Telangana: కొత్తగా ఆరు కరోనా కేసుల నమోదు  | Telangana Logs 6 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా ఆరు కరోనా కేసుల నమోదు 

Dec 30 2022 2:41 AM | Updated on Dec 30 2022 3:57 PM

Telangana Logs 6 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 6,587 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో ఆరుగురు వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో ఎనిమిది మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.

ప్రస్తుతం 69 మంది ఐసో­లేషన్‌ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో గురువారం 4,411 మంది కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో బూస్టర్‌ డోసును 3,635 మంది, రెండో డోసును 453 మంది, మొదటి డోసును 323 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. రోజురోజుకూ బూస్టర్‌ డోసు వేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement