హెల్మెట్ వాడకం తప్పనిసరి
ఇన్చార్జ్ డీటీవో ఆర్సీహెచ్ శ్రీనివాస్
గోపాలపట్నం: ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇన్చార్జ్ డీటీవో ఆర్సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు నగరంలో పలుచోట్ల వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనం నడిపే వ్యక్తితో పాటు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతోపాటు, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ రద్దు చేసిన సమయంలో వాహనం నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment