Vizianagaram District First In Andhra Pradesh State In Distribution Of YSR Pension Kanuka - Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో స్టేట్‌ ఫస్ట్‌

Published Sun, Jul 2 2023 12:06 PM | Last Updated on Sat, Jul 22 2023 8:27 PM

- - Sakshi

విజయనగరం అర్బన్‌: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకల పంపిణీలో విజయనగరం జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. నెలలో తొలిరోజు శనివారం 90.31 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేయడంతో జిల్లా ముందంజలో నిలిచింది. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీని వలంటీర్లు ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.

జిల్లాలో 14 రకాల పెన్షన్‌లు 2,76,498 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, ఒక్కరోజులోనే 2,49,706 మందికి పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి తెలిపారు. కొత్తవలస, నెల్లిమర్ల అర్బన్‌లో 94 శాతం, విజయనగరం అర్బన్‌, విజయనగరం మండలంలో 93, రాజాం అర్బన్‌, బొబ్బిలి అర్బన్‌, గుర్ల మండలాల్లో 92, దత్తిరాజేరు, బొండపల్లి, డెంకాడ, ఎల్‌.కోట, తెర్లాం మండలాల్లో 91 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement