![Telangana Logs 3 Covid 19 Cases - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/14/Untitled-5.jpg.webp?itok=bdfIuStD)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 4,230 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి తొమ్మిది మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 47 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment