేఖర్ కొంతకాలంగా డిపో స్థాయి నుంచి బస్భవన్ వరకు అన్ని విభాగాలను సమీక్షిస్తున్న సజ్జనార్.. ప్రతి విభాగం, ఆయా విభాగాల అధికారుల పనితీరుపై పూర్తి అవగాహనకొచ్చారు. పనితీరు సరిగా లేని వారిని కీలక పోస్టుల నుంచి తప్పించి మెరుగ్గా ఉందని భావించిన వారికి ముఖ్య పోస్టులను అప్పగించారు. సర్వీస్లో సీనియరే అయినా ఈడీ పోస్టు నిర్వహణలో జూనియర్గా ఉన్న మునిశేఖర్కు అత్యంత కీలకమైన, ఆర్టీసీకి ఆయువుపట్టుగా నిలిచే ఆపరేషన్స్ విభాగాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఈడీగా ఉన్నారు. ఇంతకాలం ఆ పోస్టు నిర్వహించిన యాదగిరికి గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యతలు అప్పగించారు. యాదగిరి పనితీరుపై సజ్జనార్ అసంతృప్తితో ఉన్నట్టు బస్భవన్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, జీఎమ్మార్ అంగీకరిస్తే..) గ్రేటర్ హైదరాబాద్ ఈడీగా ఉన్న వెంకటేశ్వర్లును కరీంనగర్ జోన్ ఈడీగా మార్చారు. గతంలో ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు రెండూ యాదగిరి వద్ద ఉండేవి. అందులో అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని ఏ ఈడీకి అప్పగించలేదు. బదిలీల వ్యవహారాలు ఈ విభాగం పరిధిలోనే ఉంటాయి. దీన్ని తనే స్వయంగా పర్యవేక్షించాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. బదిలీలు జరిగిన విభాగాల్లో ఎవరికీ కేటాయించనివి ఎండీ వద్దే ఉంటాయని బదిలీ ఆదేశాల్లో స్పష్టం చేశారు. (క్లిక్: ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?) -
టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధమైంది. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులను అప్గ్రేడ్ చేస్తోంది. జోనల్ వ్యవస్థలో భాగంగా ఇటీవల 317 జీవో అమలు చేశారు. కొత్త జిల్లాలకు కేడర్ను కేటాయించారు. ఈ మార్పు తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆందోళనలు తెరమీదకొచ్చాయి. అయితే, కొత్త జిల్లా కేటాయింపుల తర్వాత జిల్లాల వారీగా టీచర్ల సీనియారిటీని రూపొందించాల్సి ఉంటుంది. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ దీని ఆధారంగా చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా దీన్ని పూర్తి చేయాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సాధారణ బదిలీలు, పదోన్నతులు ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు.. సర్వీస్ రికార్డుల ఆధారంగా టీచర్ల పదోన్నతుల వ్యవహారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 2009 సర్వీసు నిబంధనలు అమలులో ఉన్నాయి. అప్పట్లో జోనల్ వ్యవస్థ అమలులో లేదు. కాబట్టి సర్వీసు రూల్స్ మార్చుకుని పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పదోన్నతులు పొందాల్సిన ఉపాధ్యాయులు దాదాపు 10 వేల మంది వరకూ ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ప్రాథమిక స్కూల్లో పనిచేస్తున్న వారిని ఎస్జీటీ స్థాయికి పెంచనున్నారు. మరోవైపు 5,700 మంది ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలను నియమించాల్సి ఉంది. పాఠశాల స్థాయిలో మొత్తం 13 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో సింహభాగం ప్రాథమిక, ఎస్జీటీ స్థాయిలోనే ఉండే వీలుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే బదిలీలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. భారీ ఎత్తున మండల విద్యాశాఖాధికారులను కూడా నియమించాల్సి ఉంది. లోకల్ బాడీ, ప్రభుత్వ స్కూళ్లను వేర్వేరుగా చూస్తున్న కారణంగా ఈ నియామక విధానంపై ఓ స్పష్టత కన్పించడం లేదని అధికారులు అంటున్నారు. హేతుబద్ధీకరణకు గ్రీన్సిగ్నల్... ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఎంత మంది ఉన్నారనే డేటాను ఇప్పటికే విద్యాశాఖ తెప్పించింది. దీని ఆధారంగా కొన్ని స్కూళ్లలో తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయనుంది. ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్న కారణంగా దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత 18 వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉండొచ్చని అంచనా వేశారు. రేషనలైజేషన్ డేటాను బట్టి ఈ సంఖ్య 13 వేల వరకూ ఉండొచ్చని తేల్చారు. దీన్నిబట్టి ప్రాథమిక స్కూళ్లపైనే రేషనలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే వీలుంది. కాబట్టి ప్రాథమిక స్కూల్ టీచర్లు సర్వీసును ఆధారంగా ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందే వీలుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలి: ఎస్టీయూటీఎస్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత్రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ప్రక్రియకు ముందే జోనల్ విధానంలో బదిలీ అయిన వారు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
AP: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల జాబితా పూర్తి
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్ల ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. విభాగాల వారీగా అందరు ఉద్యోగుల సర్వీసు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా బదిలీ ప్రక్రియ చేపడుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 13 జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో ట్యూటర్ల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకూ బదిలీలకు అర్హులైన వారి గుర్తింపు పూర్తయింది. చదవండి: జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే.. 431 మంది ప్రొఫెసర్లు ఉండగా వీరిలో 250 మందికిపైగా ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 375 మంది అసోసియేట్ ప్రొఫెసర్లలో 190 మందికిపైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,737 మందికి గాను 800 మంది, ట్యూటర్లు 123 మందికి గాను సుమారు 70 మంది.. ఇలా మొత్తంగా 1,300 మందికిపైగా తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వీరందరి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగులు 7వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిలీ జీవోల్లో మార్పులు చేయాలి ఒకే చోట 5 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులందరినీ బదిలీ చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిడకాల శ్యామ్సుందర్ శుక్రవారం డిమాండ్ చేశారు. -
‘నాలుగో సింహం’ బోనులో.. ‘వనమా’లు జనంలో
సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్లైన్లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చెప్పినట్టు వినాల్సిందే.. కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పోస్టింగ్కో రేటు పెట్టి.. రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు. ►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ►ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం. ►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది. ►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు! ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి. సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
మ్యూచువల్ బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలో మ్యూచువల్ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బదిలీలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 4వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. పరస్పర అంగీకారంతో బదిలీలకు అనుమతి తెలిపింది. ఒకే చోట రెండేళ్లు పనిచేసిన వారు మ్యూచువల్ బదిలీలకు అర్హులు. చదవండి: ‘మైకులు కనిపిస్తే చాలు.. ఆయన రెచ్చిపోతారు’ -
రెండేళ్లు పూర్తయి ఉంటే బదిలీకి ఓకే..
సాక్షి, అమరావతి: ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే అలాంటి ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్య శాఖలో తాజాగా బదిలీలకు మార్గదర్శకాలు జారీచేశారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన వారు స్పష్టమైన ఖాళీ(క్లియర్ వేకెన్సీ) ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పరస్పర బదిలీల(మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అయితే ఒకే కేడర్ పోస్ట్ అయి ఉండాలి. బదిలీకి దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తామో చెప్పాలి. లేదా ఖాళీని బట్టి వారికి పోస్టింగ్ ఇస్తారు. బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారికి అదే చోట వెయ్యరు. ఉదాహరణకు విశాఖపట్నంలోని కింగ్జార్జి ఆస్పత్రిలో పనిచేస్తూ.. మానసిక ఆస్పత్రికో, చెస్ట్ ఆస్పత్రికో బదిలీకి అనుమతించరు. కేవలం రిక్వెస్ట్ బదిలీలు మాత్రమే లకాబట్టి ఎవరికీ రవాణా సదుపాయాలు కల్పించరు. దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో జరుగుతుంది. 40 లేదా అంతకంటే ఎక్కువ వైకల్య శాతం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి అవకాశం ఇస్తారు. క్యాన్సర్, గుండె ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు చేయించుకున్న వారికి, చికిత్స కొనసాగుతున్న వారిని.. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తారు. భర్త లేదా భార్య కేసుల(స్పౌస్ గ్రౌండ్స్)కు సంబంధించి ఒకరికి మాత్రమే బదిలీకి అనుమతిస్తారు. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ గానీ, బదిలీ గానీ నిర్దేశించిన సమయంలో మాత్రమే అనుమతిస్తారు. పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. -
ఆరోగ్య శాఖలో బదిలీలు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్సిగ్నల్ లభించింది. 2019 జూలైలో 1న బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2020లో జరగలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆరోగ్య శాఖలోని అన్ని కేడర్ పోస్టులకూ బదిలీలు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. మరికొందరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకేచోట పనిచేస్తూ.. బదిలీ కోసం వినతులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. ముఖ్యంగా రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యతనిస్తారు. ఇటీవలే 14,391 పోస్టులను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, ఖాళీ అయిన చోట కొత్త నియామకాలు చేయాలనేది ఆరోగ్య శాఖ ఆలోచన. మొదటి వారంలో నోటిఫికేషన్.. అక్టోబర్ మొదటి వారంలో బదిలీలకు నోటిఫికేషన్ ఇచ్చి.. ఆ నెలాఖరుకల్లా బదిలీల ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. ఈ లోగా కొత్త నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రుల్లోని, అన్ని కేటగిరీల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నియామకాల అనంతరం డిప్యుటేషన్లు, బదిలీల అన్న మాట ఉండకూడదని, పదే పదే సిఫార్సు లేఖలకు అవకాశం ఉండకూడదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. దీంతో నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, మిగతా ఖాళీ పోస్టుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి కొత్త వారిని నియమిస్తారు. అన్ని కేడర్లలోనూ.. వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, పారా మెడికల్,పరిపాలనా సిబ్బంది ఇలా ప్రతి కేటగిరీలోనూ దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. కొన్ని బోధనాస్పత్రుల్లో 20 ఏళ్ల నుంచి కూడా వైద్యులు ఒకేచోట పని చేస్తున్నారు. 2019 బదిలీల మార్గదర్శకాల ప్రకారం మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు లేదా మెడికల్ కాలేజీల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులు ఒకేచోట 7 ఏళ్లు పనిచేస్తే తనకు నచ్చిన చోటుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మొత్తం బదిలీలు 20%కి మించకూడదు. తాజాగా బదిలీలకు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. బదిలీలు పూర్తవగానే నియామకాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో బదిలీలు చేయాలనుకున్నాం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. సిబ్బంది బదిలీలకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో వినతులు స్వీకరిస్తాం. ఈ వినతులను బట్టి బదిలీలు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త నియామకాలుంటాయి. నియామకాలు పూర్తయ్యాక ఎలాంటి డిప్యుటేషన్లు, ట్రాన్స్ఫర్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఏపీ: విలీన గ్రామాల్లోని టీచర్ల బదిలీల షెడ్యూల్
సాక్షి, అమరావతి: మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 6 నుంచి 21వ తేదీ మధ్య వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు సిద్ధం కావాలన్నారు. గత ఏడాది ఉపాధ్యాయుల సాధారణ బదిలీల సమయంలో మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్నందున తమను మునిసిపల్ ఉపాధ్యాయులుగా పరిగణించాలని 400 మందికిపైగా జెడ్పీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వీరి బదిలీలు నిలిచిపోయాయి. కోర్టు ఉపాధ్యాయుల కేసులను కొట్టేసి, బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్య అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి బదిలీలకు షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ఇలా.. 6వ తేదీ: యాజమన్య, కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల ప్రదర్శన 7వ తేదీ: తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన 8, 9 తేదీలు: ప్రకటించిన జాబితాలో అభ్యంతరాల అప్లోడ్, ఆధారాలు విద్యాశాఖ అధికారులకు అందజేత 13, 14 తేదీలు: అభ్యంతరాల పరిశీలన, ఆమోదం 15వ తేదీ: తుది సీనియారిటీ జాబితా ప్రకటన 16, 17 తేదీలు: వెబ్ ఆప్షన్ల స్వీకరణ 21వ తేదీ: వెబ్సైట్లో బదిలీ ఆర్డర్ల ప్రదర్శన, డౌన్లోడింగ్. ఇవీ చదవండి: ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ
సాక్షి, విజయవాడ: సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్స్ వివరాలు.. ► కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు ► ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్ ► తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్ ► మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్ ► నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి ► దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం ► బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్ ► సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్ ► హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ అయ్యారు. మరో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్లను రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘టాప్బాస్’లకు తప్పని బదిలీలు..?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని పోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్చార్జ్ల నేతృత్వంలో కొనసాగుతుండగా మరి కొందరు అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ నెలాఖరుకు ఇంకొందరు రిటైర్ కానున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఏటా ఈ పండుగకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం కావడంతో ఆ ప్రభావం పోలీసు బదిలీలపై ఉండేది. ఈ ఏడాది అలా కాకపోవడంతో ట్రాన్స్ఫర్స్కు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలకు తుదిమెరుగులు దిద్దుతున్న ఉన్నతాధికారులు ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదోన్నతి వచ్చి ఏడాది దాటినా... నగర పోలీసు చరిత్రలో గత ఏడాది ఓ అరుదైన ఘట్టం ఆవిష్క్రృతమైంది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 23 మంది ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు అప్పట్లో ఏడుగురు ఉండేవారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పదోన్నతులు ఇవ్వడంతో పాటే బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారినీ వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాచకొండ జాయింట్ సీపీగా పని చేస్తున్న జి.సుధీర్బాబును మాత్రం అదే కమిషనరేట్కు అదనపు సీపీగా నియమించారు. మిగిలిన వారంతా పై హోదాలో కింది పోస్టుల్లో కింది పోస్టుల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలా, ఈ స్థాయిలో అధికారులు గతంలో ఎన్నడూ పని చేయకపోవడంతో ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూపులు... పోలీసు కమిషనరేట్కు నేతృత్వం వహించే కమిషనర్ నుంచి పోలీసు స్టేషన్కు ఇన్చార్జ్గా ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు నిర్ధిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంకు అధికారి పోలీసు కమిషనర్గా ఉంటారు. సిటీ పోలీసు విభాగానికి ఆయనే బాస్ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) ర్యాంకు వాళ్ళే ఉంటారు. గత ఏడాది ఐపీఎస్ల పదోన్నతి నేపథ్యంలో సిటీ కమిషనరేట్లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం అదే తొలిసారి. నగర అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా పని చేస్తున్న షికా గోయల్కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగుతున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్జోన్ డీసీపీగా పని చేస్తున్న ఏఆర్ శ్రీనివాస్కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పని చేసే ఆస్కారం ఉండటంతో ఆ పోస్టులోనే కొనసాగుతూ ఇటీవలే డీఐజీగానూ పదోన్నతి పొందారు. నెలాఖరులో రిటైర్ అవుతున్న ఈయన మినహా మిగిలిన అధికారులు ఏడాదికి పైగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్నారు. ‘టాప్బాస్’లకు తప్పని బదిలీలు..? భౌగోళికంగా ఒకటిగా ఉన్న రాజధానిలో పోలీసు పరంగా మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. వీటిని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్, సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా ఈ పోస్టులను రెండేళ్లను టెన్యూర్ పీరియడ్గా పరిగణిస్తూ ఉంటారు. ఆ టైమ్ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా బదిలీలు తప్పవన్నది ప్రతి అధికారికీ తెలిసిన విషయమే. రాజధాని విషయానికి వస్తే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్లు ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్కు టెన్యూర్ పూర్తి కావడంతో పాటు ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. దీంతో ఈ మూడు పోస్టుల్లోనూ మార్పు చేర్పులు తప్పవని వినిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న దక్షిణ మండల డీసీపీ, నగర సంయుక్త సీపీ (పరిపాలన) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్థాయిల్లోనూ కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో మూడు కమిషనరేట్లలోనూ కొత్త టీమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసింది. గతేడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లా లకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపుతూ ఆదివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 378 మంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి రిలీవ్ కావడం.. పూర్వపు జిల్లాల్లో రిపోర్టు చేయడం.. మండలాల వారీగా పోస్టింగ్లు తీసుకోవడం జరిగిపోయాయి. మూడేళ్లు ఒకేచోట, సొంత జిల్లా ల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను ఈసీ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాల్లో నియమించాలని గత కొన్నాళ్లు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం ఈ డిమాండ్ మరోసారి తెరపైకి రావడంతో స్పందించిన ప్రభుత్వం బదిలీ ప్రక్రియను పూర్తి చేసింది. -
పోలీసుశాఖలో భారీగా బదిలీలు !
పోలీసు శాఖలో ఒకేసారి భారీగా బదిలీలు జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దసంఖ్యలో జరిగిన బదిలీలు ఇవే కావడంతో శాఖలో కుదుపు చోటు చేసుకున్నట్లయింది. ఈ మేరకు శుక్రవారం బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 అడిషనల్ ఎస్పీల బదిలీలు జరగ్గా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏడుగురి బదిలీ, వారి స్థానంలో నియామకాలు జరిగాయి. ఇక ఏసీపీ/డీఎస్పీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని 20 మంది ఉన్నారు. ఈ బదిలీలు, నియామకాల్లో కొత్త, పాత అధికారులకు అవకాశం దక్కింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు... బదిలీలు, నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రస్తుత జాబితా ద్వారా తెలుస్తోంది. సాక్షి, వరంగల్ : పోలీసుశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దమొత్తంలో పోలీసు డీసీపీ. అడిషనల్ ఎస్పీ, ఏసీపీ, డీఎస్పీల బదిలీలు, నియామకాల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) మహేందర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అడిషనల్ ఎస్పీల బదిలీలు జరగ్గా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏడుగురి బదిలీ, వారి స్థానంలో నియామకాలు జరిగాయి. శాంతిభద్రతలు, ఇంటలిజెన్స్, ఎస్ఐబీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 68 మంది ఏసీపీ/డీఎస్పీలకు స్థాన చలనం కలగగా.. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని 20 మంది ఉన్నారు. ఏసీపీలుగా పని చేస్తూ అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన గ్రూపు–1 అధికారులకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఎన్నికల కోడ్లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి బదిలీ వచ్చి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న పలువురు ఏసీపీలు, పోలీసు సబ్ డివిజనల్ అధికారు(ఎస్డీపీఓ)లను బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇదివరకే డీఎస్పీలుగా పని చేస్తున్న వారితో పాటు ఇటీవలే సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన పలువురిని కూడా ఏసీపీలు, డీఎస్పీలుగా నియమించారు. అవకాశం దక్కించుక్ను కొత్త, పాత అధికారులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద మొత్తంలో పోలీసు అధికారుల బదిలీలు జరగడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏసీపీ నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన పలువురికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ గుమ్మి చక్రవర్తిగా అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించగా, హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీగా నియమించారు. సీపీ అటాచ్డ్గా ఉన్న వి.శ్రీనివాసులును జయశంకర్భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా, అక్కడ ఉన్న బి.రాజమహేంద్ర నాయక్ను ఇంటలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన వి.సునీత కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపాల్గా, జగిత్యాల ఎస్పీ అటాచ్డ్గా ఉన్న నల్ల మల్లారెడ్డిని వరంగల్ అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా, కరీంనగర్ సీపీ అటాచ్డ్గా ఉన్న పుల్లా శోభన్కుమార్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా నియమించారు. సిద్దిపేట అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న సి.ప్రభాకర్ను మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అడిషనల్ ఎస్పీ, ఏసీపీ/డీసీపీల బదిలీలు, నియామకాల్లో కొత్త, పాత అధికారులకు అవకాశం దక్కింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై దృష్టి సారించిన పోలీసు ఉన్నతాధికారులు... బదిలీలు, నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ జాబితా ద్వారా తెలుస్తోంది. పోస్టింగ్ల కోసం పోటాపోటీ వరంగల్ పోలీసు కమిషనరేట్, ఉమ్మడి జిల్లా పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం పలువురు పోటాపోటీగా ప్రయత్నాలు చేశారు. ఎన్నికల కోడ్లో వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదురు చూడగా.. ఆ స్థానాల కోసం ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు ప్రయత్నించారు. మరికొందరు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన ఏసీపీ స్థానాలతో పాటు కాజీపేట, హన్మకొండ, వరంగల్, స్టేషన్ఘన్పూర్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు తదితర పోస్టింగ్ కోసం ఏసీపీపీ/డీఎస్పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారు కూడా పోటీ పడ్డారు. హన్మకొండ కోసం ఇక్కడే ఇన్స్పెక్టర్లుగా పని చేసి ఒకరి తర్వాత ఒకరు పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు చేశారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందులో చాలా మంది ప్రయత్నాలు ఫలించగా... మరికొందరికి నిరాశ కలిగింది. చాలామందికి కోరుకున్న పోస్టింగ్ రాకున్నా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోస్టింగ్ లభించింది. శుక్రవారం జరిగిన బదిలీల్లో కాజీపేట ఏసీపీగా ఉన్న కె.నర్సింగరావు హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయమని సూచించగా... ఏసీబీ డీఎస్పీగా బదిలీ అయిన వర్దన్నపేట ఏసీపీ మధుసూదన్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇదిలా ఉండగా త్వరలోనే ఇద్దరు, ముగ్గురు ఎసీపీ/డీఎస్పీల బదిలీలు ఉంటాయన్న పోలీసుశాఖలో చర్చజరుగుతోంది. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
పదోన్నతుల మాటేమిటి?
సాక్షి, మహబూబ్నగర్ : టీఆర్టీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పిడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017నవంబర్లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది. భర్తీ ఉత్తర్వులు అందకపోవడంతో అభ్యర్థులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,979 ఉపాద్యాయ పోస్టుల గాను 2018 ఫిబ్రవరీ, మార్చిలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించన పరీక్షకు దాదాపు 50వేల మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ పరీక్ష రాశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అనందంగా ఉన్నా సీనియర్ ఉపాధ్యాయులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండానే నేరుగా పోస్టులు భర్తీ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 1,979 పోస్టుల భర్తీకి కసరత్తు టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కలెక్టర్ కమిటీ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ను వైస్ చైర్మన్గా, డీఈఓను కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీ పాత జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల రోస్టర్ పాయింట్లకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు అందిస్తారు. పాత, కొత్త జిల్లాల వారీగా ఖాళీలు, సబ్జెక్టు, మాధ్యమం, ప్రాంతాల వారీగా వివరాలు సేకరించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమిస్తూ కమిటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ సబ్జెక్టుల వారీగా 1,979 పోస్టులను ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1979 ఎస్జీటీ, 1400 ఎస్టీటీ పోస్టులు ఇవ్వనుండగా, మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రమోషన్లు కల్పించాల్సిందే గత డీఎస్సీలో సీనియర్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చిన తర్వాత మాత్రమే నూనతంగా వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్హాక్ పద్ధతిలో అయినా పోస్టింగ్లు ఇచ్చి, విద్యాసంవత్సరం ప్రారంభంలో వారిని రివర్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది. -గట్టు వెంకట్రెడ్డి,పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి ప్రస్తుతం ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల అభ్యర్థుల భర్తీ ప్రక్రియను ఎటువంటి న్యాయపరైమన ఇబ్బందులు రాకుండా భర్తి చేస్తే బాగుటుంది. మొదటిగా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలి. అదికూడా పాత జిల్లాల ప్రకారమే ఇస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. పాత జిల్లాల వారీగా టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి, ప్రమోషన్లు మాత్ర కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వడం సరికాదు. – దుంకుడు శ్రీనివాస్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
సామూహిక సెలవులకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: కోడ్ కూత ముగిసినా.. సర్కారు కరుణిం చడంలేదు. తహసీల్దార్లు కుటుంబ సభ్యులను వదిలి పది నెలలైనా పాత జిల్లాలకు తిరిగి పంపేందుకు అంగీకరించడంలేదు. నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు అందుతాయని దాటవేస్తూ వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తహసీల్దార్ల బదిలీల మాట అటుంచితే అన్ని కేడర్లలోనూ బదిలీలు, పదోన్నతులతోపాటు రెవెన్యూశాఖ ప్రక్షాళనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సామూహిక సెలవుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సామూహిక సెలవులకు వెళ్దామని ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక రెవెన్యూ సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఉంటాయా... ఉండవా? సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా మూడేళ్లుగా ఒకే జిల్లాలో పోస్టింగ్ నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను ఎన్నికల కోడ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం వారికి తిరిగి పాత జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అలాగే ఉంటుందని భావించిన తహసీల్దార్లు.. వారి కుటుంబ సభ్యులను పూర్వ జిల్లాల్లోనే ఉంచేసి పొరుగు జిల్లాల్లో సేవలందించేందుకు వెళ్లారు. ఎన్నికలు అయిపోగానే వెనక్కి వస్తామనే భరోసాతో పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా వారిని అక్కడే కొనసాగించారు. మే నెలాఖరులో కోడ్ ముగియడంతో ఇక పాత జిల్లాలకు వెళ్తామని భావించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వుల గురించి ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో తహసీల్దార్లలో ఆందోళన మొదలైంది. బదిలీలు ఉంటాయా లేదా అనే అనుమానం వారిని తొలిచేస్తోంది. సీఎంఓ చుట్టూ చక్కర్లు..? ముఖ్యమంత్రి కేసీఆర్ పరిధిలోనే రెవెన్యూశాఖ కూడా ఉండటంతో బదిలీలపై సీఎం నిర్ణయం తీసుకుంటే కానీ ముందడుగు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నికల వేళ వివిధ జిల్లాలకు బదిలీ అయిన 466 మందిని తిరిగి పూర్వ జిల్లాలకు పంపాలని ప్రతిపాదిస్తూ సీఎం పేషీకి చేరిన ఫైలుకు ఇప్పటివరకు మోక్షం కలగకపోవడంతో తహసీల్దార్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. మరో పక్షం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆలోగా గనుక బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోతే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు బదిలీల వ్యవహారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు తలనొప్పిగా పరిణమించింది. రొటీన్గా జరిగే ఎన్నికల బదిలీల ఉత్తర్వులను కూడా ఇప్పించలేకపోయామనే ప్రచారం జరుగుతుండటంతో పరిస్థితిని అధిగమించేందుకు భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే సీఎంఓ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు తాజాగా ఏపీలో ఎన్నికల వేళ స్థానచలనం జరిగిన తహసీల్దార్లను పాత జిల్లాలకు పంపుతూ గురువారం ఉత్తర్వులు వెలువడటం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో బదిలీలపై నిర్ణయం తీసుకోకపోతే సామూహిక సెలవులపై వెళ్లాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఏపీలో 37మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున డీఎస్పీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఏకకాలంలో 37మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. అయితే బదిలీ అయినవారిలో ఏడుగురుని ఇంటెలిజెన్స్కు కేటాయించగా, మిగిలిన 30మంది అధికారులు మంగళగిరిలోని హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎన్నికల నిమిత్తం కొంతమంది పలు జిల్లాలకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు. అంతేకాకుండా బదిలీ అయినవారిపై పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల్లో మరిన్నీ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు: బి.శ్రీనివాసులు... ఎస్డీపీవో కర్నూలు బాబు ప్రసాద్..ఎస్డీపీవో గూడూరు మురళి కృష్ణ..ఎస్డీపీవో నెల్లూరు టౌన్ ఎన్.టి.వి. రామ్ కుమార్..ఎస్బీ డిఎస్పీఅనంతపురం ఎన్.యుగేంద్ర బాబు..ఎస్డీపీవో,పలమనేరు ఎన్.వెంకట రామ ఆంజనేయులు..ఎస్డీపీవో,చిత్తూరు పి.వి.ఎస్.ఎస్.ఎం.వి.అర్.వర్మ ఎస్డీపీవో,కాకినాడ జి.రామ ఆంజనేయులు..డిఎస్పీ ఎస్బి గుంటూరు..అర్బన్ కే. శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,ప్రొద్దుటూరు ఎస్.వి.వి.ప్రసాదరావు...ఎస్డీపీవో ,అనకాపల్లి ఏ.వి.ఎల్.ప్రసన్న కుమార్..ఏసీపీ..వైజాగ్ నార్త్ జి.పూర్ణ చంద్రరావు ..ఏసీపీ వైజాగ్ ఈస్ట్ బి.ప్రసాదరావు..ఎస్డీపీవో ,కాశీబుగ్గ సి హెచ్.వి.రామ రావు ..ఎస్డీపీవో ,పెద్దాపురం ఫై.మహేష్ ..ఎస్డీపీవో,గుడివాడ వి.పోతురాజు ..ఎస్డీపీవో,అవనిగడ్డ బి.శ్రీనివాసరావు ..ఎస్డీపీవో ,నూజివీడు వై.బి.పి.టి.ఏ.ప్రసాద్.. ఏసీపీ విజయవాడ సెంట్రల్ ఎన్.మురళి కృష్ణ ..డిఎస్పీ,ఎస్బి , పశ్చిమ గోదావరి వి.కాలేషావలి ...ఎస్డీపీవో ,సత్తెనపల్లి జి.రామకృష్ణ ...డిఎస్పీ ,గుంటూరు నార్త్ యు.నాగరాజ్ ఎస్డీపీవో , చీరాల ఏ.ఎస్.సి.బోస్ ..ఎస్డీపీవో ,నందిగామ ఎన్.రామారావు ...డిఎస్పీ ,రాజముండ్రి సెంట్రల్ విక్రమ్ శ్రీనివాస్ రావు ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్ ,ఒంగోలు డి.అమర్నాథ్ నాయుడు..డిఎస్పీ ,ఇంటెలిజన్స్ ఎం.శ్రీనివాస్ రావు.. డిఎస్పీ,ఏపి ఎస్పి జె .మల్లికార్జున వర్మ ..డిఎస్పీ ,ఇంటెలిజన్స్,కడప బి.విజయ్ భాస్కర్.. ,డిఎస్పీ ,ఇంటెలిజన్స్ డి.శ్రవణ్ కుమార్ ...డిఎస్పీ ,ఇంటెలిజన్స్, కృష్ణ -
రెవెన్యూశాఖలో ప్రక్షాళన షురూ..!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖను సంస్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట తిష్టవేసిన ఉద్యోగులను ఆయా స్థానాలనుంచి బదిలీ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూశాఖను అవినీతిరహితంగా మార్చేందుకు సంకల్పించిన నేపథ్యంలో మూకుమ్మడి బదిలీలతో కొంతమేర మార్పు తీసుకురావొచ్చని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి మొదలుపెట్టి.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) స్థాయి వరకు అందరికీ స్థానచలనం చేయాల్సిందేనని యోచిస్తోంది. రెవెన్యూ శాఖలో పైసలివ్వందే ఫైలు ముందుకు కదలడంలేదని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకవైపు కొత్త రెవెన్యూ చట్టానికి పదును పెడుతూనే.. మరోవైపు ఉద్యోగులను సమూల మార్పులు చేసేలా విధానాన్ని రూపొందించాలని మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించారు. ఈ మేరకు నిపుణుల కమిటీ నూతన రెవెన్యూ చట్టం, ఉద్యోగుల విలీనం తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే, చట్టం మనుగడలోకి రావడం ఆలస్యమవుతున్నందున.. ఆ లోపు ఉద్యోగుల బదిలీల ద్వారా కాస్తయినా మార్పు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దిగువ నుంచి ఎగువ వరకు ఈ విషయంలో ఎలాంటి తారతమ్యాల్లేకుండా.. దిగువస్థాయి నుంచి ఎగువస్థాయి వరకు తేడాల్లేకుండా బదిలీలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్ఓ, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, నయాబ్ (ఉప) తహసీల్దార్లను ఆ జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయడం ద్వారా కుర్చీలకు అతుక్కుపోయిన సిబ్బందిని తప్పించవచ్చని, తద్వారా అవినీతిని కొంతమేరనైనా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున.. స్థానచలనం చేయాల్సిన అధికారుల జాబితాను రెవెన్యూశాఖ తయారు చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడంతో ఆలోపే ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది. సమాచార సేకరణ! దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల డేటాబేస్ను ఇటీవల సీసీఎల్ఏ కార్యాలయం సేకరించింది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో వివరాలను రాబట్టింది. సర్వీసులో చేరిన తర్వాత ఏయే చోట్ల, ఏయే పోస్టుల్లో ఎన్నాళ్లు పనిచేశారు? సొంత జిల్లా ఏదీ? తదితర సమాచారాన్ని సేకరించింది. దిగువస్థాయి సిబ్బంది మొదలు.. తహసీల్దార్ వరకు ఈ వివరాలను పంపాలని కోరింది. జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్, డీటీ/పీడీటీ, తహసీల్దార్ల సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలకు అనుగుణంగా బదిలీల క్రతువును పూర్తి చేయాలనే యోచనలో ఉంది. ఒకే జిల్లాల్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారనే లెక్క ఆధారంగా బదిలీలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ డేటాను ముఖ్యమంత్రి కార్యాలయానికి రెవెన్యూ శాఖ నివేదించినట్లు తెలిసింది. అయితే, ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు మినహా మిగతా స్టాఫ్ను జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. దీంతో ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో అమలు చేయాలని రెవెన్యూశాఖకు సీఎంవో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతస్థాయి అధకారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తహసీల్దార్లను కూడా.. తహసీల్దార్ల బదిలీకి కూడా రంగం సిద్ధమైంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాత జిల్లాలకు పంపాలని తహసీల్దార్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 466 మంది తహసీల్దార్ల బదిలీలకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదే క్రమంలో పూర్వపు జిల్లాలకు కేటాయించిన అనంతరం.. పాత పోస్టింగ్లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకుప్రభుత్వం సూచనలు జారీ చేయనుందని సమాచారం. అలాగే ఇతర తహసీల్దార్లను జోనల్ పరిధిలో ఏ జిల్లాకైనా పంపడంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గవద్దని సీఎం పేషీ సంకేతాలిచ్చినట్లు సమాచారం. కాగా, వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో సత్వరమే బదిలీలు జరగాల్సివుంది. ఎన్నికల ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రెవెన్యూ అధికారుల బదిలీల్లో మరికొంత ఆలస్యం జరిగే అవకాశముంది. -
ఖాకీల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో భారీగా బదిలీలకు రంగం సిద్ధమైంది. కొన్ని సంవత్సరాలుగా పోలీసుశాఖలో బదిలీలు లేకపోవడం, ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాల అధికారులు బదిలీపై రావడం తదితర కారణాల రీత్యా బదిలీల ప్రక్రియ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీల వరకూ బదిలీలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మూడు సంవత్సరాల పాటు పనిచేస్తున్న వారు, జిల్లాకు చెందిన వారు, గత ఎన్నికల్లో జిల్లాలో పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలుదీరింది. జిల్లాకు నూతన ఎస్పీగా బూసారపు సత్యయేసుబాబు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నారు. డీఎస్పీలతో మొదలై... పోలీసుశాఖలో తొలుత డీఎస్పీలతో బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు, మూడు రోజుల్లో డీఎస్పీల బదిలీలు పూర్తి కానున్నాయి. ఎన్నికల నిమిత్తం కొంతమంది జిల్లాకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు. దీంతో తొలుత డీఎస్పీల బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జిల్లాలో దాదాపు అన్నీ డీఎస్పీ స్థానాలకు కొత్త అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం బదిలీపై జిల్లాకు వచ్చిన సీఐలు తిరిగి వారి జిల్లాలకు వెళ్లనున్నారు. దీంతో జిల్లాకు చెందిన సీఐలకు తిరిగి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. అనంతరం ఎస్ఐలు, ఆ తర్వాత కానిస్టేబుల్ బదిలీలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒకేస్థానంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతున్న పోలీసు సిబ్బందిని బదిలీ చేయనున్నారు. -
ఆర్టీసీలో పదోన్నతులు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారుల్లో కొందరికి పదోన్నతులు కల్పిస్తూ మరికొందరిని బదిలీ చేస్తూ సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పదోన్నతుల్లేకుండా ఇన్చార్జి ఈడీలుగా నియమితులైన ముగ్గురికి ఇప్పుడు పదోన్నతి కల్పించారు. రవీందర్, టీవీ రావు, అజయ్కుమార్లు కొంతకాలంగా ఇన్చార్జి ఈడీలుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వారిని పూర్తిస్థాయి ఈడీలుగా నియమించారు. దీంతో వారి అసలు పోస్టులను ఇతర అధికారుల బదిలీ లతో భర్తీ చేశారు. ఆదిలాబాద్ ఆర్ఎంగా ఉన్న రవీందర్ ఈడీగా నియమితులైనా ఆయన ఆర్ఎం పోస్టును మాత్రం ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు. త్వరలో అక్కడ మరో అధికారిని నియమించే అవకాశముంది. డిప్యూటీ సీటీఎంగా ఉంటూ సికింద్రాబాద్ ఇన్చార్జి ఆర్ఎంగా పనిచేస్తున్న శ్రీధర్కు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ ఆర్ఎంగా నియమించారు. అక్కడ ఆర్ఎంగా ఉన్న సూర్యకిరణ్ను బస్భవన్లో చీఫ్ పర్సనల్ మేనేజర్గా బదిలీ చేశారు. నల్లగొండ ఆర్ఎంను చీఫ్ కం ట్రోలర్ ఆఫ్ స్టోర్స్గా బస్భవన్కు బదిలీ చేశారు. డిప్యూటీ సీఎంఓ (టెక్నికల్) గా ఉన్న వెంకన్నను నల్లగొండ ఆర్ఎంగా నియమించారు. మెదక్ ఆర్ఎంను సికిం ద్రాబాద్ ఆర్ఎంగా బదిలీ చేసి, మెదక్లో డీవీఎంగా ఉన్న రాజశేఖర్ను మెదక్ ఆర్ఎంగా నియమించారు. త్వరలో మరికొన్ని బదిలీలు జరగనున్నాయి. -
బదిలీల ఫీవర్
జిల్లాలో కొందరు అధికారులు, ఉద్యోగులకు బదిలీల జ్వరం పట్టుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకశాఖల్లో ఉండి టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు మాత్రం బదిలీలు తప్పవని భావించి ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు కీలకశాఖ అధికారులు మాత్రం బదిలీల ఆందోళనలతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. ప్రజాప్రతినిధుల సన్నిహితుల ద్వారా బదిలీలు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలు కూడా పారదర్శకంగా చేయాలని, అవినీతి అధికారులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి రావడంతో బదిలీల ప్రక్రియపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించనున్నారు. సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. జిల్లాలో కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి వర్గ విస్తరణలో కూడా జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం తనదైన మార్క్ పాలన సాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా చేసేందుకు కొత్త అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అప్పటి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పాలన సాగించిన అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో గడిపిన వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. కీలక శాఖల అధికారుల మార్పు జిల్లాలో పాలనా పరమైన విషయాల్లో కీలకంగా ఉండే పలు కీలక శాఖల అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పురపాలక, నుడా, మైనింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, జిల్లా పరిషత్ తదితర శాఖల్లో బదిలీలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ముందుగా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి వన్సైడ్ పాలన సాగించిన అధికారులు, ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నెల్లూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై తొలి వేటు పడనుంది. ఈ వారంలోనే నుడా వైస్ చైర్మన్తోపాటు కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బదిలీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. గత రెండేళ్లలో నుడాలో భారీ అవినీతి చోటుచేసుకుంది. నుడా పాలకవర్గం చేతిలో కీలుబొమ్మల్లా మారిన అధికారులు అవినీతి, అక్రమాలకు రాచబాట వేశారు. దీంతో తొలి విడతలోనే వారిని పంపే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు పలు పురపాలక సంఘాల్లో కూడా బదిలీలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ సారథ్యంలో ఆయన కనుసన్నల్లో పనిచేసిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా అడ్డదిడ్డంగా పనులు చేసిన వారిని కూడా పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మైనింగ్ శాఖలో తొలివేటు పడింది. టీడీపీ హయాంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్రెడ్డికి తొత్తులా వ్యవహరించి సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేయడమే కాక ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచిన మైనింగ్ ఏడీ రాజశేఖర్ను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో మైనింగ్ శాఖలో అక్రమాలు కోకొల్లలుగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ విభాగంలో కూడా బదిలీల ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వ పెద్దలు జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేసిన జిల్లాస్థాయి, డివిజన్స్థాయి అధికారులను బదిలీలపై రప్పించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిని కొనసాగిస్తే మాత్రం టీడీపీ పెద్దలతో వారికున్న సన్నిహితం, పరిచయాల వల్ల పాలనా పరమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారిని బదిలీ చేసి కొత్త టీంను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ పోలీసులు జిల్లాలో పోలీస్శాఖలో భారీ మార్పులు ఉండబోతున్నాయన్న సంకేతాలు రావడంతో డివిజన్, సర్కిల్స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు తొత్తుల్లా పనిచేయడమేకాక, పచ్చచొక్కా తొడిగిన పోలీసులకు మాత్రం బదిలీలు తప్పనిసరిగా ఉంటాయనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుత అధికారపార్టీ చోటా, మోటా నేతలతో సంబంధాలు ఉన్న పోలీసులకు మాత్రం మరొకచోటికి స్థాన చలనం జరిగినా చాలన్నట్లుగా ప్రయత్నాలు మమ్మురం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు షాడో ఎస్పీగా చెలామణి అవుతున్న అధికారి కనుసన్నల్లో సీఐల బదిలీలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో అధికారపార్టీ నేతలకు కొమ్ము కాసే అధికార యంత్రాంగాన్ని ఏరికోరి జిల్లాకు రప్పించి పోస్టింగ్లు ఇచ్చారు. అధికారం మార్పు రాగానే టీడీపీ పచ్చచొక్కా తొడిగిన పోలీస్ అధికారులు కూడా ప్రాధాన్యత లేని పోస్టుల్లో కూడా కేవలం స్థాన చలనం చేసి మరొకచోటికి పంపితే వన్సైడ్గా చేస్తామన్నట్లుగా ప్రజాప్రతినిధుల వద్ద మంత్రాంగంనడుపుతున్నారు. అయితే ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీల విషయంలో జాగ్రత్త వహించకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు పలు జాగ్రతలు తీసుకుంటున్నారు. -
ఖాకీగోల..!
పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటామనే నమ్మకం కలిగించాల్సినపోలీసు శాఖ గత ఐదేళ్లూ దారితప్పింది. ఆ శాఖలో కొందరు అధికారపార్టీ నేతలఅడుగులకు మడుగులొత్తారు. ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శించారు. ఇప్పుడు అలాంటి వారందరిలో వణుకు మొదలైంది. ప్రభుత్వం మారడంతో బదిలీలు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో తమ పోస్టులు ఏమవుతాయోనని గోల మొదలెట్టారు.ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలీసు శాఖలోని ఎస్సైల నుంచి సబ్డివిజన్ అధికారుల వరకూ కొందరు గత ఐదేళ్లూ టీడీపీ నేతల ప్రాపకం కోసం పాకులాడారు. ఆదాయం కోసం జిల్లాలోని ప్రధాన సర్కిళ్లలో పోస్టింగులు వేయించుకోవడానికి టీడీపీ నేతల చెంతన చేరారు. ఆ నాయకులు చెప్పినట్టల్లా చేశారు. ఆఖరికి ప్రజాప్రతినిధులకు ఇసుక, మట్టి మాఫియాల నుంచి పేకాట క్లబ్ల నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత కూడా కొందరు తమ నెత్తిపై వేసుకున్నారు. వీరు పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినట్టల్లా ఆడారు. మాట వినని అధికారులను ప్రజాప్రతినిధులు బదిలీలతో భయపెట్టారు. ఒక ప్రజాప్రతినిధి ఏకంగా ఎస్సై స్థాయి అధికారిని కింద కూర్చోబెట్టడం, మరో ప్రజాప్రతినిధి దాడులకు తెగబడటంతో వారు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మారిపోక తప్పని దుస్థితి జిల్లాలో నెలకొంది. సబ్ డివిజన్స్థాయి అ«ధికారుల తీరే అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో కిందిస్థాయి అధికారులు వాళ్లను ఆదర్శంగా తీసుకుని రెచ్చిపోయారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు పెట్టడం, మరోవైపు సివిల్ సెటిల్మెంట్లు, భూకబ్జాదారులకు అండగా నిలబడడం చేశారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతలను పూర్తిగా విస్మరించారు. రాజకీయ కనుసన్నల్లోనే బదిలీలు గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో పోస్టింగ్లుఅన్నీ రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా పోస్టింగ్లు తెచ్చుకున్న అధికారులను బాధ్యతలు స్వీకరించకుండానే వెనక్కి తిప్పి పంపిన సందర్భాలు జిల్లాలో అనేకం. ఎన్నికల ముందు కూడా భీమవరం రూరల్ సీఐ నియామకంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బదిలీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు అధికారుల నిర్వాకాలు ఇవీ.. ♦ ఓ సబ్ డివిజన్ అధికారి ఇద్దరు ఎమ్మెల్యేలకు తొత్తుగా మారారు. వాళ్లు ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరించారు. ఆఖరికి ఆ అధికారి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు అన్ని వస్తువులూ సదరు ఎమ్మెల్యేల నుంచి వచ్చేలా వారితో మమేకమైపోయారు. ♦ మరో డీఎస్పీ కోడి పందేల నుంచి భారీగా వసూళ్లకు తెగబడ్డారు. ప్రతి స్టేషన్కు ఇంతని వసూలు చేశారు. హోంమంత్రి బంధువు కావడంతో అతని ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. చివరికి ఎన్నికల ముందు బదిలీపై వెళ్లారు. ♦ మరో సీఐ స్థాయి అధికారి గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని గంజాయి అక్రమ రవాణాకు సహకరించారు. చివరికి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండయ్యారు. ♦ ఒక డీఎస్పీ స్థాయి అధికారి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైన బీసీ గర్జనకు పోలీసుల బందోబస్తు నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో సభ నుంచి వెళ్లే సమయంలో జగన్మోహనరెడ్డి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. ఆ రోజున నాలుగైదు గంటల సేపు సభకు వచ్చిన వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. ♦ దళితులపై వ్యాఖ్యలు చేసిన అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు పెట్టకుండా అతని ఒత్తిడిపై వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టి వేధింపులకు గురి చేశాడో అధికారి. గతంలో చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తే, కేసు నమోదు చేసే విషయంలోనూ, ఆ తర్వాత విచారణ విషయంలోనూ పూర్తిగా చింతమనేనికి అండగా నిలబడ్డారు. ♦ ఎన్నికల సమయంలో కీలక విభాగం చూసే డీఎస్పీ అధికారి ఒకరు పూర్తిగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపైనే నిఘా పెట్టారు. ఆఖరికి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నారనుకున్న పోలీసు అధికారుల పక్కన కూడా షాడో బృందాలను ఏర్పాటు చేసి సామాజిక న్యాయం చాటుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోస్టింగ్ కోసం ప్రయత్నాలు..! జిల్లాలో పాలనా విభాగం తర్వాత అంతటిప్రాధాన్యం ఉన్న పోలీసుశాఖలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కలెక్టర్ల బదిలీలు జరగడం తర్వాత పోలీసు శాఖలో బదిలీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీజీపీ గౌతం సవాంగ్ కలవడంతో బదిలీలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతేడాది బదిలీ వేటు పడిన వారు, ఎన్నికల ముందు జరిగిన బదీలీల్లో బయట జిల్లాలకు వెళ్లిన అధికారులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు చేరేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతోరెచ్చిపోయిన ఆ పోలీసు అధికారులు ప్రస్తుతం పోస్టింగ్లు కాపాడుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పోస్టింగ్ కోసం యత్నాలు చేస్తున్నారు. -
బదిలీలకు వేళాయె!
ఒంగోలు సిటీ:ఉద్యోగుల బదిలీలకు వేళయింది. పని చేయడానికి ఎక్కడైతే బాగుంటుందన్న ఆలోచనల్లో పడ్డారు. కొందరైతే తాము ప్రయత్నాల్లో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. త్వరలోనే నియామకాల కోలాహలం ప్రారంభంకానున్నట్లు సూచనలు కన్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విధులను నిర్వహించడానికి పలువురు అధికారులు జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లారు. అక్కడి ఉద్యోగులు మన జిల్లాలో పని చేయడానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ మొత్తంగా ముగిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ఆదివారంతో ముగిసింది. ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వం కొత్త ఒరవడితో ప్రజాసంక్షేమానికి ముందుకు సాగుతోంది. జగన్ ఆశయాలకు అనుగణంగా పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రధాన కేడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీలు అనివార్యం కానున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల్లో భారీగా స్థాన చలనాలు ఉండవచ్చని భావిస్తున్నారు. తహశీల్దార్ కేడర్లో ఉన్న అధికారులు సార్వత్రిక ఎన్నికల విధులను నిర్వహించడానికి నెల్లూరు, గుంటూరు జిల్లాలకు వెళ్లారు. ఇక్కడి నుంచి 48 మంది అధికారులు వెళ్లారు. అలాగే నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడికి తహశీల్దార్లు వచ్చారు. కొందరు అధికారులు సచివాలయం నుంచి వచ్చారు. పదోన్నతుల ద్వారా జిల్లాకు కేటాయింపుజరిగి వచ్చిన వారు ఉన్నారు. తహశీల్దార్లు త్వరలోనే తిరిగి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు 34 మంది గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరి కొన్ని జిల్లాలకు వెళ్లారు. అలాగే వివిధ జిల్లాల నుంచి ఎన్నికల విధులను నిర్వహించడానికి 29 మంది ఇక్కడికి వచ్చారు. ఎన్నికల్లో అధికారుల వద్ద సహాయకులుగా, లైజనింగ్ అధికారులుగా, ఎన్నికల పరిశీలకుల వద్ద రకరకాల విధుల్లో ఉన్నారు. వీరిని త్వరలోనే విధుల నుంచి రిలీవ్ చేయనున్నారు. పోలీసు అధికారుల విషయంలోనూ అంతే. పదోన్నతుల ద్వారా వచ్చిన వారు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. ఎన్నికల కోసంగా జరిగిన పదోన్నతుల్లో జిల్లాలో వివిధ హోదాల్లో విధులను నిర్వహిసున్న వారు ఉన్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చే ముందు కూడా పలువురు కానిస్టేబుళ్లు, ఆ పై కేడర్లలోని అధికారులకు పోస్టింగ్లు పడ్డాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలు పెద్ద ఎత్తున ఉంటాయన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే పోలీసు వర్గాల్లో బదిలీపై చర్చ మొదలయ్యాయి. అన్ని కేడర్లలోనూ.. స్థాన చలనాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొందరు సర్వీసు నిబంధనలను అతిక్రమించి ఆ పార్టీ నాయకులకు విశిష్ట సేవలను అందించిన వారు ఉన్నారు. జిల్లా నుంచి ఎన్నికల సంఘానికి పలువురు పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రధాన శాఖల్లో పని చేస్తున్న వారితో పాటు జిల్లాలోని ప్రధానమైన శాఖల్లో అన్ని కేడర్లలోని ఉద్యోగులకు స్ధానచలనం తప్పదని అంటున్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు మినహా 97 ప్రభుత్వ శాఖల్లో వివిధ కేడర్లలో 27 వేల మంది పని చేస్తున్నారు. ఇందులోని కొన్ని ప్రధాన శాఖల్లో బదిలీ నియమ నిబంధనలను అనుసరించి బదిలీలు జరిగే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వం బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తుందన్న అంచనాలు అధికారుల్లో ఉన్నాయి. అయితే ప్రధాన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖలతో పాటు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. వీఆర్వోలను తాలూకాలను పరిగణలోకి తీసుకొని ఒక తాలూకా నుంచి మరో తాలూకా పరిధిలోకి బదిలీలు ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పట్లో కలెక్టర్ వీఆర్వోలను సమూలంగా బదిలీకి పూనుకొని తర్వాత పెండింగ్లో ఉంచారు. ఈ దఫా బదిలీలు క్షేత్ర స్థాయిలో కచ్చితంగా పెద్ద ఎత్తున జరుగుతాయని అంటున్నారు. అడ్డగోలుగా వ్యవహరించిన వారికి బెరుకు ఎన్నికల విధుల్లో అడ్డగోలుగా వ్యవహరించిన వారిలో బెరుకుతనం మొదలయ్యింది. కచ్చితంగా అప్రధాన్యం గల చోటికి బదిలీ తప్పదన్న ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లను చేర్పించే దగ్గర నుంచి తొలగింపులు ఇతర వ్యవహారాల్లో అడ్డగోలుగా కొందరు అధికారులు వ్యవహరించారు. వారికి మరి కొందరు ఉద్యోగులు వంత పలికారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా కొందరు వ్యవహరించి ఇబ్బంది పెట్టినట్లుగా సమాచారం. అలాంటి వారు స్వతహాగానే బెరుగ్గా ఉన్నారు. ఈ బదిలీల్లో తమ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. బదిలీల సంకేతాలు వెలువడిన నేపథ్యంలోనే ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరించిన వారికి జ్వరం పట్టుకుంది. మంచి పేరున్న వారికి తగిన గుర్తింపు ప్రజల్లో మంచి పేరున్న అధికారులకు ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించనుందన్న సంకేతాలున్నాయి. ఐదేళ్లు ఎలాంటి ఫోకల్ పోస్టింగ్ల్లో లేకండా ఎక్కడికి వేస్తే అక్కడ ఉద్యోగం చేసిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వారికి ఈ ఎన్నికల్లో తగిన గుర్తింపు వచ్చింది. పై అధికారులకు ఇబ్బంది కలిగించకుండా ఏ విధంగా పని చేశారో వారి పని తనం చూశారు. అలాం టి వారికి ఈ బదిలీల్లో తగిన గుర్తింపు లభించనుంది. ప్రజలతో ముఖ్యంగా మంచి సంబంధాలు, ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్ధాయిలో నూరు శాతం అమలు కాని పక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. చిత్తశుద్ధితో పని చేసే ఉద్యోగులకు తగిన ఫోకల్ సీట్లు అడక్కుండానే అవి వారిని వరిస్తాయంటున్నారు. ఉద్యోగులపై వేధింపులుఉండవన్న భరోసా జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు ఉండవన్న భరోసా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం ఉద్యోగులకు న్యాయబద్ధమైన సెలవు దినాల్లో వారిని ఎంత పని ఉన్నా కదిలించరు. వీడియో సమీక్షలు, ఇతర సమీక్షలు పండుగలు, ఇతర సెలవు దినాల్లో ఉండే ప్రసక్తి లేదంటున్నారు. ఇక పోలీసులకు కూడా సెలవులను ఇచ్చే విధానాన్ని ఆలోచించే అవకాశం ఉంది. ఉద్యోగులపై అనవసరపు వేధింపులకు ఈ ప్రభుత్వం చెల్లుచీటీ ఇవ్వనుందన్న భరోసా కల్పిస్తోంది. అడ్హాక్ పదోన్నతులకు ప్రయత్నాలు జిల్లాలో 12 మంది తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీటీలు కొత్తగా జిల్లాకు కొందరు వచ్చారు. ఎన్నికల విధుల్లో వారి సేవలను ఉపయోగించుకున్నారు. వీరిలో ప్రోడీటీలు ఉన్నారు. ఇక్కడ సీనియర్ ఉప తహశీల్దార్లు కొందరికి ఎన్నికల ముందు పదోన్నతులు పూర్తిగా జరగలేదు. జిల్లాలో ఖాళీగా ఉన్న తహశీల్దార్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిక్ట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) జరగాల్సి ఉంది. సీసీఎల్ఏ కార్యాలయంలోనే తగిన సిబ్బంది లేరు. వివిధ కేడర్లలో అధికారులు లేరు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన సీనియర్ డీటీలకు అడ్హాక్ పదోన్నతి ఇచ్చి వారిని తహశీల్లార్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలాంటి వారు 8 మంది అధికారులు సీనియారిటీ కలిగి ఉన్నారు.వీరికి త్వరలోనే అడ్హాక్ ఇచ్చి తహశీల్లార్ పోస్టింగ్లను ఇవ్వడానికి కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.అయితే బదిలీల మార్గదర్శకాల అనంతరం ఈ ప్రక్రియ జరుగుతుందా..అంతకు ముందే జరపాలా అన్న అంశంపై ఇంకా ముందుకు పోలేదు. ఫారెన్ సర్వీసులకు ఫుల్స్టాప్ జిల్లాలో ఫారెన్ సర్వీసులు కింద ఒక శాఖలోని ఉద్యోగులు ఇతర శాఖల్లో పని చేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని వారు పౌరసరఫరాల శాఖలో డీటీలు, ఎఫ్ఐలుగా పని చేస్తున్నారు. రెవెన్యూలోనే సిబ్బంది కొరత ఉంది. రెవెన్యూ నుంచి ఆ శాఖకు వెళ్తున్న ఆనవాయితీ గత కొన్నేళ్లుగా ఉంది. జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖకు అధికారిగా ఉన్నందున వారి ద్వారా ఫారెన్ సర్వీసులకు వెళ్తున్నారు.అలాగే డ్వామా, డీఆర్డీఏ ఇతర శాఖల్లో రెవెన్యూ నుంచి ఫారెన్ సర్వీసులకు వెళ్తున్నారు. దీంతో రెవెన్యూలోని అన్ని విభాగాల్లో పనులు కుంటుపడ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దఫా ఫారెన్ సర్వీసులకు ఫుల్స్టాప్ పెట్టేయోచనలో అధికారులు ఉన్నారు. జిల్లా అధికారులకు స్థాన చలనం ఉన్నందున జిల్లాలో ఎక్కవ కాలం పని చేసిన అధికారులు ఉన్నారు.వీరు నూతన ప్రభుత్వంలో ఫోకల్ పోస్టింగ్లకు తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లుగా సమాచారం. త్వరలోనే రిలీవ్ ఉత్తర్వులు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఎన్నికల విధుల కోసం వెళ్లిన అధికారులకు త్వరలోనే రిలీవింగ్ ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూన్ మొదటి వారంలోగా ఇక్కడనున్న వారు వారు పని చేస్తున్న జిల్లాలకు వెళ్తారు. జిల్లా నుంచి వెళ్లిన ఎంపీడీఓలు 34 మంది, తహశీల్దార్లు ఇతర అధికారులు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే వీరి రిలీవింగ్ దస్త్రం రాష్ట్ర అధికారుల పరిశీలనలోఉండడం గమనార్హం. -
ప్రక్షాళనకు వేళాయె!
జిల్లా పోలీసు శాఖలో త్వరలోనే సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్సైల నుంచి డీఎస్పీల దాకా స్థానచలనం అనివార్యమయ్యే సూచనలున్నాయి. జిల్లాకు కొత్త బాస్ కూడా రావొచ్చని తెలుస్తోంది. ప్రక్షాళన నేపథ్యంలో కొందరు అధికారుల్లో మాత్రం గుబులు మొదలైనట్లు సమాచారం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తి ‘పచ్చ’పాతంతో అత్యుత్సాహం ప్రదర్శించిన వీరు, తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని భయాందోళన చెందుతున్నారు. అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 151 సీట్లతో విజయదుందుభి మోగిం చింది. అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ శాఖల ప్రక్షాళనపై ఆయన దృష్టి సారిం చారు. కీలకమైన పోలీసు శాఖలోనూ ప్రక్షాళనకు అడుగులు పడుతున్న వేళ.. జిల్లాపై కూడా ఆ ప్రభావం పడే అవకాశముంది. సమూల మార్పులు జరిగే ఆస్కా రం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సైల నుంచి డీఎస్పీల దాకా స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మారనున్న సారథి? మార్పుల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖకు కొత్త సారథి వస్తారనే మాటలు విన్పిస్తున్నాయి. ప్రస్తుత ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ 2017 జూలై 3న పోలీసు బాస్గా పగ్గాలు చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆయన జిల్లాలో పనిచేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖపై తనదైన మార్క్ వేసుకున్న అశోక్కుమార్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ సమర్థవంతంగా పనిచేశారు. ఫ్యాక్షన్ ప్రభావితం కలిగిన జిల్లాలో ఎక్కడా గొడవలు, అల్లర్లు లేకుండా చర్యలు తీసు కున్నారు. పలు జిల్లాల్లో రీపోలింగ్ నిర్వహించినా ‘అనంత’లో మాత్రం ఆ ఆస్కారం లేకుండా చేశారు. కౌం టింగ్లో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం జిల్లాలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం వంటి సమస్యాత్మక నియోజకవర్గాల్లోని గ్రామాలకు అదనపు బలగాలను రప్పించారు. కేవలం ఎన్నికలు మాత్రమే కాకుండా క్రికెట్ బెట్టింగ్, పేకాట, మట్కా లాంటి అసాం ఘిక కార్యకలాపాలను కట్టడి చేశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించారు. ఫ్యాక్షన్ కట్టడి ఒకెత్తయితే రోడ్డు ప్రమాదాలు నివారణ మరో ప్రాధాన్యత అంశంగా తీసుకొని పనిచేశారు. ప్రముఖంగా యేసుబాబు పేరు పోలీసు శాఖలో రాష్ట్రం మొత్తం మీద ప్రక్షాళన నేపథ్యంలో అశోక్కుమార్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో కొత్త బాస్ ఎవరనే విషయంపై కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. పలు వురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో ప్రముఖంగా యేసుబాబు పేరు వినిపిస్తోంది. ఈయన లేకుంటే అప్పలనాయుడు వస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఎస్పీల బదిలీలుంటాయని తెలుస్తోంది. ‘పచ్చ’పాత అధికారుల్లో గుబులు ఈ క్రమంలో కొందరు పోలీసు అధికా రుల్లో గుబులు మొదటైనట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ నేతలకు అడుగులకు మడుగులొత్తిన వీరు భయాందోళన చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాప్తాడు, ధర్మవరం, రాయదుర్గం తదితర నియోజకవర్గాల్లో కొంతమంది ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు శృతి మించి ఏకపక్షంగా వ్యవహరించారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ తరఫున ఏజెంట్లు కూడా ఉండనీయకుండా భయబ్రాంతులకు గురి చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. కొత్త ప్రభుత్వంలో తమపై ఎలాంటి చర్యలుంటాయోననే కలవరం వీరిలో మొదలైనట్లు తెలిసింది. -
ఏసీపీ మల్లారెడ్డిపై వేటు
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపా టి జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ ఎస్.మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయన్ను గతంలోనే రాచకొండ హెడ్క్వార్టర్స్కు ఎటాచ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం మొత్తం 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇబ్రహీంపట్నం ఏసీపీగా వి.యాదగిరిరెడ్డిని నియమించింది. రాచకొం డలో ఉన్న మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టింది. మరోపక్క ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకేచోట నిర్ణీత కాలం పని చేసిన అధికారులకూ స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారి వివరాలు.. ఠి ఏసీబీలో ఉన్న కిరణ్కుమార్ను తూప్రాన్కు, కరీంనగర్ ట్రాఫిక్లో ఉన్న శ్యాంసుందర్ను మామూనూరుకు బదిలీ చేశారు. ఠి సైబరాబాద్ సీటీసీలో ఉన్న ఉమేందర్ను గోదావరిఖనికి, రామగుం డం టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహిస్తున్న రమణారెడ్డిని చౌటుప్పల్కు, అక్కడున్న బాపురెడ్డిని బాలానగర్ ట్రాఫిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఠి కరీంనగర్ పీటీసీలో ఉన్న సత్యన్నను కామారెడ్డి రూరల్కు, అక్కడి చంద్రశేఖర్గౌడ్ను హైదరాబాద్ నగర భద్రత విభాగానికి బదిలీ చేశారు. ఠి బాలానగర్ ట్రాఫిక్లో పనిచేస్తున్న నరసింహారావును పేట్ బషీరాబాద్కు, ఇక్కడున్న అందె శ్రీనివాసరావును మల్కాజిగిరి ట్రాఫిక్ కు, ఇంటెలిజెన్స్ డీఎస్పీ దేవేందర్ను మీర్చౌక్కు, అక్కడున్న ఏసీపీ ఆనంద్ను సీఎస్డబ్ల్యూకు, సీఐడీ డీఎస్పీ సత్తయ్యను సత్తుపల్లికి బదిలీ చేశారు. ఠి సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులును సీఐడీకి, సైబరాబాద్ ఎస్బీ ఏసీపీ భుజంగరావును రాచకొండకు, రాచకొండ ఏసీపీ జితేందర్రెడ్డిని సీఐడీకి, ఎస్బీ ఏసీపీగా ఉన్న భుజంగరావును భువనగిరికి, అక్కడున్న జితేందర్రెడ్డిని సీఐడీకి, సీఐడీలో ఉన్న గణపతి జాదవ్ను జహీరాబాద్కు, అక్కడున్న ఎన్.రవిని కరీంనగర్కు పీటీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఠి మహదేవపూర్ ఎస్డీపీవో ఆర్.కె.కె.ప్రసాద్ను కరీంనగర్ ట్రాఫిక్కు, రాచకొండ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్ను హన్మకొండకు, సీఐడీలో ఉన్న రమేశ్ను ఊట్నూరుకు, అక్కడున్న వెంకటేశ్ను రాచకొండ క్రైమ్కు, హన్మకొండ ఏసీపీ చంద్రయ్యను సైబరాబాద్ సీటీసీ ఏసీపీగా బదిలీ చేశారు. -
ఆరుగురు ఐపీఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ వారి స్థానాల్లో రాముల్ దేశ్ శర్మ, కోయ ప్రవీణ్లను నియమించింది. గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్గా అభిషేక్ మహంతి, విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్గా నవదీప్సింగ్, పర్సనల్ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, విశాఖ గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్గా సత్య ఏసుబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల ముందు జిల్లా ఎస్పీలను ప్రభుత్వం వరుసగా మారుస్తూ వస్తుంది. మూడు నెలల్లోనే కడప ఎస్పీని బదిలీ చేయడం గమనార్హం. -
అటవీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో–జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే సీఎం ఆదేశించారు. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్లో ఉండటం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖ సంస్కరణలు ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచిపేరున్న అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారికి మెమోలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టింది. చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు.. అడవులను సంరక్షించడంలో మంచి పేరున్న అధికారులను అటవీశాఖ ముఖ్య ప్రాంతాల్లో నియమించింది. దీంతో చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది బదిలీ అయ్యారు. ఈ బదిలీల ఫైలుపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్సర్వేటర్లు, కన్సర్వేటర్లు, డీఎఫ్వో స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలను, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన శర్వానంద్, వినోద్ కుమార్లకు మెదక్, కవ్వాల్ బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రాంతాలకు కొత్త డీఎఫ్వోలు.. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్నగర్, ఇచ్చోడకు కొత్త డీఎఫ్వోలను నియమించారు. 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్ అధికారులను నియమించారు. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు కలిపి 160 మందిని బదిలీ చేశారు. 11 మందిపై సస్పెన్షన్ వేటు... అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో పలువురిపై అటవీశాఖ చర్యలు తీసుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో అటవీశాఖ ఇటీవల 11 అటవీ అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకు ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమోలు కూడా జారీ చేశారు. -
పైరవీలతో భంగపాటు !
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: పోలీసుల బదిలీల్లో అధికారులకు పైరవీల తలనొప్పి తప్పడం లేదు. తమకు అనుకూలంగా లేనివారిని నియమించడం ఏమిటంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఐల బదిలీలు మళ్లీ నిలిచిపోయాయి. ఒక డీఐజీ స్థాయి అధికారి చేసిన బదిలీలు ఆగిపోవడం రెండునెలల్లో ఇది మూడోసారి. ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న డీఐజీ రవికుమార్ మూర్తి రెండురోజుల క్రితం చేసిన బదిలీలను మళ్లీ ఆయనే నిలిపివేసినట్లు సమాచారం. కొత్తపోస్టింగ్లలో చేరవద్దంటూ బదిలీ అయిన సీఐలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కామినేని పట్టు! కైకలూరు సీఐగా పని చేస్తున్న రవికుమార్కు మూడేళ్ల కాలపరిమితి పూర్తికాకపోవడంతో అక్కడే కొనసాగించాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పట్టుపడుతున్నారు. అయితే అతనిని మార్చి చెన్నకేశవరావును డీఐజీ నియమించారు. దీనిపై కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని జంగారెడ్డిగూడెం సీఐ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత మాట వినకుండా ఎంపీ మాగంటి బాబు సూచించిన వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారు. కడియం, రాజానగరం సీఐల విషయంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్ కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము లేఖ ఇచ్చిన వారికి కాకుండా వేరేవారికి పోస్టింగ్ ఇవ్వడంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంటిలిజెన్స్ ఏజీ జోక్యంతోనే! అయితే ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ప్రమేయంతో ఈ బదిలీలు జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయన జోక్యంతో జరిగిన బదిలీలు వివాదానికి కారణంగా మారాయి. దీంతో ఎమ్మెల్యేలకు చెప్పలేక, ఉన్నతాధికారి మాట కాదనలేని పరిస్థితి వివాదానికి దారి తీసింది. ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. గతంలోనూ వివాదం మరోవైపు గతంలో భీమవరం రూరల్ సీఐ నియామక విషయంలో అధికార పార్టీలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కనుమూరు రామకృష్ణంరాజు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మధ్య కోల్డ్వార్కు దారి తీసిన సంగతి తెలిసిందే. భీమవరం రూరల్ సీఐ నియామకం విషయంలో తాను సిఫార్సు చేసిన అధికారిని కాకుండా మరొకరికి పోస్టింగ్ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ వేటుకూరి శివరామరాజు బెదిరింపులకు దిగడంతో అప్పటికే ఇచ్చిన పోస్టింగ్లు రద్దు చేసి ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పాలకొల్లు రూరల్ స్టేషన్కు ఎస్బీలో ఉన్న కొండలరావును నియమించగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అడ్డుకుని పోస్టింగ్ నిలిపివేశారు. తర్వాత తనకు అనుకూలంగా ఉండే సీఐని తెచ్చుకున్నారు. ఏలూరు రేంజి చరిత్రలో ఇన్నిసార్లు పోస్టింగ్లు మార్చిన సందర్భాలు లేవని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
ఎన్నికల బదిలీలు
సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల బదిలీలకు జిల్లాలో రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే జిల్లా పరిధిలో మూడు సంవత్సరాల సర్వీసు దాటిన అధికారులను విధిగా బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను కూడా ఎన్నికల సమయంలో అదే జిల్లాలో ఉండనీయరాదని తేల్చిచెప్పింది. దీంతో జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారుల బదిలీలకు రంగం సిద్ధ్దమైంది. 9మంది తహసీల్దార్లకు స్థానచలనం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తహసీల్దార్ల బదిలీ ప్రక్రియను ఉన్నతాధికారులు చేపట్టారు. ఎన్నికల నిబంధనల పరిధిలోకి వస్తున్న తొమ్మిది మంది తహసీల్దార్లను జిల్లా నుంచి బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నవంబర్ 30 నాటికి ఒకే జిల్లా పరిధిలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యలో ఉన్నతాధికారులు బదిలీ జాబితా రూపొంది ంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, ఓదెల, రామగుండం, రామగిరి, ఎలిగేడు, ముత్తారం, ధర్మారం తహసీల్దార్లు బదిలీ కానున్నారు. ఇందులో రామగిరి, ఎలిగేడు, ముత్తారం తహసీల్దార్లు జిల్లా వాసులే కావడంతో వారిని బదిలీ చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఆరుగురు జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. దీంతో వారి బదిలీ తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే బదిలీ ప్రక్రియ సిద్ధం కాగా శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కలెక్టర్ దేవసేన, జాయింట్ కలెక్టర్ వనజాదేవీలు బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా దాటలేదు. పెద్దపల్లి, మంథని ఆర్డీఓలు ఇటీవలనే బాధ్యతలు చేపట్టారు. దీనితో ఎన్నికల బదిలీల్లో ఉన్నతాధికారులు లేరు. పోలీసు విభాగంలో... రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు విభాగంలోనూ ఎన్నికల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో నెల క్రితమే పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి.మూడు సంవత్సరాల పై బడి సర్వీసు పూర్తయిన పోలీసు అధికారుల బదిలీను ముందుగానే చేపట్టారు. గోదావరిఖని టూటౌన్ సీఐగా ఉన్న చిలుకూరి వెంకటేశ్వర్లును ఎస్బీకి బదిలీ చేయగా, ఆయన స్థానంలో జి.వెంకటేశ్వర్లుకు పోస్టింగ్ ఇచ్చారు. వీరితో పాటు మరో ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేశారు. కాగా ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబధం ఉన్న సబ్ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఆ నిబంధనల ప్రకారమే పోలీసుల బదిలీలు చేపట్టారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న పోలీసు అధికారులకే ఈ ఎన్నికల సంఘం నిబంధన వర్తిస్తుండడంతో, అలాంటి వారిని ముందుగానే గుర్తించి లూప్లైన్లకు పంపించారు. కాగా నెల రోజుల క్రితమే జిల్లాలో బదిలీలు పూర్తి కావడంతో, తాజాగా బదిలీలు ఉండకపోవచ్చని పోలీసు అధికారులు వెల్లడించారు. -
మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం 10 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులోఐదుగురికి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టింగులిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. జి.భాస్కరరావు(ఎస్జీడీసీ)ని నిర్మల్ డీఆర్వోగా బదిలీ చేస్తూ గురువారం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఆయనను పాత స్థానంలోనే (సీసీఎల్ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి) కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతావారి బదిలీల వివరాలు... అధికారి పేరు హోదా ప్రస్తుత స్థానం బదిలీ స్థానం 1. టి.పూర్ణచంద్ర ఎస్జీడీసీ ఆర్డీవో, ఖమ్మం డీఆర్వో, హైదరాబాద్ 2. పి.చంద్రయ్య ఎస్జీడీసీ వెయిటింగ్ డీఆర్వో, సూర్యాపేట 3. బి.బిక్ష డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ డీఆర్వో, కరీంనగర్ 4. ఎం.వి.రవీంద్రనాథ్ డిప్యూటీ కలెక్టర్ వెయిటింగ్ డీఆర్వో, నల్లగొండ 5. కె. మధుకర్రెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీవో, ఇబ్రహీంపట్నం డీఆర్వో, మేడ్చల్ 6. ఆర్.పాండు డిప్యూటీ కలెక్టర్ ట్రెయినింగ్ ఆర్డీవో, అచ్చంపేట 7. సి.అమరేందర్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డీవో, అచ్చంపేట ఆర్డీవో, ఇబ్రహీంపట్నం 8. ఎం.వాసుచంద్ర డిప్యూటీ కలెక్టర్ జీఏడీ డీసీ, శేరిలింగంపల్లి 9. ఎస్.తిరుపతిరావు డిప్యూటీ కలెక్టర్ డీసీ, శేరిలింగంపల్లి రిపోర్ట్ చేయాలి -
రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, నాన్కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు జాయింట్ కలెక్టర్ల బదిలీ.. కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న బద్రి శ్రీనివాస్ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో జీవీ శ్యామప్రసాద్లాల్ను, ఆసిఫాబాద్ జాయింట్ కలెక్టర్ వి.అశోక్కుమార్ స్థానంలో పర్సా రాంబాబును నియమిస్తూ సీఎస్ ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. బద్రి శ్రీనివాస్, అశోక్కుమార్ ఇద్దరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. -
మరోసారి ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలకు తెరలేపింది. పోలీసు శాఖకు సంబంధించి జిల్లాల్లో కీలక బాధ్యతలలో ఉన్న తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్లో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్గా శివప్రసాద్ను నియమించా రు. ఇప్పటివరకు ఇదే పోస్టులో ఉన్న మురళీకృష్ణను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కార్ హెడ్క్వార్టర్ అదనపు కమిషనర్గా బదిలీ చేసింది. ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్ పోస్టును భర్తీ చేసింది. మరోసారి ఐఏఎస్ల బదిలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం.జగన్మోహన్ ఈ నెల 31న రిటైర్ అవుతుండటంతో ఆయన స్థానంలో రాహుల్ బొజ్జాను, ధరణి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి రజత్కుమార్ శైనినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా నియమించిన డి.అమోయ్కుమార్ను ప్రభుత్వం ఒక్కరోజులోనే బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిందీ ప్రస్తావించలేదు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పని చేస్తున్న భారతి హొళికెరి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పని చేస్తూ బదిలీ అయిన కాట ఆమ్రపాలిని నియమించింది. భారతి హొళికెరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్గా, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న కె.శశాంకను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలతో ఈ పోస్టులో ఉన్న రోనాల్డ్రాస్ను రిలీవ్ చేశారు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న యోగితా రాణాను కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించారు. మరో పది మందిని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన నూతన కలెక్టర్ల వివరాలు హైదరాబాద్- రఘనందన్ రావు రంగారెడ్డి- లోకేశ్ కుమార్ సిద్ధిపేట- కృష్ణ భాస్కర్ కొమురంభీం ఆసిఫాబాద్- రాజీవ్గాంధీ హనుమంతు జయశంకర్ భూపాలపల్లి- వి. వెంకటేశ్వర్లు రాజన్న సిరిసిల్ల- వెంకట్రామిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం- అమేయకుమార్ సంగారెడ్డి- ఎం హన్మంతరావు ఖమ్మం- ఆర్వీ కర్ణన్ వరంగల్ అర్బన్- ప్రశాంత్ జీవన్ పాటిల్ యోగితా రాణా- ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ -
టీచర్ల సర్దుబాటు లీలలు!
అనంతపురం ఎడ్యుకేషన్: సబ్జెక్టు టీచర్లు లేని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా పదోతరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సర్దుబాటు’కు పూనుకుంది. అయితే విద్యాశాఖ అధికారులు పైరవీలకు పెద్దపీట వేస్తూ సర్దుబాటుకు కొత్తభాష్యం చెబుతున్నారు. విద్యార్థుల అవసరాలు కాకుండా టీచర్ల సౌలభ్యం కోసం సర్దుబాటు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ♦ రొళ్ల మండలం రత్నగిరి జెడ్పీహెచ్ఎస్లో 6–10 తరగతుల విద్యార్థులు 300 మంది ఉన్నారు. తెలుగు పండిట్ టీచర్లు ఇద్దరు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని ధర్మవరం మండలం గొట్లూరు జెడ్పీహెచ్ఎస్కు సర్దుబాటు చేశారు. గొట్లూరు స్కూల్లో 200 మంది విద్యార్థులున్నారు. ఇక్కడే ఇదివరకే ఒక టీచరు కూడా పని చేస్తున్నారు. అయినా మరో టీచరును సర్దుబాటు చేశారు. ♦ గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఫిజికల్ సైన్స్ టీచరును ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు జెడ్పీహెచ్ఎస్కు సర్దుబాటు చేశారు. నిబంధనల ప్రకారం మండల పరిధిలో సరఫ్లస్ (మిగులు) టీచర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ లేకపోతే పొరుగు మండలాలు, అక్కడా లేకపోతే పొరుగు డివిజన్ నుంచి తీసుకోవచ్చు. అయితే ముదిగుబ్బ మండలంలో ఓ యూపీ స్కూల్లో పీఎస్ టీచరు సరఫ్లస్గా ఉన్నారు. ఆ టీచరును కాదని ఎక్కడో గుడిబండ మండలం నుంచి తీసుకురావడం విశేషం. టీచర్ల సర్దుబాటులో జరుగుతున్న పైరవీలకు ఈ ఉదంతాలు నిదర్శనం. నిబంధనలకు నీళ్లు.. జిల్లాలో టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూనుకుంది. ఈ ప్రక్రియ జూన్ 30లోగా పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు నేటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘అయిన వారికి ఆకులో కానివారికి కంచంలో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు : ఉపాధ్యాయుల రేషియో మేరకు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ టీచర్లు ఉండి ఎక్కువ విద్యార్థులుండే పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న చోటే జీతాలు తీసుకుంటూ మరోచోట పని చేయాల్సి ఉంటుంది. సర్దుబాటు ఆయా మండలాల పరిధిలోనే మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోలేదు. విద్యార్థుల కోసం కాకుండా ఉపాధ్యాయుల సౌలభ్యం కోసమే చాలామందిని డెప్యూటేషన్పై నియమించారు. అయితే చాలామంది టీచర్లు పైరవీలు చేశారు. అవసరమైన చోటుకు కాకుండా...వారికి అనుకూలమైన ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకున్నారు. విద్యాశాఖ సిబ్బంది అడ్డుగోలుగా సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ చేయించి కొందరు టీచర్లు తమకు అనుకూలమైన చోటుకు వెళ్లగా, ఇదే అదనుగా కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆమ్యామ్యాలకు తెర తీశారు. అనుకూలమైన వారితో డబ్బు ఒప్పందం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిలీవ్ ఉత్తర్వులు పంపుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని డీఈఓ బ్లాగులో పెట్టే విద్యాశాఖ అధికారులు ఇంత భారీ ఎత్తున జరుగుతున్న సర్దుబాటు వివరాలను మాత్రం బ్లాగులో పెట్టకపోవడం విశేషం. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. విద్యార్థుల సంక్షేమం పట్టని టీచర్లు చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. తాము నివాసాలు ఉంటున్న చోటుకు ఎంత దగ్గరికి వద్దామనే ఆలోచన తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిత్యం గురించి ఆలోచించడం లేదు. ఇలాంటి వారికి విద్యాశాఖ సిబ్బంది సపోర్ట్ చేస్తుండడం బాధాకరం. ఎంతసేపూ జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపం, బస్సుల సదుపాయం అనుకూలంగా ఉన్నాయా...లేదా అనే టీచర్లు ఆలోచిస్తున్నారు. కొన్ని స్కూళ్లకు అవసరం లేకపోయినా కేవలం వారికి అనుకూలంగా ఉంటుందనే కారణంతో డీఈఓపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయించి మరీ ఆ స్కూళ్లలో చేరారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా తప్పుపడుతున్నారు. ♦ డీఈఓ పూల్లో హిందీ టీచర్లు ఉన్నారు. అవసరం ఉన్న చోట్ల వీరిని వినియోగించుకోవచ్చు. వారిని కాదని ఎక్కడో దూరంగా ఉన్న ఎస్జీటీ స్థాయి టీచరును అనంతపురం సమీపంలోకి సర్దుబాటు చేశారు. ♦ తాడిపత్రి ప్రభుత్వ పాఠశాల నుంచి గణితం టీచరును కళ్యాణదుర్గం స్కూల్కు సర్దుబాటు చేశారు. అయితే తిరిగి తాడిపత్రి స్కూల్కు గుంతకల్లు నుంచి మరో టీచరును సర్దుబాటు చేయడం విశేషం. ♦ అమడగూరు మండలం జౌకులకొత్తపల్లి నుంచి రొళ్ల మండలం కాకి స్కూల్కు ఫిజికల్ సైన్స్ టీచరును సర్దుబాటు చేశారు. నవాబుపేట స్కూల్ నుంచి తిరిగి జౌకులకొత్తపల్లికి ఇంకో టీచరును సర్దుబాటు చేశారు. ♦ ఒక్క కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాలకు దాదాపు తొమ్మిదిమంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున, మరో సబ్జెక్టుకు ఏకంగా ముగ్గురు టీచర్లను నియమించారు. ♦ ఎన్పీ కుంట మండలం గౌకులపల్లి ప్రాథమిక పాఠశాలకు టీచర్ల అవసరం ఉంది. పక్కనే ఉన్న వెలిచెలిమల స్కూల్లో టీచర్లు సర్ఫ్లస్గా ఉన్నారు. ఇక్కడి నుంచి కాదని 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండెంవారి పల్లి నుంచి సర్దుబాటు చేశారు. ఆరోపణలు రావడంతో తేరుకున్న అధికారులు అవసరం లేకపోయినా వెలిచెలిమలలో సర్ఫ్లస్గా ఉన్న టీచర్లను ఎన్పీకుంట మెయిన్ స్కూల్కు సర్దుబాటు చేశారు. వాస్తవానికి మండెంవారిపల్లిలో యూపీ స్కూల్కు ఇక్కడ టీచర్లు అవసరం. కానీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. -
ప్రభుత్వం అనుమతిస్తేనే బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు ప్రభుత్వం ఆమోదిస్తేనే చేపడతామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ విద్యా కమిషనరేట్లో బోర్డు విద్యా కమిషనర్ అశోక్ మాట్లాడారు. అలాగే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లెక్చరర్ల సాధారణ బదిలీల కారణంగా ఇబ్బందిపడ్డ 292 మందికి బదిలీలు నిర్వహించామని, మిగతా వారూ బదిలీలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశామని.. ప్రభు త్వ నిర్ణయం వెలువడాల్సి ఉందని చెప్పారు. గతే డాది ఇంటర్ ఫస్టియర్లో 94 వేలమంది చేరగా.. ఈసారి ఇప్పటివరకు92 వేల మంది వరకు చేరినట్లు తెలిపారు. ప్రవేశాల్లో విద్యార్థులు సంఖ్య తగ్గలేదని వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.81 లక్షలమంది విద్యార్థులకు ఆగస్టు 15నాటికి మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భోజనం తీసుకురావడం, వడ్డించడం, విద్యార్థులు తిన్నాక శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను మొత్తంగా గంటలో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 3న అక్షయపాత్ర ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఉందని, ఏయే వంటలను ఏ రోజుల్లో అందించాలన్న దానిపై స్పష్టత వస్తుందని వివరించారు. దరఖాస్తు చేసుకుంది 20 హాస్టళ్లే.. జూనియర్ కాలేజీల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్న 600 కాలేజీల్లో ఇప్పటివరకు 20 కాలేజీలు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని అశోక్ తెలిపారు. హాస్టల్ నిర్వహిస్తున్న ప్రతి కాలేజీ దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు 63 కాలేజీలు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా లేవని, అవన్నీ ఆయా కాలేజీలను మరో భవనాల్లోకి మార్చుకోవాల్సిందేనని చెప్పారు. జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆదేశాలిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. ఆగస్టు నుంచి జేఈఈ, నీట్ శిక్షణ.. రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు వచ్చే నెల నుంచి జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఒక జూనియర్ కాలేజీని ఎంపిక చేసి, అందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను (జేఈఈకి 50 మంది లేదా 30 మంది, నీట్కు 50 మంది లేదా 30 మంది) ఎంపిక చేసి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. వారికి అక్కడే నివాస వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు. -
పల్లె బడి.. టీచర్లేరీ!
సాక్షి, హైదరాబాద్: పల్లె బడికి కష్టమొచ్చింది. ఉపాధ్యాయ బదిలీలతో అక్కడ బోధన సంకటంలో పడింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేని పరిస్థితి నెలకొంది. టీచర్లు లేకపోవడంతో పిల్లల సంఖ్య కూడా పతనమవుతోంది. నాలుగేళ్ల అనంతరం నిర్వహించిన బదిలీలు కావడంతో గ్రామీణ ప్రాంత బడులు ఖాళీ అయ్యాయి. ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు పట్టణ, జిల్లా, తాలూకా కేంద్రాల్లోని స్కూళ్లకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,150 స్కూళ్లలో పూర్తిస్థాయి టీచర్లకు స్థానచలనం కలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై క్షేత్రస్థాయిలో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో తాజా బదిలీల తంతు పల్లె బడులను మరింత అఘాతంలోకి నెట్టేసినట్లైంది. 44,361 మందికి స్థానచలనం బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,361 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 2,189 మందికీ స్థానచలనం కలిగింది. మరో 42,172 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా బదిలీ అయ్యారు. దశాబ్దన్నర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు బదిలీ కావడం ఇదే తొలిసారి. తాజా బదిలీల్లో 42 శాతం టీచర్లు పట్టణ ప్రాంతాలకు వచ్చినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పల్లె బడులు బలహీనపడ్డాయి. అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడంతో బోధన ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో టీచర్లెస్, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్ల వివరాలను క్షేత్ర స్థాయి నుంచి విద్యా శాఖ సేకరిస్తోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన టీఆర్టీ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో బోధన కుంటుపడే ప్రమాదం నెలకొంది. విద్యా వలంటీర్లతో భర్తీ బదిలీలతో ఏర్పడిన ఖాళీలతో పాటు సాధారణ ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 16,781 వీవీలను నియమించుకోవాలని డీఈవోలను ఆదేశించింది. మంజూరైన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ, సెలవులతో ఏర్పడిన ఖాళీలతో భర్తీ చేస్తారు. మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. వీరికి నెలవారీ గౌరవ వేతనంగా రూ.12 వేలు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఛిఛీట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీచర్లు లేని స్కూళ్లు కొన్ని వికారాబాద్ జిల్లా దోమ మండలం కుమ్మరితం డా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో ఇద్దరూ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో 130 మంది విద్యార్థులుండగా 8 పోస్టులున్నాయి. బదిలీలతో ఇక్కడ పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ఉన్నత పాఠశాలలో 350 మంది పిల్లలున్నారు. ఇక్కడ 8 మంది టీచర్లుండగా ఆరుగురు పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లా దాదాపూర్ ఉన్నత పాఠశాలలో 550 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ 20 మంది పనిచేస్తుండగా తాజా బదిలీలతో 12 మందికి స్థానచలనం కలిగింది. -
487మంది కానిస్టేబుళ్ల బదిలీ
సాక్షి, ఖమ్మం : ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల్లోని 487మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలపై వారం రోజులుగా కౌన్సిలింగ్ నడుస్తోంది. బదిలీలకు మొదటి ప్రాధాన్యంగా మెడికల్, రెండవ ప్రాధాన్యంగా స్పౌస్ (భార్య ఉద్యోగిని అయితే) పరిగణించారు. ఏజెన్సీలో మూడేళ్లు, నగరాల్లో ఐదేళ్లపాటు పనిచేసిసన వారిని బదిలీ చేశారు. త్రిశుంకు స్వర్గంలో అటాచ్మెంట్ సిబ్బంది అవినీతి ఆరోపణలతోపాటు ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తున్న ఐడీ పార్టీ సిబ్బంది, డ్రైవర్లు, గన్మన్, ఇతర కానిస్టేబుళ్లను ఖమ్మం కమిషనరేట్లో 77 మందిని హెడ్ క్వార్టర్స్కు సీపీ అటాచ్మెంట్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దీనిపై కమిషనర్ను పోలీస్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. వారిని (అటాచ్మెంట్లో ఉన్న వారిని) బదిలీ చేయాలని కోరారు. సీపీ మాత్రం, మూడు నెలలపాటు అటాచ్మెంట్లోనే విధులు నిర్వర్తించాలని ప్రకటించిన విషయం విదితమే. శనివారం విడుదలైన కానిస్టేబుళ్ల బదిలీ జాబితాలో.. అటాచ్మెంట్కు గురైన 77మంది ఉన్నారు. ‘‘బదిలీ అయినవారు వెంటనే విధుల్లో చేరాలి’’ అని, సీపీ స్పష్టంగా ఆదేశించారు. అయితే, అటాచ్మెంట్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలా..? (సీపీ అన్నట్టుగా) మూడు నెలల తర్వాత చేరాలా...? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది. -
పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్ బి.దేవ్ సింగ్ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా, ఎస్.పంకజను పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా, పి.సరోజను రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా బదిలీ చేశారు. పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న ఎన్.వాణిశ్రీతో పాటు నిజామాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్ ఎం.మంగతాయారును జీహెచ్ఎంసీకు బదిలీ చేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ డి.జగన్ను ఖమ్మం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా, వేములవాడ మున్సిపల్ కమిషనర్ ఎ.జగదీశ్వర్ గౌడ్ను ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్గా, ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ శైల జను నిర్మల్ జిల్లా మెప్మా అకౌంటెంట్ (ఆర్మూ రు కమిషనర్గా అదనపు బాధ్యతలు), నిర్మల్ మెప్మా అకౌంటెంట్ పెద్ద రామేశ్వర్ను పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్గా, జగిత్యాల మునిసిపాలిటీ మేనేజర్ కె.గంగారాంను వేములవాడ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. -
‘వ్యవసాయ’ బదిలీల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో బదిలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉద్యోగ సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బదిలీ కౌన్సెలింగ్ను మరో రోజుకు వాయిదా వేస్తూ వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలో బదిలీ ప్రక్రియ సోమవారం మొదలైంది. వ్యవసాయ శాఖ శిక్షణ కేంద్రంలో కమిషనర్ కౌన్సెలింగ్ చేపట్టా రు. ఐదో జోన్కు చెందిన వ్యవసాయ ఉద్యోగులు, అధికారుల బదిలీ ప్రక్రియ నిర్వహించారు. జూనియర్, సీనియర్ అసిస్టెం ట్లు, సూపరింటెండెంట్ల బదిలీ ప్రశాంతంగానే ముగిసింది. ఆ తర్వాత సహాయ వ్యవసాయాధికారుల(ఏడీఏ) కౌన్సెలింగ్ను ప్రారంభించడంతో రెండు వ్యవసాయ సంఘాల మధ్య వివాదం నెలకొంది. తమకు అన్యాయం జరుగుతుందని వారు నిరసనకు దిగారు. జీవోకు వ్యతిరేకంగా కమిషనర్ బదిలీలు చేపడుతున్నా రని ఓ సంఘం, నిబంధనల ప్రకారం చేస్తున్నా అతనికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మరో సంఘం ఆరోపించాయి. ఏడీఏ ల్లో ఏడెనిమిది మందికి అర్హత ఉన్నా పోస్టింగులు సరిగా ఇవ్వలేదని ఓ సంఘం ఆరోపించింది. మండల వ్యవసాయాధికారుల(ఏవో) బదిలీ ప్రక్రియలో 7 నుంచి పదేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులను బదిలీ చేయలేదని పలువురు ఆరోపించారు. ఉన్న ఉద్యోగుల్లో 40% బదిలీ చేయాల్సి ఉండగా, కట్ ఆఫ్ పరిధిని మించి బదిలీ చేస్తున్నారని మరో సంఘం ఆరోపించింది. నేడూ ఐదో జోన్ బదిలీలే... ఐదో జోన్ బదిలీలు వాయిదా పడటంతో మంగళవారం అదే జోన్కు చెందిన ఏవోల బదిలీలు పూర్తిచేస్తామని వ్యవసాయశాఖ కమిషనర్ ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం జరగాల్సిన ఆరో జోన్ బదిలీలను బుధవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఐదో జోన్ ఏడీఏల బదిలీ ప్రక్రియ ముగిసిందని, అదే జోన్ ఏవో ల కౌన్సెలింగ్ నిర్వహణకు సమయం సరిపోకపోవడంతో వాయి దా వేశామన్నారు. నిబంధనల ప్రకారం కమిషనర్ బదిలీ కౌన్సెలింగ్ చేపట్టడం లేదని తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ కృపాకర్రెడ్డి ఆరోపించారు. కాగా, కౌన్సెలింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు అన్నారు. -
టీచర్ల బదిలీ షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బదిలీల దరఖాస్తు గడువును ప్రభుత్వం తాజాగా ఒక రోజు పొడిగించింది. దీంతో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బదిలీలకు సంబంధించిన ఆప్షన్ల ఎంపిక ఈ నెల 20 నుంచి 23 వరకు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ నెల 25న బదిలీల జాబితా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 26న బదిలీల ఉత్తర్వుల జారీతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. -
విద్యుత్ శాఖలో బదిలీల సందడి
కొత్తపల్లి(కరీంనగర్) : విద్యుత్శాఖలో బదిలీల సందడి నెలకొంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి సంస్థ ఇదివరకే మార్గదర్శకాలను జారీ చేసింది. తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క రెండోసారి విద్యుత్శాఖలో బదిలీలు చేపడుతోంది. మూడేళ్ల క్రితం వంద శాతం ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన ప్రభుత్వం, ఈసారి 40 శాతం మాత్రమే బదిలీ చేయాలని నిర్ణయించింది. జూన్ 30వ తేదీ వరకు మూడే ళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులను బదిలీకి అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ బదిలీలన్నీ పాత సర్కిల్ పరిధిలో జరగనున్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మా త్రం సంస్థ పరిధిలో చేపట్టనున్నారు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాను ఇదివరకే ప్రకటించిన ఉన్నతాధికారులు అభ్యంతరాల ను సైతం స్వీకరించారు. ఈ నెల 15వ తేదీన ఉద్యోగుల బదిలీలను ప్రకటించనున్నారు. బదిలీ అయిన ఉద్యోగులు, సిబ్బంది 20లోగా రిలీవ్ అయి కేటాయించిన చోట బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాత సర్కిల్ పరిధిలోనే బదిలీలు.. పాత కరీంనగర్ సర్కిల్ పరిధిలోనే కార్యాలయ సిబ్బంది, ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగం (ఎగ్జిక్యూటివ్)కు సంబంధించిన అధికా రులను మాత్రం కంపెనీ పరిధిలో చేపట్టనున్నా రు. పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల నూతన జిల్లాకో సర్కిల్ ఆఫీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వం, పరిపాలనంతా పాత సర్కిల్ కేంద్రంగానే కొనసాగుతోంది. ఇప్పుడు కూడా పాత సర్కిల్ పరిధిలోనే బదిలీల ప్రక్రియ చేపడుతోంది. ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ను జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ సర్కిళ్లుగా విభజించిన విషయం విదితమే. అయితే.. పూర్తిస్థాయిలో సర్కిళ్ల విభజన అనంతరం బదిలీలు చేపడితే బాగుండన్న అభిప్రాయాలు సైతం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సర్కిళ్లు ఏర్పాటు చేసినా సరిపడా సిబ్బంది లేక నామమాత్రంగా కొనసాగుతున్నా యి. ఆఫీసు సబార్డినేట్, ఫోర్మెన్, రికార్డ్ అసిస్టెంట్, స్వీపర్లు, వాచ్మెన్, జేఏఓలు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్ పోస్టులను సర్కిల్ పరిధిలో బదిలీలు చేపడుతుండగా.. ఏఈ, ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్లకు సంబంధించి బదిలీల ప్రక్రియ వరంగల్ కేంద్రంగా కంపెనీ పరిధిలో జరగనున్నాయి. ఉద్యోగుల లిస్టు ప్రదర్శన.. ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ పరిధిలో 2,013 మంది వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ఉండగా.. ఇందులో మూడేళ్లు నిండిన 203 మంది కి బదిలీకి అర్హులుగా నిర్ణయించారు. ఆఫీసు సబార్డినేట్ 21, ఫోర్మెన్ 8, రికార్డ్ అసిస్టెంట్ 7, స్వీపర్లు 3, వాచ్మెన్ 2, జేఏవోలు 9, జూనియర్ అసిస్టెంట్ 48, సీనియర్ అసిస్టెంట్ 24, సబ్ ఇంజినీర్లు 19 మందితో కూడిన లిస్టును కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. వీరి వద్ద నుంచి అభ్యంతరాలను సైతం ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కంపెనీ పరిధిలో ప్రక్రియ జరగనున్నందునా టీఎస్ఎన్పీడీసీఎల్ వరంగల్ కేంద్రంగా బదిలీల లిస్ట్ వెలువడనుంది. చోటు కోసం పైరవీలు.. బదిలీ అవుతున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు కోరుకున్న చోటు కోసం పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. ట్రేడ్ యూనియన్ల మద్దతుతో కార్మికులు, ఉన్నతాధికారుల మద్దతు కోసం కార్యాలయ సిబ్బంది, కంపెనీ పరిధిలో జరిగే ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం ఖాళీలుంటే పోస్టింగ్ సులువుగా దొరికే అవకాశం ఉంది. కానీ.. ఒకే చోటుకు పోటీ నెలకొన్న పరిస్థితుల్లో పైరవీలు చేపడుతున్నారు. కంపెనీ మార్గదర్శకాల మేరకు.. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ టీఎస్ఎన్పీడీసీఎల్ కంపెనీ మార్గదర్శకాల మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మూడే ళ్లు నిండిన సర్కిల్ పరిధిలోని 40 శాతం మంది ఉద్యోగులకు బదిలీలు అనివార్యం అయ్యాయి. బదిలీల లిస్టులో ఉన్న సిబ్బంది, ఉద్యోగుల అభ్యంతరాలు ఇదివరకే స్వీకరించాం. ఆప్షన్ పెట్టుకుంటే తదనుగుణంగా పరిశీలించి పోస్టింగ్ కేటాయిస్తాం. ఈ నెల 15వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. 20వ తేదీలోగా పోస్టింగ్ ప్రదేశాల్లో జాయిన్ కావల్సి ఉంటుంది. -
అందరికి హైదరాబాదే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీఏలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.మరి కొద్ది రోజుల బదిలీల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో వివిధ కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులు ఆప్షన్ల ఎంపికలో తలమునకలయ్యారు. ఈ నెల 7, 9 తేదీల్లో రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి 15 నాటికి బదిలీలను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాలో ఉన్న ఉద్యోగులంతా తమకు నచ్చిన స్థానాల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో పని చేస్తున్న పలువురు అధికారులు హైదరాబాద్లోనే ఉండేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకే తమ బదిలీ పరిమితం కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం బదిలీపై హైదరాబాద్కే రావాలని కోరుకుంటుండటంతో రవాణాశాఖలో బదిలీల అంశం ఆసక్తికరంగా మారింది. ఆప్షన్ల ఎంపికలోనూ పలువురు ఈ మూడు జిల్లాలకే ప్రాధాన్యతనిచ్చారు. పరిపాలనా అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, జూనియర్ అసిస్టెంట్లు, తదితర కేటగిరీల్లో సుమారు 125 పోస్టులు ఉన్నాయి. బదిలీకి 2 ఏళ్ల కాలపరిమితిని కనీస అర్హతగాను, 5 ఏళ్లను గరిష్టంగానూ ప్రభుత్వం నిర్ధేశించిన సంగతి తెలిసిందే. ఒకే చోట 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పనిసరి కావడంతో హైదరాబాద్కే పరిమితయ్యేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. మెడికల్ సర్టిఫికెట్ల కోసం పోటీ.... ఈ క్రమంలో మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న కొందరు సీనియర్లు మెడికల్ సర్టిఫికెట్ల కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దూరప్రాంతాల్లో పని చేయలేని అశక్తతను, తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ధృవీకరించే సర్టిఫికెట్లతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్క ఆరో జోన్ పరిధిలోనే 30 మందికి పైగా పరిపాలనా విభాగానికి చెందిన ఉద్యోగులు, మరో 10 మంది హెడ్కానిస్టేబుళ్లు బదిలీ కావలసి ఉంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బదిలీ అయ్యే జూనియర్ అసిస్టెంట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జోనల్ స్థాయి బదిలీలు తప్పనిసరైన వారు పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ‘‘ గత 10 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాను. మరో 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్లడం పనిష్మెంట్ వంటిదే..’’ అని నగరంలోని ఒక ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పట్ల విముఖత చూపుతున్న మరి కొందరు ఉద్యోగులు పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘ పిల్లలను స్కూళ్లలో చేర్పించాం. ఫీజులు కట్టాం. యూనిఫాంలు, బుక్స్ తీసుకున్నాం, క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో మరో చోటుకు ఎలా వెళ్లగలం. ఏప్రిల్, మే నెలల్లోనే బదిలీలు పూర్తి చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా...’’ అని అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఉద్యోగసంఘాల నాయకులకు ఊరట దక్కేనా... మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం బదిలీల పట్ల ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హైదరాబాద్కే పరిమితయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సం ఘంలో గత ఆరేళ్లుగా ఒకేవిధమైన బాధ్యతల్లో ఉ న్నవారిని మాత్రం వారు కోరుకున్న చోటనే వి ధులు నిర్వహించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. మరి కొందరు ఏదో ఒక విధంగా ఉద్యోగసంఘాల నేతల నుంచి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో బదిలీలే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పారదర్శకంగా బదిలీలు... బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు రవాణాశాఖలో మొట్టమొదటిసారి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ చైర్మన్గా మరో ఇద్దరు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో జోనల్ స్థాయి బదిలీలకు సంబంధిత జోనల్ ఇన్చార్జి అధికారికే బాధ్యతలు ఉండేవి. ఇందుకు విరుద్దంగా ఈ సారి కమిటీయే అన్ని రకాల బదిలీలను చేపడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా బదిలీలను పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు నిశ్చింతగా ఉండాలని సూచించారు. -
ఆన్లైన్తో ఆగమే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు ‘ఆన్లైన్’ విధానాన్ని అనుసరించాలన్న నిర్ణయం గందరగోళానికి దారితీస్తోంది. ఈ విధానంలో దరఖాస్తుల దగ్గరి నుంచి పోస్టుల కేటాయింపు దాకా ఎన్నో సమస్యలు ఎదురుకాక తప్పదని ఉపాధ్యాయ సంఘాల నేతలే పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న పోస్టులు నచ్చకుంటే ‘నాట్ విల్లింగ్’ చెప్పే అవకాశం ఉండదని.. స్పౌజ్ కేటగిరీలో సమస్యలతోపాటు దుర్వినియోగానికీ ఆస్కా రం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒక్క టీచర్ బదిలీ తప్పుగా జరిగినా.. ఆ తర్వాత వరుసగా ఉండే వేల మందికి బదిలీ ప్రాంతాలు మారిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీచర్లు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఆఫ్లైన్లో బదిలీల ప్రక్రియ చేపట్టాలని.. కచ్చితంగా ఆన్లైన్లోనే బదిలీలు చేయాలనుకుంటే లోపాలను సరిదిద్ది, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకుంటే వెళ్లాల్సిందే.. నిబంధనల ప్రకారం.. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను మాత్రమే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. రెండేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు తప్పనిసరిగా బదిలీ కావాలన్న నిబంధన లేదు. ఆఫ్లైన్ విధానంలో ఎవరైనా టీచర్ బదిలీల కౌన్సెలింగ్ సమయంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో ఖాళీలు లేకపోతే.. ‘నాట్ విల్లింగ్’ చెప్పి యథాతథంగా ఉన్న స్థానంలోనే కొనసాగవచ్చు. అదే ఆన్లైన్ విధానంలో అయితే.. దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ కావాల్సి వస్తుంది. ఆ టీచర్ ఇచ్చే వెబ్ ఆప్షన్ల మేరకు ఎక్కడ పోస్టు కేటాయింపు జరిగినా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే బదిలీకి అసలు దరఖాస్తే చేసుకోకుండా ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు శ్రీనివాస్ అనే టీచర్ ఓ పాఠశాలలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయన కంపల్సరీ ట్రాన్స్ఫర్ (ఒకేచోట 8 ఏళ్లు పూర్తయి కచ్చితంగా బదిలీ కావాల్సిన టీచర్లు) జాబితాలో ఉండరు. ఆయన ప్రస్తుత స్థానంలో రెండేళ్లకు మించి కొనసాగుతున్నారు కాబట్టి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఆయన తాను కోరుకునే.. 50 ప్రదేశాలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఆయన సీనియారిటీ, ఇచ్చిన ఆప్షన్లను బట్టి ఒకటో ప్లేస్ నుంచి 50వ ప్లేస్ వరకు ఎక్కడికి బదిలీ వచ్చినా వెళ్లాల్సిందే. ఆప్షన్లు ఇచ్చుకున్న చోట్ల కంటే మంచి చోటు అందుబాటులో ఉన్నా.. ఆయనకు వచ్చే అవకాశం ఉండదు. అదే ఆఫ్లైన్ బదిలీల విధానంలో అయితే.. అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని చోట్లలో తనకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. లేకుంటే ‘నాట్ విల్లింగ్ (బదిలీ కోరుకోవడం లేదు)’ అని చెప్పి.. ప్రస్తుతమున్న స్థానంలోనే కొనసాగవచ్చు. ఆన్లైన్ విధానంలో ఈ అవకాశం ఉండదు. ‘ఆన్లైన్’తో ప్రధాన సమస్యలివీ.. స్పౌజ్ కేటగిరీలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విద్యాశాఖ ఇచ్చే 10 ప్రాధాన్య పాయింట్లను వినియోగించుకుని దరఖాస్తు చేసుకుంటే.. స్పౌజ్ ఉన్న ప్రదేశంలోనే పోస్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు. అంతేకాదు ఆ ప్రాధాన్య పాయింట్లను పొందేవారు.. వాటిని దుర్వినియోగం చేస్తూ, పట్టణ ప్రాంతాలకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనికి అడ్డుకట్ట వేయడం కష్టం. దీంతో ఇతర కేటగిరీల వారికి నష్టం వాటిల్లుతుంది. ‘ఆన్లైన్’విధానంతో ఆప్షన్ల విషయంలోనూ గందరగోళం తప్పని పరిస్థితి. ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టును తీసుకుంటే.. ఒక జిల్లాలో 250 మంది గణితం టీచర్లు ఉన్నారనుకుందాం. సీనియారిటీ ప్రకారం సురేశ్ అనే టీచర్ 200వ స్థానంలో ఉంటే... తనకు ముందున్న 199 స్థానాలను ఖాళీలుగానే భావించి.. నచ్చిన స్థానాలకు వరుసగా ఆప్షన్లు ఇవ్వాలి. దాంతోపాటు మరో 100 ఖాళీ పోస్టులు ఉన్నాయనుకుంటే.. వాటిని కూడా కలిపి మొత్తం 299 స్థానాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇలాంటపుడు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియదు. వచ్చిన చోట చేరిపోవాల్సిందే. లేదంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) విషయంలో పరిస్థితి మరింత కష్టంగా ఉండనుంది. ప్రతి జిల్లాలో బదిలీ అర్హత కలిగిన ఎస్జీటీలు దాదాపు ఐదు వేల మంది వరకు ఉంటారు. దాంతో ఏ స్థానాలు ఖాళీ అవుతాయో, ఎవరెక్కడి వెళతారో తెలియదు. కాబట్టి ప్రాధాన్య క్రమంలో వేల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. పైగా ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. విడో, మెడికల్, వికలాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన కష్టమే. ఇందుకు రెండు రోజులు సమయం కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ సాధ్యం కాదు. మ్యాన్యువల్ బదిలీల సమయంలో సంఘాల పర్యవేక్షణ ఉన్నపుడే.. అనర్హులకు ప్రాధాన్యత లభించింది. అదే ఆన్లైన్ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశమేదీ ఉండదు. బదిలీలు పూర్తయ్యాక ఎవరైనా గుర్తిస్తేనే విషయం బయటకు వస్తుంది. లేదంటే అంతే. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే.. ‘‘బదిలీలకు ప్రభుత్వమిచ్చిన గడువు ఇంకా 12 రోజులే ఉంది. ఈ తక్కువ సమయంలో ఆన్లైన్లో లోపాల సవరణ, టీచర్లకు అవగాహన కల్పించడం కష్టం. ఇలా గందరగోళంగా బదిలీలు చేసి అభాసుపాలయ్యే కన్నా.. అన్ని ఏర్పాట్లు చేసుకుని బదిలీలు చేపడితే.. పారదర్శకంగా జరుగుతాయి. ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది..’’ – సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ అవగాహన లేకుంటే నష్టమే.. ‘‘ఆన్లైన్ బదిలీ ప్రక్రియపై టీచర్లకు అవగాహన కల్పించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అవగాహన కల్పించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. హడావుడిగా చేస్తే సమస్యలు తలెత్తుతాయి..’’ – ప్రతాప్రెడ్డి, టీఆర్టీఎఫ్ ముందు లోపాలు సవరించాలి ‘‘ఆన్లైన్ విధానంలో ముందు లోపాలన్నింటినీ సవరించి బదిలీలు చేయాలి. లేకపోతే టీచర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే ఆన్లైన్ వల్ల అక్రమాలకు చెక్ పడుతుంది.’’ – రవి, యూటీఎఫ్ ఒక్క పొరపాటు జరిగినా సమస్యే ‘‘ఆన్లైన్లో ఒక్క పొరపాటు దొర్లినా అంతా గందరగోళంగా మారిపోతుంది. ఖాళీల జాబితాలో ఒక్క ఖాళీ తప్పుగా చూపించి (క్లియర్ వేకెన్సీ కాకపోతే), ఆ ఖాళీకి ఎవరైనా ఆప్షన్ ఇస్తే.. ఆ టీచర్కు కేటాయింపు జరిగిపోతుంది. మిగతావారికి వరుస క్రమంలో కేటాయింపులు జరిగిపోతాయి. దాంతో గందరగోళం నెలకొంటుంది..’’ – శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ -
టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు, సంఘ నేతలతో సమావేశం జరిగింది. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు మాత్రం ఆగస్టులో నిర్వహించాలని.. ఈ నెల 4 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి 20వ తేదీలోగా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. పరిశీలకులుగా సీనియర్ అధికారులు.. టీచర్ల బదిలీలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పాత జిల్లాలకు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తారు. శనివారం నుంచి వారు జిల్లా అధికారులతో సమావేశమై ఉపాధ్యాయ ఖాళీలను ఖరారు చేస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాల్లోని సంఘాల ప్రతినిధులకు మాత్రమే పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధర్ సిన్హా, జాయింట్ సెక్రటరీ విజయకుమార్, అదనపు సంచాలకుడు పీవీ శ్రీహరి, సంయుక్త సంచాలకుడు శ్రీనివాసాచారి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, జనార్దన్రెడ్డి, రవీందర్, సంఘ నేతలు చావ రవి, కొండల్రెడ్డి, సరోత్తంరెడ్డి, బి.భుజంగరావు, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. 4, 5 తేదీల్లో వెబ్సైట్లో ఖాళీల జాబితా ప్రదర్శన 5న ఖాళీల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ 6న ఖాళీల తుది జాబితా విడుదల 7–10 వరకు దరఖాస్తుల స్వీకరణ 11, 12 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన 13న దరఖాస్తుల్లో సవరణకు చాన్స్ 20వ తేదీలోపు కౌన్సెలింగ్ పూర్తి -
బదిలీలకు దరఖాస్తులు నేటి నుంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఒకట్రెండు మినహా మిగతా శాఖలేవీ బదిలీల దరఖాస్తుల షెడ్యూలును కూడా ఖరారు చేయలేదు. పైగా సీనియారిటీ జాబితాలను కూడా సిద్ధం చేయలేకపోయాయి. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తేశాక గురువారం దాకా పోలీసు శాఖ, ఎస్పీడీసీఎల్ మాత్రమే షెడ్యూలు జారీ చేశాయి. మిగతా శాఖలు ఇంకా సీనియారిటీ జాబితాల రూపకల్పన దశలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని పలు మండలాలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి మారాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై గందరగోళం నెలకొంది. దరఖాస్తులకు షెడ్యూలు త్వరగా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం బదిలీలను ఉమ్మడి జిల్లాలవారీగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని మండలాల విషయంలో సమస్యలు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ నుంచి వరంగల్ అర్బ న్ జిల్లాకు ఎల్కతుర్తి సహా 3 మండలాలు వచ్చాయి. బదిలీలను పాత జిల్లాల ప్రాతిపదికన చేయాలి గనుక ఆ 3 మండలాల ఉద్యోగులను వరంగల్ అర్బన్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి తేవాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా ఆ మండలాల ఉద్యోగుల్లో బాగా పనిచేసే కొందరిని కలెక్టర్లు జిల్లా హెడ్క్వార్టర్ కు తీసుకెళ్లారు. సరిగా పని చేయని వారిని కొత్త జిల్లా ల్లోని మారుమూల ప్రాంతాలకు పంపారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న వివరాలు సేకరించి సీనియారిటీ జాబితా రూపొందించడంలో గందరగోళం నెలకొంది. పైగా ఈ అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నది జటిలంగా మారింది. రెండు ఉమ్మడి జిల్లాల మధ్య సమన్వయమూ కుదరక సీనియారిటీ జాబితాల రూపకల్పన ఆలస్యమవుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీ లు చేయట్లేదు. విద్యా, ఎక్సైజ్, వైద్యారోగ్య, సంక్షేమ శాఖలు బదిలీల మార్గదర్శకాలే ఖరారు చేయలేదు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయలేదు. ఖాళీల ను ప్రకటించలేదు. ఈ ప్రక్రియకు సమయం పట్టేలా ఉంది. పాఠశాల విద్యాశాఖలో మార్గదర్శకాలపై న్యాయ సంప్రదింపులు సాగుతున్నాయి. -
మూడేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపి ణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెర లేచింది. 2018 మే 31 నాటికి ప్రస్తుత స్థానంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న వారితో పాటు 2015–16లో జరిగిన సాధారణ బదిలీల్లో స్థానచలనం పొందిన ఉద్యోగులు ఈ ఏడా ది సాధారణ బదిలీలకు అర్హులు. ఈ మేరకు ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, పీ అండ్ జీ సర్వీసు విభాగాల ఉద్యోగుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలను ప్రక టిస్తూ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాలను సంబంధిత డివిజన్/సర్కిల్ కార్యాలయాలు జూన్ 4 నాటికి సిద్ధం చేస్తాయి. జాబితాపై అభ్యంతరాలతో పాటు బదిలీల విజ్ఞప్తులను జూన్ 11లోగా పంపాలి. జూన్ 18న బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తర్వాత ఎలాంటి బదిలీ ఉత్తర్వులూ జారీ చేయరాదు. క్రమశిక్షణ/విజిలెన్స్ ప్రాతిపదికన జరిపే బదిలీలు మినహాయింపు. స్థాన చలనం పొందిన వారిని జూన్ 25లోగా రిలీవ్ చేయాలి. ఇంజనీరింగ్, అకౌంట్స్ ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలు ♦ సబ్ ఇంజనీర్/ఏఈ/ఏఈఈలను సర్కిల్ పరిధి లోని అదే డివిజన్ లేదా ఇతర డివిజన్కు సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు బదిలీ చేయాలి ♦ ఏఈ/ఏఈఈ (సివిల్)లను సర్కిల్/జోన్ పరిధిలోని ఇతర స్థానానికి కార్పొరేట్ కార్యాలయం (సీఓ) బదిలీ చేస్తుంది. సాధ్యం కాకుంటే ప్రస్తుత స్థానంలో కొనసాగిస్తారు ♦ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లను అదే సర్కిల్ లేదా ఇతర సర్కిల్కు సీఓ బదిలీ చేస్తుంది ♦ ఏడీఈ, ఆపై కేడర్; ఏఏఓ, ఆపై కేడర్ ఉద్యోగులను అదే సర్కిల్లో లేదా బయటకు సీఓ బదిలీ చేస్తుంది ♦ జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న ఏఈ/ఏడీఈ, సమాన కేడర్ ఉద్యోగులను జీహెచ్ఎంసీ యూనిట్గా సీఓ బదిలీ చేయనుంది ♦ బదిలీలన్నీ ప్రాధాన్య స్థానం నుంచి ప్రాధాన్యత లేని స్థానానికి, ప్రాధాన్యత లేని స్థానం నుంచి ప్రాధాన్య స్థానానికి జరుగుతాయి. ఆపరేషన్, కమర్షియల్, హెచ్టీ మీటర్స్ విభాగాల పోస్టులను ప్రాధాన్య పోస్టులుగా; హైదరాబాద్ దక్షిణ సర్కిల్, మెహిదీపట్నం, వికారాబాద్ సర్కిల్, ట్రూప్ బజార్, బేగంబజార్, ఏసీ గార్డ్స్ సబ్ డివిజన్లను అప్రాధాన్యత ప్రాంతాలుగా చూస్తారు ♦ రిక్వెస్ట్/పరస్పర బదిలీ దరఖాస్తులను జూన్ 11లోగా పంపాలి ♦ మహిళా ఉద్యోగులను ప్రస్తుత ప్రాంతంలోని వేరే పోస్టుకు బదిలీ చేస్తారు. సాధ్యం కాకుంటే సమీపంలోని ఇతర ప్రాంతానికి పంపుతారు ♦ 2019 జూన్ 30లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరు. -
ఉద్యోగుల బదిలీలు
నిజామాబాద్ నాగారం : ఎట్టకేలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు కానున్నాయి. జీ.ఓ ఎంఎస్ నం. 61 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ జూన్ 15 వరకు కొనసాగుతుంది. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు రెండు, మూడు రోజుల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గైడ్లైన్స్ వెల్లడించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ, కౌన్సెలింగ్, బదిలీలు ఎట్టిపరిస్థితుల్లో గడువులోపు పూర్తి చేయాలి. నేటి నుంచి బదిలీలకు సంబంధించిన ప్రక్రియలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు నిమగ్నం కానున్నారు. ఒకే దగ్గర రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులందరికీ బదిలీలు ఉంటాయి. ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పనిచేస్తున్న వారు కచ్చితంగా బదిలీ కావాల్సిందే. స్పౌజ్ (భార్యాభర్తలు ఉద్యోగలు), మెడికల్ గ్రౌండ్, వితంతువు కేసులను మినహాయించనున్నారు. ఈ కేటగిరికి చెందిన వారు బదిలీ కోరుకుంటే చేస్తారు. ఏడాదిలోపు రిటైర్మెంట్ ఉన్న వారికి బదిలీ లేదు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. జిల్లాల విభజన నేపథ్యంలో ఇతర జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ ద్వారా వెళ్లిన ఉద్యోగులకు బదిలీలకు ఉంటాయి. వారు తమ సొంత జిల్లాలకు రావాలని ఆశ పడుతున్నారు. పనిచేసే చోట రెండేళ్లు పూర్తి కాకున్నా ప్రభుత్వం వీరి బదిలీలకు అవకాశం ఇచ్చింది. జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 40 శాతం ఉద్యోగులకు బదిలీలు కానున్నాయి. సుమారుగా 15 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. దాదాపు అన్ని శాఖ ల్లో రెండేళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరి రెండేళ్లు నిండని వారు పదుల సంఖ్యలో ఉంటారు. పదోన్నతులపై వెళ్లిన వారికి రెండేళ్లు నిండకుంటే బదిలీలు ఉండవు. ఏడేళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలు కానున్నాయి. నేటినుంచి.. శుక్రవారం నుంచి 31 వరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. జూన్ 1 నుంచి 5 వర కు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 6 నుంచి 12 వరకు దరఖాస్తులను పరిశీలించి, బదిలీలు చేపడతారు. 13 నుంచి 15 వరకు బదిలీ ఆర్డర్లను జారీచేస్తారు. దీంతో బదిలీల ప్రక్రియ ముగుస్తుంది. తిరిగి జూన్ 16 నుంచి బదిలీలపై నిషేధం విధిస్తారు. కాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మరో జీవో విడుదల చేయనున్నారు. అందరికీ న్యాయం : టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ బదిలీలలో ఉద్యోగులందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తాం. ఉద్యోగులు బదిలీలను కోరుకుంటున్నారు. అన్ని శాఖల్లోని ఉద్యోగులందరికీ సమన్యాయం జరిగే విధంగా టీఎన్జీవోస్ అండగా ఉంటుంది. ఆర్డర్ టు సర్వ్ వారికి కూడా బదిలీ లు ఉన్నాయి. -
ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు సిద్ధం
-
కనీసం రెండేళ్లు దాటితేనే బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. అజయ్ మిశ్రా కమిటీ సిఫారసులతో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. పైరవీలకు ఆస్కారం లేకుండా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కమిటీ సూచించింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి పది రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. 12 పేజీల నివేదిక 12 పేజీలతో అజయ్ మిశ్రా కమిటీ రూపొందించిన బదిలీల మార్గదర్శకాల నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి మంగళవారమే సమర్పించింది. బుధవారం ఆ నివేదికను ముఖ్యమంత్రికి సీఎస్ అందజేసినట్లు తెలిసింది. బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు వీలుగా వివరణాత్మక బదిలీ పాలసీని కమిటీ రూపొందించింది. ఏ ఉద్యోగి అయినా, కనీసం రెండేళ్లు దాటితేనే బదిలీకి అవకాశం ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పని సరిగా బదిలీ చేయాలని సూచించింది. ఐదేళ్లు పని చేసిన వారు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండే డ్రా పద్ధతిలో బదిలీ చేయాలని నివేదికలో పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టూ సర్వ్ ఉద్యోగులకు రెండేళ్ల కాలపరిమితి నిబంధన వర్తించదని కమిటీ తెలిపింది. స్పౌస్ కేటగిరీలో ముందుగా బదిలీలు ముందుగా స్పౌస్ కోటా బదిలీలు చేపట్టాలని కమిటీ పేర్కొంది. 20 శాతం మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలనే నిబంధనను తొలగించాలని, ఈ ఏడాదికి 40 శాతం బదిలీలు చేపట్టాలని అభిప్రాయపడింది. ప్రతి కార్యాలయంలోనూ ఉద్యోగులు అక్కడ పని చేస్తున్న కాలం వివరాలు తెలిపే జాబితాను నోటీసు బోర్డుపై లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ జాబితాను అవరోహణ క్రమంలో రూపొందించాలని తెలిపింది. బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయిల్లో త్రిసభ్య కమిటీలను నియమించాలని నివేదికలో సూచించింది. రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, జోనల్ స్థాయిలో హెచ్వోడీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. మారుమూల ప్రాంతాల్లోని వారికి ప్రాధాన్యం దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అజయ్ మిశ్రా కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఫోకల్ పోస్టులో చాలాకాలంగా పని చేస్తున్న ఉద్యోగులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. మారుమూల ప్రాంతాలు ఏవనేది ఉద్యోగ సంఘాలతో చర్చించి శాఖాపరంగా నిర్ణయించాలని తెలిపింది. విద్య, అటవీ, రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. మెంటల్ రిటార్డెడ్ పిల్లలు ఉన్న వారికి బదిలీల్లో అవకాశం ఇవ్వాలని తెలిపింది. అలాగే అనారోగ్య కారణాలు, డిపెండెంట్ బదిలీలకు కూడా స్పష్టమైన సూచనలు చేసింది. కేన్సర్, నెర్వ్ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీ, లివర్, కిడ్నీ మార్పిడి, బ్రెయిన్ సర్జరీ వంటి తీవ్రమైన అనారోగ్యాల బారినపడిన ఉద్యోగులను మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించాలని సిఫారసు చేసింది. సీఎం సంతకం కాగానే.. బదిలీల మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి నేడో రేపో సంతకం చేసే అవకాశం ఉంది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈనెల 28 నుంచి లేదా జూన్ 1వ తేదీ నుంచి పది రోజుల షెడ్యూల్తో బదిలీల ప్రక్రియ చేపట్టేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. బదిలీ ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోపు రిలీవ్ చేయాలని లేకపోతే రిలీవ్ చేసినట్టుగానే భావించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ముగిసిన వెంటనే బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని కమిటీ పేర్కొంది. -
ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లకు కేసీఆర్ తీపికబురు