
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 7,938 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 88 మంది వైరస్ బారిన పడ్డారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 102 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.30 లక్షలకు చేరింది. ప్రస్తుతం 874 క్రియాశీలక కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.