
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 25,585 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 540 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.10 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 708 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,481 క్రియాశీలక కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్లో వెల్లడించారు.