
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
రాపూరు: వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవారికి గ్రీష్మ తాపాన్ని చల్లార్చేందుకు పెంచలకోనలో వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీవారికల్యాణ మండలపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను ఉంచి విశేషంగా అభిషేకించారు. ఉభయకర్తలుగా బండి తిరుపాల్రెడ్డి, తేజ దంపతులు వ్యవహరించారు.
శేష వాహనంపై ఊరేగిన నృసింహుడు
గురువారం రాత్రి శేష వాహనంపై నరసింహస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.