Srinivasa Rao
-
journalist Bharadwaj: రాజమౌళికు - శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్..?
-
బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే
2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది. 2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి⇒ బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.⇒ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.⇒బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.⇒ బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.⇒ బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.⇒అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
బడ్జెట్: మార్కెట్లకు జోష్ ఇస్తేనే...!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో... -
సాగుకు ఊతమిద్దాం
‘ఒకప్పుడు బెగ్గింగ్ బౌల్గా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగింది. వరి, గోధుమ వంటి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఏటా 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 345 మిలియన్ టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయడమే కాకుండా ఏటా 55 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. 142 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి సంపూర్ణ ఆహార భద్రత సాధించగలిగాం. అందులో సందేహం లేదు. కానీ పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో బాగా వెనుకబడ్డాం. ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన పప్పులు, నూనె గింజల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ట్రైనీ సైంటిస్ట్ నుంచి ఐఏఆర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం, భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతిబెట్టను తట్టుకునే మరిన్ని రకాలు రావాలిదేశ జనాభా 142 కోట్లు దాటింది. 14 కోట్ల మంది రైతులున్నారు. దేశంలో 6 లక్షల గ్రామాలుండగా, 15 కోట్ల కమతాలున్నాయి. 80–85 శాతానికి పైగా చిన్న కమతాలే. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు. అర్బనైజేషన్ కారణంగా గ్రామాలతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక రైతులు సాగును వదిలేసే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో 50 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సాగు విస్తీర్ణంలో 50 శాతానికి పైగా నేటికీ వర్షాధారమే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ సాగు విస్తీర్ణం వర్షాధారమే. 30–40 ఏళ్లుగా వర్షాలకు లోటులేదు. కానీ బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పొలంలో నీళ్లు పొలంలో, గ్రామంలో నీళ్లు గ్రామంలో, ఫామ్ ఫాండ్స్లో నీళ్లు నిల్వ చేసుకొని ఎప్పుడు బెట్ట వస్తే అప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించొచ్చు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్లో పెనుముప్పు తప్పదు. వర్షాధారం కింద అధిక దిగుబడులు సాధించే రకాల వంగడాలను, ప్రధానంగా బెట్టను తట్టుకునే వాటిని అభివృద్ధి చేయాలి. కర్బన్ శాతాన్ని సంరక్షించుకోకపోతే ముప్పేప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వెజిటబుల్స్, పండ్లు తినే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల వారీగా అనువైన వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి.కరువు ప్రాంతాల్లో సైతం అధిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు తగిన వంగడాలను అభివృద్ధి చేయాలి. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. నేలల్లో కర్బన్ శాతాన్ని సంరక్షించగలిగినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫామ్ మెకనైజేషన్ (యాంత్రీకరణ) ద్వారా పెట్టుబడి ఖర్చులను నియంత్రించగలుగుతాం. కొత్త వంగడాలు వేగంగా అందించాలిమన శాస్త్రవేత్తలు ఏటా వందలాది వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అవి రైతు పొలానికి చేరినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అది ఆశించినంత వేగంగా జరగడం లేదు. పరిశోధనా కేంద్రాలు అందించే ఫౌండేషన్ సీడ్ నుంచి మల్టిపుల్ సీడ్ ఉత్పత్తి చేసి రైతులకు వేగంగా అందించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, సీడ్ ఏజెన్సీలు, సీడ్ కంపెనీలు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో సీడ్ రీప్లేస్మెంట్ జరగాలి. ఉత్తమ వంగడాల డెమో, చీడపీడల నియంత్రణ, నీటి వినియోగం వంటి ప్రయోగాలన్నీ రైతు క్షేత్రంలోనే జరగాలి. పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్ట్ మార్చడం, తక్కువ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా అడుగులు వేయాలి. రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ఓ రైతును ఓ మాస్టర్ ఫార్మర్గా తయారు చేయాలి. వారి ద్వారా ఆ గ్రామంలో పరిశోధనా ఫలాలు వేగంగా రైతులకు చేరువవుతాయి. పంట సాగు వేళ, కోత, కోత అనంతరం, నిల్వ సమయంలో ఉత్పత్తి నష్టాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పంట ఉత్పత్తిని ప్రాసెసింగ్ వ్యాల్యూ ఎడిషన్తో మార్కెట్లోకి తీసుకెళ్లగలిగితే రైతులకు మేలు జరుగుతుంది.ఏపీ, తెలంగాణలో జిల్లాకో కేవీకేదేశ వ్యాప్తంగా 113 పరిశోధనా సంస్థలు, 731 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఉన్నాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో కూడా కేవీకేల సంఖ్య సమీప భవిష్యత్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పెరిగిన జిల్లాలకనుగుణంగా కనీసం 10–15 మధ్య కొత్తగా కేవీకేలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కొత్త రీసెర్చ్ స్టేషన్ల ఏర్పాటు కంటే ఉన్న రీసెర్చ్ స్టేషన్లను బలోపేతం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఆ విషయంలో అవసరమైన నిధులు సాధించి పరిశోధనలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తాను. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పరిశోధనలకు ఏటా రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్లో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వర్షాధారం, బెట్ట పరిస్థితులతో పాటు వరదలు, తుపాన్లు వంటి వైపరీత్యాలను తట్టుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా మల్టిపుల్ టాలెంటెడ్ వంగడాలను అభివృద్ధి చేయడంతో పాటు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.వాతావరణంలో అనూహ్య మార్పులు, ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయ రంగానికి పెనుసవాళ్లుగా మారాయి. పూర్వం జూన్లో వర్షాలు కురిసేవి. ఆ వెంటనే నాట్లు వేసుకునే వారు. కానీ నేడు జూలై–ఆగస్టుల్లో వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో వర్షపాతానికి లోటు లేదు. ఏటా సగటున 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కానీ పడితే కుండపోత.. లేకుంటే కరువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొన్నేళ్లుగా దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన ప్రాంతాలను సైతం కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ సీజన్లను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పంట దిగుబడి సాధిస్తే.. మార్కెటింగ్ తీరుతో రైతులు నష్టపోతున్నారు. ఈ సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఐఏఆర్ఐ ముందుకెళ్తోంది. – డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఐఏఆర్ఐ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ -
డిప్యూటీ సీఎం పవన్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు
-
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఐసీఏఆర్ డైరెక్టర్గా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–న్యూఢిల్లీ) సంచాలకులుగా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. కృష్ణా జిల్లా అవనిగండ్లపాడుకు చెందిన చెరుకుమల్లి..బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఐసీఏఆర్లో పీహెచ్డీ పట్టా పొంది, అదే సంస్థలో ట్రైనీ సైంటిస్ట్గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ అయ్యారు. 30 ఏళ్లుగా ఐసీఏఆర్లో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా చెరుకుమల్లి పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, విధాన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. 300కు పైగా ఈయన సమర్పించిన పరిశోధనా పత్రాలు జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. 8 ఏళ్లుగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా, విస్తరణ యాజమాన్య అకాడమీ (ఎన్ఏఏఆర్ఎం) డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వ్యవసాయ పరిశోధన మండలిలో కొత్తగా చేరే యువ శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేస్తూ, బోధనలో మార్పులు తీసుకువస్తున్నారు. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ప్రొగ్రామ్ను ప్రవేశపెట్టి దానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చిన ఘనత చెరుకుపల్లిదే. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ పొటాష్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఏఐ) అవార్డుతో పాటు ఎన్ఏఏఎస్, గోల్డెన్ జూబ్లీ, ఐసీఏఆర్ సంస్థల నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డులు అందుకున్నారు. ఇటీవలే పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని కూడా చెరుకుమల్లి అందుకున్నారు. -
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
చాయ్ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!
మూసాపేట: టీస్టాల్ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్వద్దకు టీ తాగేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు, మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్ బానోత్ సురేష్, గుంటుక అజయ్ కుమార్ అనే యువకులకు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్ హోటల్లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్, గుంటుక అజయ్ కుమార్లను అరెస్టు చేసి రిమాడ్కు తరలించారు. -
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్ప్లాంట్పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి...
-
స్టీల్ప్లాంట్ మూసివేతకు కుట్ర.. ‘కూటమి’పై సీపీఎం నేత ఫైర్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూసీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.‘‘స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు. -
పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. -
కొలికపూడి కక్ష రాజకీయం పోలీసులను తోసేసి మరి...
-
డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం!
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్కు కేంద్రంగా హైదరాబాద్.. -
ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలన్నారు. హోదా సాధనకు ఇదే సరైన సమయమన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పదేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకోవాల్సి ఉందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదుసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, అది సజీవ సమస్యగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. హోదా కోసం 2014 నుంచి పోరాటం జరుగుతోందని, చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూగతంలో చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని, వాటిని మరోసారి కేంద్రానికి పంపించాలని కోరారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందన్నారు. మీడియాపై అప్రకటిత నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాక్ డ్రిల్.. పవర్ఫుల్
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్నాథ్బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. కళ్లకు కట్టిన ప్రదర్శన ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు 50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
కొలికపూడికి ప్రజా ప్రతిఘటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దురుసు స్వభావం, అహంకారపూరిత ధోరణి ఓటర్లను మరింత దూరం చేస్తోంది. గతంలో ఆయన ట్రాక్ రికార్డు సైతం ప్రజల్లో భయందోళన రేకెత్తిస్తోంది. దీంతో పారీ్టల కతీతంగా సామాన్య ఓటర్లు సైతం ఈయనను ఎమ్మెల్యేగా భరించగలమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ సామాజికవర్గ నేతలు సైతం కొలికపూడి విషయంలో కినుకు వహిస్తున్నారు. కొలికపూడి సైతం వారిని కలుపుకొనిపోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతోంది. దీంతో చివరి అస్త్రంలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలను సైతం పసిగట్టిన ఓటర్లు తిప్పికొడుతుండటంతో ఆయన విలవిల్లాడుతున్నాడు. ప్రతి సారీ ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలను తెచ్చి తమవైపు రుద్దుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, చినబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. హంగామా చేసి... టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అందోళన చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఏకొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా, గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావిడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తరువాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు. ఇలా కొలికిపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గంపలగూడెం మండలం మంచిరాలపాడులో కొలికపూడికి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఆయన ప్రచారంలో భాగంగా నోటి దురుసుతో సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి.. అని అనగానే అక్కడ ఉన్న మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు. ఫ్యానుకే మా ఓటు అంటూ మహిళలు చేతులు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. ఊహంచని పరిణామం నుంచి వెంటనే తేరుకొని ఇంకా అక్కడ ఉంటే మహిళల నుంచి పరాభవం తప్పదని గ్రహించి రోడ్షో చేయకుండానే జారుకున్నాడు. ప్రలోభాలకు తెర.. ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనే భావనకు వచ్చిన కొలికపూడి ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలల్లో తొలుత హోలి కానుకల పేరుతో మభ్యపెట్టే యత్నం చేశారు. పలు సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి రకరకాల హామీలు గుప్పించారు. స్థలాలు కొని, సామాజిక భవన నిర్మాణాలు చేపడతానని మభ్య పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికల తరువాత చూస్తానని నాలుక మడతేశారు. పదో తరగతిలో 500 కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు పారితోíÙకం ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామని చెబుతున్నాడు. ప్రచారంలో సైతం జనాలు లేకపోవడంతో, ఆ గ్రామాల్లో అద్దె మనుషులను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీలోని నేతలే పేర్కొంటున్నారు. -
జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావులకు తగి న అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది. -
కొలికపూడి శ్రీనివాస్ కి స్వామి దాస్ స్ట్రాంగ్ కౌంటర్
-
డాక్టర్ శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక డి.లిట్ ప్రదానం
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లెటర్స్) లభించింది. భారతీయ భాషలకు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు అదే విధంగా దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపించిన పరిపాలనా దక్షతకూ గుర్తింపుగా వారికి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు షహిద్ మహేంద్ర కర్మా విశ్వవిద్యాలయం, బస్తర్ ప్రకటించింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో గల విశ్వవిద్యాలయంలో 2024 మార్చ్ 5వ తేదీన జరిగిన గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు డి.లిట్. డిగ్రీ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ ఇతర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సాహిత్య సేవా రంగంలో అత్యంత అరుదైన, ప్రతిష్టాకరమైన గౌరవ డి.లిట్. డిగ్రీని స్వీకరించిన సందర్భంగా కళా సాహిత్య రంగాలకు, పరిపాలనా రాజకీయ రంగాలకూ చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపారు. కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిషులో డాక్టరేట్ చేశారు. పలు గ్రంధాలు వెలువరించారు. దేశ విదేశాల్లో వందలాది సాహిత్య కార్యక్రమాలలో ప్రసంగించారు. భారత సాంస్కృతిక శాఖకు చెందిన ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శి హోదాలో శ్రీనివాసరావు దాదాపు రెండు దశాబ్దాలుగా విశేషమైన సేవలందిస్తున్నారు. -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు
-
కొలికపూడి, టీవీ5 సాంబ అరెస్ట్ ?..సీఐడీ విచారణలో కీలక విషయాలు
-
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
‘పిండ మార్పిడి’ విధానంలో గిర్జాతి కోడె దూడ జననం
చేబ్రోలు: పిండ మార్పిడి విధానంలో పశువులు, ఆవుల్లో గర్భం దాల్చడం ఇప్పటి వరకు పరిశోధనశాలలు, ఫామ్స్లో మాత్రమే ఉన్నాయని, ఆ దశదాటిన పరిశోధనలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు అనీల్ కుమార్రెడ్డికి సంబంధించిన జెర్సీ ఆవుకు పిండమార్పిడి ద్వారా గిర్జాతి కోడెదూడ జన్మించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో శ్రీనివాసరావు, లాం ఫాం పశుపరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. ముత్తారావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డి. బాలశంకరరావు తదితర బృందం గిర్జాతి కోడెదూడను పరిశీలించారు. జెర్సీ ఆవుకు గిర్జాతికి చెందిన పిండాన్ని ఈ ఏడాది మార్చి 13న ప్రవేశపెట్టారు. ఆ జెర్సీ ఆవు ఈనెల 22న గిర్జాతికి చెందిన కోడెదూడకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ఎం శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ పిండ మార్పిడి ద్వారా మేలు రకం జాతి లక్షణాలు ఉన్న సంతతితో పాటు, అంతరించి పోతున్న దేశవాళీ జాతులను కూడా వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 145 పిండాలను మార్పిడి చేయగా 45వరకు చూడి దశలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది వంద దూడలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడీకి సీఈవో అభినందన జిల్లాలో మొట్టమొదటి పిండమార్పిడిలో గిర్జాతి కోడె దూడ జన్మించింది. ఈ ప్రయోగాల కోసం కృషి చేసిన ఏడీ సాంబశివరావును సీఈవో ఎం శ్రీనివాసరావు, శాస్త్రవేత్త ముత్తారావు, ఉన్నతాధికారులు సన్మానించారు. పశుసంవర్థకశాఖ ఏడీలు, పశువైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మూడు వారాలు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించాడు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి.. చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడికత్తి సంపాదించాడని, అదును చూసి జగన్పై దాడిచేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తరువాత ఎన్ఐఏ.. కుట్రకోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్లో విచారించిన హైకోర్టు.. విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
పొన్నూరు:గుంటూరు జిల్లా పొన్నూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వ్యక్తి అవమానకర చేష్టలకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పట్ల దళిత సంఘాలు, జై భీమ్ సభ్యులు ఆందోళనకు దిగారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రాంతీయ గ్రంథాలయ ఉద్యోగి, టీడీపీ సానుభూతిపరుడు ముప్పవరపు శ్రీనివాసరావు అవమానకరంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పి.. పక్కన ఉన్న మెట్లపైకి ఎక్కి విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, జై భీమ్ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ను అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంఘాల నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేదు. కాగా, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. వారణాసిలో ఉన్న ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అంబేడ్కర్ లాంటి విశిష్ట వ్యక్తులను అగౌరవపరిచే చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది టీడీపీ శ్రేణులేనని దళిత మహాసభ వ్యవస్థాపకుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆరోపించారు. జనవరిలో విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న తరుణంలో అగ్రకులాలకు చెందిన వారు ఆయనను అగౌరవపరుస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్కు లేఖ రాశారు. -
జగన్ను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే దాడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్యానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టుకు నివేదించింది. హత్య చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు పదునైన కత్తితో జగన్మోహన్రెడ్డిపై దాడి చేసినట్టు సాక్షులు తమ వాంగ్మూలాల్లో తెలిపారని ఎన్ఐఏ వివరించింది. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడని, దాచిపెట్టేందుకు అనువుగా ఉండేలా ఆ కత్తిని ఎంచుకున్నారని తెలిపింది. ప్రాణాంతక గాయం చేసేందుకు ఆ కత్తి సరిపోతుందని కోర్టుకు వివరించింది. ఈ కేసులో శ్రీనివాసరావు 9 సార్లు బెయిల్ పిటిషన్లు వేశారని, వాటన్నింటినీ న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపింది. జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో న్యాయస్థానాలు అతని బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చాయంది. హత్యాయత్నం కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే ట్రయల్ మొదలు పెట్టిందని, కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయవద్దని అభ్యరి్థంచింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని తెలిపింది. అంతేకాక శ్రీనివాసరావు పారిపోతాడని, అతన్ని తిరిగి పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందని తెలిపింది. అందువల్ల అతని బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని విన్నవించింది. జగన్పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎన్ఐఏ ఇన్స్పెక్టర్, ఈ కేసు దర్యాప్తు అధికారి బీవీ శశిరేఖ కౌంటర్ దాఖలు చేశారు. ఇదే సమయంలో శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు సీనియర్ న్యాయవాది త్రిదీప్ పైస్ స్పందిస్తూ, ఎన్ఐఏ కౌంటర్ తమకు అందిందని, దానిని పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
పురందేశ్వరికి వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
బాబు మాజీ పీఎస్ ‘పెండ్యాల’ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటుపడింది. ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. అయితే, ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయారు. ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్విసు రూల్స్ను అతిక్రమించడమేనని సర్కారు స్పష్టంచేసింది. మరోవైపు.. శ్రీనివాసరావు శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ప్రభుత్వం నోటీసు పంపింది. అయితే, ఆయన రాకపోవడంతో సర్విసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శ్రీనివాసరావుపై సస్పెన్షన్ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం అందులో స్పష్టంచేసింది. ఈ కాలంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని పేర్కొంది. సస్పెన్షన్ సమయంలో శ్రీనివాసరావుకు నిబంధనల మేరకు అలవెన్స్ను చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పెండ్యాల పారిపోయింది ఇలా.. ♦ అమెరికాలో తన తోడల్లుడి గృహప్రవేశంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉండటంతో సెలవు కోరుతూ ఆగస్టు 23న ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ♦ స్కిల్ కుంభకోణంలో విచారించడానికి సీఐడీ ఆయనకు నోటీసులిచ్చినట్లు సెపె్టంబర్ 5, 6 తేదీల్లో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ♦ దీంతో అత్యవసర ఆరోగ్య పరీక్షల కోసం తక్షణం అమెరికా వెళ్లాలంటూ సెపె్టంబర్ 5న మరో లేఖ రాశారు. కానీ, ఈ లేఖతో ఆరోగ్యానికి సంబంధించి కానీ, డాక్టరు సిఫార్సు లేఖ కానీ జతచేయలేదు. ♦ సెపె్టంబర్ 6న ప్రభుత్వ సర్విసు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండానే అమెరికా వెళ్లిపోయారు. ♦ అనంతరం.. ఆరోగ్యం బాగోలేదు దానితో వెంటనే అమెరికా వెళ్లిపోయాను, లీవ్ ఇవ్వమని కోరుతూ సెపె్టంబర్ 7న లేఖ రాశారు. సాధారణంగా ఇటువంటి సెలవులకు కనీసం 10 రోజుల ముందుగా లేఖ రాయాల్సి ఉంటుంది. ♦ ఇక ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారని నిర్థారించుకున్న తర్వాత సెపె్టంబర్ 13న సెలవును తిరస్కరించారు. ♦ తక్షణం విధుల్లో చేరాల్సిందిగా మెమో జారీచేయగా సెపె్టంబర్ 20న సెలవు కోరుతూ మరో లేఖ రాశారు. ♦ ఆ తర్వాత మరో మూడ్రోజుల అదనపు సమయం ఇచ్చినా విధుల్లో చేరకపోయేసరికి ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్లో 52 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ 53.4 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) ఉండగా, 2025 నాటికి 52 శాతం పెరిగి 81 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ పేర్కొంది. ఏటా 23 శాతం చొప్పున కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ఈ మార్కెట్కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాల్లో ఆపరేటర్ల నిర్వహణలో ప్రస్తుతం 7.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని వెస్టిన్ నివేదిక తెలిపింది. ఈ రంగంలో 50 పెద్ద సంస్థలు ఉండగా, టాప్–10 సంస్థల నిర్వహణలోనే 84 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పరిమాణం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (తక్షణ కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన) ఆరంభ దశలో ఉన్నట్టు వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. అన్ని విధాల వృద్ధి 2015–16 నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వినియోగం విస్తృతమైందని (వివిధ రంగాలు, కంపెనీలు), అప్పటి వరకు ఈ మార్కెట్ అసంఘటితంగా, పరిమితంగా ఉండేదని వెస్టిన్ నివేదిక వివరించింది. ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ, మరింత సంఘటితంగా మారినట్టు తెలిపింది. కేవలం స్టార్టప్ల నుంచే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు, పెద్ద సంస్థలు సైతం వినియోగించుకోవడం మొదలైనట్టు వివరించింది. ‘‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకునే సంస్థలు తక్కువ వ్యయం, సౌకర్యాలు, సాంకేతికంగా అత్యాధునిక వసతులను కోరుకుంటున్నాయి. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మాంద్యం భయాలతో 2023 ఈ మార్కెట్కు సవాలే’’అని శ్రీనివాసరావు వివరించారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు హైబ్రిడ్ నమూనాలో రప్పిస్తున్నాయని, దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతుందని వెస్టిన్ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి మొత్తం ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు )లో ఫ్లెక్సిబుల్ స్పేస్ 25 శాతంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ, బెంగళూరులోని వైట్ఫీల్డ్, పుణెలోని బనేర్, ముంబైలోని అంధేరి, గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ సిటీ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. -
పొన్నవోలుపై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. డోలు కడతాం
-
డోలీ కష్టాలకు చెక్
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించవని ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషితో గిరిశిఖర గ్రామాలకు చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, దీనికి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు వేస్తున్న రోడ్డే నిదర్శనమని అన్నారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలైన దారపర్తి, పల్లపుదుంగాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పాలనను వివరించారు. పథకాల అందుతున్న తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పల్లపుదుంగాడలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినపుడు ప్రాణాల మీదికి వస్తే డోలీ మోతలే దిక్కు అని, దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రోడ్డు వేయమని గిరిజనులు అడిగారన్నారు. ఆ మేరకు అటవీశాఖ అనుమతులు సాధించి దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు ఐదు కిలోమీటర్ల రోడ్డును రూ.4.50 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. పల్లపుదుంగాడ నుంచి దారపర్తి వరకూ మరో 6 కి.మీ మేర రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. జల్జీవన్ మిషన్ కింద పల్లపుదుంగాడలో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి తాగునీరు ఇచ్చామని.. పొర్లు, కురిడి, గూనపాడు, ధారపర్తి గ్రామాల్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ధారపర్తి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, స్టేట్ ఫోక్ అకాడమీ డైరెక్టర్ వి.రాంబాబు పాల్గొన్నారు. -
‘అనంత’లో పనిచేయడం గొప్ప అనుభూతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జిల్లాలో తక్కువ కాలం పని చేసినా.. తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇది మరువలేనిదని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పోలీసు క్వార్టర్సులో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు, సిబ్బంది చూపించిన ప్రేమాభిమానాలను మరువలేనన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాను పని చేసినా ఎక్కడా ఇంతటి సంతృప్తికరమైన విధులను చూడలేదన్నారు. నేరాలను ఛేదించే క్రమంలో పనిని సవాళుగా తీసుకోవడం, టీమ్ వర్క్ చేయడం లాంటి అనేక అంశాల్లో సిబ్బంది చూపిన ఆత్మస్థైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. అనంత వాసుల్లో మానవత్వం ఎక్కువగా ఉందన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాద సమయంలో అనిత ఆరోగ్యంపై అనంత వాసులు స్పందించిన తీరును కొనియాడారు. కష్టం ఎవరికి వచ్చినా కరిగిపోయి ఆపన్న హస్తాలందించే వ్యక్తిత్వం అనంత వాసుల సొంతమన్నారు. మంచి వాతావరణంలో పని చేశానన్నా సంతృఫ్తితో వెళుతున్నానన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆయన కుటుంబసభ్యులు, సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసులు, గంగయ్య, నర్శింగప్ప, శివారెడ్డి, మునిరాజ్, జి. ప్రసాద్రెడ్డి, సీఐలు జాకీర్ హుస్సేన్, ఇందిర, విశ్వనాథచౌదరి, దేవానంద్, రెడ్డప్ప, శివరాముడు, ధరణీకిషోర్, ప్రతాప్రెడ్డి, నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్ఐలు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్థన్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు పాల్గొన్నారు. -
అది చంద్రబాబు, రామోజీ దుష్ట పన్నాగం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూమి మీద లేకుండా చేయాలనే కుట్రతోనే ఆయనపై హత్యాయత్నం చేశారు. ఈ దుష్ట పన్నాగంలో చంద్రబాబు, రామోజీరావుల పాత్ర ఉందనడంలో సందేహం లేదు’ అని విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఈ కేసులో ఉన్న నిందితుడికి అంతకు ముందు నేర చరిత్ర ఉన్నా సీఐఎస్ఎఫ్ భద్రత ఉన్న విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ క్యాంటీన్లో ఎలా చేరాడని ప్రశ్నించారు. శ్రీనివాసరావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్పై ఆనాడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో వాస్తవాలను మరుగునపర్చి, పూర్తిగా వక్రభాష్యం చెబుతూ ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తను ఖండించారు. ‘ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్పై వచ్చిన అనంతరం మీడియాకు ఏం చెప్పారో తెలియదా? ఇప్పుడు ఈనాడు పత్రిక ఉటంకించిన న్యాయవాది ఆ రోజు ఆ నిందితుడి పక్కనే ఉన్నారు కదా? అయినా చంద్రబాబు దగ్గర ఫీజు తీసుకున్న అడ్వొకేట్ ఏదో చెబితే అదేదో కోర్టు చెప్పినట్లుగా ఈనాడు పత్రిక రాసేయడమేనా? ఇదేనా జర్నలిజం? ఇదేనా విశ్వసనీయత?’ అని మండిపడ్డారు. కేంద్ర భద్రతా బలగాల పహారాలో ఉండే విశాఖ విమానాశ్రయంలో ఒక టీడీపీ నాయకుడికి చెందిన క్యాంటీన్లో పనిచేస్తున్న వ్యక్తి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం చేశాడంటే.. అదేమైనా చిన్న విషయమా? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలన్నీ కోర్టు విచారణలో బయటకు వస్తాయని చెప్పారు. కోర్టు విచారణలో ఉన్నా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏతో పాటు ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు, రామోజీరావు ఇలాంటి వక్రమార్గాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగిన తీవ్రమైన కేసును తొలి నుంచీ కోడి కత్తి కేసు అంటూ నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రజాదరణ కోల్పోయిన టీడీపీని, చంద్రబాబుని రామోజీరావు ఎన్ని జాకీలతో ఎత్తినా రానున్న ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేరని వారికి అర్థమైపోయిందని చెప్పారు. అందుకే ఎంతకైనా దిగజారిపోతున్నారని, తప్పుడు రాతలతో పైశాచికానందం పొందుతున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్ర రాజకీయాలు చేసినా వాస్తవాలేమిటో కోర్టు విచారణలో నిగ్గుతేలతాయని చెప్పారు. ప్రజాకోర్టులాంటి రానున్న ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటమి తప్పదన్నారు. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధితో ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీని మట్టి కరిపించి, వైఎస్ జగన్ మరోసారి ఘన విజయం సాధిస్తారని, ఆ విషయం చంద్రబాబు, రామోజీరావులకు తెలిసిపోయిందని అన్నారు. అందువల్లే టీడీపీని బతికించుకోవడానికి రామోజీరావు, చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ముమ్మాటికీ హత్యాయత్నమే
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే. ఆయన్ని హతమార్చాలనే కుట్రతోనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది. చార్జిషీట్లోనూ ఇదే పేర్కొంది. అంతకు ముందు సిట్ కూడా ఇదే చెప్పింది’ అని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. కానీ, ఓ వర్గం మీడియా క్రియేటివ్ సెన్సేషన్ కోసమే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి తెస్తోందని, దర్యాప్తు అధికారుల నివేదికకు విరుద్ధంగా ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకటేశ్వర్లు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నిందితుడే స్వచ్ఛందంగా అంగీకరించాడు నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్పై విడుదలైన తర్వాత తన న్యాయవాదితో (ఇప్పుడున్న న్యాయవాదే) కలిసి ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్పప్పుడు ఆయనపై తానే దాడి చేశానని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఇప్పుడు అదే న్యాయవాది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయుధాన్ని సమకూర్చారంటూ కొత్త వాదన తెరపైకి తేవడం సిగ్గుచేటు. న్యాయ స్థానంలో దాఖలు చేసిన పత్రాల్లోని విషయాన్ని చూడాలి తప్ప, కోర్టులో జరగనివి, జరిగినవి చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే. దీనికి బాధ్యులు చర్యలు ఎదుర్కోక తప్పదు. సీఎం జగన్పై హత్యాయత్నంలో నిందితుడు శ్రీనివాసరావు ఒక ఆయుధం మాత్రమే. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం లేకుండా ఈ ఘటన జరగడానికి అవకాశం లేదనడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం దర్యాప్తును, కోర్టు విచారణను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. మీడియాతో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు కోడి కత్తి అంటూ కేసు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఓ పత్రిక (ఈనాడు) మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించారు. సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మీడియా సైతం వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన (2018 అక్టోబరు 25) మర్నాటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఏకపక్షంగా రాసేశారు. ఆ దాడిలో వైఎస్ జగన్కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ఓ ప్రతిక (ఈనాడు) మాత్రం వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. బాధితుడైన వైఎస్ జగన్ను అవహేళన చేస్తోంది. బ్లేడ్లతోనే ఎన్నో హత్యలు చేస్తున్నారు. కోడి కత్తి చిన్నగా ఉన్నా అత్యంత పదునుగా ఉంటుంది. కానీ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రతిసారీ కోడి కత్తి అంటూ ఓ ఆయుధాన్ని కేసుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. దాడి నాటి దృశ్యం కేసులున్న వ్యక్తికి ఎయిర్పోర్టులో ఉద్యోగం ఎలా? నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయం రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్లో ఉద్యోగంలో చేరడంతోనే ఈ కుట్రకు బీజం పడింది. వాస్తవానికి విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. శ్రీనివాసరావుకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్వోసీ ఎవరు ఇచ్చారన్నది కీలకంగా మారింది. శ్రీనివాసరావుపై 2017లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్తో పాటు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. పైగా, అతన్ని రెస్టారెంట్లో చేర్పించడానికి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఆతృత కనబరచడం గమనార్హం. శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేవని ఆ పోలీస్ స్టేషన్ అధికారి ఎన్వోసీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో అతనిపై కేసులు ఉన్నాయో లేవో వారికి తెలియదని చెప్పినట్టే. కానీ హర్షవర్ధన్ చౌదరి మాత్రం శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి నేర చరిత్ర లేదని తానే సొంతంగా నిర్ధారిస్తూ ఎన్వోసీ సమర్పించారు. ఏ ప్రాతిపదికన ఆయన అలా చెప్పారు? అంటే శ్రీనివాసరావు నేర చరిత్రను గోప్యంగా ఉంచుతూ డీజీసీఏను తప్పుదోవ పట్టిస్తూ మరీ ఎన్వోసీ ఇచ్చారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉంది. సాక్ష్యం చెప్పడానికి రానని సీఎం చెప్పలేదు ఎన్ఐఏ దర్యాప్తు అనంతరం తొలి చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో పెద్ద కుట్రకోణం దాగి ఉందని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొంది. తొలుత 39 మంది సాక్షులను తూతూమంత్రంగానే విచారించి వదిలేసింది. 2019 జనవరి 23న చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సాక్షిని కూడా విచారించలేదు. ఒక్క డాక్యుమెంట్ను కూడా సేకరించలేదు. సిట్ అధికారులు ఇచ్చిన రికార్డులను మాత్రమే 2019 జూలై 23న కోర్టులో దాఖలు చేశారు. తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి రాలేదని మాత్రమే కోర్టులో చెప్పింది. దర్యాప్తు అవసరం లేదని ఎక్కడా రాయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఇకపై ఎన్ఐఏ విచారణ అవసరం లేదని చెప్పినట్టు రాస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానని ఎక్కడా చెప్పలేదు. తన సాక్ష్యం రికార్డు ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కులుగుతుందని మాత్రమే చెప్పారు. అడ్వొకేట్ కమిషన్ ద్వారా సాక్షులను విచారించే అవకాశం ఉందని, దాని ప్రకారం తనను విచారించాలని అనుమతి కోరుతూ ఎన్ఐఏ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూడా వక్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానానికి, మిగిలిన జిల్లాల్లోని కేసుల విచారణ పరిధి విజయవాడ న్యాయస్థానానికి ఉంటుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది. కుట్రకోణం ఉంది.. అనుమానాలివే తనపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందని ఈ కేసులో బాధితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు బలాన్ని చేకూరుస్తూ స్పష్టమైన అంశాలను ప్రస్తావించారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేర్పించడం, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి నిందితుడు ఆయుధాన్ని అక్రమంగా తీసుకురావడం, ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి టీడీపీ నేత కావడం మొదలైన అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కుట్ర కోణాన్ని, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి హత్యాయత్నం వెనుక కుట్రను ఛేదించాలని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయాలనేదే మా వాదన. అందులో మేం చెప్పిన అంశాలివీ.. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరికి, నిందితునికి ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో కేసులు ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ చార్జ్షీట్లో చెప్పిన విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్థన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్థన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ♦ ఎన్ఐఏకి రికార్డు ఇవ్వొద్దని సిట్ దర్యాప్తు అధికారి శ్రీనివాసరావును అప్పటి డీజీపీ ఎందుకు ఆదేశించారు? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? ♦ స్థానిక పోలీసులు బయోమెట్రిక్ హాజరు మిషన్ను సీజ్ చేసి వివరాలు సేకరించగా అందులో నిందితుడు శ్రీనివాసరావు పేరు నమోదు కాలేదు. హర్షవర్ధన్ కూడా పేరు ఎంట్రీ చేయలేదని చెప్పారు. కానీ, ఎన్ఐఏ దగ్గరికి వచ్చేసరికి బయోమెట్రిక్ హాజరులో నిందితుడు అక్కడే పని చేస్తున్నట్టు, దాడి జరిగిన రోజు కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధ అంశాలు. ♦ అదే రోజు విమానాశ్రయం లాంజ్లో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు? -
వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించిన ‘దిశ’
తెనాలిరూరల్ : వ్యక్తి వేధింపులు తాళలేని ఓ మహిళ దిశ యాప్ ఎస్ఓఎస్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ.రెండు లక్షలు అప్పుగా తీసుకుంది. కొన్ని నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. గతంలో అప్పు కోసం తన ఆఫీస్కు వచ్చినప్పటి ఫొటోలు, కాల్ రికార్డ్లున్నాయని బెదిరించేవాడు. బాధిత మహిళ తన భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధిత మహిళకు, ఆమె భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. తెనాలి వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. ఆమెకు శ్రీనివాసరావు పంపించిన అసభ్యకర సందేశాలను, అప్పు చెల్లించినట్టు ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై ఐపీసీ సెక్షన్ 354 ఈ, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
రామోజీ చట్టాలకు అతీతుడా?
సాక్షి, అమరావతి/ గాందీనగర్ (విజయవాడ): కేంద్ర చిట్ఫండ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈనాడు రామోజీరావుకు రాజ్యాంగం వర్తించదా? ఆయన చట్టాలకు అతీతుడా అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ‘చిట్ఫండ్స్ సంస్థలు, ఆర్థిక సంస్థల మోసాలు – నివారణ చర్యలు’ అనే అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో కొమ్మినేని శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్రాల్లో చిట్ఫండ్స్ సంస్థల మోసాలపై దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్గదర్శి చిట్ఫండ్స్ను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర చట్టాలు మార్గదర్శి చిట్ఫండ్స్కు వర్తించవా అని సామాన్యులకు సందేహం కలుగుతుండటం న్యాయ వ్యవస్థకు కూడా అపప్రదను తెస్తుందని అన్నారు. రామోజీరావు తప్పు చేయలేదని భావిస్తే సీఐడీ దర్యాప్తునకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని నిశితంగా పరిశీలించి అడ్డుకట్ట వేయాలని కోరారు. ♦ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ విచారణకు రామోజీరావు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీరావు ఈనాడు పత్రికను కవచంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సహకార వ్యవస్థను కుట్రపూరితంగా దెబ్బతీశారని శారదాంబ మహిళా సహకార బ్యాంకు మాజీ చైర్పర్సన్ శిష్టా ధనలక్ష్మి చెప్పారు. ఆర్బీఐ ఆడిటింగ్ నిర్వహించే పటిష్ట వ్యవస్థ కలిగిన సహకార బ్యాంకులపై ఈనాడు పత్రిక ద్వారా దు్రష్పచారం చేయించారన్నారు. ♦ ప్రముఖ ఆడిటర్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తోందని విమర్శించారు. చట్టాల అమలుకు అథారిటీ పోలీసు శాఖే అని, ఆ శాఖ ఆధ్వర్యంలోని సీఐడీ దర్యాప్తు చేయకూడదని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మేధావులు ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. కృష్ణా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సైకం భాస్కరరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్ఫండ్స్ కేంద్రంగా నల్లధనం భారీగా చలామణి చేస్తున్నారని విమర్శించారు. నగదులోనే లావాదేవీలు నిర్వహిస్తూ ఆ పూర్తి మొత్తానికి కూడా రశీదులు ఇవ్వరని చెప్పారు. ♦ న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్గదర్శి తరహాలోనే విజయవాడలో 15 ఏళ్ల క్రితం అక్రమాలకు పాల్పడిన సిరి గోల్డ్ వంటి సంస్థలను మూసివేయించారన్నారు. అంతకంటే భారీ మోసాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో కనీ్వనర్ ఎం.కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు, ఆడిటర్లు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది? ఒక్కరోజు ముందు కూడా హడావిడి బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయం అంటేనే సేవ.. కట్ చేస్తే! 23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే.. హెల్త్ డైరెక్టర్గానే కొనసాగుతారా? లేక మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చదవండి: కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా వేరే పార్టీలోకి! ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు. చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. -
రక్షణ రంగానికి బ్రాండ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపికైన ఏఎన్ఎం–2 (సెకండ్ ఏఎన్ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఏఎన్ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు.. రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు. తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
బాలకృష్ణ పీఏ ఓవరాక్షన్
సాక్షి, శ్రీసత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, టీడీపీ లీడర్ శ్రీనివాస్ రావు ఓవరాక్షన్కు దిగాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పోలింగ్ కేంద్రం వద్ద తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతంగా మారింది. చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాసరావు, తన అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ కేంద్రంలోకి వెళ్లబోయే ప్రయత్నం చేశాడు. అయితే.. అది రూల్స్కు విరుద్ధమంటూ పోలీసులు అడ్డుకోగా.. దూసుకెళ్లే యత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో దౌర్జన్యకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. -
వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గదన్నారు. సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్లకు మాత్రమే చెల్లిందని ధ్వజమెత్తారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. ఎవరెంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్ జగన్కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఓ హత్యకేసులో ఇద్దరికి జీవితఖైదు
కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు మడకం తుల, పొడియం నాగకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. జీవితఖైదుతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఏడు నెలల్లోపే ఈ విచారణ పూర్తి చేసి శిక్ష విధించడం గమనార్హం. ఏం జరిగిందంటే... జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ పరిధి ఎర్రబోడులో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అటవీ భూముల్లో పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆ భూములను అటవీ అధికారులు స్వా«దీనం చేసుకుని ప్లాంటేషన్ చేశారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 22న గొత్తికోయలు ఆ భూముల్లో పశువులు మేపుతుండగా ప్లాంటేషన్ వాచర్ భూక్యా రాములు, బేస్ వాచర్ ప్రసాద్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని వారు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దృష్టికి తేగా ఆయన రావికంపాడు సెక్షన్ అధికారి తేజావత్ రామారావుతో అక్కడికి వెళ్లారు. ఈ భూముల్లో పశువులు మేపొద్దని చెబుతూ.. వీడియో తీస్తుండగా గొత్తికోయలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో మడకం తుల, పొడియం నాగ వేట కొడవళ్లతో ఎఫ్ఆర్ఓ మెడపై నరికారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఖమ్మం తరలిస్తుండగానే మృతిచెందారు. ఈ ఘటనపై నాటి చండ్రుగొండ ఎస్ఐ విజయలక్ష్మి, సీఐ వసంత్కుమార్ కేసు నమోదు చేయగా, 24 మంది సాక్షులను విచారించిన జడ్జి.. నేరం రుజువు కావడంతో నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, అటవీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్ వైద్యరంగానికి పెద్దపీట వేశారు: ఎమ్మెల్యే కడుబండి
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది
మచిలీపట్నంటౌన్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు. సీఎం జగన్.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను సీఎం జగన్ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్ కాకుండా జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు. 71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం నుంచే పోటీ.. హెల్త్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో డాక్టర్ జీఆర్ఎస్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్ధేశిస్తూ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశిస్తే ప్రజల కోరిక మేరకు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది కొత్తగూడెం వాసులు కోరుకున్నది నెరవేరుస్తానని అన్నారు. డీహెచ్కు ముషీరాబాద్ సీటు ఖరారైందని వస్తున్న వార్తలు అవాస్తవమని, కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోటీచేస్తే కొత్తగూడెంలోనే పోటీ చేస్తానని లేకపోతే లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇక్కడే పుట్టిన నేను ఈ గడ్డమీదే చనిపోతానని, ఇక్కడే నా ఆఖరి మజిలీ అని అన్నారు. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ ఇంకా ఏడేళ్లు సర్వీస్ ఉన్నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వస్తున్నా. కానీ ఆస్తులు పోగేసుకోవడానికో, కీర్తులు గడించడానికో రావట్లేదు.. నాకు ఒక కూతురు మాత్రమే ఉంది. ఇప్పుడు తన భాద్యత కూడా తీరిపోయింది ఇక మిగిలింది నా కొత్తగూడెం కుటుంబం బాధ్యత మాత్రమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ కేటగిరి ఉన్నది కేవలం మూడు స్థానాలే. వాటిలో ఒక స్థానం ఒక వర్గం, మరొక స్థానం మరొక వర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే పుట్టిన, ఇక్కడే చనిపోతా.. కొత్తగూడెంపై ఇక మిగిలిన కొత్తగూడెం నియోజకవర్గం బీసీల అడ్డా. ఇక్కడైనా బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే కేటాయించాలి. నా గురించి ఎందరో ఎన్నో మాటలను మాట్లాడుతున్నారు. శనివారం వస్తారు, సోమవారం వెళ్తారని అంటున్నారు. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా. హైదరాబాద్ వెళ్ళేది కేవలం శరీరం మాత్రమమే.. నా మనసు ఇక్కడే మీ చుట్టూ ఉంటుంది. నాకు మిగిలిన ఈ జీవితం నా జన్మ భూమి అయిన కొత్తగూడెంనకు మాత్రమే’నని వ్యాఖ్యానించారు. -
దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక బోధన నైపుణ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక విద్యా బోధన అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతో డిజిటల్ విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్డీటీ అనంతపురం) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం ఆర్డీటీ ఆడిటోరియంలో జరిగిన ‘ఫస్ట్ ఇన్క్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలోని ఆరు జిల్లాల (అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప) నుంచి 300 మంది దివ్యాంగ, సాధారణ విద్యార్థులతో కలిపి విజువల్ కోడింగ్, ఆక్సిస్బల్ కోడింగ్, రోబోటిక్, వెబ్ డిజైన్, యానిమేషన్ గేమ్స్ డెవలప్మెంట్ వంటి 100 డిజిటల్ నైపుణ్యాల ప్రాజెక్టులను ప్రదర్శించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫె సర్ ఎం.రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్ దశరథ్, చక్షుమతి ఫౌండేషన్ ప్రతినిధి రామ్కమల్, సైబర్ స్క్వేర్ సీఈవో ఎన్.పి.హరిష్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు. -
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రూటే సపరేటు.. కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి రావడం, తమదైన తీరులో ముద్ర వేయడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు పాలిటిక్స్లో సత్తాచాటారు. వారిలో కొంతమంది రాజకీయాలు తమకు సరిపోవని తూర్పు తిరిగి దండంపెట్టి గుడ్ బై చెప్పారు. అయితే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాతనే రాజకీయాల్లో మునిగి తేలారు. వారు పద్ధతి ప్రకారం నడుచుకుంటే తెలంగాణకు చెందిన ఓ ఉన్నతాధికారి మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. శ్రీనివాస్ రూటే సపరేటు ఈయన పేరు గడల శ్రీనివాసరావు.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్. కరోనా మహమ్మారి సమయంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేస్తూ టీవీల్లో కనిపించేవారు. అలా ప్రజలకు పరిచయమైన ఈయన ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనల కారణంగా తరచుగా వార్తల్లో వుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి కానీ గడల శ్రీనివాసరావు రూటే సపరేటు. ఏ కాస్త అవకాశం దొరికినా సరే పొలిటీషియన్లాగా వ్యవహరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. రాజకీయాలకే ఎక్కవ టైం ఉన్నత అధికారిగా నిర్వహించాల్సిన సేవలకు కాకుండా రాజకీయాలకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ప్రజాప్రతినిధిగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలనే కోరిక గడల శ్రీనివాసరావుకు బలంగా వున్నట్లుంది. అందుకేనేమో ఆయన హెల్త్ డైరెక్టర్ విధులను మర్చిపోయి కొత్తగూడెంనకు మాత్రమే పరిమితం అయ్యారన్న చర్చ నడుస్తోంది. చదవండి: ‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్ టార్గెట్ వనమా! వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసి తీరతానంటూ ఇప్పటికే పలుమార్లు ఆయన తన మనసులో మాట వెలిబుచ్చారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం ఉల్వనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వనమాకు 80 ఏళ్ళు వచ్చాయి. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయమని.. ఇంకా ఎంతకాలం ఆయన రాజీకాయల్లో ఉంటారంటూ గడల శ్రీనివాసరావు సెటైర్లు విసిరారు. వేడేక్కిన రాజకీయం అంతటితో ఆగకుండా నేను అభివృద్ధి చేయడానికి వస్తే అడ్డుకుంటారా అంటూ ఆవేదన చెందారు. కొత్త కొత్తగూడెంను చూద్దాం. కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందాం అని ప్రజలకు పిలుపు నిచ్చారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా అని కార్యక్రమానికి వచ్చినవారిని అడగడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా పని చేస్తున్న గడల శ్రీనివాసరావుకు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. ఆయన పలుమార్లు తన స్థాయికి సరిపోని వ్యాఖ్యలు, విమర్శలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి ఆయన ఈ రకంగా వ్యవహరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనేది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ వుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అంతే తప్ప అధికారిగా ఉంటూ రాజకీయాలు చేయడం ఏంటన్న చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతోంది. చదవండి: వీరి సంగతేంటి?.. బీజేపీకి పెద్ద దెబ్బే పడుతుందా? -
అత్యధిక స్టార్టప్లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ
హఫీజ్పేట్: దేశంలోనే అత్యధిక స్టార్టప్లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని టీహబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని షర్టన్ హోటల్లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నేషనల్ టెక్నాలజీ కాంక్లేవ్–2023 శనివారం జరిగింది. ఈ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,500 స్టార్టప్లున్నాయన్నారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తిలోనూ కొత్తగా ఏర్పడిన తెలంగాణే టాప్ రాష్ట్రంగా కొనసాగుతోందని తెలిపారు. ఈజీ ఆఫ్ బిజినెస్లో, బెస్ట్ ఇన్నోవేషన్ స్టేట్గానూ తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు.. అమెరికా తర్వాత తమ అతి పెద్ద కేంద్రాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తూ తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. సీఐఓ క్లబ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ 2018లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఐఎస్బి అసోసియేట్ డైరెక్టర్ అజయ్ సింగ్, సీఐఓ క్లబ్ ప్రతినిధులు ఉమేష్ మెహతా, 14 చాప్టర్ల సీఐఓలు, సభ్యులు పాల్గొన్నారు. -
ఇలా చేస్తే ఎమ్మెల్యే అవ్వొచ్చనే ప్లాన్
-
వ్యధార్థ జీవుల యథార్థ కవి
శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు. ‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది. స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు. అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా. – డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి (నేడు శ్రీశ్రీ జయంతి) -
బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుపై సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకి చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ‘‘బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలి. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా? బాబు చెప్పాలి. 2022 కల్లా దేశంలో బుల్లెట్ ట్రైన్ మోదీ నడుపుతామన్నారు.. బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ‘‘18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోదీలో చూస్తున్నది అభివృద్ధి కాదు, పచ్చి అవకాశవాదం. గడ్డిపరకనైనా పట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మోదీ విజన్లో పేదలకు, ప్రజలకు స్థానం ఎక్కడ?, పెట్టుబడిదారుల విజన్ మతోన్మాదుల విజన్ అసలు విజన్ కాదు. మోదీ, చంద్రబాబుది విజన్ కాదు.. అదొక డివిజన్’’ అంటూ తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు:శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తామని చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. మరి చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని మోదీ అంటున్నారు. చంద్రబాబు మరి కంటిన్యూ చేస్తా అంటున్నారు.. ఇందులో ఉన్న విజన్ ఏమిటి?. చంద్రబాబుది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి లేదు. ఈ వైఖరితో చంద్రబాబు ఎన్నడూ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’’ అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్ విషయంలోనే.. -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు. కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య -
ఏది నిజం?: బాధితులనే దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?
నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్ జగన్ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు చార్జిషీట్ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది. వైఎస్ జగన్ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందనేది వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో ఆలస్యమవుతోంది కాబట్టి, వేగంగా చేసేలా దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఇదీ జరుగుతున్న వాస్తవం. కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్ జగన్ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి నిందితులకు కొమ్ముకాసే దగాకోరు పాత్రికేయం చరిత్రలో ఎక్కడైనా ఉందా? బాధితులనే దోషులుగా చూపించే కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా? ఇదేం తీరు రామోజీరావ్? ఇంకెన్నాళ్లు ఇలా..? హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్తో వీఐపీ లాంజ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్ట్రిక్స్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... ♦ హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్ జగన్ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? ♦ నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? ♦ నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? ♦ జగన్ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? ♦ నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? ♦ ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్ ఫుడ్స్ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్ ఫుడ్స్ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ హైదరాబాద్లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్పోర్టుకు రావటం... హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? లోతైన దర్యాప్తు అవసరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుతున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణలో భాగంగానే ఎన్ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్ వేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం. -
ఏది నిజం?: కప్పిపుచ్చడమే..అసలైన కుట్ర!
మొదటి నుంచీ అంతే!!. 2018 అక్టోబర్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన రోజునే... అటు ‘ఈనాడు’ గానీ... ఇటు తెలుగుదేశం పార్టీ గానీ సిగ్గూ ఎగ్గూ వదిలేశాయి. హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుపై తన స్వస్థలం ముమ్మిడివరంలో ఎలాంటి కేసులూ లేవంటూ రామోజీరావు తొలిరోజునే సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ రెండవరోజున అప్పటి వైజాగ్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిందితుడిపై ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో నమోదైన రెండు కేసుల్ని వివరించారు. తప్పనిసరై దాన్ని కూడా ప్రచురించింది ‘ఈనాడు’. ఇక్కడ గమనించాల్సింది... ప్రశ్నించాల్సింది ఒక్కటే. తొలిరోజున ఏ పోలీస్ అధికారీ చెప్పకుండానే... ‘ఈనాడు’ తనంతట తానుగా నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని ఎలా ప్రచురించింది? అసలెందుకు ప్రచురించిందీ వార్త? ఎందుకంటే ఇదంతా రామోజీ, చంద్రబాబు కలిసి ఆడించిన కుట్ర కాబట్టి!. తాజాగా ఎన్ఐఏ వేసిన కౌంటర్కు తన సొంత భాష్యం చెబుతూ శుక్రవారం ‘ఈనాడు’ రాసిన వార్త... ఈ కుట్రను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.అంతే!. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం ? వాస్తవానికి సంఘటన జరిగిననాడే ‘ఈనాడు’ ఏడెనిమిది వార్తలు వేసింది. అందులో ఒక్కటి మాత్రమే దాడికి సంబంధించినది. మిగిలినవన్నీ ఆ దాడితో తెలుగుదేశానికి సంబంధం లేదంటూ ఎదురుదాడి చేసినవే. ఆ రోజు మొదలు... ప్రతిరోజూ ఈ కేసును తప్పుదోవ పట్టించే వార్తలే. కాకపోతే ఈ కేసును దర్యాప్తు చేసిన ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) 2019 జనవరి 23న దీనిపై ఛార్జిషీట్ వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యకు ప్రయత్నించటం వెనక కుట్ర కోణం ఉన్నట్లు ఎన్ఐఏ ఆ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. ఆ దిశగా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో న్యాయస్థానాలు అయితే ఆ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుని అభియోగాలు నమోదు చేయటం... లేకపోతే తదుపరి దర్యాప్తు కొనసాగించి తుది ఛార్జిషీటు వేయాలని చెప్పటం చేస్తాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాలని ఎన్ఐఏకు కోర్టు చెప్పింది. కాకపోతే ఏళ్లు గడుస్తున్నా... ఎన్ఐఏ తుది ఛార్జిషీటు వేయలేదు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని తన తొలి ఛార్జిషీట్లో చెప్పింది కాబట్టి... ఆ కోణాన్ని త్వరగా విచారించి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశించాలంటూ పిటిషనర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆనాడే.. తన స్టేట్మెంట్లో.. వివరంగా తనపై హత్యాయత్నానికి సంబంధించి 2019 జనవరి 17న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు. తనపై హత్యాయత్నం వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఆయన బలంగా వినిపించారు. ‘‘నిందితుడెవరో నాకు తెలియదు. కానీ తనను వైఎస్సార్ సీపీ అభిమానిగా చూపించటం, దానికి మద్దతుగా ఒక ఫ్లెక్సీని సృష్టించటం ఇదంతా ఓ పెద్ద కుట్రలో భాగం. ఇదంతా తమకు సంబంధం లేని వ్యవహారంగా చిత్రించడానికి టీడీపీ చేస్తున్న కుట్ర. నా పాదయాత్ర విశాఖలో అడుగుపెట్టిన నాటి నుంచీ హత్యాయత్నం జరిగిన రోజు వరకూ ఎయిర్పోర్టులో సీసీ టీవీ కెమెరాలు పనిచేయలేదని నాకు తెలిసింది. పైపెచ్చు నిందితుడికి ఎయిర్పోర్టులోని తన ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చిన హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు. 2014లో గాజువాక టిక్కెట్ కూడా ఆశించారు. నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని అబద్ధపు డిక్లరేషన్ ఇచ్చి మరీ తనను పనిలో పెట్టుకున్నాడు. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట టీడీపీ సానుభూతిపరుడైన ఓ నటుడు(శివాజీ) ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ కుట్రలో భాగమేననిపిస్తోంది. వీళ్లు చేసే హత్యాయత్నం ఫలిస్తే వీళ్లనుకున్నది జరుగుతుంది. ఒకవేళ బెడిసికొడితే.. గరుడలో చెప్పిందే జరిగిందని వీళ్లే ఎదురుదాడి చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది’’ అంటూ అప్పట్లో తన స్టేట్మెంట్లో వివరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని ఎన్ఐఏ ఎందుకు సమగ్రంగా విచారించటం లేదు? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇది కుట్ర కాదనగలమా? వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్లో ఉద్యోగంలో చేరడమే ఈ కుట్రకు నాంది. తదనంతరం జరిగిన పరిణామాలు కుట్రను స్పష్టంగా బయటపెట్టేలా ఉన్నా... ఎన్ఐఏ ఉదాసీనంగా ఉండటమే ఇక్కడ విస్మయం కలిగించే అంశం. ఎందుకంటే జె.శ్రీనివాసరావుకు తన రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చేందుకు దాని యజమాని హర్షవర్దన్ చౌదరి అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే విమానాశ్రయాల్లో ప్రైవేటు సిబ్బంది నియామకానికి కచ్చి తమైన మార్గదర్శకాలున్నాయి. (హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచి్చన వాంగ్మూలం.) రెస్టారెంట్, ట్రావెల్ ఏజెన్సీల డెస్క్ లు మొదలైన వాటిలో ప్రైవేటు వ్యక్తులే పని చేస్తారు. అందుకోసమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. నిజానికి జె.శ్రీనివాసరావుపై 2017లో నాటి తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు పోలీసులు చార్జ్షీట్ కూడా వేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. కానీ అతనిపై ఎలాంటి కేసులూ లేవని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి డిక్లరేషన్ ఇవ్వటం గమనార్హం. ఇంకా శ్రీనివాసరావుపై తమ పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులూ లేవని, స్వస్థలంలో ఉన్నాయేమో చూడాలని విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్వోసీ ఇచ్చారు. కానీ స్వస్థలంలో కేసుల గురించి కనుక్కునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. దానికితోడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ హర్షవర్దన్ చౌదరి తన సొంత ఎన్ఓసీ ఇచ్చేశారు. హత్యాయత్నం జరిగిన రోజున రామోజీరావు కూడా శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ ‘ఈనాడు’ ద్వారా ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇంతటి కీలకమైన అంశంపై ఎన్ఐఏ దృష్టిసారించకపోవటమే పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ టీవీ రికార్డింగులు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు ఈ కేసులో విమానాశ్రయంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకం. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి జె.శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడానికి వాడిన కత్తిని ఎలా తీసుకువెళ్లారన్నది కీలకం. హత్యాయత్నానికి కంటే కొన్ని రోజుల ముందటి సీసీ టీవీ కెమెరాల రికార్డులను ఎన్ఐఏ ఆ కెమెరాల తయారీదారైన తోషిబా కంపెనీకి పంపించి విశ్లేషించింది. విమానాశ్రయం కిచెన్లో ఓ వంటపాత్రలో ఆ కత్తిని వేడిచేస్తున్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగుల్లో ఉందని వెల్లడైంది. జె.శ్రీనివాసరావే ఆ కత్తిని వేడి నీటిలో మరిగిస్తున్నట్టుగా వీడియో క్లిప్పింగుల్లో ఉంది. మరి ఆ విషయాన్ని ఎన్ఐఏ ఎందుకు కౌంటర్ అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతటి కీలకమైన వీడియో క్లిప్పింగులను న్యాయస్థానానికి కూడా సమర్పించకపోవడం గమనార్హం. నిందితుడి లేఖను కూడాసమర్పించనే లేదు... ఈ కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు రాసిన లేఖ, ఇతర కాపీలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఎన్ఐఏకు అప్పగించారు. తనకు ఏమైనా అయితే తన శరీర అవయవాలను దానం చేయాలని అతను రాసినట్టుగా ఉంది. తనకు ఏదైనా అవుతుందని జె.శ్రీనివాసరావు ముందే ఎలా ఊహిస్తారు... ! అంటే ఇదేమీ యాదృచ్చి కంగానో అప్పటికప్పుడు హఠాత్తుగానో జరిగింది కాదన్నది సుస్పష్టం. ముందస్తుగానే కొందరితో కలిసి పన్నిన కుట్ర ప్రకారమే అంతా జరిగిందని... ప్లాన్తోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వెల్లడి కావటంలేదా? మరి అంతటి కుట్ర వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్తో వీఐపీలాంజ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని, అవకాశం దొరికినవెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. దర్యాప్తు ముగియనే లేదు కదా...! అంత ఆతృత ఎందుకు రామోజీ? హత్యాయత్నం వెనక ఉన్న కుట్రకోణాన్ని త్వరగా దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్పై ప్రస్తుతం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఎన్ఐఏను సమాధానమివ్వాలని కోర్టు కోరగా... దీనిపై ఎన్ఐఏ కౌంటర్ వేసింది. ఇది కౌంటర్ మాత్రమే తప్ప తుది ఛార్జిషీటు కాదు. తమ దర్యాప్తు ముగిసిందని కూడా చెప్పలేదు. ఈ కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలను కౌంటర్లో ప్రస్తావించింది. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. కానీ దర్యాప్తు ముగిసిపోయినట్లు... ఇక దర్యాప్తు చేసేందుకు ఏమీ లేదని అన్నట్టుగా టీడీపీ అనుకూల పచ్చ మీడియా తెగ హడావుడి చేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నం చేసినట్లు ఎన్ఐఏ ఎప్పుడో చెప్పింది. దానికి కారణాలు తేలాలి. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. కారణాలు తెలిస్తే కుట్ర కోణమూ బయటపడుతుంది. కాకపోతే దర్యాప్తు కొనసాగుతుండగానే... ఇక కుట్ర కోణమేదీ లేదని ఎల్లో మీడియా తేల్చేసింది. ఎన్నాళ్లగానో తాము చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లుగా... ఎన్ఐఏ కౌంటర్ను చూసి ఎల్లో మీడియా తెగ సంబరపడిపోయింది. ఎందుకింత ఆత్రం? దర్యాప్తు పూర్తికాకుండానే ఎందుకంత తొందర రామోజీ? ఎల్లో సిండికేట్ తీరే అంత... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఎల్లో సిండికేట్ మొదటి నుంచీ వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించేశారు. కేవలం సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికిపాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించడం అప్పట్లో అందరినీ నివ్వెరపరిచింది. నిజానిజాలు వెలికితీస్తాం అని ప్రకటించాల్సిన ఆయన... చంద్రబాబు డైరెక్షన్ మేరకు అడ్డగోలు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసే కిందిస్థాయి పోలీసు అధికారులను ప్రభావితం చేసేందుకే ఆయన అలా ప్రకటించారన్నది సుస్పష్టం. వైఎస్ జగన్కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉండే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ గాయం చిన్నదే అని నాటి డీజీపీ, చంద్రబాబు, ‘ఈనాడు’ కట్టగట్టుకుని ప్రచారం చెయ్యడాన్ని ఏమనుకోవాలి? మళ్లీ అదే తతంగం ఇక తాజాగా ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల విషయంలోనూ ఎల్లో మీడియా ఇదే పంథా ఎంచుకుంది. హత్యాయత్నం వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని నిర్ధారణ అయినట్టుగా కథనాలు ప్రచురించి తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్లోని అంశాలను సవాల్ చేస్తూ బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకోసం న్యాయస్థానం గడువు ఇస్తూ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. జగన్ తరపు న్యాయవాది వేసే కౌంటర్లోని అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నాక విచారణ ప్రక్రియ సాగుతుంది. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు కూడా ఇంకా పూర్తి కాలేదు. తుది నివేదిక రావాలి. ఇవేవీ పట్టించుకోకుండా కేసు దర్యాప్తు ముగిసినట్టే అనే భ్రాంతి కలిగించేలా పచ్చ మీడియా హడావుడి చేస్తుండటమే అసలైన కుట్ర!!. -
10, 11 తేదీల్లో ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్
సాక్షి, హైదరాబాద్: దేశ విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10, 11 తేదీల్లో కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లపై పరిశీలన చేసే నిమిత్తం మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు గురువారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. వార్డుల్లో పడకలు, ఆక్సిజన్ వసతి, ఐసీయూలు, టెస్టింగ్ కిట్ల నిల్వ, మందులు వంటి వాటిపై ఈ డ్రిల్ ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయో లేదో మాక్ డ్రిల్లో పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరిదిద్దుతారు. కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతారు. మిషన్లు, పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ప్లాంట్లు తదితర వాటి పనితీరును పరిశీలిస్తారు. మాక్ డ్రిల్ కోసం ప్రతి జిల్లాకు ఒక నోడల్ఆఫీసర్ను నియమిస్తారు. మాక్ డ్రిల్లో ఏం చేస్తారంటే.. అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి అనేది తనిఖీ చేస్తారు. దీంతో పాటు ఆయా ఆసుపత్రులు, అనుబంధ కేంద్రాల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఆశాలు, అంగన్వాడీలు ఎంత మంది ఉన్నా రు? అనే వివరాలు సేకరిస్తారు. కరోనా నియంత్రణకు శిక్షణ కలిగిన సిబ్బంది ఉన్నారా? లేదా? అనే వివరాలను కూడా సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటారు. దీంతోపాటు అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితిఎలా ఉంది? అనే అంశాలను తనిఖీ చేస్తారు. కాగా, మాక్డ్రిల్ నివేదికను జిల్లా వైద్యాధికారులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమో దు చేయాలని శ్రీనివాసరావు ఆదేశించారు. -
24 గంటలూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు.. మార్గదర్శకాలు జారీ!
సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్ను పీహెచ్సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు. మార్గదర్శకాలివీ... ♦ అన్ని పీహెచ్సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి. ♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి. ♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి. ♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి. ♦ నీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ♦ పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి. ♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి. ♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి. ♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది ♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి. ♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు. -
నిశ్శబ్దాన్ని ఛేదించి ఎందరికో ‘చేయూత’
హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు దీనిపై నలుగురిలో మాట్లాడాలంటేనే వణుకు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనుకునే వారు. కానీ.. మందులకు లొంగని ఈ వ్యాధి సోకినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని కోటగిరి రేణుక రుజువు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రేణుక భర్త కోటగిరి శ్రీనివాసరావుకు 1999లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. రేణుకకు కూడా ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. 2003లో శ్రీనివాసరావు మృతి చెందారు. భర్త మరణానంతరం రేణుక విజయవాడకు మారారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల తనలా ఇంకెంత మంది మహిళలు వేదనకు గురవుతున్నారోననే భావన రేణుకను కలచివేసింది. హైదరాబాద్కు వెళ్లి హెచ్ఐవీ బాధితుల ‘కేర్ అండ్ సపోర్టింగ్’లో శిక్షణ పొందారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా 2003లోనే ‘తెలుగు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంలో భాగస్వామి అయ్యారు. మరోవైపు అప్పట్లోనే చేయూత అనే సంస్థను సైతం నెలకొల్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని హెచ్ఐవీ బాధితులకు వివిధ రకాలుగా అండగా నిలిచారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు సాయం, పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది పిల్లల చదువులకు చేయూత ఎన్జీవో ద్వారా సాయం అందించారు. ప్రస్తుతం 400 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆమె సహకారంతో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ చదివిన వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పుకోవడానికి భయపడను నేను హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి భయపడను. అలా చెప్పుకోవడానికి ఇబ్బంది పడి.. నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా బాధితులకు సాయం చేయడమే నా లక్ష్యం. తమ ప్రమేయం లేకున్నా.. ఏ తప్పు చేయకున్నా చాలామంది ఈ వ్యాధి బారినపడుతుంటారు. వ్యాధి సోకినంత మాత్రాన కుంగిపోవద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో మంచి వైద్యం అందుతోంది. ఎవరో.. ఏదో అనుకుంటారని బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మానేయొద్దు. – కోటగిరి రేణుక, చైర్మన్, చేయూత స్వచ్ఛంద సంస్థ -
Telangana: కొత్తగా 18 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 4570 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 18 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 13 కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 95 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. -
Telangana: కొత్తగా ముగ్గురికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 2534 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురు వైరస్ బారిన పడినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కరోజులో కరోనా నుంచి ఇద్దరు కోలుకోగా, ప్రస్తుతం 32 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
కరోనా కేసుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారి శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక్క రోజులో 3,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ కరోనా సోకలేదని ఆయన స్పష్టం చేశా రు. కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రోజూ కేసులు నమోదయ్యే వని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు గరిష్టంగా ఒక రోజులో 15 కేసులు నమోదు కాగా, తాజాగా కనిష్టంగా జీరో కేసులు నమో దయ్యాయని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8.41 కరోనా కేసులు నమోదైనట్లయింది. అందులో 8.37 లక్షల మంది కోలుకున్నా రు. ఒక రోజులో 10,405 మంది కరోనా టీకా వేసుకున్నారు. వారిలో 9,800 మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. -
‘ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తాను ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. -
అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!
తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐల హవా ఎక్కువైంది. అమెరికాలో బాగా సంపాదించి ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. నియోజకవర్గం నేతలకు టెన్షన్ పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఐదుసార్లు గెలిచిన ఓ నేతను ఎన్ఆర్ఐ వెంటాడుతున్నాడు. గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన ఆ నేత ఎప్పటికీ ఆ సీటు తనదే అనుకుంటున్నారు. ఇంతలో ఎన్ఆర్ఐ రంగ ప్రవేశంతో కంగారుపడుతున్నారట. ధూళిపాళ్లకు ఎన్నారై సెగ ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో పొన్నూరు ఓటర్లు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా పొన్నూరు ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉందో మొన్నటివరకూ అలాగే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర, అతని తమ్ముడు సురేంద్రలు నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. సెకండ్ లెవెల్ క్యాడర్ ను ఎక్కడా ఎదగనివ్వలేదు. దీంతో ధూళిపాళ్లపై నియోజకవర్గంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. కానీ నరేంద్ర మాత్రం పొన్నూరు సీటు తనకు కాదని మరెవరికీ ఇవ్వరనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే పార్టీలోని నరేంద్ర వ్యతిరేకులు ఆయనకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారట. తెనాలి దత్త పార్టీకి నరేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపధ్యంలోనే ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఉయ్యూరు శ్రీనివాసరావు గుంటూరు వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ఉయ్యూరు శ్రీనివాస్ మంచి దోస్తులు. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆలపాటి తనకు నష్టం జరగకుండా వ్యూహం పన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఆలపాటి రాజా ఇన్ ఛార్జిగా ఉన్న తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆలపాటి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనతోనే స్నేహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు నువ్వు పొన్నూరులో పోటీ చేస్తే బెటర్ అని కన్విన్స్ చేశారట. ఆలపాటి రాజా ఎన్నారైకి ఈ సలహా ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ధూళిపాళ్ల, ఆలపాటికి మొదటినుంచి ఒకరంటే ఒకరికి గిట్టదు. సంగం డైరి కొట్టెయ్యాలని ఆలపాటి భావిస్తే నరేంద్ర హస్తగతం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది పరిస్థితి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. చదవండి: (టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం) గుంటూరు తొక్కిసలాట పాపం బాబు ఆలపాటి రాజా తన వ్యూహంలో భాగంగానే ఉయ్యూరు శ్రీనివాసరావును ధూళిపాళ్ల నరేంద్రపైకి వదిలారు. ఆలపాటి సలహాతో శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు చెప్పారట. ధూళిపాళ్ల నరేంద్ర ఖర్చు పెట్టేదానికంటే రెండింతలు ఎక్కువ ఖర్చుపెడతానని, ఈసారి పొన్నూరు సీటు మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని ఎన్నారై విభాగం ద్వారా చంద్రబాబుపై వత్తిడి తీసుకొస్తున్నారు. వీరికి ఆలపాటి రాజా కూడా తోడయ్యాడు. అందులో భాగంగానే జనవరి 1న ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక సభను నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబును చీఫ్ గెస్ట్ గా పిలవడం వెనుక కూడా అసలు స్కెచ్ పొన్నూరు సీటేనని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సభ వ్యవహారాలన్నీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి చూసుకున్నారట. ఉయ్యూరు శ్రీనివాసరావు ఆలపాటి రాజా మినహా మరే ఇతర టీడీపీ నేతకు ప్రాధాన్యత ఇవ్వలేదట. పొన్నూరు ఉయ్యూరుకేనా? పొన్నూరు సీటు ఉయ్యూరు శ్రీనివాసరావుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో నరేంద్రకు టెన్షన్ పట్టుకుంది. పొన్నూరు సీటు తనకు కేటాయిస్తే లోకేష్ పాదయాత్రకు భారీస్థాయిలో స్పాన్సర్ చేస్తానని కూడా చంద్రబాబుకు ఉయ్యూరు శ్రీనివాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. ఇలా ఖర్చు భరిస్తానంటే చంద్రబాబుకు కూడా సంతోషమే కదా? ఎగురుకుంటూ వచ్చిన వారికే పచ్చ పార్టీలో సీటు అనే ప్రచారం మరోచోట కూడా నిజం కాబోతోందని టాక్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Telangana: రాష్ట్రంలో మూడు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 4,230 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి తొమ్మిది మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 47 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. -
పుంజు భళా.. మటన్ కీమా, గుడ్డు, బాదం, ఆయుర్వేద స్నానం.. కనులారా చూడాల్సిందే..
అదో మామిడి తోట..అక్కడ ఎన్నో వింతలు..విశేషాలు.. అక్కడికి వెళితే తిరిగి వెనక్కి రావాలనిపించదు. లోపలకు అడుగు పెట్టగానే రంగు రంగుల, రకరకాల కోళ్లు దర్శనమిస్తాయి. ఇక లోపలకు వెళితే కొక్కొరోకో కూతలు...ఒకటా, రెండా వందల సంఖ్యలో కోడి పుంజులు, పెట్టలతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టినట్టు అనుభూతి కలుగుతుంది. అది చెబితే తనివి తీరదు. ఆ ఆనందాన్ని కనులారా చూడాల్సిందే.. అక్కడి ప్రత్యేకతలు చెవులారా వినాల్సిందే. ఒంగోలు నగరానికి కూత వేటు దూరంలో యరజర్ల గ్రామం. 4 ఎకరాల్లో కోళ్ల ఫాం ఉంది. ఇక్కడ కోళ్ల పెంపకంలో ప్రత్యేకత ఉంది. మామిడి తోటలో ఉన్న ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. విభిన్న జాతి రకాల కోళ్లు, కోడి పుంజులను చిన్న పిల్లల్లా వీటిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక గదులు. దుప్పట్లు.. దోమ తెరలు ఏర్పాటు చేశారు. వీటికి ఆయుర్వేద వనమూలికతో ప్రత్యేక స్నానం. మటన్ కీమా, బాదం, పిస్తా, తేనె, అంజూర్.. ఇలా బలవర్ధకమైన ఆహారం. అనారోగ్యం పాలవకుండా మందులు.. ఇంకా ఎన్నో.. వీటిని సంరక్షించేందుకు నిత్యం పది మంది పనివారు. ఇక్కడ విదేశాల నుంచి తీసుకువచ్చిన కోళ్లు కూడా సందడి చేస్తాయి. ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు, విశేషాలు తెలుసుకుందామా మరి.. యరజర్లకు చెందిన టి.శ్రీనివాసరావు కోడి పుంజుల ఫాంను ఏర్పాటు చేశారు. ఇక్కడ పుంజులకు, బ్రీడర్లకు ప్రత్యేకంగా ఫాంలను ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా నున్నలోనూ పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లుగా స్వగ్రామం యరజర్లలోని తన మామిడి తోటను కోడి పుంజుల ఉత్పత్తి కేంద్రంగా మార్చేశారు. కుక్కుట శాస్త్రంలోనూ లేని విధంగా.. ఎన్నో మెళకువలు గుడ్డు పెట్టించటం మొదలుకొని పొదిగి పిల్ల తయారు, వాటి పెంపకం ...అన్ని దశల్లోనూ ఎన్నో మెళకువలు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం దగ్గర నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకూ ఎన్నో జాగ్రత్తలు అన్నీ...ఇన్నీ కావు స్పెషల్ మెనూ... ఇక్కడ కోడి పుంజులకూ బలవర్ధకమైన మెనూ ఉందండీ. బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుకలు, రసగుల్లాలు, రంగు రంగుల ద్రాక్షలు, కిస్ మిస్, నాటుకోడి గుడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది.. వాటికి పరగడపున మొదలుకొని సాయంత్రం వరకు మెనూ సమయాన్ని పాటిస్తారు. ప్రతి రోజూ 30 గ్రాముల లడ్డూ... ప్రతి రోజూ ఒక్కో పుంజుకు ఉదయం 30 గ్రాముల లడ్డూ పెడతారు. బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూరం, రెండు మూడు రకాల ఎండు ద్రాక్ష, సొంటి, సోంపు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, యాలుక్కాయలు, రసగుల్లలు, పిట్ట దంట్లు వీటన్నింటినీ కలిపి పచ్చడి బండపై రుబ్బు రోలుతో కచ్చపచ్చాగా నూరి సమపాళ్లలో తేనె వేసి లడ్డూలుగా తయారు చేస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే 30 గ్రాముల చొప్పున ఒక్కో పుంజుకు తినిపిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటల లోపు ఉడకబెట్టిన నాటుకోడి గుడ్డు ఇస్తారు. తర్వాత 30 గ్రాముల మటన్ కీమా.. ► మధ్యాహ్నం ఒక్కో పుంజుకు నానబెట్టిన 8 బాదం పప్పు. వాటితో పాటు ఎండు ద్రాక్షలు, కిస్మిస్ ఒక్కోదానికి 10, ఆవుపాలలో నాన బెట్టిన అంజూర్ను తినిపిస్తారు. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ను కూడా.. ► సాయంత్రం ధాన్యం, రాగులు, సజ్జలు, చిలకడ గుండ్లు, పిట్టగుండ్లు లాంటి వాటిని సరిపడా ఇస్తారు. కొత్త జాతులు... ఇతర దేశాల జాతులతో సంపర్కం ఇక్కడ రకరకాల కొత్త కోడి పుంజు జాతులను రూపొందిస్తున్నారు. భీమవరం కోడి పెట్ట జాతితో అరేబియా జాతి, ఆఫ్రికా జాతి, ఈము జాతి కోళ్లను సంపర్కం చేయించి మరీ కొత్త రకం జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ► అరేబియా జాతికి చెందిన పెట్టను రూ.70 వేలు వెచ్చించి మరీ ఇక్కడకు తెప్పించారు. ► రూ.3 లక్షల విలువచేసే భీమవరం జాతికి చెందిన సీతువా బ్రీడర్తో కూడా పిల్లల ఉత్పత్తి. ► ఈము పక్షితో భీమవరం జాతి బ్రీడర్ను సంక్రమింపజేసి కొత్త రకం జాతి ఉత్పత్తి చేశారు. ► ఆఫ్రికా రకం కోడి కాకి జాతి బ్రీడర్ పుంజుతో మరో రకం ఉత్పత్తి. ► అరేబియా జాతి మైల రకం కోడి ఉంది. ► తెల్ల కొక్కెర పెట్టతో ఇతర జాతుల ఉత్పత్తి ► ఇతర దేశాల జాతి పెట్టలతో దేశీరకం జాతులతో సంపర్కం చేయించి మరీ చురుకైన జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయుర్వేద మూలికలతో చేసిన నీళ్లు మూడు నెలలకొకసారి ఆయుర్వేద స్నానం కోడి పుంజుగా మూడు నెలల వయస్సు వచ్చే సరికి మొదటి ఆయుర్వేద స్నానం ప్రారంభిస్తారు. సాధారణంగా కోళ్లను నీటిలో వదలటం, ఈత కొట్టించటం సర్వసాధారణం. వాటితో పాటు శరీరం గట్టి పడటానికి, శరీరంలోని వృథా నీరు బయటకు పోవటానికి, ఉన్న కొవ్వు కరిగిపోవటానికి, శరీరం ‘‘వజ్రకాయం’’ కావటానికి దోహదపడేలా వాటిని తీర్చిదిద్దుతారు. అందుకే ఆయుర్వేద స్నానంతో పాటు స్టీమ్ బాత్ చేయిస్తారు. తొలుత 50 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో వెదురు ఆకు, వాయల ఆకు, నల్లతుమ్మ చెక్క, విప్ప పువ్వు, మోదుగు పువ్వు, పచ్చి పసుపు కొమ్ములు, మిరియాలు, స్ఫటిక, వాము, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం కలిపి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని 25 లీటర్ల వరకు వచ్చేలా మరిగించాలి. ఆ తరువాత కొంచెం చల్లనీళ్లలో కలిపి నులివెచ్చగా నీటిని తయారు చేసి ఆ నీటిలో పుంజును మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ నీటిలో ముంచిన గోనె సంచులను పిండి.. కింద ఒకటి, పైన ఒకటి గోనె సంచులు ఉంచి స్ట్రీమ్ బాత్లాగా వాటిని అందులో ఉంచాలి. ఆ పొగల్లో నుంచి పుంజు శరీరంలోని వృథా నీరు కాస్తా బయటకు వెళ్లిపోతాయి. అరగంట సేపు ఆదమరిచి ఆ పుంజులు సొమ్మసిల్లుతాయి. అరగంట తరువాత ఆ గోనె సంచుల నుంచి వాటిని విడదీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో ఉంచాలి. ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయుర్వేద స్నానం చేయిస్తారు. ఆ తరువాత మూడో రోజు షాంపూలతో స్నానం చేయించటం ఇలా ఎన్నో జాగ్రత్తలు. దీనిద్వారా శరీరంలో ఉన్న రుగ్మతలు కూడా దరిచేరవు. ఆరు నెలలపాటు ప్రత్యేక ర్యాక్లలో పెంచుతారు. వీటి కోసం ప్రత్యేక బెడ్లు, దోమ తెరలు ఉంటాయి. ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంపలో వీటిని ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుతారు. అనారోగ్యం పాలవకుండా మందులు ఇస్తారు. ప్రత్యేక టానిక్లు కూడా వేస్తుంటారు. అంతేకాదండోయ్ ప్రతి చెట్టుకూ సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఆసక్తితోనే పెంపకం.. కోళ్లపై చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తితోనే వీటిని పెంచుతున్నాను. వీటికి ఖరీదైన పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకుంటాం. పుంజులు, పెట్టలను విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. విదేశాల నుంచి అరుదైన జాతులను తీసుకువచ్చి క్రాస్ బీడింగ్ చేస్తున్నాం. పాముల నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా వలలను కూడా ఏర్పాటు చేశాం. – టీ శ్రీనివాసరావు, యర్లజర్ల - పట్నాల రవిచంద్ర, ఒంగోలు డెస్క్ ఫోటోలు: ఎం ప్రసాద్ -
Telangana: కొత్తగా 15 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 5,427 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 15 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. -
కొత్తగా ఐదు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 5,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఐదుగురు వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 60 మంది ఐసోలేషన్ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బుధవారం 3,944 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో బూస్టర్ డోసు 3,276 మందికి వేయగా, రెండో డోసు 427 మందికి, మొదటి డోసు 241 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. -
Telangana: కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 6,408 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 14 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 64 మంది ఐసోలేషన్ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో సోమవారం 1,857 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు.అందులో బూస్టర్ డోసు 1,448 మందికి వేయగా, రెండోడోసు 237 మంది, మొదటి డోసు 172 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. -
Telangana: కొత్తగా ఆరు కరోనా కేసుల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 6,587 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో ఆరుగురు వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో ఎనిమిది మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 69 మంది ఐసోలేషన్ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో గురువారం 4,411 మంది కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో బూస్టర్ డోసును 3,635 మంది, రెండో డోసును 453 మంది, మొదటి డోసును 323 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. రోజురోజుకూ బూస్టర్ డోసు వేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. -
న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షల్లేవ్
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగలకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చైనా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఇక్కడ ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ప్రజలు వేడుకలు జరుపుకోవడానికి జంకాల్సిన అవసరం లేదంటూ ఆయన గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్లను మనం గతంలో సులువుగా ఎదుర్కొన్నామనీ దీంతో టెన్షన్పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీర్ఘకాలిక రోగులు, ఇతర హైరిస్క్ గ్రూప్లు మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇక ఆంక్షలు లేకుండా వేడుకలు కాగా, న్యూఇయర్ ఈవెంట్లను ఈసారి ఘనంగా నిర్వహించుకునేందుకు వెసులుబాటు కలిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా కొత్త సంవత్సర వేడుకలు జరగడం గమనార్హం. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫాంహౌస్లు, గేటెడ్కమ్యూనిటీ ఇళ్లు, రిసార్ట్లలో వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైగా డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
‘సంక్షేమ పాలన’కు టీడీపీ ఎంపీటీసీ స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల హృదయాలను సైతం కదిలిస్తున్నాయి. ఇందుకు విశాఖజిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం కాలనీలో మంగళవారం జరిగిన ఘటన అద్దం పడుతోంది. భీమునిపట్నం ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాపురం ఎస్సీ కాలనీలో నిర్వహించారు.తమ గడప ముందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను కొనియాడారు. –పద్మనాభం(విశాఖజిల్లా) -
Telangana: కొత్తగా 9 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 3,599 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 9 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో నలుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం 59 మంది ఐసొలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆదివారం 2,016 మంది కరోనా టీకా తీసుకున్నారు. వారిలో 1,523 మంది బూస్టర్ డోస్ టీకా తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.57 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల్లో మాత్రం 21,010 డోసులు ఉండగా, హైదరాబాద్ రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంలో 9.36 లక్షలున్నాయి. -
ప్రభుత్వ అధికారి అయితే.. కేసీఆర్ కాళ్ళు మొక్కవద్దా : DH. శ్రీనివాస రావు
-
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస రావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
కొవ్విరెడ్డితో సంబంధం లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తనది కేవలం రెండు గంటల పరిచయం మాత్రమేనని, అంతకుమించి ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని, మున్నూరు కాపు సంఘంలో తిరుగుతాడని, ఐపీఎస్ అని విన్నానని తెలిపారు. అంతేతప్ప తానెప్పుడూ ప్రత్యక్షంగా అతన్ని కలుసుకోలేదని అన్నారు. అయితే ఇటీవల అరెస్టుకు వారం రోజుల ముందు ధర్మేందర్ అనే వ్యక్తి ద్వారా ఫిల్మ్నగర్లో జరిగిన ఓ గెట్ టు గెదర్లో శ్రీనివాసరావును కలిశానని చెప్పారు. శ్రీనివాస్ మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ అని గర్వంగా ఫీలయ్యామని, అతడి భార్య కూడా ఐఏఎస్ అని చెప్పడంతో వారిని కలిసేందుకు ధర్మేందర్ ద్వారా వెళ్లామన్నారు. ఆ సందర్భంగానే ఫొటోలు దిగడం జరిగిందని తెలిపారు. తనను అతను ఎలాంటి పనులు అడగడం కానీ, తాను అతడిని అడగటం కానీ జరగలేదని అన్నారు. మరుసటి రోజు గంటపాటు మామూలుగా మాట్లాడామే తప్ప అంతకుమించి ఏమీ లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్ను అరెస్టు చేసిన సమయంలో అతని ఫోన్లో తన ఫొటోలతో పాటు కాల్లిస్టులో పేరు ఉండటంతో విచారణకు పిలిచారని వివరించారు. తన బావ, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి సాయం అడిగాడని, దాంతో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఇప్పించాడని, ఆ డబ్బుల బకాయి ఇంకా ఉందని చెప్పారు. శ్రీనివాస్తో తామెలాంటి లావాదేవీలు జరపలేదని, సీబీఐ అధికారులకు ఇదే స్పష్టం చేశామని అన్నారు. -
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు గురించి విస్తుపోయే విషయాలు
-
Telangana: కొత్తగా 4 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 3,650 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో నలుగురికి కరోనా పాజిటివ్గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరిందన్నారు. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని సమర్థించుకున్నారు. ఒక్కసారి కాదు వందసార్లు బరాబర్ మొక్కుతానని అన్నారు. ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వక్తిని ఎలా బలహీన పరచాలి? ఎలా దూరంచేయాలి? అనే కుట్రలు చేస్తున్నారంటూ ఆయనను నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమిషం వ్యవధిలోనే డీహెచ్ రెండు సార్లు కేసీఆర్కు పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: (కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!) -
కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన ప్రవర్తనను పలువురు సీనియర్ అధికారులు తప్పుబడుతున్నారు. పదవుల కోసం ఇంతగా దిగజారతారా అంటూ ఆక్షేపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్కు పాద నమస్కారం చేశారు. అక్కడితో ఆగకుండా మరోసారి ముఖ్యమంత్రి కాళ్లుమొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనివాసరావు వ్యవహార శైలిని పలువురు అధికారులు ఆక్షేపించారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పరువు తీస్తున్నారు: ఆకునూరి మురళి శ్రీనివాసరావు కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్ కోసమే కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ‘మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూశాను టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నార’ని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. కేసీఆర్కు శ్రీనివాసరావు కాళ్లు మొక్కిన వీడియోను కూడా షేర్ చేశారు. శ్రీనివాసరావు కోరిక నెరవేరుతుందా? టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డాక్టర్ శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్టింగ్లకే టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కోరిక ఫలిస్తుందో, లేదో చూడాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. (క్లిక్ చేయండి: శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన) -
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ మేరకు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ప్రారంభించడంపై సీఎంకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ... సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ ఒకేసారి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ జాతిపితగా సుపరిపాలనతో చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. -
పోలీస్ అభ్యర్థులకు ‘అప్లోడ్’ కష్టాలు!
►కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్వాసి గణేశ్కు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లలో ఒకటి, రెండో తరగతివి లేవు. అందుకోసం తహసీల్దార్ నుంచి స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే వీటిని ఆన్లైన్లో అప్లోడ్చేయవచ్చో? లేదోననే సందేహం తలెత్తింది. ►రమేశ్ అనే టీఎస్ఎస్పీ ప్రొబెషనరీ కానిస్టేబుల్ గతేడాది జూలై 25న సర్వీసులో చేరారు. కానీ, అతన్ని టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం లేదు. అతని బ్యాచ్లో ఉన్న దాదాపు 3,800 మందికి ఇదే సమస్య ఎదురవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్ పీఆర్బీ) ఎస్సై, కానిస్టేబుళ్ల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైనవారు పార్ట్–2 ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు రోజుకో రకం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికెట్లు తప్పనిసరి అని, వాటిలో ఏదైనా లేకుంటే స్థానిక తహసీల్దార్ ధ్రువీకరించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ సరిపోతుందని ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’తో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని సందేహాలు, అనుమానాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి. అవేంటంటే.? ►పార్ట్–2 కోసం ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల అప్లోడ్ తప్పనిసరి. ఈ క్రమంలో గుర్తింపులేని స్కూళ్లలో చదివిన కొందరు అభ్యర్థులు ఆ విద్యా సంవత్సరాలకు ముందుగానే స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ జారీ చేసిన స్టడీ/గ్యాప్ సర్టిఫికెట్లను, తమ వద్ద ఉన్న స్టడీ సర్టిఫికెట్లతో కలిపి అప్లోడ్ చేయవచ్చా? లేక ఏడేళ్లకు రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలా? అన్న సందేహంలో వీరు ఉండిపోయారు. ►2021 జూలై 25వ తేదీన టీఎస్ఎస్పీలో సుమారు 3,800 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో చాలామంది ఇటీవల టీఎస్ఎల్ పీఆర్బీ నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యారు. ఇప్పుడు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తు నింపే క్రమంలో మీరు ప్రభుత్వ ఉద్యోగా? అన్న కాలమ్లో వీరు ఎస్ అని సమాధానం ఇస్తున్నారు. సర్వీసులో ఎప్పుడు చేరారు? అన్న ప్రశ్నకు సమాధానంగా 25–07–2021 అని పొందుపరిస్తే దరఖాస్తులో ఎర్రర్ చూపిస్తోంది. అక్కడ నుంచి దరఖాస్తు ముందుకు కదలడం లేదు. పోనీ ఆ కాలమ్ని వదిలేద్దామా? అంటే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ►ప్రొబెషనరీలో ఉన్న పోలీసులు సర్వీసు సర్టిఫికెట్లు పెట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నారు. 24 గంటల్లో పరిష్కరిస్తాం పార్ట్–2లో దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ రెసిడెన్స్/స్టడీ సర్టిఫికెట్లు, అందుబాటులో ఉన్న పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్లో వీటిని మరోసారి నిర్ధారిస్తాం. గతేడాది డిపార్ట్మెంట్లో చేరిన టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు దరఖాస్తు తీసుకోకపోవడంపై సాంకేతిక సిబ్బందితో మాట్లాడి 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తాం. సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే అభ్యర్థులకు అది ఎంతో మేలు చేస్తుంది. ఒక్క పోలీసుశాఖే కాదు, ఇతర ఏ శాఖ ఉద్యోగులకైనా దానివల్ల దాదాపు ఐదేళ్ల వయసు మినహాయింపు దక్కుతుందని మర్చిపోవద్దు. – శ్రీనివాసరావు, చైర్మన్, టీఎస్ఎల్ పీఆర్బీ -
కొత్త వివాదంలో హెల్త్ డైరెక్టర్.. బతుకమ్మ ముందు డీజే టిల్లు పాటకు స్టెప్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాపరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఓ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ సంసృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్సు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీనివాసరావు డ్యాన్స్ వ్యవమారం తాజాగా చర్చనీయంశంగా మారింది. కాగా హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
డీజే టిల్లు సాంగ్కు స్టెప్పులేసిన హెల్త్ డైరెక్టర్
-
లిక్కర్ స్కామ్తో మరొకరికి లింక్!
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్ మొత్తం హైదరాబాద్ నుంచే జరిగినట్టు సీబీఐకి స్పష్టమైన ఆధారాలు లభించడంతో, మనీలాండరింగ్ సైతం ఇక్కడినుంచే జరిగినట్టు భావిస్తున్న ఈడీ విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్ లింకులను ఛేదించే పనిలో పడింది. మొదట్లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై వరకే ఉందని భావించినా..తర్వాత బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్సాగర్రావు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆడిటర్ బుచ్చిబాబు పేరుతో పాటు రాబిన్ డిస్టిలరీ, మరో ఎనిమిది కంపెనీలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు, సోదాలు కొనసాగిస్తున్న ఈడీ బృందాలు సోమవారం వెన్నమనేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించడం కేసులో పెద్ద మలుపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలతో ఈ కేసులో పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్న ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వెన్నమనేని శ్రీనివాసరావు విచా రణలో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దగ్గరి బంధువుకు లింకులు ఇరవై ఏళ్లుగా లిక్కర్, పబ్ల వ్యాపారాల్లో ఉన్న శ్రీనివాసరావు దగ్గరి బంధువుకు ఈ స్కామ్లో లింకులున్నట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఆ వ్యక్తికి శ్రీనివాసరావు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఎవరో అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో లిక్కర్ మార్టుల ఏర్పాటులో ఆయన హస్తం కూడా ఉందా? ఆయనకు సంబంధించిన డబ్బు ఏమైనా శ్రీనివాసరావు ద్వారా ఢిల్లీ వెళ్లిందా అన్న కోణంలో ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని సోదాలు, నోటీసులు? ఇప్పటివరకు నాలుగు సార్లు జరిపిన సోదాలు, విచారణలు, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరికొంత మంది కీలక వ్యాపారులు, నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాలని ఈడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పెన్డ్రైవ్లు, మెయిల్స్, సిగ్నల్.. వాట్సాప్ యాప్ల నుంచి రిట్రీవ్ చేసిన సందేశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి పలువురికి నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. దీంతో ఈ స్కామ్ ఎటు తిరిగి ఎవరికి చుట్టుకుంటుందోనన్న జరుగుతోంది. -
Telangana: కొత్తగా 114 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 10,804 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరింది. ఒక రోజులో 130 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 8.31 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 792 క్రియాశీలక కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
Telangana: కొత్తగా 88 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 7,938 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 88 మంది వైరస్ బారిన పడ్డారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 102 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.30 లక్షలకు చేరింది. ప్రస్తుతం 874 క్రియాశీలక కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
కు.ని. మరణాలపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీపీఎల్ ఆపరేషన్ల ఘటనపై విచారణ అత్యంత పారదర్శ కంగా చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంసంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే తుది నివేదికను రూపొందించనున్నట్లు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తొలిసారిగా ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయా రని, ఇది అత్యంత బాధాకరమని అన్నా రు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, సర్జరీలు నిర్వహించిన ఆస్పత్రి వైద్య విధాన పరి షత్ పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం, ఆ రెండు విభాగాలకు కాకుండా ప్రజారోగ్య విభాగానికి విచారణ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నా రు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చికిత్స చేసిన వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు. స్టెరిలైజేషన్లో జరిగిన లోపాల వల్లే బాధి తులు ఇన్ఫెక్షన్కు గురైనట్లు ప్రాథమికంగా భావి స్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆ నివేదికను మీడియాకు సైతం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కమిషనర్ను ఆదేశించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపులో చికిత్స చేయించు కున్న మిగతా వారిని నిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వివ రించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ వైద్యాధికారులను నియమించిందని, చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉండగా, ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతావారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
కు.ని. ఆపరేషన్లపై పారదర్శకంగా విచారిస్తాం
ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనలో ప్రభుత్వానికి 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని నిపుణుల కమిటీ విచారణాధికారి, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శుక్రవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కు.ని. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ ఆస్పత్రిలో 5 క్యాంపులు నిర్వహించగా గత నెల 25న జరిగిన ఆపరేషన్లు వికటించాయన్నారు. ఇక్కడ ఆపరేషన్లు చేసిన వైద్యులు ఆ మరుసటి రోజు చేవెళ్లలో 60 మందికి, సూర్యాపేటలో 100 మందికి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలే దన్నారు. ఆరోజు ఆపరేషన్లు చేసుకున్న మరో 30 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందన్నారు. నిమ్స్ నుంచి ఐదుగురిని, అపోలో నుంచి ఆరుగురిని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని విచారిస్తున్నామని.. పోస్టు మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25 మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్) -
కానిస్టేబుల్ పరీక్షకు 91.34% హాజరు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని 15644 సివిల్ కానిస్టేబుల్, అబ్కారీ శాఖలోని 614 పోస్టులు, రవాణా శాఖలోని 63 పోస్టులకు రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్తో పాటు 38 ప్రధాన పట్టణాల్లోని 1601 పరీక్ష కేంద్రాల్లో 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 6,6,1198 మంది అభ్యర్థుల్లో 91.34 శాతం మంది పరీక్ష రాసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సహా ఫొటోలు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నపత్రం కీ పేపర్ను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ఆ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ షీట్పై అభ్యర్థులు ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్ను తప్పనిసరిగా సరైన విధానంలో వేయాలని, బుక్లెట్ కోడ్ను రాయకపోయినా, సరైన పద్ధతిలో నమోదు చేయకపోయినా మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో జ్వర సర్వే
సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేపట్టినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రాంతాలను నాలుగు భౌగోళిక ప్రాంతాలుగా విభజించామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షించారని తెలిపారు. ‘‘పారిశుధ్య కార్యకలాపాలను వేగవంతం చేయాలని, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. మందులు తగినంత నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సీజనల్ వ్యాధుల నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. యాంటీ లార్వా ఆపరేషన్లు, డెంగీ, మలేరియాను గుర్తించడానికి ఏర్పాట్లు చేశాం. 297 హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహించేందుకు 670 మంది అదనపు ఆరోగ్య సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాం. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేశాం. సహాయక శిబిరాల వద్ద ఆరోగ్య శిబిరాలతో పాటు, గ్రామస్థాయి ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తాం. అన్ని ఇళ్లకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటలు పనిచేసేలా వార్ రూంలను ఏర్పాటు చేశాం. వరద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 64,230 మందికి వివిధ రకాల వైద్య చికిత్సలు చేశాం. అందులో మంగళవారం ఒక్క రోజే 18,558 మందికి వైద్య సాయం అందజేశాం’’ అని శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు. -
Telangana: కొత్తగా 540 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 25,585 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 540 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.10 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 708 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,481 క్రియాశీలక కేసులున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బులెటిన్లో వెల్లడించారు. -
మంకీపాక్స్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్/గాంధీఆస్పత్రి: దేశంలోకి మంకీపాక్స్ ప్రవేశించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపారు. మంకీపాక్స్ పరీక్షించడానికి దేశంలో 15 ప్రయోగశాలలకు కేంద్రం అనుమతించగా అందులో రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి ప్రయోగశాలను గుర్తించిందన్నారు. మంకీపాక్స్పై 90302 27324కు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చని, నేరుగా మాట్లాడాలనుకునేవారు 040– 24651119 నెంబరుకు ఫోన్ చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. గాంధీలో మంకీపాక్స్ పరీక్షలు రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. -
జలుబు లాగే కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్ (వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందన్నారు. వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్నగర్లో 54, మేడ్చల్లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఒక్క జూన్లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జనవరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరేచనాల కేసులు 6 వేలు నమోదయ్యాయని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్ కేసులూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు. అన్ని సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా.. కరోనా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమానమున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. -
ఎస్ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7న
సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7వ తేదీన సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ విభాగం తదితర సమానహోదా పోస్టులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్ సివిల్, తదితర సమాన పోస్టులు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 554 సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులతోపాటు 15,644 సివిల్ తదితర సమాన కానిస్టేబుల్ పోస్టులు, 63 ట్రాన్స్పోర్టు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మొదటిదశలో భాగంగా రాతపరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 20 పట్టణాల్లో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆగస్టు 21న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ, 6.5 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవుతారని శ్రీనివాసరావు వెల్లడించారు. సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
నెలన్నర కీలకం.. అప్పటివరకు కరోనా కేసుల్లో పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఈ సమయంలోనే 66 శాతం కేసులు పెరిగాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. నెల నుంచి నెలన్నరపాటు కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటుందని హెచ్చరించారు. అప్పటివరకు ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో పెరుగుదల మహారాష్ట్రలో 145 శాతం, ఏపీలో 111 శాతం, కేరళలో 77 శాతం ఉందన్నారు. తెలంగాణలో గత వారంలో 355 కేసులు నమోదైతే, ఈ వారంలో 555 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 55 శాతం పెరుగుదల ఉందన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘దేశంలో పాజిటివిటీ రేటు 1.4 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు ఒక శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు పెరిగాయి. కరోనా కేసులు పెరుగు తున్నా ఆసుపత్రుల్లో రెండు మూడు కేసులు మాత్రమే ఉన్నాయి. రెండు నెలలుగా కరోనా మరణాలు సంభవించలేదు. కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరగడం వల్ల ప్రజల్లో యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్లోని సబ్ వేరియంట్ అయిన బీఏ.2 కేసులు 66 శాతం నమోదయ్యాయి. కొత్త వేరియంట్లు పుట్టలేదు కాబట్టి నాలుగో వేవ్ రాదని చెబుతున్నాం’ అని చెప్పారు. కరోనా ఇంకా అంతం కాలేదని, ఆరు నెలల నుంచి ఏడాది వరకు అప్పుడప్పుడు కేసుల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. తర్వాత అది ఎండెమిక్ (వైరస్ వ్యాప్తి తగ్గే) దశకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభం అవుతోం దని, సీజనల్ వ్యాధులు వస్తుంటాయని శ్రీనివా సరావు చెప్పారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ ఫ్లూలో గొంతులో గరగర, ముక్కుకారటం వంటివి ఉంటాయని, కోవిడ్లో అవే లక్షణాలతో జ్వరం, పొడిదగ్గు ఉంటా యన్నారు. కరోనాలో ఈ లక్షణా లు ఐదు రోజుల వరకు ఉంటాయని, అను మానముంటే ప్రజలు తక్షణమే పరీక్షలు చేయించు కోవాలని కోరారు. కరోనా నుంచి బయటపడా లంటే మాస్క్ తప్పనిసరని, అలాగే వ్యాక్సిన్ కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల 3 నుంచి ఇంటింటికీ కరోనా టీకా వేస్తున్నామన్నారు. త్వరలో పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని, 12–18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. అందుకోసం విద్యా సంస్థల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేస్తామ న్నారు. ఆన్లైన్ తరగతులు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు బూస్టర్ డోస్ వేస్తామన్నారు. ‘పిల్లల వ్యాక్సిన్లలో లక్షల్లో ఎక్కడో ఒక రియాక్షన్ వచ్చిందన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేకుండా టీకా వేయించాలి. 12 ఏళ్లలోపు వారికి కరోనా వచ్చే అవకాశాలు తక్కువ. వారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రాబోయే రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతాం. నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం. జీహెచ్ఎంసీలో జనసాంద్రత ఎక్కువ కాబట్టి ఇక్కడ క్రియాశీలక కేసులు ఎక్కువగా ఉన్నాయి. కేసులు ఎక్కువైతే మాస్క్లు పెట్టుకోనివారికి జరిమానాలు విధిస్తారు’ అని చెప్పారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి రెండు శాతం శాంపిళ్లు తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నామన్నారు. ఇటీవల 527 శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా, అందులో 65 శాతం బీఏ.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నమోదైందన్నారు. ఈసారి డెంగీ దడ 2019లో రాష్ట్రంలో డెంగీ కేసులు అధికమొత్తంలో నమోదు అయ్యాయని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోందని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నా యన్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 158 డెంగీ కేసులు నమోదయ్యాయని, అందులో ఏప్రిల్, మే నెలల్లోనే వంద కేసులు రికార్డు అయ్యాయన్నారు. మురికి వాడల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడ 150 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 వేల మంది శాంపిళ్లకు డెంగీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో పెద్దగా డెంగీ ప్రభావం లేదన్నారు. పగటి దోమ వల్ల డెంగీ కేసులు పెరుగుతాయని, కాబట్టి నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తమ అంచనా ప్రకారం ఈసారి డెంగీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. హైదరాబాద్లో చెరువులు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్నందున దోమలు వృద్ధి చెందాయని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని, వాటిల్లో 15 భవనాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. చదవండి: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు! -
‘అసామాన్యుడు’.. రిక్షా కార్మికుడి కుటుంబంలో పుట్టి.. బట్టల షాపులో పనిచేస్తూ..
సాక్షి, ఖమ్మం లీగల్ : ఇంట్లో మగపిల్లాడు పుట్టగానే సంతోషపడే వారున్నారు. కానీ ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తేనే తల్లిదండ్రులకు అసలైన సంతోషమన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం రిక్షా కార్మికుడైన ఓ వ్యక్తి విషయంలో అక్షరాలా నిజమైంది. రిక్షా నడుపుకునే వ్యక్తి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపించగా... ఆ కుమారుడు ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై తన తండ్రికి పుత్రోత్సాహం కలిగించాడు.. నలుగురితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు. మా కుటుంబం పేదరికంలో ఉంది. మాకు సరైన వనరులు లేవు. అందుకే చదువుకోలేకపోయాం.. జీవితంలో సాధించలేకపోయాం అని బాధపడే ఎందరో యువతకు న్యాయమూర్తి జీవితం, ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పనిచేస్తూనే చదువు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో జల్లయ్య – నాగమ్మ దంపతులకు శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా, తల్లి నాగమ్మ సాధారణ గృహిణి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాక, పదో తరగతి చదువుతున్నప్పుడు జాతీయ పర్వదినాల్లో ప్రముఖులు జాతీయ జెండా ఎగురవేయడం చూసిన ఆయన తాను కూడా జాతీయజెండా ఎగురవేసే స్థాయికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఒక బట్టల షాపులో పనికి కుదిరాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా ఒకవైపు పనిచేస్తూనే.. మరోపక్క చదువుకుంటూ అత్యధిక మార్కులతో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఆయన న్యాయశాఖపై దృష్టి సారించారు. ఒక న్యాయమూర్తిగా న్యాయార్థులకు సేవలు అందించవచ్చని, అక్రమార్కులను శిక్షించవచ్చని భావించిన శ్రీనివాసరావు న్యాయశాస్త్ర పట్టా పొంది 1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. వృత్తిలో రాణిస్తూనే 2005లో మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. ఆత్మసంతృప్తికి తావ్వివక.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించామనో, వ్యాపారంలో రాణించామనో ఓ స్థాయికి చేరుకున్నాక సంతృప్తి పడతారు. అయితే శ్రీనివాసరావు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. న్యాయమూర్తిగా తన విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే న్యాయపాలన, వివిధ దేశాల చట్టాలు తదితర అంశాలపై తులనాత్మక అధ్యయనం చేశారు. 2007 నుంచి 2017 వరకు 52 అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ‘సత్వర న్యాయం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన రాసిన వ్యాసాలు అనేక ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితం కావడం విశేషం. అంతేకాకుండా ‘మోరాలిటీ ఇన్ లీగల్ సిస్టమ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సంచలనాత్మక కేసుల్లో తీర్పులు హైదరాబాద్లో సెషన్స్ జడ్జిగా పనిచేసిన కాలంలో శ్రీనివాసరావు ఎన్నో సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు. గోకుల్చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటు పాస్పోర్ట్ ఆఫీస్లో పేలుళ్లు, అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి తదితర సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు శ్రీనివాసరావు. కాగా, ఉగ్రవాద సంబంధ కేసుల్లో తీర్పులు ఇచ్చిన ఆయన భద్రత కోసం ప్రభుత్వం అంగరక్షకులను నియమించింది. న్యాయశాస్త్రంలో చివరి అంచులను చూసి డాక్టరేట్ పట్టా పొంది జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నా ఆయన సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రీనివాసరావు వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాక సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఖమ్మంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వడం ప్రారంభించిన ఆయన, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు పూనుకున్నారు. కాగా, సమస్య ఎవరిదైనా తన పరిధిలో ఉంటే సకా రాత్మక ధోరణిలో పరిశీలించే శ్రీనివాసరావు, కేసుల సత్వర పరిష్కారంలో జిల్లాను ఆగ్రస్థానంలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
పీహెచ్సీల్లో ఆరోగ్యశ్రీ
వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు. వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. -
పోలీసు ఉద్యోగాలకు.. లక్ష మంది మహిళల దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు 4.5 లక్షల దరఖాçస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 4.5 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 23 శాతం అంటే ఒక లక్ష మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పురుషులు 77 శాతం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 6 శాతం ఓపెన్ కేటగిరీ, 53 శాతం బీసీ, 22 శాతం ఎస్సీ, 19 శాతం ఎస్టీ అభ్యర్థులున్నట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు మూడు వంతుల్లో దాదాపు రెండు వంతుల మంది పరీక్ష మాధ్యమం తెలుగు మీడియం ఎంచుకున్నారని, ఒక వంతు ఇంగ్లిష్ మీడియం, 0.2 శాతం ఉర్దూ మాధ్యమం ఎంచుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల దరఖాస్తులకు మరో వారం మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేయడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. కాగా, ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు సమయం ఉన్న సంగతి తెలిసిందే. -
‘రెవెన్యూ’కు 250 ఏళ్లు
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యవసాయాదాయం పెంచుకునే ఇతర రంగాలను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ కాలాల్లోని రాజ్యాల ప్రధాన వనరు అయిన భూమిశిస్తును వసూలు చేసింది సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులే. అంటే దేశంలో అతి పురాతన శాఖ రెవెన్యూ శాఖే. అయితే ఆధునిక రెవెన్యూ శాఖ సృష్టి, రూపురేఖలన్నీ బ్రిటిష్ రాజ్ కాలంలోనే సంతరించుకున్నాయి. బ్రిటిష్ వలస పాలనలో స్థాపితమైన అనేక వ్యవస్థలూ, చట్టాలూ కొన్ని యథాతథం గానూ, కొన్ని మార్పు చేర్పుల తోనూ ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆ కాలంలో పురుడుపోసుకున్నదే. ప్లాసీ యుద్ధం (1757) భారత దేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు వీలుకల్పించింది. బక్సార్ యుద్ధం (1764) ఆంగ్లేయుల అధికారాన్ని పటిష్ఠపరచింది. ఆ యుద్ధం తరువాత జరిగిన అలహా బాద్ సంధి ద్వారా మొగల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్, బిహార్, ఒరిస్సా, సుబాలలో దివానీ (శిస్తు వసూలు చేసుకునే) అధికారం పొందారు. ఉత్తర భారతంలో 1765 నుండి 1772 వరకు, అలాగే కర్ణాటక యుద్ధాలు విజయాల తరువాత దక్షిణాదిన కూడా బ్రిటిష్వాళ్లు శిస్తు వసూలుకు వివిధ పద్ధతులను పాటించారు. బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772 మే 14న భూమిశిస్తు వసూలుకు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ను నియమించారు. అంటే కలెక్ట్టర్ ఉద్యోగ సృష్టి జరిగి మే 14 నాటికి 250 ఏళ్ళు పూర్తవుతుందన్న మాట! బెంగాల్ మొత్తంలో శిస్తు వసూలును పర్య వేక్షించడానికి ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ గవర్నర్ ఆధ్వ ర్యంలో ఏర్పాటయింది. తరువాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చిన కారన్ వాలీస్ ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ను సంస్కరించి, అన్ని బ్రిటిష్ ప్రావిన్స్ల లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మద్రాస్ ప్రావిన్స్లో ఏర్పడిన ఈ వ్యవస్థ 1977లో íసీఎల్ఆర్ శాఖ ఏర్పాటు వరకూ కొనసాగింది. ప్రస్తుతం దాని స్థానంలో సీసీఎల్ఏ 1999 నుంచి కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో రెవెన్యూ సిబ్బంది నెరవేర్చిన బాధ్యతలు మరువ లేనివి. జమిందార్లకు శిస్తు వసూలు అధికారాలను రద్దు చేస్తూ, సాగుచేసే వాడికి భూమిపై హక్కులు కల్పిస్తూ చేసిన ‘ఎస్టేట్ రద్దు చట్టం–1948’ను అమలు చేయడం, ప్రతి పేదోడికి భూమిపై హక్కులను గుర్తించడానికి చేసిన ‘సర్వే అండ్ సెటిల్మెంట్’లో రెవెన్యూ శాఖవారి సేవ జీతంతో కొలవలేనిది. అలాగే ‘ల్యాండ్ సీలింగ్ యాక్ట్’ అమలు, ‘మిగులు భూమి’ని అర్హులుకు పంపిణీ చేయడం వంటివన్నీ రెవెన్యూ వారిని మరింత ప్రజల మనుషులను చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంస్కరణ ఫలాలు పేదోడికి చేర్చిన ఘనత రెవెన్యూ శాఖదే! స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణా ళికలో ఎన్నో లక్ష్యాల కొరకు ఎంతో భూసేకరణ చేయవలసి వచ్చింది. రెవెన్యూశాఖే ఆ బాధ్యతను తలకెత్తుకొంది. దేశాభివృద్ధి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు – ఇరిగేషన్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు వంటి ఎన్నో నిర్మాణాలకు భూసేకరణ అనే మహా యజ్ఞం రెవెన్యూ శాఖతోనే జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు పథకం/ రీ సర్వే’ రెవెన్యూ శాఖ ద్వారానే జరుగుతోంది. పేదలందరికీ ఇళ్ళ పథకంలో 30 లక్షల పైగా ఇంటి పట్టాల పంపిణీకి భూసేకరణ అంతా రెవెన్యూ శాఖ చేతుల మీదుగానే జరిగింది. సంక్షేమ పథకాలలో అగ్రగామి అయిన నిత్యావసర వస్తువుల పంపిణీ రెవెన్యూ శాఖ భుజస్కంధాల పైనే నేటికీ నడుస్తోంది. తుపానులు, వరదలు అగ్ని ప్రమాదాల ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు రెవెన్యూ శాఖ పాత్రే ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటి సామా న్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ఎన్నో ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడమే కాక సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసేది రెవెన్యూ శాఖే! కోరాడ శ్రీనివాసరావు వ్యాసకర్త తహశీల్దారు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా ‘ 94410 08574 -
సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లుక్తో రైతు బజార్ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్ స్టోర్స్ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కంటైనర్ స్టోర్స్ను విస్తరిస్తామని చెప్పారు. -
‘నాలుగో వేవ్ చాన్స్ తక్కువే’
‘‘రాష్ట్రంలో 92.9% మందిలో యాంటీబాడీలు ఇప్పటికే వృద్ధిచెంది ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. నాలుగో వేవ్ ఉండే అవకాశాలు లేవనేది నా విశ్లేషణ. అయితే ఇది నిర్ధారణ అవడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఒకవేళ 6– 8 వారాల్లో కేసులు పెరిగినా.. అవి అతి స్వల్పంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది..’’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం తక్కువేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ‘‘గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలింది. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కులు, వ్యాక్సిన్ తప్పనిసరి కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఆంక్షలు అవసరం లేదని.. యధావిధిగా శుభకార్యాలు, ఇతర వేడుకలు జరుపుకోవచ్చని, కానీ గుంపుగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు. మే నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూరప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. -
మంచి మాట: అనుకూలతలు ఆరోగ్య హేతువులు
అధికశాతం మంది వారి వారి మనస్తత్వాల వల్లనే ఆనందం కోల్పోతున్నారు. ఒక చిన్న విషయాన్ని సైతం పదే పదే తలచుకోవడం వలన అది వారి ఆరోగ్య సమస్యపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయం వీరు గుర్తించటం లేదు. కొద్దిపాటి ‘చిరుగు’ను వేలితో పెద్దగా చేస్తే, అది పెద్ద చిరుగు అవుతుంది. అలాగే ఆలోచనలు కూడా.. చిన్నపాటి సమస్య గురించి ‘అతి’గా ఆలోచిస్తే ఎంత అనర్థమో వీరు ఆలోచించలేరు. దైనందిన జీవితంలో, జీవన విధానంలో, ఎవరో ఏదో అన్నారని, ఆ మాటలకు పెడర్థాలు తీస్తూ, అదే పనిగా ‘కుమిలి’ పోవడం ఎంత నష్టమో వీరు ఆలోచించలేరు. ఏ విషయాన్నైనా మనస్సులో పెట్టుకోవడం వలన, అది వారి వారి అంగరంగాలనే దహింపజేస్తుంది. లోకంలో ఉన్నవారు, వారి వారి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటుంటాయి.మన ఐదు వేళ్ళే ‘సమంగా’ లేవు. కొంతమంది తమ ‘అసూయ’ను లోపల మింగలేక, ఏదో ఒక సూటి పోటి మాట విసిరి ‘స్వ ఆనందం’ పొందుతారు. అంతటితో ఆ మాట అన్నవారి మనస్సు ‘శాంతం’ పొందవచ్చు. ధానం జారితే తీసుకోవచ్చు.. మాట జారితే తీసుకోలేము. అనే జ్ఞానం లేకుండా ఉంటుంది అటువంటి వారి ప్రవర్తన. ఇటువంటి, మనస్సు నొచ్చుకునేలా చేసే వారికి, ఎంత దూరం పాటించినా, వారే చొచ్చుకు వచ్చి, ఒక కుళ్ళు పదాన్ని విసిరి పోతుంటారు. అయితే ఆ మాట స్వీకరించి, దానిని తేలికగా తీసుకోకపోవడం అనర్థమే.. అది మానసిక సమస్యనే. అన్ని వ్యాధులకు మందు ఉంది. మానసిక వ్యాధికి మందు లేదు. సున్నిత మనస్కులు, అననుకూల దృక్పథం ఉన్న వారే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. అదీ అనుకూలం దృృక్పధం ఉన్నవారు అతి తేలికగా తీసుకుంటారు. మన సమాజంలో మాట పట్టింపులు ఎక్కువ. ఎవరో ఏదో అన్నారని, ఆ మాటల గురించి పదే పదే ఆలోచించే వారిని ‘నిద్రలేమి’ పట్టి పీడిస్తుంది. అనవసర వాక్కుల గురించి అతిగా ఆలోచిస్తూ, అదేపనిగా లోలోపల కుమిలిపోతూ మనస్సును ‘రొచ్చు’ చేసుకోవడం అవసరమా? ఇలా, అననుకూల దృక్పథం గల వ్యక్తులను ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు సైతం మార్చలేవేమో! అయితే ఇటువంటి సున్నిత మనస్తత్వం గల వారి వలన కుటుంబ వ్యవస్థ అతి తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యక్తుల మనశ్శాంతులను సైతం దహించడానికి కారణం, ఇటువంటి సున్నిత మనస్కుల ‘అతి’ ఆలోచనలే! ఏదైనా ఒక వ్యాపకం అలవరచుకోవాలి. అనుకూల దృక్పథం గల రచనలను అభ్యసించాలి. అయితే ఇక్కడ దురదృష్టకర విషయమేమిటంటే, నేడు సామాజిక మాధ్యమాలలో, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ వింటున్నా, చూస్తున్నా అది అంతవరకే. అననుకూల దృక్ప«థం, అతి అననుకూల ఆలోచనలూ ఉన్నవారిని ఎటువంటి ఉపోద్ఘాతాలూ సంస్కరించలేవేమో! అన్పిస్తుంది. వాస్తవానికి సున్నిత మనస్కుల హృదయం ‘బోళా’ గా ఉంటుంది. వీరు ఆనందం వచ్చినా, దుఃఖం కలిగినా తట్టుకోలేరు. చాలామందికి, మానసిక చికిత్స చేయించవలసిన పరిస్థితి. అదేసనిగా, తీవ్ర ఆలోచనలు చేయడం వల్లనే ఇటువంటి విపత్కర సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఆనందం ఆహ్లాదం మన చేతికందే సమీసంలోనున్నా, అందుకోలేరు ఆ వ్యక్తులు. కుటుంబ వ్యవస్థలో, ఇటువంటి మనస్కులను అతి సున్నితంగా చూసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ‘రక్తపోటు’ తీవ్రస్థాయికి చేరి, ఏదేదో మాట్లాడుతుంటారు. ఘర్షణ పూరిత వాతావరణంలోకి చేరుకునేలా... అటువంటి సమయంలో ఎదుటి వారు ‘మౌనంగా’ ఉండటం శ్రేయస్కరం.. కొద్దిసేపటి తర్వాత, సహజంగా ప్రశాంతత నెలకొంటుంది. పరుల గురించి ‘అతిగా ఆలోచించేవారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. తన గురించి ఆ ఇతరులు ఆలోచించటం లేదని! ప్రతి విషయానికి ప్రతిస్పందించటం మంచిది కాదు. కొద్దినిముషాలు కళ్ళు మూసుకుని, ధ్యానంలో నిమగ్నమైతే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇటువంటి సుభాషితాలు అనంతంగా విన్నా, చదివినా షరామామూలే.. అన్నట్టు వారి ప్రవర్తన మార్చలేని విధంగా ఉంటుంది. ఆలోచనలను మంచి పనులకు వినియోగించాలి. ఎదుటి వారి మాటలు అనుకూల దృక్పథంతో వున్నా కూడా, ఆ మాటల్లో రంధ్రాన్వేషణ చేస్తే మరీ ప్రమాదం. ‘నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే’ అనే విషయం విస్మరిస్తేనే ఇటువంటి జాడ్యాలు పట్టి పీడిస్తుంటాయి. రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇంకా ప్రజా జీవితంలో ఉండే వారి మీద ఎన్నో వ్యతిరేక, ఇంకా ‘చెడు’ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ వారు పట్టించుకుంటే అటువంటి వారు ‘సెలబ్రిటీ’లుగా కొనసాగలేరు. ఎవరైనా ఏదైనా సందర్భంలో ‘ప్రతిస్పందిస్తే’ మరింతగా ‘ఎదురుదాడు’లను నెటిజన్ల నుంచి ఎదుర్కొనవలసి ఉంటుంది. అందుకే వ్యక్తిగత ఆనందాలను కోల్పోకుండా వుండాలంటే ‘లోకులు పలుకాకులు’ అనే సూక్తి ప్రకారం అతిగా ఆలోచనలు పెట్టుకోకుండా ఉండటం, వారి వారి ఆరోగ్యాలకే క్షేమదాయకం. ఆనందాలను దూరం చేసుకోకుండా తోటలో విరబూసిన పువ్వులను గుర్తు చేసుకోండి. అవి ఎలా ఎల్లవేళలా మందహాసం చేస్తుంటాయో! ఆ పువ్వునే మీకు ఎందుకు ఆదర్శం కాకూడదు! ఆలోచించండి!! – పంతంగి శ్రీనివాసరావు -
హెల్త్ డైరెక్టర్ పూజ వివాదాస్పదం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సుజాత నగర్/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పాత అంజనాపురం పంచాయతీ పరిధిలోని చిమ్నతండాలో నిర్వహించిన ప్రత్యంగిర పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు పాల్గొనడం వివాదాస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి.. లంబాడీల కులదైవం ప్రత్యంగిర అమ్మవారి భక్తురాలు. భర్త శ్రీరాం, కుటుంబసభ్యులతో కలిసి గత రెండేళ్లుగా తమ ఇంటివద్ద ప్రతిరోజూ హోమాలు, ప్రతి శుక్రవారం గోపూజ, మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 మధ్య రాహుకేతు పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిదిగా భావించే ముక్కుపుడక, మెడలో పూలదండ ధరించి ‘ప్రత్యంగిర.. ప్రత్యంగిర.. ప్రత్యంగిర..’ మంత్రోచ్ఛారణతో నిత్యం గంట పాటు హోమం చేస్తున్నారు. అయితే హోమగుండంలో ఎండుమిర్చి వేస్తే ఘాటు రావడం లేదని, ఇది ప్రత్యంగిర అమ్మవారి మహిమ అని స్థానికులు చెప్పుకుంటున్నారు. అనేక మంది భక్తులు వచ్చి ఆ పూజలో పాల్గొంటున్నారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు తదితర ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 5న జిల్లా పర్యటనలో ఉన్న శ్రీనివాసరావు ఈ పూజలో పాల్గొనడంతో విజయలక్ష్మి నిర్వహించే ప్రత్యంగిర పూజ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. కుమారుడి గుండె జబ్బు తగ్గిపోయిందని.. స్థానికుల కథనం ప్రకారం.. విజయలక్ష్మి, శ్రీరాం దంపతులకు సుమంత్, 18 ఏళ్ల చరణ్ కుమారులు. మూడేళ్ల క్రితం చరణ్ గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఉన్న ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకున్న ఆ కుటుంబం తమ కులదైవానికి మొక్కుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ లేకుండానే చరణ్ గుండె జబ్బు తగ్గిపోయిందని, మందులూ వాడనవసరం లేదని వైద్యు లు చెప్పారని, ఇదంతా తమ కులదైవమే చేసిందని ఆ కుటుంబం నమ్మింది. రెండేళ్ల నుండి చిమ్నతండాలో తమ ఇంటి వద్ద పూజలు ప్రారంభించింది. ఆహ్వానం మేరకే డీహెచ్ హాజరు! జిల్లాకు చెందిన డీహెచ్ శ్రీనివాసరావు ఇటీవల మరణించిన తన తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నెల 24న పాల్వంచలోనూ ఈ తరహా శిబిరం నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన, నిరుపేద విద్యార్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈనెల 5న జిల్లా కేంద్రానికి వచ్చారు. మధ్యా హ్నం 2:30 గంటలకు సుజాతనగర్ వెళ్లిన డీహెచ్ మెడలో పూలమాల వేసుకుని అక్కడ విజయలక్ష్మి నిర్వహించిన ప్రత్యంగిర పూజలో పాల్గొన్నారు. ఆయన్ను తానే ఆహ్వానించానని, తాను చేస్తున్నవి క్షుద్ర పూజలు కావని ఆమె ‘సాక్షి’కి చెప్పారు. ప్రశాంతత కోసమే గ్రామానికి.. తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్వయం ప్రకటిత దేవతతో తనకు సంబంధం లేదని, మూఢ నమ్మకాలను తాను విశ్వసించనని వివరించారు. తన తండ్రి స్ఫూర్తితో జీఎస్సాఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామాజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం సెలవుల్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రజారోగ్య సంచాలకునిగా ఉన్న తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏం ఉందన్నారు. మెగా హెల్త్క్యాంపు ఏర్పాట్లలో భాగంలోనే గత కొంత కాలంగా కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. -
ఖమ్మంలో హెల్త్ డైరెక్టర్ వింత పూజలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు
సాక్షి, ఖమ్మం: తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు. కానీ స్వర్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని నొక్కి చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టనఖగా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదన్నారు. మెగ హెల్త్ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానన్నారు. ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. -
మాస్క్ ధరించడం చాయిసే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిందని ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ‘గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది ఇప్పుడు చాయిస్ మాత్రమే’అని స్పష్టం చేశారు. అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోనందున మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాస్క్లు ధరించాలని, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లినప్పుడు తప్పనిసరని పేర్కొన్నారు. ఇతరులు జనసమూహంలో ఉన్నప్పుడు ధరించాలని సూచించారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని, అయితే ఈ విషయం లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తు తం రోజుకు 40 కరోనా కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదన్నారు. ఆరేడు జిల్లాల్లో ఒక్కో కేసు, జీహెచ్ఎంసీలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 0.18 శాతం పాజిటివిటీ నమోదవుతోందని, ఇప్పటివరకు ఇదే అత్యల్పమని పేర్కొన్నారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఆ వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో వచ్చిపోయాయని అన్నా రు. ఈ ఏడాది చివరినాటికి కరోనా ఎండమిక్ దశకు చేరుకుంటుందని, ఏదో ఒక ప్రాంతానికి అది పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మనం తట్టుకోగలమన్నారు. వ్యాక్సిన్ వికటించి ఒకరు మృతి 18 ఏళ్లుపైబడిన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 12–14 ఏళ్ల వయస్సు పిల్లల వ్యాక్సినేషన్లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టామని, ఈ రెండు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయని, యాజమాన్యాల నుంచి అనుమతి రావడంలేదన్నారు. ప్రతీ తొమ్మిది నెలలకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు 50 నుంచి 60 శాతం వరకు వర్క్ఫ్రం హోం ఎత్తేశాయని, మిగిలినవి కూడా ఇదే పద్ధతిని పాటించాలని కోరారు. 12–14 ఏళ్ల పాపకు వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్డెడ్ అయిన సంఘటనపై డాక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ, టీకాకు, దానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వయస్సు వారిలో 7 లక్షలకుపైగా టీకాలు వేస్తే, ఎవరికీ ఏమీ కాలేదన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల టీకా డోసులు వేస్తే, రాష్ట్రంలో ఒకరు చనిపోయారని, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. టిమ్స్ ఆసుపత్రిని ఎత్తేయడంలేదని, అక్కడ సాధారణ ఓపీ కొనసాగుతుందని, దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పెరిగిన ఎండల తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని, రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి ఆడేలా చూడాలని, అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించేవాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రోజుకు 4 లీటర్లకుపైగా నీరు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ తరచూ తీసుకోవాలన్నారు. ఈసారి ఎండలు తీవ్రంగానే ఉంటాయన్నారు. అన్ని ఆసుపత్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ పంపించామన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
యువకుడితో లవ్ ఎఫైర్.. భర్తకు తెలియడంతో..
సాక్షి, కశింకోట (విశాఖపట్నం): మండలంలోని మోసయ్యపేట శివారు గోకివానిపాలెంలో గురువారం వివాహిత సహా యువకుడు అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ గ్రామాల నుంచి బైక్పై వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి సమాచారం అందివ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి సీఐ జి.శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం.. గోకివానిపాలెంలో బుచ్చియ్యపేటకు చెందిన మజ్జి శ్రీనివాసరావు(25), కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన వివాహిత చెల్లపల్లి హేమలత(23) విగత జీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాసరావు చోడవరంలోని ఒక షోరూంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నారు. హేమలత గృహిణి. వీరు 2017లో చోడవరం కళాశాలలో చదివేవారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం, తరచుగా సెల్ఫోన్లో సంభాషిస్తున్న విషయం భర్త భాస్కరరావు, హేమలత తండ్రికి తెలియడంతో వారు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి శ్రీనివాసరావుతో బైక్పై గోకివానిపాలెం గ్రామం వద్ద చేరుకొని ఆత్మహత్యకు పాల్పడి విగత జీవులుగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: (దుబాయ్కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్చేసి..) -
మూడంతస్తుల మేడలో.. పావురాలతో 'ప్రేమలో'..
పావురం.. ప్రేమకు ప్రతిరూపం.. శాంతికి చిహ్నం. అటువంటి పావురాల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న ఆయన వాటి కోసం ఏకంగా ఓ ప్రేమ మందిరాన్నే నిర్మించాడు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా వాటిని చూసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మానికొండ గ్రామంలో పావురాలకు ఇల్లు కట్టిన ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు గురించి మీ కోసం ఈ కథనం. – సాక్షి, అమరావతి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గం అది. అక్కడ మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల నడుమ మూడంతస్తుల భవనం ఒకటి కనిసిస్తుంది. ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు. అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాలు సందడి చేస్తుంటాయి. పావురాల శత్రు ప్రాణులు కానీ, వాటి భక్షక ప్రాణులు కానీ ఆ భవనంలోకి ప్రవేశించలేవు. అంటే.. పిల్లి, డేగ వంటి జంతువులు బయటి నుంచి జొరబడకుండా ఇనుప కంచెతో కట్టుదిట్టమైన రక్షణ వలయం, ఆఖరికి దోమలు కూడా దూరకుండా దోమల మెష్ సైతం ఏర్పాటు చేసి ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నట్లే వాటికి కూడా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. 20 రకాల గింజలతో పావురాలకు వేళకు బలమైన ఆహారం, వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంటాయి. అంతేనా.. మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం తన ప్రేమ పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా వినిపిస్తున్నాడు పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావు. అరుదైన జాతులు.. 1,150కి పైగా పావురాలు పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన దాదాపు 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, బంగ్లాదేశ్, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. జెయింట్ హంగేరియన్, అమెరికన్ పాంకెయిన్స్, జాకోబిన్స్, షీల్డ్, వార్లెస్ హ్యుమర్స్, ఓరియంటల్ ఫెరల్, యూరోపియన్ లాహోర్, అమెరికన్ నన్స్, మాల్టీస్, సాండీల్ ముకీస్, చైనీస్ ఓవెల్స్, పెంచ్ మొడెనా, కింగ్స్, షేక్ షెర్లీ, అమెరికన్ ఎలిమెంట్స్, కాప్చినో, జర్మన్ బ్యూటీ హ్యుమర్, వాల్గట్ పౌటర్, హెన్నా పౌటర్, మూన్ మార్క్ పౌటర్, బోటెడ్ ఎల్మెంట్, పెషర్ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. పావురం.. ప్రేమకు ప్రతిరూపం ప్రపంచ వ్యాప్తంగా పావురాలను ప్రేమకు, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. రెండు పావురాలు జత కడితే ఇక జీవితాంతం ఆ రెండే కలిసి జీవిస్తాయి. జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో చనిపోతుంది లేదా చనిపోయే వరకు ఒంటరిగానే జీవిస్తుంది. అంతే తప్ప వేరొక పావురంతో ఎట్టి పరిస్థితిలోనూ జత కట్టదు. పావురం అంటే ప్రాణం ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, జంతువులతోనూ మనకు ప్రేమానుబంధం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పావురాలంటే ప్రాణం. తొలుత కొన్నింటిని ఇంటి వద్దే పెంచేవాడిని. 8 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా వాటి కోసమే ఇల్లు నిర్మించాను. ఉదయాన్నే లేచి వాటిని చూడందే ఆ రోజు మొదలవ్వదు. వాటితో ఉంటే నా వ్యయప్రయాసలు, సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. అన్ని వందల పావురాల్లో ప్రతి పావురం నాకు ప్రత్యేకమే. ఏ ఒక్క పావురాన్ని వేరు చేసినా నేను గుర్తించగలను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. – చెరుకువాడ శ్రీనివాసరావు, మానికొండ, కృష్ణా జిల్లా మా నాన్నకు అవి కూడా పిల్లలే.. మేము పుట్టక ముందు నుంచే మా నాన్న పావురాలను పెంచుకుంటున్నారు. నేను, నా సోదరుడు సుధీర్ చదువుకుని స్థిరపడ్డాం. మాకు ఉండటానికి ఇల్లు కట్టినట్టే.. పావురాలకూ ప్రత్యేకంగా ఇల్లు కట్టిన మా నాన్నకు అవి అంటే ప్రాణం. అందుకే నేను వివాహమై అత్తగారింటికి వెళ్లినా, మా నాన్న పెంచుకుంటున్న పావురాలను భవిష్యత్లోనూ మేము సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఇదే మా నాన్నకు మేమిచ్చే బహుమానం. – దాసరి రవళి, శ్రీనివాసరావు కుమార్తె -
బాబు నుంచి భూమిని ఇప్పించండి
తాడేపల్లి రూరల్: తన ఇంటికి వెళ్లడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్కు దారిలేకపోవడంతో ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్లు.. శ్రీనివాసరావుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారు. ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్ వేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి బాధితుడికి రూపాయి కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టామని శ్రీనివాసరావు వాపోతున్నాడు. వైద్యానికి నగదు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామని కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని చెబుతున్నాడు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే మరోవైపు తమకు కమీషన్ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ స్థలం అయినా తమకు అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరాడు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నాడు. -
రాష్ట్రంపై ఎన్నాళ్లీ వివక్ష?
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్ని రకాలుగా తీరని ద్రోహం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గత బడ్జెట్లో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకుండా, కనీసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంపై ఎందుకింత కక్ష? ఎన్నాళ్లీ వివక్ష? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కలిసి రావాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని నేతలు ప్రకటించా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా వీధుల్లోకి రావాలని, అవసరమైతే బంద్ చేయాలని కోరారు. వామపక్షనేతలు వెంక య్య, శంకర్, విల్సన్, వనజ, జి.కోటేశ్వరరావు, బాబూరావు, కృష్ణ, కాశీనాథ్, అమరనాథ్, ఖాదర్ బాషా మాట్లాడారు. విశాఖపట్నంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగ రం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
ఒక్కరోజే 2,484 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆదివారం 65,263 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,484 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.61 లక్షలకు చేరుకుంది. తాజాగా 4,207 మంది కోలుకోగా, మొత్తంగా 7.18 లక్షలమంది రికవరీ అయ్యారు. ఆదివారం కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు 4,086 మంది బలయ్యారు. ప్రస్తుతం 38,723 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 843 మంది ఐసీయూలో, 1,319 మంది ఆక్సిజన్, సాధారణ పడకలపై 1,052 ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్ రిమ్స్లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. -
మతకల్లోలాలకు బీజేపీ కుట్ర
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ బీజేపీ చర్యలను అడ్డుకోవాలని కోరారు. ఆయన మంగళవారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మతసామరస్యానికి నిలయమైన రాష్ట్రంలో మతవిద్వేషాలు రగిలించేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఒక వర్గంపై బీజేపీ వారే తొలుత దాడిచేశారన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చకపోతే కూల్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనల్లో హిందువులను బీజేపీ ఉద్రిక్తతకు గురిచేస్తోందన్నారు. అన్ని మతాలు, వర్గాల్లోను మతతత్వశక్తులు అభద్రతను సృష్టిస్తున్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయ వ్యవస్థ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక అని, ఆయన మీద నమ్మకంతో ఉన్నత విద్యావంతులు కూడా సచివాలయ ఉద్యోగాల్లో చేరారని చెప్పారు. భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు చర్చల ద్వారా సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపించాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఐఆర్కు తగ్గకుండా ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీపీఎం జిల్లా నేత నాగేంద్రకుమార్ ఉన్నారు. -
‘పోలవరం’పై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా కేంద్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వీటిపై ఎన్ని ఆందోళనలు చేసినా బీజేపీలో చలనం రావడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ నిర్వాసిత కుటుంబాల లెక్కలు పంపాలని కోరడం దారుణమన్నారు. మారుతున్న అంచనాలకు అనుగుణంగా నిధులు అందించాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కానీ రకరకాల సాకులతో కొర్రీలు వేస్తూ ప్రాజెక్టును ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు పోరాడాల్సిన అవసరముందన్నారు. కాగా, విద్యుత్ వినియోగదారులపై అభివృద్ధి చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ సీఎం జగన్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
ఒక్కరోజులో 274 మందికి కోవిడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఆదివారం 21,679 మందికి కరోనా పరీక్షలు చేయగా 274 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ 1.26 శాతంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 212 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 6,82,489కు చేరుకుంది. ఒక రోజులో 227 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 6.74 లక్షల మంది కోలుకున్నారు. ఒక రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటి వరకు 4,030 మంది మృతిచెందారు. కాగా, ఆదివారం ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరుకుంది. ఒక రోజులో ఒమిక్రాన్ నుంచి ఐదుగురు కోలుకోగా, ఇప్పటివరకు 32 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఒక రోజులో ముప్పున్న దేశాల నుంచి 163 మంది రాగా 14 మందికి సాధారణ కరోనా నిర్ధారణైంది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. మొత్తం 30 జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. -
‘సంక్షేమం’పై ప్రజల్లో సానుకూలత
(ఏ. అమరయ్య, సాక్షి, అమరావతి): రాజకీయ బలాల రీత్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన రాజకీయ శక్తిగానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని సీపీఎం అభిప్రాయపడినట్లు ఆ పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. గ్రామీణ పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ తగ్గలేదని, మిగతా వర్గాల్లో అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల మొదలు ప్రస్తుత రాజకీయ పరిస్థితి వరకు పలు అంశాలను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు.. బీజేపీపై మెతక వైఖరిని విడనాడాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ఫెడరలిజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని ఏ అంశాన్నీ అమలు చేయలేదు. ఇవికాక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని చెబుతోంది. ఇలాంటి సమస్యలపై వైఎస్సార్సీపీ గొంతెత్తాలి. చాపకింద నీరులా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆరెస్సెస్కు ముకుతాడు వేయాలి. ఇటువంటి దశలో వైఎస్సార్సీపీ మౌనంగా ఉండడం రాష్ట్రానికి క్షేమకరం కాదు. వైఎస్సార్సీపీ తమ భావసారూప్య పార్టీ కానప్పటికీ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కలిసివస్తే ఆయా సందర్భాలను బట్టి సహకరిస్తాం. పూర్వ వైభవానికి టీడీపీ పాకులాట ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ తీవ్ర నిరుత్సాహంలో ఉంది. పూర్వవైభవం కోసం పాకులాడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని టీడీపీ మహానాడు ఇచ్చిన పిలుపు అంతిమంగా బీజేపీకే తోడ్పడుతుందని మా పార్టీ భావిస్తోంది. కొత్త కార్యదర్శిగా మా ప్రాధామ్యాలు.. ► పార్టీని పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడం. ► వామపక్ష ప్రజాతంత్ర పార్టీలను, శక్తులను కలుపుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించడం. ► కార్మిక, కర్షక, కౌలురైతు, వ్యవసాయ కూలీలు సహా వివిధ వర్గాలు, తరగతుల హక్కుల కోసం ఆందోళనలు నిర్వహించడం. ► గ్రామాల్లో భూస్వాములు, ధనిక రైతులు, కాంట్రాక్టర్లు వ్యాపార కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో మా పార్టీ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి వారి దుశ్చర్యలను ఎదిరించడం. ► సంస్థాగత నిర్మాణ లోపాలను పార్టీ మహాసభల్లో చర్చించాం. ఇప్పటికే దిద్దుబాటు ప్రారంభమైంది. పార్టీ నిర్మాణాన్ని మరింత సమర్ధంగా చేపట్టబోతున్నాం. ► స్వతంత్ర రాజకీయ పునాదిపై పార్టీని నిర్మించుకుంటాం. దళితులపై దాడుల్ని సహించం రాష్ట్రంలో కులవివక్ష నేటికీ కొనసాగుతోంది. కులవివక్ష దాడులు, చివరకు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఆధిపత్య, అగ్రకుల దురహంకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రకాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల్లో పార్టీలు, సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. దళితులపై దాడులు ఎక్కడ జరిగినా ఉద్యమించి తీరుతాం. రాష్ట్రంలో 36% నిరక్షరాస్యత ఉంటే అందులో 47% మంది దళితులు. ఈ పరిస్థితిని మార్చేందుకు మా పార్టీ, ప్రజా సంఘాలు చొరవచూపుతాయి. ప్రతి దళితవాడకు 2 ఎకరాల స్థలం మంజూరు చేసి అభివృద్ధి చేయాలి. ఇక ఎన్నికల గురించి పార్టీ మహాసభల్లో చర్చించలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చర్చిస్తాం. ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరపాలి ఇక రాష్ట్ర ప్రభుత్వద్యోగులకు 11వ పీఆర్సీ ఫిట్మెంట్పై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తక్షణమే తెరదించాలని వి. శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. సీఎం నేరుగా రంగంలోకి దిగి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు తగిన విధంగా ఉద్యోగులు వేతన పెంపు కోరుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాల్సింది ఉద్యోగులేనని, అందువల్ల ఆ సంఘాల నేతలతో ముఖ్యమంత్రే స్వయంగా చర్చలు జరిపి పరిష్కరించాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. -
ఒకే రోజు 10వేల కేసులు పెరిగాయి.. వచ్చే 2,3 వారాల్లో కేసులు పెరుగుతాయి
-
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాశం జిల్లా వాసి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు ఆహ్వానితులు సహా 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 62 మందితో పార్టీ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. జాలా అంజయ్య అధ్యక్షతన ఐదుగురితో కంట్రోల్ కమిషన్ ఏర్పాటైంది. పార్టీ మహాసభల్లో చివరిరోజైన బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంఏ గఫూర్, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్ నరసింగరావు, సీహెచ్.బాబూరావు, కె.ప్రభాకర్రెడ్డి, డి.రమాదేవి, మంతెన సీతారాం, బి.తులసీదాస్, వి.వెంకటేశ్వర్లు, పి.జమలయ్య,కె.లోకనాథం, మూలం రమేష్, ఆహ్వానితులుగా కె.సుబ్బరావమ్మ, సురేంద్ర కిల్లో ఎన్నికయ్యారు. వీఎస్సార్ ప్రస్థానం ఇలా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లిలో ఓ సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను ప్రకాశం జిల్లాలోనే అభ్యసించారు. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివిన ఆయన ఆ సమయంలోనే విద్యార్ధి ఉద్యమాల వైపు ఆకర్షితులై ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. యువజనోద్యమాలకు సారధ్యం వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారు. రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ రైతువాణి పత్రికను రైతుల్లోకి తీసుకెళ్లారు. ప్రజాశక్తి దినపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. దళిత్ సోషన్ ముక్తిమంచ్ (డీఎస్ఎంఎం) ఏర్పాటుచేసి వ్యవస్థాపక కన్వీనర్గా దేశవ్యాప్తంగా విస్తరించారు. కొంతకాలం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేశారు. ఆయన సతీమణి 1998లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. బీవీ రాఘవులు తరువాత ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తి శ్రీనివాసరావు. -
ఇక స్టార్ట్..‘అప్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏడేళ్ల క్రితం స్టార్టప్ ఇంక్యుబేటర్గా పురుడు పోసుకున్న టీ–హబ్ ప్రస్తుతం నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారిందని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్రావు అన్నారు. కరోనా సంక్షోభంతో ఏర్పడిన పరిస్థితుల నుంచి స్టార్టప్లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే వాతావరణం సృష్టిస్తామన్నారు. టీ–హబ్ ద్వారా ఇప్పటివరకు 1,800కుపైగా స్టార్టప్లకు తోడ్పాటు లభించగా సుమారు రూ. 2,300 కోట్ల మేర నిధుల సమకూరాయన్నారు. టీ–హబ్ రెండో దశ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలపై శ్రీనివాస్రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► స్టార్టప్లకు అవసరమైన పని ప్రదేశాన్ని (వర్క్ స్పేస్) అందుబాటులో తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన టీ–హబ్ తర్వాతి కాలంలో వాటికి అవసరమైన మార్కెటింగ్, నిధులు, సలహాదారులు, మార్గదర్శకులు, నైపుణ్యం, ప్రోత్సాహం తదితరాలను అందించేలా కార్యకలాపాలను విస్తరించింది. ► ఉద్యోగాల కల్పనలో స్టార్టప్లదీ కీలకపాత్ర. ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్లు కేవలం రెండు వేలుకాగా ఇప్పుడు ఆరు వేలకుపైగా ఉన్నాయి. ఈ పురోగతిలో టీ–హబ్ కీలక పాత్ర పోషించింది. ► ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), వాటికి వాణిజ్య రూపం (ఇంక్యుబేషన్) ఇవ్వ డంలో టీ–హబ్ నాయకత్వ స్థానంలో ఉంది. 29 రాష్ట్రాల్లో 356 ఇంక్యుబేటర్లు ఉన్నా టీ–హబ్ మాత్రమే రోల్మోడల్గా ఉంది. Ü ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, సైబర్ భద్రత, సోషల్ మీడియా, బ్లాక్చెయిన్, రవాణా, ఏఐ వంటి 14 రంగాల్లో స్టార్టప్లు వాణిజ్య స్థాయికి ఎదుగుతున్నాయి. ► స్టార్టప్లకు కావాల్సిన మార్కెట్, నిధులు, మార్గదర్శకులు, నైపుణాన్ని అందించడమే టీ–హబ్ ప్రధాన లక్ష్యం. పెద్ద కంపెనీలకు స్టార్టప్లను చేరువ చేయడం కూడా మా లక్ష్యాల్లో భాగం. ► హైదరాబాద్ స్టార్టప్లకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. స్థానిక స్టార్టప్లకు భారీ పెట్టుబడులు సాధిం చేందుకు యాక్టివ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్తో మాట్లాడుతున్నాం. ► నైపుణ్యం, పెట్టుబడి, ప్రభుత్వం, మార్కెటింగ్ను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీ–హబ్తోపాటు వీ–హబ్, టాస్క్, టీఎస్ఐసీ సంస్థలు పనిచేస్తుండగా 300కుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఉన్నారు. స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు స్టేట్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించిన టీ–ఫండ్ ద్వారా త్వరలో రూ. 15 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► టీఎస్ఐసీ భాగస్వామ్యంతో కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ త్వరలో టీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ► యువతకు చేరువయ్యేందుకు టీ–ట్రైబ్, కిక్ స్టార్ట్, లాంచ్పాడ్ అనే కార్యక్రమాలు రూపొందించాం. ► లాంచ్పాడ్ ద్వారా 30 కాలేజీల నుంచి 50 మంది విద్యార్థుల చొప్పున ఎంపిక చేసుకొని వారికి స్టార్టప్లపై శిక్షణ ఇస్తాం. కొన్ని కాలేజీల్లో ఉన్న ఈ–సెల్స్ ద్వారా కిక్స్టార్ట్ ప్రోగ్రామ్ కింద ఉపాధ్యాయుల సహకారంతో ఆవిష్కర్తలను గుర్తిస్తాం. టై, సీఐఐ, వీ–హబ్తోనూ క లసి రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణ వాతావరణం కల్పన దిశగా ముందుకు సాగుతాం. ►ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉన్న టీ–హబ్ మొదటి దశలో 160 స్టార్టప్లు ఇంక్యుబేట్ అవుతుండగా రెండో దశ ద్వారా 3.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 800కుపైగా స్టార్టప్లు ఒకేచోట సిద్ధమయ్యేలా వసతులు సమకూరుస్తాం. ► నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రస్తుతం టీ–హబ్ నాలుగో స్థానంలో ఉన్నా ఎంత వేగంగా దీన్ని సాధించామన్నది కూడా ముఖ్యమే. రాష్ట్రంలోని ప్రగతిశీల ప్రభుత్వం, మౌలిక వసతులు, నైపుణ్యం తదితరాల మూలంగా తప్పకుండా తొలి స్థానానికి చేరుకుంటాం. -
కరోనా కేసుల తీవ్రత ఫిబ్రవరిలో పీక్స్కు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో కేసుల తీవ్రత భారీగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అందరం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి నుంచి గట్టెక్కగలమని.. వచ్చే ఆరు వారాల పాటు కచ్చితంగా మాస్క్ నిబంధనను, ఇతర జాగ్రత్తలను పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కువమంది ఉండే ఇళ్లలోనూ మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రంలో పరిస్థితులు, ఇతర అంశాలపై శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో బాధితులు ఆస్పత్రుల్లో చేరడం తక్కువగా ఉందని, మరణాలుగానీ నమోదవడం లేదని.. ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పారు. ఈ వేరియంట్తో పెద్దగా సమస్య లేకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని.. నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటివి మాత్రమే ఉంటున్నాయని చెప్పారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత నాలుగైదు రోజులుగా ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. గుంపులుగా ఉండటం లేదని, మాస్కులు ధరిస్తున్నారని తెలిపారు. రేపో, మాపో రావొచ్చు.. ఒమిక్రాన్ చాలా దేశాలకు విస్తరించిందని.. మనదేశంలో బెంగళూరు, ముంబై, జైపూర్లోనూ కేసులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. రేపో మాపో తెలంగాణలోనూ ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మూడో వేవ్ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి 900 మందికిపైగా రాష్ట్రానికి చేరుకోగా.. అందులో 13 మందికి కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామన్నారు. టిమ్స్లో ఉన్న ఈ 13 మంది ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చినవారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారని.. అందులో ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని, పాజిటివ్ రాలేదని వివరించారు. జిల్లాల్లో అధికారులు వారిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్లు పరిష్కారం కాదు.. కరోనా వ్యాప్తిని అరికట్టడడానికి లాక్డౌన్లు పెట్టడం పరిష్కారం కాదని శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్డౌన్లు ఉండవని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం రెండో వేవ్ సమయంలో రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కోటి ఇళ్లకు ఆరేడుసార్లు తిరిగి లక్షణాలున్న 8 లక్షల మందికి కిట్లు ఇచ్చామని, దాన్ని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. టెస్టుల సంఖ్య పెంచుతాం రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని గుర్తించి.. అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అయినా మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి. స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు, భౌతికదూరం ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. భయంతోనే ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు. ‘‘డెల్టా వేరియంట్ సమయంలో ఆస్పత్రుల ముందు బాధితులు బారులుతీరారా? ఏదైనా ఆస్పత్రిలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు చూశామా? చనిపోయినవారిని దాచిపెట్టగలమా? మా వైద్య సిబ్బంది 70 మంది చనిపోయారు. వారిని అవమానిస్తారా? ప్రభుత్వం పడిన శ్రమ ఏం కావాలి? ఎవరిని అనుమానిస్తున్నారు?’’అని ప్రశ్నించారు. డెల్టా వేరియంట్ ధాటి నుంచి కనీస నష్టంతో బయటపడ్డామని చెప్పారు. కానీ కరోనా ఏదో చేస్తుందన్న భయంతోనే బాధితులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. -
కంగారు అక్కర్లేదు.. కంట్రోల్ చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ వ్యాపించిన దేశాలను ప్రమాదకరమైన వాటిగా గుర్తించామని చెప్పారు. ఆయా దేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి పాజిటివ్గా తేలిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలిస్తామని వివరించారు. అలాగే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీ వంటి లేబొరేటరీలకు పంపిస్తామన్నారు. సోమవారం యూరప్ నంచి 22 మంది, యూకే నుంచి 17, సింగపూర్ నుంచి ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోగా వారెవరికీ కరోనా నిర్ధారణ కాలేదన్నారు. ఆందోళన అక్కర్లేదు... విదేశాల్లో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసమే ప్రధాన లక్షణాలని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ వైరస్ను ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ టెస్టుల్లో కనుక్కోవచ్చన్నారు. ప్రస్తుత వైద్య చికిత్స పద్ధతులే దీనికీ వర్తిస్తాయన్నారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,300 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. వచ్చే నెలాఖరుకు అర్హులందరికీ రెండు డోసుల టీకా... రాష్ట్రవ్యాప్తంగా 7–10 రోజుల్లో కరోనా మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేస్తామని, వచ్చే నెలాఖరుకు అర్హులైన వారందరికీ రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, వరంగల్, గద్వాల, నారాయణపేట జిల్లాలు రెండో డోస్ వ్యాక్సినేన్లో వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల మందికి రెండో డోస్ టీకాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రెండో డోస్ వేసుకోకున్నా అటువంటి వారిలో కొందరికి వేసుకున్నట్లు సర్టిఫికెట్లు మొబైల్ఫోన్లకు వచ్చిన విషయంలో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లను, కొందరు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు 9154170960 ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు 9154170960 నంబర్కు వాట్సాప్ చేయాలని శ్రీనివాసరావు సూచించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ. 500 మాత్రమే ప్రైవేట్ లేబరేటరీలు వసూలు చేయాలన్నారు. విమానాశ్రయంలో అదే ధర వసూలు చేయాలన్నారు. అయితే 20 నిమిషాల్లోనే ఫలితం ఇచ్చేందుకు అంతకంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నాయన్నారు. -
డెల్టా కంటే 30 రెట్లు వేగంగా ఒమిక్రాన్, అయితే..
సాక్షి, హైదరాబాద్: కరోనా డెల్టా వేరియెంట్ కంటే ఒమిక్రాన్ వేరియెంట్ 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అయినా జాగ్రత్తలు పాటిస్తే ఈ వేరియెంట్ను అడ్డుకోవచ్చని చెప్పారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియెంట్, ప్రభుత్వ సన్నద్ధతపై వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం డీఎంఈ రమేశ్రెడ్డితో కలసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. కేసుల సంఖ్య నిలకడగానే ఉందని వెల్లడించారు. దేశంలో ఒమిక్రాన్ నమోదు కాలేదు.. ‘ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం. ఒమిక్రాన్ను అడ్డుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెంచాం. మూడోవేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 100 నుంచి 150 వరకే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 45 శాతం రెండో డోసు కరోనా టీకాలు ఇచ్చాం. కాలవ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంతో ఉన్నట్లు గమనించాం. ఏ వేరియెంట్ను అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులైతే వ్యాక్సిన్ తప్పనిసరి’అని చెప్పారు. కేంద్రం విధివిధానాలు వచ్చాక మూడో డోసు... ‘రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒక స్కూలులో, హైదరాబాద్ శివారు మహీంద్ర వర్సిటీలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో 557 స్కూళ్లు, కాలేజీల్లోని 37,994 మంది విద్యార్థులకు కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. అందులో 25 స్కూళ్లలో 141 కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదు కంటే ఎక్కువ కేసులు ఆరు విద్యా సంస్థల్లో, 5 కంటే తక్కువ కేసులు 19 విద్యా సంస్థల్లో బయటపడ్డాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమాత్రం భయపడాల్సిన అవసరంలేదు. పిల్లలు కరోనా బారినపడి ఆసుపత్రుల పాలవడం, మృతిచెందడం జరగలేదు. కరోనాలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉత్పరివర్తనాలు జరగడంతో ఎప్పుడూ కొత్త రూపం దాలుస్తోంది. ఒమిక్రాన్ ఎంతమేరకు ప్రమాదకరమైందో ఇప్పుడే చెప్పలేం. ఒకట్రెండు వారాల తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. రెండు డోసులు వేసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మూడో డోస్పై విధివిధానాలు రూపొందిస్తోంది. అవి వచ్చాక మూడో డోస్ గురించి చెప్తాం. ఒమిక్రాన్ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు కూడా ఎదుర్కొంటాయి’అని శ్రీనివాసరావు వివరించారు. వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఒమిక్రాన్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కొత్తగా 153 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 36,570 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 153 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,845కు చేరింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 3,984కి చేరిందని తెలిపారు. ఒక్కరోజు వ్యవధిలో 157 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,67,328కి చేరిందని వెల్లడించారు. -
కొత్తగా 144 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 35,659 కరోనా పరీక్షలు నిర్వహించగా... 144 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6.74 లక్షలకు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్ విడుదల చేశారు. ఒక్క రోజులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,978కి చేరింది. -
కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 34,778 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 148 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,73,722కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఒకరోజు కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 3,975 మంది మృతిచెందారని చెప్పారు. ఒకరోజు వ్యవధిలో కరోనా నుంచి 151 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,66,012కు చేరిందని తెలిపారు. -
ఏపీ సెట్కు 80.72 శాతం హాజరు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్–2021 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 80.72 శాతం మంది హాజరయ్యారు. పరీక్షను ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షకు మెత్తం 36,667 మంది దరఖాస్తు చేయగా 29,596 మంది హాజరైనట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు పరిశీలించారు. సోమవారం ఏపీ సెట్ వెబ్సైట్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. -
ఆధునిక అభ్యుదయ కవి తిలక్
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు. -
100% టీకా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూటికి నూరు శాతం కరోనా వ్యాక్సినేషన్ దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గ్రామ సభలు నిర్వ హించడం ద్వారా లక్ష్యం సాధించాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా సర్పంచులకు వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. ఆయా సభల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ కోసం తీర్మా నాలు చేయాలని పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, సర్పంచులు మొదలు ఎమ్మె ల్యేల వరకు అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకునేలా చూ డాలని భావిస్తోంది. అందులో భాగంగా 4 రో జుల క్రితం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అవగాహన సదస్సు లు నిర్వహించారు. గ్రామసభ లు నిర్వహించి వ్యాక్సినేషన్ సంపూర్ణంగా జరిగేలా తీర్మానాలు చేయాలని కోరినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సదస్సులు చేపడతామని తెలిపారు. కొనసాగుతున్న థర్డ్వేవ్ హెచ్చరికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్ వేవ్ తప్పదనే హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధారణ సహా కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందరూ టీకాలు వేయించుకునేలా చూడాలని ప్రభు త్వాలను కోరుతున్నారు. అప్పుడే కరోనాను తుదముట్టించగలమని స్పష్టం చేస్తున్నారు. రెండు డోసులు తీసుకుంది 38 శాతమే ఈ నెల మొదటి వారం వరకు చూసుకుంటే 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్ టీకా పొందారు. కాగా జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మాత్రమే మొదటి డోస్ టీకా పొందారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 46 శాతం, నాగర్కర్నూలులో 50 శాతం మంది అర్హులైనవారు టీకా పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్ డోస్ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్ డోస్ తీసుకున్నవారు హైదరాబాద్లో 51 శాతం ఉంటే, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా కేవలం 14 శాతమే తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 19 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో టీకా తీసుకున్నవారు తక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో సైతం నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
ఏపీపీ రాత పరీక్ష హాల్టికెట్లు డౌన్లోడ్కు అవకాశం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంతో జరుగుతున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ 24న రాత పరీక్ష ఉంటుందన్నారు. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని కలర్ జిరాక్స్ లేదా మామూలు జిరాక్స్ అందుబాటులో పెట్టుకోవాలని, హాల్టికెట్ డౌన్లోడ్లో ఏదైనా సమస్యలుంటే రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. -
సీఐ గారి రైస్మిల్ కథ!.. సుప్రియ పేరుతో
సాక్షి, పట్నంబజారు(గుంటూరు తూర్పు): ఇదీ ఒక సీఐ గారి రైస్మిల్ కథ.. రైస్ మిల్లులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. ‘సుప్రియ పేరుతో రైస్మిల్ పెడుతున్నా.. పెట్టుబడి పెడితే షేర్లు ఇస్తా.. దీంతో పాటు మిల్లులో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు’.. కోట్లాది రూపాయలు వసూలు చేశారు.. మిల్లు తెరుచుకుంది.. సంపాదన బాగానే ఉంది.. అందుకు పెట్టుబడి పెట్టిన వారికి.. అప్పులిచ్చిన వారికి మాత్రం ఇప్పటికీ షేర్లు రాలేదు సరికదా ఉద్యోగాలు వచ్చింది లేదు. ఇదంతా చేసింది ఒక పోలీసు అధికారి. ఓ నాలుగు కేసులు ఆయనపైనా, మరో రెండు కేసులు ఆయన భార్యపైనా నమోదయ్యాయి. అయితే స్టేషన్ స్థాయి అధికారులు కేసుల విచారణలో పక్షపాతం చూపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. గుంటూరు రేంజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బత్తుల శ్రీనివాసరావు ఎస్ఐ, సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్లో ఉన్నారు. ఖాకీ దుస్తులను అడ్డుపెట్టుకుని నిలువు దోపిడీకి తెరదీశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధనలకు నీళ్లొదిలేశారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో రైస్మిల్లు కడుతున్నానంటూ జనం నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. చదవండి: (టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్ విమర్శలు) కేసుల పరంపర ఇలా... ►గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన బండ్లమూడి బిందు వద్ద 2016 సంవత్సరంలో రూ. 1 కోటి 40 లక్షలు అప్పుగా తీసుకుని, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో బాధితురాలు నగరంపాలెంలో పీఎస్లో ఫిర్యాదు చేయడంతో ఆయనతోపాటు భార్యపైనా కేసు నమోదైంది. ►తెనాలికి చెందిన యండ్రాతి చంద్రమ్మ అనే మహిళ వద్ద 2018 సంవత్సరంలో రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారనే ఫిర్యాదు మేరకు టూటౌన్లో కేసు నమోదైంది. ►విశాఖపట్నంలోని గాజువాకలో తనకు బంధువైన ఏలిషా వద్ద రూ.29 లక్షల వరకు తీసుకుని మోసం చేయటంపై గాజువాక పీఎస్లోనూ కేసు నమోదైంది. తన రైస్మిల్లుకు సంబంధించి షేర్లు ఇస్తామని నమ్మబలికి అతన్ని మోసం చేయటంపై ఫిర్యాదు చేశాడు. ►గుంటూరు నగరంలో నివాసం ఉండే పాపాబత్తుల ప్రభుదాస్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేశారు. ఈ క్రమంలో పరిచయమైన సీఐ బత్తుల శ్రీనివాసరావు అతని రైస్మిల్లులో షేర్లు ఇవ్వటంతో పాటు, సూపర్వైజర్గా ఉద్యోగం ఇస్తా మని నమ్మబలికి రూ.34 లక్షల 84 వేల నగదును తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు వాపోతున్నాడు. ►పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే విధంగా షేర్ ఇస్తామని, తన బినామీల ద్వారా రూ.25 లక్షలు వరకు తీసుకున్నారని, అందులో ఆయనే సాక్షిగా ఉన్నారని బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు తెరదీసి.. డబ్బులు తీసుకున్న ఏ ఒక్కరికీ తిరిగి ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సీఐ స్థాయిలో ఉన్న శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసినప్పటికీ, ఉన్నతాధికారులు తప్ప, స్టేషన్ అధికారులు పట్టించుకోవటంలేదు. మాపై దయ ఉంచి.. డబ్బులు ఇప్పించండయ్యా! నేను రిటైర్మెంట్ అవ్వగానే వచ్చిన డబ్బులన్ని సీఐ బత్తుల శ్రీనివాసరావుకే ఇచ్చా. నా జీవితకాలం కష్టం తీసుకెళ్లి ఆయనకిచ్చా. కుటుంబ పెద్దగా రిటైర్మెంట్ తరువాత ఏదో వ్యాపారం చేద్దామకున్నా.. తప్ప, పోలీసు అయి ఉండి ఆయన మోసం చేస్తారని అనుకోలేదు. నా డబ్బులు, మిగిలిన బాధితులకు తిరిగి డబ్బులు తిరిగి ఇప్పించాలి. – పాపాబత్తుల ప్రభుదాస్, శ్రీనగర్, గుంటూరు కేసులు వాస్తవమే సీఐ హోదాలో ఉన్న బత్తుల శ్రీనివాసరావుపై పలు కేసులు నమోదైన మాట వాస్తవమే. పూర్తిస్థాయిలో కేసులు విచారిస్తున్నాం. ఆరోపణల నేపథ్యంలోనే బత్తుల శ్రీనివాసరావును సస్పెండ్ చేశాం. గుంటూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. మరెవరైనా బాధితులు ఉన్నారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నాం. –సీఎం తివిక్రమవర్మ, డీఐజీ -
పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అందించాలన్నదే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన తండ్రి సూర్యనారాయణరావు వర్ధంతిని శనివారం గోల్కొండ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఓ వైద్యుడిగా తన తండ్రి కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో మందికి సేవలు చేశారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన్ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే జీఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీఎస్ఆర్ ట్రస్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పేదలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, ఉపాధి అందించేందుకు ట్రస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెల్త్సెక్రటరీ రిజ్వీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
గణేష్ ఉత్సవాల్లో చిందేసిన శ్రీనివాసరావు
సుల్తాన్బజార్ (హైదరాబాద్): గణేష్ ఉత్సవాల్లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కాసేపు సరదాగా చిందులు వేసి ఆ శాఖ ఉద్యోగుల్లో జోష్ నింపారు. టీఎన్జీవోస్ డీఎంహెచ్ఎస్ విభాగం అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలకు మంగళవారం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆడిపాడారు. అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతోన్న ఆయనే మాస్కు లేకుండా డ్యాన్సులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణలో మంగళవారం నిర్వహించిన 76,481 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఒకరోజులో కరోనాతో ఒకరు మృతిచెందారు. -
‘వర్క్ ఫ్రం హోం’కు స్వస్తి పలకండి
సాక్షి, హైదరాబాద్: ‘ఐటీ సంస్థలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. కోవిడ్ అదుపులో ఉన్నందున ఐటీ సంస్థలు కరోనా నిబంధనలను పాటిస్తూ, గతంలో మాదిరి యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించుకోవాలి. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలకాలి. ఐటీ శాఖ కూడా ఈ మేరకు ఆయా సంస్థలకు సమాచారమిచ్చింద’ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ నిబంధనలను సడలించి 3 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఎక్కడా అసాధారణంగా కేసులు పెరగలేదన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణలోనే ఉందని చెప్పారు. ‘బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు విద్య, వైద్య శాఖలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 40–50 శాతం మంది విద్యార్థులు హాజరవుతుండగా, ప్రైవేటు బడుల్లో 25 శాతం మేరకు హాజరవుతున్నారు. ఎలాంటి భయాందోళన లేకుండా పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నా. ఒక్క పాఠశాలలో కూడా ఐదుకు మించి కేసులు నమోదు కాలేదు. 1.10 లక్షల మంది విద్యార్థులను పరీక్షిస్తే వారిలో 55 మందిలో మాత్రమే కరోనా బయటపడింది’అని ఆయన చెప్పారు. ‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా థర్డ్వేవ్ వస్తుందని కొన్ని సంస్థలు చెబుతూ వస్తున్నాయి. మూడోదశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మొత్తం 27 వేల పడకలకుగాను ఇప్పటికే 19 వేల పడకల్లో ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఈ నెలాఖరులోగా మిగిలిన పడకల్లోనూ ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. రూ.138 కోట్ల వ్యయంతో పిల్లల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలోనే గాంధీ సహా ఐదు ప్రాంతీయ ఆసుపత్రుల్లో కొత్తగా 792 పడకలను సిద్ధం చేస్తున్నాం. మొత్తంగా బోధనాసుపత్రుల్లో 3,200 పడకలను పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నాం’అని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి గ్రామానికి వెళ్లి టీకా వేస్తాం.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1.96 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 1.43 కోట్లు మొదటి డోసులు కాగా, 54 లక్షల వరకూ రెండు డోసులు పొందినవారున్నారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి డోస్ టీకా దాదాపుగా 100 శాతం పూర్తయిందన్నారు. అయితే రాష్ట్రంలో ఇంకా 49 శాతం మంది కనీసం ఒక్క డోసు కూడా తీసుకోలేదన్నారు. ‘ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ టీకా పొందని వారు ఎక్కువమంది ఉన్నారు. అందుకే వచ్చే 4 వారాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి టీకాలను అందించేలా స్పె షల్డ్రైవ్ అమలు చేస్తాం’అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు మరో 25 లక్షల డోసులు రానున్నాయన్నారు. వచ్చే నెలలో 75–80 లక్షల డోసులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. మరో కొత్త రకం, అది కూడా బలమైన మార్పు చెందిన వైరస్ వస్తే తప్ప మూడోదశ ఉధృతి వచ్చే అవకాశాల్లేవని తేల్చిచెప్పారు. 10 వేలకు పడిపోతేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి గతేడాదితో పోల్చితే ఈసారి వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. కొన్ని జిల్లాల్లో డెంగీ, మలేరియా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ప్రతి నెలా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ వైరల్ జ్వరాల కేసులు వస్తుంటాయని, సెప్టెంబర్లో మరింత పెరిగే అవకాశముందన్నారు. డెంగీ రోగుల్లో ప్లేట్లెట్లు తగ్గినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఎక్కించేందుకు వీలుగా 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్ల పరికరాలను అం దుబాటులో ఉంచినట్లు చెప్పారు. లక్షకుపైగా ప్లేట్లెట్లు ఉన్నా కూడా అవసరం లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటిని ఎక్కించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్లేట్లెట్లు 10 వేలకు పడిపోతేనే ఎక్కించాలని చెప్పాలి. ప్లేట్లెట్ల పేరిట దోపిడీకి పాల్పడవద్దని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. -
హైదరాబాద్ లో ఐటీ కంపనీలు ప్రారంభించుకోవచ్చు
-
కీలక నిందితుడు జిషాన్తో కలిపి రవితేజను విచారించిన ఈడీ
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈవెంట్ మేనేజర్గానే తెలుసు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈవెంట్ మేనేజర్గానే తనకు తెలుసునని, మరో నిందితుడు జీషాన్తో ఎలాంటి సంబంధాల్లేవని సినీ నటుడు రవితేజ ఈడీ అధికారులకు తెలిపారు. గురువారం రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరావు అధికారుల ఎదుట హాజరయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు సినీ నటులు, మరోవ్యక్తిని విచారించినట్లైంది. నందు, రానా దగ్గుబాటిలు వచ్చిన సందర్భంలో ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ను పిలిచారు. రవితేజ, శ్రీనివాసరావుల వంతు వచ్చేసరికి కీలక నిందితుడు జీషాన్ను రప్పించారు. విడివిడిగా... ఉమ్మడిగా... రవితేజ, శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యా హ్నం 12 గంటల ప్రాంతంలో జీషాన్ వచ్చాడు. జీషాన్తో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? అతడితో పాటు కెల్విన్కు శ్రీనివాసరావుతో డబ్బు పంపారా? అనే అంశాలపై రవితేజను అధికారులు ప్రశ్నించారు. శ్రీనివాసరావును విచారించిన మరో బృందం రవితేజ ఆదేశాల మేరకు జీషాన్, కెల్విన్లను కలిశారా? వారికి నగదు ఇవ్వడం, వారి నుంచి డ్రగ్స్ తీసుకురావడం జరిగిందా? అనేది ఆరా తీశారు. ఈ సందర్భంగా రవితేజ తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్లను సమర్పించారు. ఈ ముగ్గురినీ తొలుత విడివిడిగా ప్రశ్నించిన అధికారులు తర్వాత కలిపి విచారించారు. తాను డ్రగ్స్ ఖరీదు చేసినట్లైతే గతంలో సిట్ విచారణలోనే ఆ విషయం బయటపడేదని, అప్పుడు కూడా వారు పలు కోణాల్లో ఆరా తీశారని రవి తేజ ఈడీకి తెలిపారు. సుదీర్ఘ కాలంగా రవితేజ వద్ద తాను డ్రైవర్గా పని చేస్తున్నానని చెప్పిన శ్రీనివాసరావు, ఆయన వ్యక్తిగత పనులు లేదా సినిమాకు సంబంధించిన పనులపై అనేకమందిని తీసుకురావడం, తీసుకువెళ్లడం చేశానని వివరించాడు. అందులో భాగంగానే కెల్విన్తో నూ సంప్రదింపులు జరిపానని పేర్కొన్నాడు. ఏ సందర్భంలోనూ డ్రగ్స్ ఖరీదు చేసుకురావడం కానీ, ఎవరి నుంచైనా తీసుకురావడం కానీ జరగలేదని స్పష్టం చేశాడు. జీషాన్ను విచారించిన అధికారులు కొన్ని కీలకాంశాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం 3.30 సమయంలో రవితేజ, శ్రీనివాసరావు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపో యారు. జీషాన్ మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వచ్చాడు. సోమవారం నటుడు నవదీప్, డ్రగ్స్ దందాకు కేంద్రంగా ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎఫ్–క్లబ్ జీఎంలు హాజరుకానున్నారు. -
ఐదు కంటే ఎక్కువ కేసులొస్తే స్కూలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఒక బడిలో ఐదు కరోనా కేసులు నమోదైతే, దాన్ని ఒక క్లస్టర్గా తీసుకొని కట్టడి చర్యలు చేపడతామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు కంటే ఎక్కువగా కేసులు నమోదైతే ఆ పాఠశాలను నిర్ణీత సమయం వరకు మూసివేస్తారని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థులతో ఎంతమంది సన్నిహితంగా ఉన్నారనేది గమనించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్ తీసుకున్న టీచర్లకే అనుమతి పిల్లల్ని పాఠశాలలకు పంపించడంపై ఇప్పటికీ కొందరు తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నా యి. కానీ ఆందోళన వద్దు. పిల్లలపై కరోనా ప్రభా వం తక్కువ. కాబట్టి నిరభ్యంతరంగా పాఠశాల లకు పంపించండి. ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే విద్యకు సార్ధకత చేకూరుతుంది. అందరూ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చు. మరో కొత్త రకం, మరింత ఎక్కువ ప్రమాదకరమైంది వస్తే తప్ప మూడోదశ ఉధృతి రాదు. బోధన, బోధనేతర సిబ్బందిలో 95 శాతం మందికి ఇప్పటికే టీకాలు అందించాం. కాబట్టి వీరి నుంచి వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. మిగతావారిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బడిలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా ఎవ్వరూ మాస్కు ధరించకుండా తరగతి గదిలోకి ప్రవేశించకూడదు. లక్షణాలు కన్పించిన వెంటనే టెస్టు చేయించాలి లక్షణాలు కనిపించిన పిల్లలను పాఠశాలలు వెంటనే తల్లిదండ్రుల వద్దకు పంపించాలి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేలా చూడాలని ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఒక విద్యార్థిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ విద్యార్థిని వేరే గదిలో కూర్చో బెట్టాలి. మిగతావారిని పరిశీలనలో ఉంచాలి. ఒకవేళ ఇంటి వద్ద లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పాఠశాలకు పంపొద్దు. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాలి. బడి నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్ను విడిగా ఉంచాలి. చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయించాలి. పిల్లలు ఇంటికే పరిమితమై ఉండటం లేదు రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సుమారు 60 లక్షల మంది వరకు ఉన్నారు. తరగతులు జరగక పోవడం వల్ల స్కూలుకు రాకపోయినా వీరంతా ఇంటికే పరిమితమై లేరు. ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు తిరుగుతూనే ఉన్నారు. పండుగలు జరుపుకుంటున్నారు. ఐసీఎంఆర్ సీరో సర్వే ప్రకారం పెద్దల్లో ఇప్పటికే 63 శాతం మంది కరోనా బారినపడ్డారు. పిల్లల్లోనూ 50 శాతానికి పైగా వారికి తెలియకుండానే ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మొహర్రం, బోనాలు వంటి పండుగలు ప్రజలు జరుపుకున్నారు. శుభ కార్యాలకు వందల సంఖ్యలో హాజరవుతున్నారు. కానీ ఎక్కడ కూడా భారీగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగలేదు. అందువల్ల తల్లిదండ్రులు భయపడనక్కర్లేదు. అన్నీ పరిశీలించి, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధం ఐసీఎంఆర్, ఇతర సంస్థలు అక్టోబర్లో థర్డ్వేవ్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతు న్నాయి. కానీ అక్టోబర్లో కచ్చితంగా థర్డ్వేవ్ ఉధృతి వస్తుంద నడానికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాల్లేవు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ శుభ కార్యాలు, పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసి దాదాపు రెండున్నర నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు అత్యల్పంగానే నమోదవు తున్నాయి. పిల్లలకు సోకినా త్వరగా కోలుకుం టున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పిల్లల్లో ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు కరోనాకు గురైనవారు 3 శాతం మంది మాత్రమే. 10–20 ఏళ్ల వారిని తీసుకుంటే 10% మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా 20 ఏళ్లలోపు వారు 13%, 20–60 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా 73% కరోనా బారినపడ్డారు. పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్రత చాలా తక్కువగా ఉండి త్వరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా చాలా స్వల్పంగా ఏర్పడింది. మరణాలైతే అస్సలే నమోదు కాలేదు. 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం... రాష్ట్రంలో ఇప్పటివరకు 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం. వచ్చే 15–20 రోజుల్లోనే ఈ సంఖ్య 2 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే 95 శాతం మందికి టీకాలు ఇచ్చాం. 60 శాతం కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. దసరా నాటికి రాష్ట్రంలో అర్హులైన అందరికీ తొలిడోసు ఇచ్చేలా ప్రణాళిక రచించాం. సినిమాకెళ్లాలంటే టీకా తప్పనిసరి కానుంది పిల్లలకు సంబంధించి ఇప్పటికే జైడస్ క్యాడిలా టీకాను అనుమతించారు. 12 ఏళ్ల పైబడిన వారికి దీన్ని ఇస్తారు. ఇది ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో రెండేళ్లు పైబడిన వారి కోసం భారత్ బయోటెక్స్ రూపొందిస్తున్న టీకా అక్టోబర్/ నవంబర్ నుంచి అందుబాటులోకి రావచ్చు. ఇతర దేశాల నుంచి ఇంకా అనేక రకాల వ్యాక్సి న్లు కూడా మన దగ్గరకు వస్తాయి. మాల్స్, సినిమా టాకీసులకు వెళ్లాలంటే టీకాలు పొంది ఉండాలనే నిబంధన త్వరలోనే రానుంది. -
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
-
టీకా వేసుకున్న వాళ్లకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే భవిష్యత్లో హోటళ్లు, మాల్స్లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన కోఠిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, ఇరువురూ కోలుకున్నారని, వారి కాంటాక్ట్లను కూడా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందన్నారు. డెల్టా రకం ప్రమాదకరమని, ఇంటాబయటా ప్రజలు మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు. థర్డ్వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వందకు పైగా బెడ్లు ఉన్న అన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగస్ట్ నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఆదేశించారు. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపుతోందన్నారు. దేశంలోని 50% కేసులు కేరళ నుంచే వచ్చాయని, డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరించారు. సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి చోట్ల కేసులు అధికంగానే ఉన్నాయని చెప్పారు. కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదైన ఘటనలు చూశామని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్ఎంసీ, ఖమ్మం వంటి చోట్ల అత్యధికంగా కేసులు చూస్తున్నామని, దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులని, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోస్లు పూర్తి చేశామన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల డోసులు పంపిణీ చేశామని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్నారు. కోవిషీల్డ్ 22.32 లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి అందించినట్లు చెప్పారు. కోవాక్సిన్ 3 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. రానున్న రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
ముప్పు ఇంకా పోలేదు.. మరో రెండు మూడు నెలలు ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ అదుపులోనే ఉంది కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. సెకండ్ వేవ్ మరో రెండు మూడు నెలలు కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఫస్ట్ వేవ్ దాదాపు ఎనిమిది నెలలు కొనసాగిందని, అదే సెకండ్ వేవ్ కేవలం మూడు నెలల్లోనే విజృంభించిందని అన్నారు. ఒక రోజులో దేశవ్యాప్తంగా గరిష్టంగా 4 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటికీ రోజుకు 35 వేల నుంచి 40 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్లో ఆల్ఫా రకం వైరస్ వ్యాప్తి చెందిందని, సెకండ్ వేవ్లో డెల్టా రకం విజృంభిస్తోందని తెలిపారు. భారత్లో మొదలైన ఈ రకం వైరస్ ఇప్పుడు 115కు పైగా దేశాలను వణికిస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనాను కట్టడి చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ‘రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో వైరస్ ఇంకా విజృంభిస్తోంది. హుజూరాబాద్ నియోజక వర్గంలో మూడు నాలుగు మండలాల్లో కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సామాజిక బాధ్య తలను చాలామంది పక్కనబెట్టేశారు. కరోనా నిబంధనలు పట్టిం చుకోవడం లేదు. ఇలాగే ప్రవర్తిస్తుంటే థర్డ్వేవ్ ముప్పు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. పండుగలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రాణాలు పోతే రావు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. ఉత్సవాల్లో తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో వేలాది మంది పాల్గొనడం సరైంది కాదు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు పెరిగిపోయాయి. పాదయాత్రలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు ఎక్కువయ్యాయి. ఇందులో ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. రాజకీయ నేతలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తే, ప్రజలు కూడా వారి బాటలో నడిచే అవకాశం ఉంటుంది. రోజుకు లక్షన్నరకు పైగా టెస్టులు ఫీవర్ (జ్వర) సర్వేలో భాగంగా కోటి ఇళ్లను ఐదారు సార్లు జల్లెడ పట్టాం. దీంతో పాజిటివ్ రేటు, మరణాలు తక్కువగా ఉన్నాయి. రోజుకు లక్షన్నరకు పైగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నాం. వ్యాక్సి న్ వేయించుకోని వారు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో అర్హులైన టీకా లబ్ధిదారుల్లో 50 శాతం మందికి ఒక్క డోసుతో పాక్షిక రక్షణ కల్పించాం. రెండో డోసుతో సుమారు 30 శాతం మందికి రక్షణ లభించింది. మిగిలిన వారికి కూడా అందించడానికి సుమారు రెండు మూడు నెలలు పట్టే అవ కాశముంది. తగినన్ని వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభు త్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రస్తుతం మరో 4.5 లక్షల డోసులు వస్తున్నాయి. సెకండ్ డోసు పొందాల్సిన వారు 30 లక్షల మంది ఉన్నా రన్నారు. వచ్చే 4.5 లక్షల డోసుల్లో సెకండ్ డోసు వారికి ప్రాధాన్యత ఇస్తాం. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల్లో చేరికలు పెరగడం లేదు. ప్రభుత్వంలో 14 శాతం, ప్రైవేట్లో 4 శాతం మాత్రమే చేరికలు ఉన్నాయి..’ అని శ్రీనివాసరావు వివరించారు. -
సరిహద్దు జిల్లాల్లో తగ్గని ఉధృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి రాలేదని.. వాటికి సరిహద్దుగా ఉన్న మన జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కొన్నిజిల్లాల్లో ఒక్కో రోజు ఒక్కకేసు కూడా నమోదుకాని పరిస్థితి ఉంటే.. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం వరుసగా పదులకొద్దీ కేసులు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు ఎక్కువగా వస్తున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, మరికొందరితో కూడిన ఉన్నతస్థాయి బృందం హెలికాప్టర్లో సుడి గాలి పర్యటనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేటలలో ఉన్నతాధికారులు పర్యటించారు. స్థానిక వైద్య సిబ్బందిని, అధికారులతో సమావేశమై కరోనా నియంత్రణలోకి రాకపోవడానికి కారణాలను పరిశీలించారు. కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల బృందం ఆదివారం రాత్రి ఖమ్మంలోనే బసచేసింది. సోమవారం డోర్న కల్, హుజూరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ రాత్రి గోదావరిఖనిలో బసచేసి.. మంగళవారం సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పర్యటించనుంది. సీఎం ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతుండటంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. అటు వంటి ప్రాంతాలను గుర్తించి అధ్యయ నం చేయాలని.. కరోనా విస్తరణకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల బృందం మూడు రోజుల పాటు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ కేసుల పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ నెల ఐదో తేదీన 62 కేసులు నమోదైతే, పదో తేదీన 64 కేసులు వచ్చాయి. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉండటం, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం, కరోనా టెస్టులు, ట్రేసింగ్ సరిగా నిర్వహించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నా నియంత్రణపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
‘రూ.కోటి పరిహారం ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విధుల్లో మరణించిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైద్య,ఆరోగ్యశాఖలోని 24 సంఘాల ప్రతినిధులతో కూడిన ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మరణించిన వైద్య సిబ్బంది కుటుంబాల్లో అర్హులైన వారికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబసభ్యులను కూడా ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి తొలి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రజారోగ్య వైద్య సంచాలకులు డా.శ్రీనివాసరావుకు ఐక్యవేదిక నేతలు డా.రవిశంకర్ ప్రజాపతి, డా.కత్తి జనార్దన్, సు జాత, రాజశేఖర్, ఎ.సుజాత శనివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం కోఠి లోని డైరెక్టర్ హెల్త్ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కో విడ్ బారిన పడిన నర్సులు, ఇతర సిబ్బందికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స, నిమ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా 21 రోజుల వేతనంతో కూడిన జీతం ఇచ్చేలా జీవో జారీచేయాలని కోరారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్, ఇతర ఉద్యోగులకు షిఫ్టులవారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలన్నారు. ఇప్పటికే ఆయా సమస్యలు, అంశాలను గురించి మంత్రి హరీశ్ రావు, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితం లేదని, వచ్చే వా రం, పది రోజుల్లో తమ సమస్యలపై స్పందించి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యాక్సిన్లపై వారం ఆగమన్నారు.. వైద్యులు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులకు వ్యాక్సినేషన్పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని డా.జి.శ్రీనివాసరావు చెప్పినట్లు ఐక్యవేదిక నాయకుడు డా.రవిశంకర్ తెలిపారు. కరోనా విధుల్లో మరణించిన వారికి నష్టపరిహారం, ఇతర సమస్యలు, డిమాండ్ల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.