
ఆచార్య సిమ్మన్నకు జ్ఞానజ్యోతి పురస్కారం
ఎంవీపీకాలనీ: ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యుడు ఆచార్య వెలమల సిమ్మన్నకు అరుదైన గౌరవం లభించింది. రచయితలు ప్రతిష్టాత్మకంగా భావించే జ్ఞానజ్యోతి పురస్కారం ఆయన్ని వరించింది. 2024 సంత్సరానికి గాను ఈ పురస్కారానికి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఎంపిక చేసింది. 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 17న విజయవాడ మహాత్మగాంధీరోడ్లోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ఆచార్య సిమ్మన్న ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలుగు సాహితీరంగానికి ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు రచయితలు, విద్యావేత్తలు, ఆచార్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.