కేకే లైన్‌లో ప్రయాణికుల రైళ్ల గమ్యం కుదింపు | - | Sakshi
Sakshi News home page

కేకే లైన్‌లో ప్రయాణికుల రైళ్ల గమ్యం కుదింపు

Published Tue, Mar 4 2025 2:01 AM | Last Updated on Tue, Mar 4 2025 2:01 AM

-

తాటిచెట్లపాలెం: కేకే లైన్‌ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దంతేవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ● విశాఖపట్నం–కిరండూల్‌(58501) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్‌– విశాఖపట్నం (58502) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్‌ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది.

● విశాఖపట్నం–కిరండూల్‌(18515) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్‌– విశాఖపట్నం (18516) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్‌ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement