Vizianagaram District News
-
స్థానిక సంస్థలపై..
ఎయిర్పోర్ట్ కోసం మీరేం చేశారో చెప్పండి..? భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారో చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని అడ్డంకులు తొలగించి జీఎంఆర్ సంస్థ పర్యవేక్షణలో ఎల్అండ్టీ సారథ్యంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 23 శాతం పనులు పూర్త్తయినట్లు స్వయానా ప్రస్తుత కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రకటించారు. అడ్డంకులు ఉంటే నిధులు మంజూరయ్యేవా...? టెండర్ దక్కించుకున్న వారు పనులు ప్రారంభించగలరా...? అంతా తామే చేస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిర్పోర్ట్ కోసం ఒక్క కొత్త అనుమతైనా తీసుకువచ్చారా...? మిగులు రైతుల సమస్యలు పరిష్కరించారా...? మౌలిక వసతుల కల్పనపై కనీసం దృష్టి సారించారా? అన్న ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలి. ● 11 నెలల పాలనలో సాధారాణ నిధులు ఒక్కరూపాయి కూడా విడుదల చేయని వైనం ● మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ● కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజా పోరాటం చేస్తాం ● మత్స్యకారులకు రెండేళ్లకు రూ.40వేలు చొప్పున భృతి ఇవ్వాల్సిందే ● ఉపాధి వేతన బకాయిల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణి ● బీసీ రుణాల మంజూరులో రాజకీయ జోక్యం తగదు ● కూటమి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసిందేంటి..? ● జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెనుకబడిన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంజూరు చేసే రుణాల విషయంలో కూటమి ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయకపోవడం దారుణం. జిల్లా వ్యాపంగా 3,379 యూనిట్లు మంజూరు కాగా... జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో అర్హులైన 20,452 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఎవరిని అర్హులుగా గుర్తిస్తారన్న విషయంపై అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో గుర్ల ఎంపీపీ ఇదే విషయమై ప్రస్తావిస్తే.. స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేక తీసుకురావాలంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు. గత ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా రుణాలు మంజూరు చేస్తే.. ఇప్పుడు పార్టీలే ప్రామణికంగా మంజూరు చేస్తారా..? కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హమీలకు, ప్రస్తుత పాలన తీరుకు పొంతన లేకుండా పోతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు తప్పదు. విజయనగరం: నిధులు లేక స్థానిక సంస్థలు నీరసిస్తున్నాయని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, పంచాయతీలకు సాధారణ నిధుల విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థలపై చిన్నచూపు తగదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మాటల గారెడీతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి నేతలు నేడు ప్రజా సమస్యలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించి స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు, పరిష్కారం చూపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ సమావేశాలకు గైర్హాజరు కావడంతో ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలన తీరు, హామీలు అమలుచేయకపోవడం, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకపోవడాన్ని మీడియా సాక్షిగా తెలియజేశారు. ఆయన మాటల్లోనే... రుణాల మంజూరుకు నిబంధనలేవి? పింఛన్లు మంజూరులో మాటల గారెడీ ఎందుకు...? 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు, భర్తను కోల్పోయిన వితంతువులకు, దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయకుండా సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఇటీవల భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేవి. 2023 డిసెంబర్ వరకు అర్హులందరికీ న్యాయం చేశారు. వాస్తవానికి గతేడాది జూన్ నెలలో అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి సచివాలయాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పటికి 15 వేలకు పైగా పెరుగుతందని అంచనా. ఒక్క చీపురుపల్లిలో 330 మంది పింఛన్ కోసం ఇటీవల రోడ్డెక్కి నిరసన చేపట్టిన పరిస్థితులే దీనికి తార్కాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 65.49 పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా... ప్రస్తు తం ఆ సంఖ్య 63.92 లక్షలకు తగ్గింది. అర్హులకు పింఛన్లు మంజూరు కోసం పార్టీ అధిష్టానం సూచనల మేరకు పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబ డడం, సంక్షేమానికి కృషిచేయడంలో వైఎస్సార్సీపీ బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపిస్తాం. వేతనదారులు గగ్గోలు పెడుతున్నా.. ఉపాధిహామీ వేతనదారులకు 13 వారాలుగా వేతన బకాయిలు చెల్లించకపోయినా ప్రభుత్వం, ప్రజాప్రతినినధులు పట్టించుకోకపోవడం దారుణం. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలస నివారణకు ఉపాధి హమీ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. సగటున రోజుకు ఒక్కో వేతనదారునికి కనీసం రూ.307 వేతనం గిట్టుబాటేయ్యేలా చూడాలి. చాలా ప్రాంతాల్లో రూ.50 నుంచి రూ.100 మాత్రమే గిట్టుబాటు అవుతుండడం దారుణం. తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలి. మత్స్యకారులకు రెండేళ్ల భృతి ఇవ్వాల్సిందే... ఏడాదిలో 60 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధించే సమయంలో ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు అందించాల్సిన వేటనిషేధ భృతిని రెండేళ్ల కాలానికి రూ.40వేల చొప్పున అందించాలి. అర్హులైన 3,798 మంది మత్స్యకారులుకు న్యాయం చేయాలి. ఎన్నికల్లో ఒకలా.. ఇప్పు డు ఒకలా మాట్లాడడం తగదు. హామీ మేరకు ఏడాదికి రూ.20వేల చొ ప్పున ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం ఏటా ఠంచన్గా మత్స్యకార భృతి అందించింది. రాయితీలు కల్పిస్తూ ఆదుకుంది. అన్నింటా విఫలం పరిశ్రమలు తీసుకువస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికలకు ముందు హమీలు గుప్పించారు. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలో జిందాల్ పరిశ్రమ మూతబడింది. కార్మికులు రోడ్డున పడ్డారు. దీనికి కూటమినేతలు ఏమని సమాధానం చెబుతారని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నర్సింహమూర్తి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, తదితరులు పాల్గొన్నారు. -
ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం
విజయనగరం అర్బన్: ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు అమలుచేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ డా.అహ్మద్బాబు, జిల్లా అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండించే పంటలు, కూరగాయలు, పూలు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు విశాఖలో మంచి మార్కెట్ ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. అహ్మద్ బాబు మాట్లాడుతూ వృద్ధిరేటు సాధనలో కిందిస్థాయి సిబ్బందిని భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్తో జాతీయవాష్ నిపుణుల భేటీ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత ఆధ్వర్యంలో జాతీయ వాష్ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) నిపుణులు సుధీర్కుమార్ బండారీ, సౌమేంద్ర రంజన్ గంగూలి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను కలెక్టర్కు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. డీఈలు ఢిల్లీశ్వరరావు, యడ్ల గోవిందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్మీపేటకు అదనపు బందోబస్తు
వంగర: మండల పరిధి లక్ష్మీపేటకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. లక్ష్మీపేటలో శనివారం పర్యటించిన ఆయన ఆక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక న్యాయస్థానాన్ని పరిశీలించారు. 2012 జూన్ 12న జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వంగర పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట రూరల్ సీఐ హెచ్. ఉపేంద్ర ఉన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు విజయనగరం: ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాసీ్త్రయ పద్ధతుల్లో తొలగించడం ముఖ్య మని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధా న కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్థా లను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని చె ప్పారు. విజయనగరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇ–వ్యర్థాలపై నగరంలో పైడితల్లి అమ్మ వారి ఆలయం నుంచి కోట వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద విద్యార్థులు, మహిళలు స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఇ–వ్యర్థాలను శాసీ్త్రయంగా తొలగిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను వెలికితీయవచ్చన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన ఇ–వ్యర్ధాల సేకరణ కౌంటర్ను ప్రత్యేక అధికారి పరిశీలించారు. అనంతరం పైడితల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అంబేడ్కర్, కమిషనర్ పి.నల్లనయ్య, ఆర్డీఓ కీర్తి, ఈఈ బి.బి.సరిత పాల్గొన్నారు. -
గొంతు కోసి నడిరోడ్డుపై వదిలేసి
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడిబొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(25) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. భవాని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్ పని చేస్తోంది. శనివారం మధ్యా హ్నం 3.30 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోటల్లో పని చేసిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. పైడిభీమవరంలోని బోనం పేరంటాలు గుడి సమీప ప్రాంతం. సాయంత్రం 6 గంటల సమయం. అంతా రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతలో ఒకామె నడుచుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు గమనించి వెళ్లి చూసేలోపే అప్పటికే తెగిన ఆమె గొంతు నుంచి రక్తం ధార కట్టి ఆ ప్రాంతమంతా ఎర్రగా మారిపోయింది. పైడి భీమవరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాతికేళ్ల వివాహితను అత్యంత కర్కశంగా గొంతుకోసి చంపేశారు.పైడిభీమవరం నడిబొడ్డున ఘటన వివాహిత దారుణ హత్య -
పెరుమాళి పీఏసీఎస్లో దర్యాప్తు
తెర్లాం: మండలంలోని పెరుమాళి పీఏసీఎస్లో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం దర్యాప్తు నిర్వహించారు. బొబ్బిలి సబ్ డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారి చల్లా పద్మజ పీఏసీఎస్కు వచ్చి ఫిర్యాదుదారు, పీఏసీఎస్ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో దర్యాప్తు చేశారు. పీఏసీఎస్లో రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తున్నారని, నచ్చిన వారిని ఎటువంటి జీవోలు లేకుండా ఉద్యోగులుగా నియమించుకుని వేలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పెరుమాళి పీఏసీఎస్ పరిధిలో డీసీసీబీ నిధులతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని, ఆ బంక్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని కొరగంజి అశోక్ దర్యాప్తు అధికారి వద్ద తెలిపారు. దీనిపై దర్యాప్తు అధికారి పద్మజ మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్లో జరిగిన దర్యాప్తులో ఫిర్యాదుదారులు తెలిపిన వివరాలు, సభ్యులు లెవనెత్తిన అంశాలను, సూపర్వైజర్, మేనేజర్ దర్యాప్తుకు హాజరుకాని విషయంపై నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేస్తానని చెప్పారు. దర్యాప్తులో పీఏసీఎస్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
బొబ్బిలి: ప్రశాంతమైన బొబ్బిలిలో యువత గంజాయికి అలవాటు పడ్డారు. ఈ విషయమై పోలీసులు పెట్టిన నిఘాలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ఆ దిశగా విచారణచేసిన పోలీసులకు ముగ్గురు బీటెక్ విద్యార్థులు పట్టబడినట్లు తెలిసింది. వారు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి కాలేజీలో చదువుకుంటున్న వారుగా గుర్తించారు. పోలీసులు జరుపుతున్న విచారణలో మొత్తం ఏడుగురిని ప్రాథమికంగా గుర్తించి విక్రేతలు, కొనుగోలుదారులే కాకుండా సాగు చేస్తున్న వారి వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమంటే పోలీసులు గుర్తించిన నిందితుల్లో సుమారు 70ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంజాయిని వినియోగిస్తూ, విక్రయిస్తున్న వారిలో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్కువ మండలంలోని కంచేడువలస, కొయ్యాన పేట గ్రామాలకు చెందిన లక్ష్మ ణరావు, కాంతారావులు బొబ్బిలి పట్టణానికి చెందిన యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఎస్సై ఆర్ రమేష్ను వివరణ కోరగా పట్టణంలో విక్రయిస్తూ గంజాయి కలిగి ఉన్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై బుధవారమే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పూర్తిస్థాయిలో నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో పూర్తివివరాలను వెల్లడిస్తామన్నారు. వన్టౌన్ పోలీసుల అదుపులో మరో ఇద్దరు..విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను విజయనగరం వన్టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన సమాచారం మేరకు..నగరంలోని గూడ్స్ షెడ్వద్ద వన్టౌన్ ఎస్సై ప్రసన్నకుమార్ వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు తాను డ్రైవ్ చేస్తున్న బైక్ను ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చి మ్యాన్ ఫ్యాక్ ద్వారా యువకుడితో పాటు బైక్పై వెళ్తున్న మరో వ్యక్తిని పట్టుకుని విచారణ చేసి రెండు కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని శాంతినగర్కు చెందిన వాసుపల్లి విజయ్(19)ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీ చేసి స్కూటీని, వారు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఏడుగురిని గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇచ్చి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, డీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. కొండపల్లి శ్రీనివాస్కు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులను రద్దుచేసి సూపర్ సిక్స్లో భాగంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేయలేదని వాపోయారు. వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మొదటి వారానికి నోటిఫికేషన్ ఇస్తామని జూన్ నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నా రు. జిల్లాలో దాదాపు 20 వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో ఒక వైపు కుటుంబం నుంచి ఒత్తిడి మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డీఎస్సీలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళి, నరేష్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్ జిల్లా మంత్రికి వినతిపత్రం అందజేత -
ప్రవర్తన మారకుంటే జైలుకే
● రౌడీషీట్లర్లకు ఎస్పీ హెచ్చరిక విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్పీ వకుల్ జిందల్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో తమ తమ స్టేషన్ల పరిధిలో ఉన్న పాత నేరస్తులను శనివారం పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో సంబంధిత స్టేషన్ల ఎస్సైలు హిస్టరీ,రౌడీషీట్లు కలిగిన నేరస్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, చీపురుపల్లి, గరివిడి, గజపతినగరం, ఎస్.కోట, వల్లంపూడి ఇలా 34 స్టేషన్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల ప్రవర్తన, వారు రోజువారీ నిర్వర్తించే పనులపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి సెట్ కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. రౌడీలు మళ్లీ దురుసుగా నేరాలకు పాల్పడే విధంగా ఉంటే ప్రత్యేకంగా వారిపై నిఘా తీవ్రతరం చేయాలని సూచించారు. 25 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్తెర్లాం: అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్న వ్యక్తి వద్ద 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై సాగర్బాబు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఎస్సై మాట్లాడుతూ మండలంలోని నందబలగ గ్రామంలో బమ్మిడి నారాయణరావు అనే వ్యక్తి అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి దాడి చేశామన్నారు. ఈ దాడిలో 25 మద్యం సీసాలతో పట్టుబడిన నారాయణరావును అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించామని చెప్పారు. సమగ్ర శిక్షలో సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్● 21 నుంచి తరఖాస్తుల స్వీకరణ విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఉత్తర్వుల మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ అధికారి, అసిస్టెంట్ ఏఎంఓ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోస్టులకు అర్హతగల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. దరఖాస్తు తదితర వివరాలను ‘విజయనగరం.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ను సందర్శించిన ఈడీగజపతినగరం : ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ల్లో అన్ని మౌలికవసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల రాకపోకల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చి వెళ్లే ఏర్పాట్లు చేశామన్నారు. ఏవైనా బస్సులు విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా సాలూరు వెళ్లేవి, సాలూరు నుంచి గజపతినగరం మీదుగా విజయనగరం వెళ్లేవి గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్(డిపోకు)కు రాకుండా డైరెక్ట్గా వెళ్లిపోయినట్లయితే తమకు సమాచారం ఇస్తే సంబంధిత డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.అనంతరం కాంప్లెక్స్లో తాగునీరు, ప్రయాణికుల మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీపీడీఓ అప్పలనాయుడు, డీఎం శ్రీనివాసరావు, ఆర్టీసీ కాంప్లెక్స్ కంట్రోలర్ ఆరిక తోట జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక పాఠశాలకు టాటా..?
పాఠశాల ఎత్తివేసే పరిస్థితి మా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు చేస్తున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఉన్నత పాఠశాలల వైపు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం, గ్రామ ప్రజా ప్రతినిధులతో ఆలోచన చేయలేదు. గురుగుబెల్లి స్వామినాయుడు, కళింగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వాల్తేరు మంచి విధానమే అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక విద్యకు అడ్మిషన్లు ఇవ్వడంలేదు. గతంలో 3 నుంచి 5 వ తరగతివరకూ విలీనమైన ఉన్నత పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాం. ఈ విధానంతో ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాల అక్కడ కొనసాగాలంటే కనీసం 45 మంది విద్యార్థులు దాటి ఉండాలి. యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం. ● ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచే అడ్మిషన్లు ● ఎక్కడైనా చేరవచ్చంటూ అంటూ జీఓ జారీ ● జిల్లావ్యాప్తంగా 287 ప్రాథమిక పాఠశాలల ఎత్తివేతకు కసరత్తురాజాం: ప్రభుత్వ విద్య బలోపేతం మాట పక్కన పెడితే ఉన్న విద్య అటకెక్కేలా కనిపిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా గడిచిన రెండేళ్ల క్రితం నుంచే కేంద్ర మానవవనరులశాఖ ప్రభుత్వ ప్రాథమిక విద్యను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆర్టీఈని ప్రయోగించింది. అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ విద్యావిధానాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రాభుత్వ ప్రాఽథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల వద్ద ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసింది. మరోవైపు ఎన్ఈపీని గౌరవిస్తూ 3 నుంచి 5 వతరగతి వరకూ కొన్నిగ్రామాల్లోని (ఉన్నత పాఠశాల నుంచి 500 మీటర్లు లోపు ఉన్న పాఠశాలలకు చెందిన) తరగతులను గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారంతో విలీనం చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ విధానాన్ని చాలా గ్రామాల్లో వ్యతిరేకించడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు చాలాచోట్ల యథావిధిగా కొనసాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు అన్ని మండల మానవ వనరుల కేంద్రాలకు, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు తమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచే చేరికలు చేసుకోవచ్చునని ఆదేశాలు జారీచేసింది. 287 పాఠశాలల వరకూ విలీనం కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే చాలామంది ఉద్యోగులు, ప్రధానంగా ఉపాధ్యాయుల్లో ఈ విధానం ఆందోళన కలిగించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి బాహాటంగానే మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఈ సర్క్యులర్లు అందుకున్న పాఠశాలలు తమ పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల ప్రారంభానికి కసరత్తు చేసుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో ఇదివరకే ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం గుట్టుగా చేస్తున్నారు. ఈ కొత్త జీఓ బయటకు వస్తే చాలామంది నిరుద్యోగుల్లో వ్యతిరేకత అధికమవుతుందనే ఉద్దేశంతో విద్యాశాఖ గుప్చుప్గా తంతు నడిపిస్తోంది. ఈ విషయం తెలిసి నిలదీస్తున్న పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఒకటో తరగతి అడ్మిషన్లు ఇస్తున్నామని, విద్యార్థులకు ఎక్కడ నచ్చితే అక్కడ చేర్పించుకోవచ్చునని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1317 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 168 ప్రాథమికోన్నత పాఠశాలలు, 232 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో గ్రామంలో గతంలో విద్యార్థులు, జనాభా సంఖ్య ఆధారంగా ఒకటి నుంచి మూడేసి ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు ఇందులోని 287కిపైగా ప్రాథమిక పాఠశాలలు దగ్గర్లోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఎత్తివేతకు సిద్ధంగా రాజాం పట్టణంలోని డోలపట ప్రాథమిక పాఠశాలవింత కొర్రీలుమరోవైపు ప్రాథ మిక పాఠశాలల్లో వంటలు వండుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఖ్య కుదింపు ప్రారంభమైంది. పూర్తిగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల విధానం ప్రాథమిక పాఠశాలల్లో అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్నత పాఠశాలల్లో చేరిన 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు మళ్లీ వెనక్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కొత్త కొర్రీ పెడుతోంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మళ్లీ వెనక్కు వెళ్లాలంటే కుదరదని కచ్చితంగా చెబుతుంది. అలా తప్పని పరిస్థితుల్లో వెళ్లాలంటే దగ్గరలో 45 మంది విద్యార్థులు దాటి ఉన్న ప్రాథమిక పాఠశాలకు, మోడల్ స్కూల్కు వెళ్లాలని చెబుతున్నారు. ఫలితంగా విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో మానేసి, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. -
మెప్మా ఆర్పీల ఆందోళన
బొబ్బిలి: మెప్మా ఆర్పీలు బొబ్బిలిలో గురువారం ఆందోళనకు దిగారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ శాఖ పీడీ చిట్టిరాజుకు వివరించారు. కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. నెలకు ఇచ్చే రూ.8వేలు వేతనం ఖాతాలకు జమచేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. శ్రమకు తగిన వేతనం ఇవ్వడంలేదంటూ వాపోయారు. గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదుకోసం వేలాది రూపాయల ఖర్చుతో మహిళాభివృద్ధి కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శనలను నిర్వహించి మెప్నా డీఎం ఏర్పాటుచేసిన యాప్లో నమోదు చేశామన్నారు. వాటికి పైసా డబ్బులు ఇవ్వలేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ బొబ్బిలి మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంపై మండిపాటు కనీస వేతనాలు చెల్లించాలంటూ మెప్మా పీడీకి వినతి ఆర్పీల ప్రధాన డిమాండ్లు ఇవే.. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం నెలకు రూ.18,600 చెల్లించాలి. ఇరవయ్యేళ్ల సీనియార్టీ ఉన్న ఆర్పీలను సీఓలుగా ప్రమోట్ చేయాలి. -
ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం
కొత్తవలస: ఉద్యోగ భరోసా కల్పిస్తేనే విధులకు హాజరువుతామని అప్పన్నపాలెం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం కార్మికులు స్పష్టంచేశారు. యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికలు రెండు రోజులుగా విధులను బహిష్కరించారు. కర్మాగారం యాజమాన్యంతో వైఎస్సార్టీయూసీ (కార్మిక సంఘం) జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి గణేష్, సీఐటీయూ నాయకులు టి.సూర్యనారాయణ, కార్మిక సంఘ నాయకులు గురువారం చర్చలు జరిపారు. కార్మికులకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్మాగారం హెచ్ఆర్ మేనేజర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని టాప్ మేనేజ్మెంట్కు మెయిల్ చేశానని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయుకులు లగుడు వామాలు, గాడి అప్పారావు పాల్గొన్నారు. స్పష్టంచేసిన జిందాల్ కార్మికులు -
హత్యా..? ఆత్మహత్యా..?
పూసపాటిరేగ: భోగాపురం మండలం రావాడ గొల్లపేట గ్రామంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇప్పిలి అంకయ్యమ్మ (55), భర్త రమణ తరచూ రాజాపులోవలో ఉన్న ఎకరా ఢీ పట్టా భూమి విషయంపై గొడవ పడేవారు. డీ పట్టా అత్తపేరు మీద ఉండడంతో ఆ భూమిని విక్రయించేందుకు రమణ పలు మార్లు ప్రయత్నించాడు. దీనిని అంకయ్యమ్మ అడ్డుకుంది. ఈ విషయంపై ఇద్దరు కుమారులు, కుమార్తె సమక్షంలోనే భార్యాభర్తలు వాగ్వాదం చేసుకునేవారు. ఈ క్రమంలో అంకయ్యమ్మ మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి భర్త రమణ, మృతురాలి బావ నర్సయ్య, కుమారుడు వెంకటేష్ కారణమని, ఆ సమయంలో ఈ ముగ్గు రూ ఇంట్లోనే ఉన్నారని బంధువులు చెబుతున్నారు. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ సూర్యకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి ఆస్తి వివాదమే కారణమా? కుటుంబ సభ్యులే హత్యచేశారంటూ బంధువుల ఆరోపణ దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
ఆన్లైన్లోనే సహకారం
● అన్ని సహకార సంఘాల్లోనూ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి ● పీఏసీఎస్ల సేవల్లో పారదర్శకతకు అవకాశం విజయనగరం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి, అక్రమాల నిరోధానికి గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సాంకేతికత చర్యలు ఫలించాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని సంఘాల్లోనూ పూర్తయింది. ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశాబ్దాల కిందట సభ్యత్వం తీసుకున్న రైతులు, రుణాల వివరాలను ఆన్లైన్ చేశారు. గతేడాది మార్చి నెలాఖరుకు ఆడిట్ నివేదికలో ఉన్న బ్యాలెన్స్ ఓచర్లు నమోదు చేశారు. డిజిటలైజేషన్ పూర్తి ఉమ్మడి విజయనగరం జిల్లాలో లాభాలు, నష్టాల్లో నడుస్తున్న అన్ని సహకార సంఘాలను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో 94, పార్వతీపురంలోని 64 సంఘాల్లో దాదాపు 5 లక్షల మంది రైతులు సభ్యులుగా నమోదయ్యారు. ఇటీవల చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తరువాత 1.4 లక్షల మంది మాత్రమే పక్కా ఆన్లైన్ సేవలకు అర్హులైన రైతులుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా రైతులు పొందుతున్న సేవల ఆధారంగా తుది జాబితాను ఖరారు చేశారు. అక్రమాలకు చెక్ సహకార సంఘాల్లో క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది రుణాల కోసం పర్సంటేజీలు వసూలు చేస్తు న్నారు. 30 శాతానికిపైగా సొసైటీల్లో రైతులు రుణ చెల్లింపులు చేసిన వెంటనేకాకుండా కొందరు సహకార సిబ్బంది తమ అవసరాలకు డబ్బులు వాడుకొని నిదానంగా జమ చేయడం, మరికొందరు సొమ్మును దుర్వినియోగం చేసి రైతులు చెల్లించలేదంటూ మాయచేసిన ఘటనలు గతంలో కనిపించేవి. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాలెన్స్, ముగింపు నిల్వల వివరాలు పక్కాగా ఉంటాయి. పాత తేదీలకు నమోదుచేసే అవకాశం ఉండదు. రైతు నగదు చెల్లించిన రోజే ఖాతాలో జమచేయాలి. సొసైటీ ఇచ్చిన అప్పులు, రుణ గ్రహీతల వివరాలు, చెల్లింపులు పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయిలో 1.4 లక్షల మంది సభ్యత్వం ఉన్న సంఘాలుగా ఖరారయ్యాయి. ఈ–ప్యాక్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ శతశాతం సంఘాల్లో పూర్తయింది. ఆన్లైన్ కంప్యూటరీకరణ నేపథ్యంలో లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. ఈ సొసైటీల్లో ఆన్లైన్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల తరహాలో బ్యాంకింగ్ ప్రక్రియ సాగనుంది. – సీహెచ్ ఉమామహేశ్వరరావు, సీఈఓ, డీసీసీబీ -
అంబేడ్కర్ దార్శనికత దేశానికే మార్గనిర్దేశం
విజయనగరం అర్బన్: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని, ఆయన దార్శనికత దేశానికి మార్గనిర్దేశం ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి, విద్యావేత్త ప్రొఫెసర్ సంజయ్ పాశ్వాన్ అన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణం మరియు మహిళా సాధికారతలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు జాతీయ సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అణచివేత, సాధికారత వంటి సమస్యల పరిష్కారంలో అంబేడ్కర్ చొరవను కొనియాడారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ మహిళలకు చట్టపరమైన సమాన త్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లుకు ఆయన చేసిన కృషిని వివరించారు. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు విషయాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చారన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ప్రమాణ్ణి జయదేవ్ మాట్లాడుతూ సామాజిక పనిలో అంబేడ్కర్ తత్వశాస్త్రం ప్రాముఖ్యతను, సమ్మిళిత విధాన రూపకల్పనపై ఆయన ప్రభావాన్ని వివరించారు. యూనివర్సిటీ వీసీ టీవీ కట్టిమణి మాట్లాడుతూ సమాజహితమైన అంశాలపై కళాశాల స్థాయి విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహించడం వల్ల చైతన్యవంతమై సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అనంతరం ముఖ్య అతిథులను వీసీ సత్కరించారు. డాక్టర్ ఎం.నగేష్ ఆధ్వర్యంలో సాగిన సెమినార్లో ప్రొఫెసర్లు జె.ఎం.మిశ్రా, ఎం.శరత్చంద్రబాబు, ఎల్.వి.అప్పసాబా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ -
ఎముకల విభాగం వైద్యుడికి మెమో జారీ
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులను సొంత క్లినిక్లకు తరలిస్తున్నారనే ఆరోపణలపై ‘మా క్లినిక్కు వచ్చే యండి..!’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన కథనానికి సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. రోగిని తన క్లినిక్కు రమ్మని చీటీరాసి ఇచ్చిన వైద్యుడికి మెమో జారీ చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు తెలిపారు. డీపీఎంఓగా రవికుమార్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: డిస్ట్రిక్ ప్రొగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ ఎం.ఎం.రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీపీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. సూర్యనారాయణ స్థానంలో రవికుమార్ రెడ్డిని నియమించారు. 19న వాష్ కేంద్ర బృందం సందర్శన బాడంగి: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్ (వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ, గ్రామీణ రక్షితనీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్జీవన్మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాన్ని గురువారం పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఢిల్ల్శ్వేరరావు, పంచాయతీ విస్తరణాధికారి సూర్యనారాయణ, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాలవలస గౌరు, తదితరులు పాల్గొన్నారు. అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విజయనగరానికి చెందిన శివప్రసాద్ గురువారం రూ. లక్షా116లు విరాళం అందజేశారు. దేవస్థానం తరఫున దాతకు స్వామివారి అన్నప్రసాద విభాగం ఏఈఓ పిళ్లా శ్రీనివాసరావు బాండ్ అందించారు. అనంతరం అధికారులు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు. దరఖాస్తు స్థితిని ఓటర్లు తెలుసుకోవచ్చు ● డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి విజయనగరం అర్బన్: ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. సీఈఓఆంధ్రా.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో వివరాలు ఉంటాయని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో వచ్చిన క్లైమ్లు, వాటి స్థితిగతులను వివరించారు. జిల్లాలో సవరణ అనంతరం జనవరి 6న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం 15,68,048 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, అప్పారావు, సోములు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా నేలల్లో నత్రజని లోపం
● పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ● సేంద్రియ కర్బన లోపం కూడా ఎక్కువే.. ● నాలుగు మండలాల్లో జింక్ లోపం ● 2024–25లో 21,175 మట్టి నమూనా పరీక్షలు ● ఈ ఏడాది లక్ష్యం 28,392 విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని నేలల్లో నత్రజని లోపం అధికంగా ఉంది. భూసార పరీక్ష కేంద్రం అధికారులు చేపట్టిన మట్టి నమూనా పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. నత్రజనితో పాటు సేంద్రియ కర్బనం లోపం కూడా ఉన్నట్టు తేలింది. కొన్ని మండలాల్లో జింక్, ఐరన్ లోపం ఉంది. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పంట ఎదుగుదల లోపించడంతో పాటు పంట దిగుబడి గణనీయంగా తగ్గుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. నత్రజని పంటకు ఆక్సిజన్ లాంటిదని పేర్కొన్నారు. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువుల గెత్తం, వర్మీ కంపోస్టును పొలాల్లో వేసుకోవాలన్నారు. లేదంటే జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూమిలో కలియదున్నాలన్నారు. లక్ష్యం 28,392 భూసార పరీక్షలు 2024–25 సంవత్సరానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రం అధికారులు 21,205 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా 21,175 పరీక్షలు చేశారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి 28,392 పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 15 సెం.మీ లోతులో వి–షేప్ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించనున్నారు. నాలుగు మండలాల్లోని నేలల్లో జింక్ లోపం జిల్లాలోని చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, బొబ్బిలిలో జింక్ లోపం ఉంది. జింక్ లోపం నివారణకు దమ్ములో ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ వేయాలి. ● జిల్లాలోని చీపురుపల్లి, బొబ్బిలి మండలాల్లోని భూముల్లో ఐరన్ లోపం కూడా ఉంది. దీని నివారణకోసం అన్నభేది 2.5 గ్రాములు, నిమ్మ ఉప్పు 5 గ్రాముల చొప్పన లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పోషక లోపాలను భర్తీచేయాలి భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 28,392 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బన లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. – భానులత, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం -
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు
–10లో1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీ సులు దాడులు చేశారు. 1800 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. విజయనగరం అర్బన్: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. విజయనగరం నియోజకవర్గం కొండకరకాంలో 12 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం మోదవలసలో 19.8 ఎకరాలు, గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొండకిండాంలో 57 ఎకరాలు, రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం సంకిలిలో 20 ఎకరాలు, బొబ్బిలి నియోజవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కిలో 100 ఎకరాలు, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కుమరాంలోని 10 ఎకరాలు, ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టంలోని 57 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విజయవాడ ఏపీ సచివాలయంలో సీఎస్ సమావేశ మందిరం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీరు సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర, తదితర అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో కలెక్టర్ అంబేడ్కర్, జేసీ ఎస్.సేతుమాధవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
ఇంటర్ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి
పార్వతీపురంటౌన్: ఇటీవల మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఇంటర్ బోర్డు పేర్కోన్న నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలని కోరారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరాల్లో గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. సబ్జెక్టు వారీగా ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థులు రూ.600తో పాటు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చెప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు రూ.275, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సులకు హాజరయ్యే వారు రూ. 165 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ బీఐఈ.ఏపీ.జోఓవీ.ఐన్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే.28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నైతికత, మానవ విలువలు పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న జరగనున్నట్లు వివరించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ -
1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై గురువారం నిర్వహించిన దాడుల్లో 18 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు సీఐ వీవీఎస్ శేఖర్బాబు, కురుపాం ఎకై ్సజ్ ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్లు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ దాడుల్లో 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సారా స్థావరాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి ముడిసరుకు సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిర్ధారణ అయితే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యిలీటర్ల సారా ఊటలు ధ్వంసం భామిని: మండలంలోని కొత్తగూడలో గురువారం సారా అమ్మకం దారులపై దాడులు జరిపి 40లీటర్ల సారాతో ఇద్దరు అమ్మకం దారులు బిడ్డిక రవి, బిడ్డిక కొండలరావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఏఈఎస్ ఏఎస్,దొర ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే దాడిలో వెయ్యి లీటర్ల సారా ఊటలు ధ్వంసం చేసి సారా తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాలకొండ ఎకై ్సజ్ సీఐ కె.సూర్యకుమారి సారథ్యంలో నవోదయం 2 కిం సారా నిర్మూలనలో భాగంగా సారా తయారీకి బెల్లం అందిస్తున్న ఘనసరకు చెందిన భూపతి షణ్ముఖపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాడుల్లో పాలకొండ సీఐ సూర్యకుమారితో పాటు మొబైల్ సీఐ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మయి, పి.లీలారాణి, పాలకొండ ఎస్సై కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా..?
ఇలా ఈ ముగ్గురే కాదు. జిల్లాలోని వందలాది మంది ప్రజలు ఎన్ని ఆపసోపాలు పడినా..ఆధార్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. జిల్లాలోని ఏ సచివాలయానికి వెళ్లినా, ఎవరిని అడిగినా జిల్లా కేంద్రంలో పెదపోస్టాఫీసుకు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లండి, అక్కడైతేనే చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం జిల్లాలో సరైన ఆధార్ కేంద్రాలు లేకపోవడమేనని తెలుస్తోంది. గతప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోక పోవడం, సచివాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడం, పరికరాలు ఉన్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో హెడ్్పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడా టోకెన్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. దీంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఒక రోజుకు వందటోకెన్లకు పైగా బుక్ అవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వేకువ జామునుంచే పడిగాపులు హెడ్పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో ఆధార్ మార్పుల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు వేకువ జామునుంచే టోకెన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఈ కార్యాలయాల వద్ద సుమారు 150మందికి పైగా ఒకేసారి వచ్చారు. టోకెన్లు ముందే బుక్ అయ్యాయని తెలియక పడిగాపులు కాశారు. ఈ విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు టోకెన్ల కోసం క్యూలో వేచి ఉన్నారు. జిల్లాలో ఆధార్, సెంటర్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు పదుల సంఖ్యలో బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నా ఎక్కడా సేవలు అందించడం లేని తెలుస్తోంది. గతంలో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిబ్బంది కొరత, పరికరాలను మూలపడేసిన కారణంగా మారుమూల గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెడ్పోస్టాఫీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. -
లైంగికదాడి కేసులో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి పోలీస్స్టేషన్లో 2020వ సంవత్సరంలో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం మహిళాకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పదేళ్ల కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ..గరుగుబిల్లి మండలం, దళాయివలస గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు జీవనోపాధి నిమిత్తం 2017వ సంవత్సరంలో ఆకివీడులోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తూ కంపెనీ హాస్టల్లో ఉంటూ జీవనం సాగిస్తుండగా..అదే సంవత్సరంలో గరుగుబిల్లి మండలం, కొంకడివరం గ్రామానికి చెందిన ముద్దాయి బలగ శివ జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి పలుమార్లు శారీరకంగా లోబరుచుకుని మోసం చేశాడన్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువైన మేరకు విజయనగరం న్యాయస్థానం పైవిధంగా శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
● విజేత బలిజిపేట ● బహుమతులు అందజేసిన ఏఆర్ ఏఎస్పీవిజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్లో నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్లో ముగింపు వేడుకలకు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వాలీబాల్ పోటీలలో నాలుగు పోలీస్స్టేషన్ల పరిధికి చెందిన ఏఆర్,సివిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ కానిస్టేబుల్గా పని చేసిన గోపాలరావు ఏఆర్ విభాగానికి ఓ డాక్టర్గా సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఙాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం ఆయన సేవలను గుర్తుంచుకోవడమేనన్నారు.ఈ టోర్నమెంట్లో ప్రథమస్థానంలో నిలిచిన బలిజిపేట జట్టుకు రూ.12 వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన గంట్యాడ జట్టుకు రూ.8 వేలు తృతీయ స్థానంలో నిలిచిన కొత్తవలస జట్టుకు రూ.6 వేలు కన్సొలేషన్ ప్రైజ్గా విజయనగరం జట్టుకు రూ.4 వేలు ఏఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐలు గోపాలరావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, మహేష్, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ కుటుంబసభ్యలు పాల్గొన్నారు. -
తప్పని ఆధార్ తిప్పలు
● కార్డులో మార్పులకు అవస్థలు ● జిల్లాలో పనిచేయని కేంద్రాలు ● సచివాలయాల్లో మూలన పడిన పరికరాలు ● జిల్లా కేంద్రంలో పోస్టాఫీసు వద్ద మాత్రమే నమోదు పార్వతీపురంటౌన్: ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఊర్మిళ తన చంటి బిడ్డతో దయనీయంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద వేచిచూస్తోంది. తనకు ఆధార్లో అడ్రస్ మార్పు గ్రామ సచివాలయంలో అవడం లేదని జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాల వద్ద అప్డేట్ అవుతుందన్న సమాచారం తెలుసుకుని పట్టణానికి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని, 4గంటల కాలం పాటు వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది. ● కొమరాడ మండలం పొడుగువలస గ్రామానికి చెందిన కిల్లక అరుణ మూడు రోజులుగా ఆధార్ అప్డేట్ కోసం వేచి చూస్తోంది. ప్రతిరోజూ బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి వేచి చూస్తున్నా ఆమెకు టోకెన్ దొరకడం లేదు. సిబ్బందిని టోకెన్ కావాలని అడగ్గా వారం రోజుల పాటు టోకెన్లు ఇచ్చేశామని, అయినా సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.● పార్వతీపురం మండలం ఆర్కె బట్టివలస గ్రామానికి చెందిన వెంకీ తన కుమార్తె, కుమారుడు నాని, దివ్యల ఆధార్ అప్డేట్ చేయడానికి మూడు రోజులుగా పార్వతీపురం పట్టణంలోని పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ టోకెన్లు లేవన్న కారణంతో అప్డేట్ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు. -
ప్రతి 3 నెలలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీ కులాలు, షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఇక నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. సమావేశం నిర్వహించిన అనంతరం మినిట్స్ను కలెక్టర్కు పంపాలని, అక్కడి అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్ఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్ను పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల స్మశానాలు లేవని, మరికొన్ని చోట్ల ఆక్రమించుకున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ముగ్గురు ఆర్డీఓలు అన్ని ఎస్సీ కాలనీల్లో తనిఖీ చేసి శ్మశానాలు ఎక్కడెక్కడ లేవో, ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో పరిశీలిలంచి నివేదిక పంపాలని ఆదేశించారు. కొన్ని చోట్ల 2 గ్లాస్ల విధానం ఇంకా అమలవుతోందని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా చట్టంపై పోలీసులు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఏపీజీఎల్ఐ ఎ.డి హైమవతి, ట్రాన్స్కో ఎస్ఈ లక్ష్మణరావు, డీఎస్పీలు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పేదల భూముల ఆక్రమణపై విచారణ జరిపించండి
సాలూరు: నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో దళితులు, గిరిజనులు, నిరుపేదల భూములు అన్యాయంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, మంత్రి సంధ్యారాణికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నింటిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మండలంలోని మోసూరు గ్రామంలో దళితులు సుమారు 24 ఏళ్ల క్రితం, వారికి పట్టాలివ్వక ముందు నుంచి బంజరుభూములు సాగుచేసుకోగా తరువాత ప్రభుత్వం వారికి పట్టాలిచ్చిందన్నారు. ఈ పట్టాలు ఇచ్చి సుమారు 20 సంవత్సరాలు దాటిపోయిందని, సుమారు 24 ఏళ్లుగా సాగుచేస్తున్న దళితుల భూముల మీదకు ఇటీవల విచారణలో భాగంగా అధికారులు స్థానిక బీసీలను తీసుకువెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మోసూరులో పాఠశాల భవనం కట్టిన స్థలం ప్రభుత్వానిదా? లేక జిరాయితీ స్థలమా? అన్న విషయం అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండానే దళిత ఎంఈఓపై సస్పెన్షన్ విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరాయితీ స్థలంలో పాఠశాల భవనం నిర్మించారని, పాఠశాల కావడంతో ఎవరూ ఏమీ అనలేదన్నారు. తరువాత భవనం పడిపోయి నిపపయోగంగా ఉండడంతో, స్థలం యజమాని భూమిని అమ్మగా స్థానిక సర్పంచ్ కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసిన తరువాత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే మోసూరు గ్రామంలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేయగా, చెరువు ఆక్రమణ వాస్తవమేనని అంగీకరిస్తూ అది ఎవరు ఆక్రమించారో తెలియదని రెవెన్యూ అధికారులు పేర్కొనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి నిజంగా గ్రామంలోని చెరువులు ప్రభుత్వానికి అవసరం లేకపోతే అక్కడ ఉన్న దళితులు, గిరిజనులు, బీసీ, అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలని కోరారు. దళితులు, గిరిజనుల భూములను ఎక్కడైనా ఎవరైనా ఆక్రమిస్తే దర్యాప్తు చేయించి, దర్యాప్తును అనుసరించి సర్వే చేసి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో తాను మాట్లాడిన విషయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై రాజన్నదొర స్పందిస్తూ, తాను మాట్లాడిన విషయాలను అంశాల వారీగా ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తానన్నారు. ఆ సభలో తాను అంబేడ్కర్ రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, వైఎస్సార్సీపీ నాయకుడు మొకర లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ127 శ్రీ218 శ్రీ228మెరిట్ జాబితా విడుదలగుమ్మలక్ష్మీపురం: ఏకలవ్య, ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెరిట్ జాబితా, విద్యార్థులు ఎంపికై న పాఠశాలల వివరాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ అధికారిక వెబ్సైట్ http://twreircet.apcfss.in లో పొందుపర్చినట్లు గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీర్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యార్థులు/తల్లిదండ్రులు వారి మెరిట్ స్థితిని, ఏ పాఠశాలకు ఎంపికయ్యారో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని తదనంతరం చర్యలకు సిధ్ధపడాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు తగిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో 2025 ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీలోగా ఆయా ఎంపికై న పాఠశాలలకు హాజరై నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రవేశాలకు గడువును పొడిగించబోరని స్పష్టం చేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. స్థానిక కోడి రా మ్మూర్తి వ్యాయామ సంఘం ప్రతినిధి, అభిన వ భీమ పెద్ది లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శిక్షణ పొందిన క్రీడాకారులు స్ట్రాంగ్ ఉమన్ జారా గోల్డ్ మెడల్ సాధించగా, ఉదయ్ అనే మరో క్రీడాకారుడు ద్వితీయస్థానంలో నిలిచి సి ల్వర్ మెడల్ సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు. బైపీసీ విద్యార్థులకు అవకాశం శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబానికి సిబ్బంది ‘చేయూత’ ● రూ.3 లక్షల ఆర్థిక సాయం విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు కుటుంబానికి ఏఆర్, సివిల్ సిబ్బంది అండగా నిలిచారు. తాము పోగుచేసిన సొమ్ము రూ.3 లక్షల 60 వేల నగదును ఎస్పీ వకుల్ జిందల్ చేతుల మీదుగా మృతుడి సతీమణి శారదకు గురువారం అందజేశారు. 2000 బ్యాచ్కు చెందిన ఏపీఎస్పీ, ప్రస్తుతం ఏఆర్ కన్వర్షన్గా బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్ కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా పొదుపు చేసిన రూ.3లక్షల 60వేలను సహచర ఉద్యోగి అకాలమరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థికంగా భరోసా కల్పించారని ఎస్పీ వకుల్ జందల్ ఈ సందర్భంగా అన్నారు. మృతుడి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకుగల సర్టిఫికెట్లను డీపీఓలో అందచేయాలని మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్ఐలు గోపాలనాయుడు, రమేష్, శ్రీనివాస్ రావు, మిలీనియం బ్యాక్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు, ఉమా మహేశ్వరరావు, పైడితల్లి, కృష్ణమోహన్, శేషగిరి, రమేష్, మోహన్, రమేష్, హరిశంకర్, చిట్టిబాబు, సీతారాం, చక్రధర్, ప్రసాద్లు పాల్గొన్నారు. -
చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి
పార్వతీపురం రూరల్: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరికీ చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం అయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పోలీస్ కాన్ఫరెన్సు హాల్లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సీఆర్పీఎస్ కేసులు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, ఇతర కేసులపై సమీక్షించారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని ఎస్పీ ఈ సందర్భంగా ఆదేశించారు. కళాశాలలో ర్యాగింగ్ లేకుండా అవగాహన కల్పించాలి ఈ నేర సమీక్ష సమావేశంలో ఐజీ కేవీ మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..జిల్లా పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో గంజాయి అక్కడినుంచి వస్తున్నందున రైల్వే, ఆర్పీఎఫ్ ఫోర్స్తో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని ఐజీ ఆదేశించారు. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2022, 2023వ సంవత్సరంలో విధి నిర్వహణలో ఉత్తమసేవలు అందించిన వారికి గుర్తింపుగా అందజేసిన యాంత్రిక సురక్ష, ఉత్కృష్ట సేవా పతకాలను సిబ్బందికి ఎస్పీ అందజేశారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
డిజిటల్ అరెస్ట్ కేసులో ఏబీసీడీ అవార్డు
● డీజీపీ చేతుల మీదుగా అందుకున్న వన్టౌన్ సీఐవిజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధి విజయనగరం వన్టౌన్ స్టేషన్ సీఐగా ఎనిమిది నెలల క్రితం చార్జ్ తీసుకున్న శ్రీనివాస్ ముంబై, పుణెలకు వెళ్లి మరీ నిందితులను పట్టుకున్నందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా మంగళగిరిలో బుదవారం అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ను అందుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో ప్రతి మూడు నెలలకోసారి పలు కేసుల ఛేదనలో స్థానిక స్టేషన్హౌస్ ఆఫీసర్లు చూపిన ప్రతిభను డీజీపీ ఆఫీస్ పరిశీలనలోకి తీసుకుంటుంది. అందులో భాగంగా గతేడాది దాదాపు కోటిన్నర పైగా డబ్బులు పొయాయని వన్టౌన్ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. ఎస్పీ వకుల్ జిందల్ అదేశాలతో అప్పుడే విజయనగరం వన్టౌన్ పోలీసులు డిజిటల్ అరెస్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కేసులో విజయనగరం వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మీప్రసన్నకుమార్లు జమ్ము, ముంబై, పుణె ప్రాంతాల్లో ఉండి మరీ ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏబీసీడీ అవార్డు పరిశీలనలోకి వెళ్లారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పరిశీలనలో విజయనగరం వన్టౌన్ సీఐ, ఎస్ఐల పేర్లు రావడం, మంగళగిరి నుంచి పిలుపు రావడంతో ఎస్పీ వకుల్ జిందల్తో కలిసి వెళ్లి వారు ఈ అవార్డును అందుకున్నారు. -
అవగాహన అవసరం
అగ్ని ప్రమాదాల నివారణకు● 14 నుంచి ప్రారంభమైన జాతీయ వారోత్సవాలుపార్వతీపురం రూరల్: ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యం వహించి మరికొందరు ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ‘అగ్ని సురక్ష దేశం కోసం– అందరం ఏకమవడం’ అనే నినాదంతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అగ్నిమాపక కేంద్రాలు పార్వతీపురం జిల్లా కేంద్రం, గుమ్మలక్ష్మీపురం, సాలూరులో, పాలకొండలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు పాటిస్తే మేలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ● అగ్గిపెట్టె లైటర్లు మండే పదార్థాలకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి ● నాణ్యతా ప్రమాణాలు ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను మాత్రమే వినియోగించాలి ● సెలవులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటి మెయిన్ ఆఫ్ చేయడం సురక్షితం ● వంట గదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి ● గ్యాస్ వాడకం పూర్తయిన తర్వాత సిలిండర్ వద్ద రెగ్యులర్ వాల్వ్ను నిలిపివేయాలి ● విద్యాసంస్థలు, ఆస్పత్రి, హోటల్లో అగ్నిప్రమాదాలు జరిగేటప్పుడు క్షేమంగా బయటపడేందుకు సరైన ప్రణాళికలను తయారుచేసి అవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు ● 17న ఆస్పత్రిలోని సిబ్బందికి తరగతులు, మాక్డ్రిల్ ప్రదర్శన ● 18న పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాముల్లో అవగాహన తరగతులు ● 19న కల్యాణ మంటపాలు, విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు ● 20 న రాజకీయ పార్టీ ప్రతినిధులతో అగ్నిమాపక కార్యాలయంలో ప్రమాదాల నివారణపై శిక్షణ తరగతుల సమావేశం.సమయస్ఫూర్తితో జాగ్రత్తలు పాటించాలి షాపింగ్ మాల్కు, అలాగే నూతన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ గోడలపై అంటించిన ఫైర్ సేఫ్టీ మ్యాపులను చూడాలి. అగ్నిప్రమాదాల నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు జరిగిన చోటికి సమాచారం అందగానే క్షణాల్లోనే చేరుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైన మేరకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలను తెప్పిస్తున్నాం. – కె. శ్రీనుబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
జిల్లాలో న్యాయ సేవలు సంతృప్తికరం
● జిల్లా జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి బొబ్బిలి: జిల్లాలో న్యాయమూర్తిగా అందజేసిన సేవలు తనకు సంతృప్తినిచ్చాయని జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. శాఖాపరమైన బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా జడ్జిగా వెళ్తున్నందున ఆయనను సత్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మోహన్ మురళీ కుమార్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు సీనియర్ న్యాయమూర్తి దామోదర రావు, స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ, ఏజేఎఫ్సీఎం రోహిణీరావు, న్యాయవాదులు కొల్లి సింహాచలం, ఎం.బెనర్జీ, ఎ.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.లక్ష్మి దీపవల్లి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో ఇసుకను తవ్వి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు బుధవారం సీజ్ చేశారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్తున్న ఆయన వేగావతి నదిలో ఇసుకను లోడ్ చేస్తుండగా గమనించి ట్రాక్టర్ డ్రైవర్లను తవ్వకాలపై ప్రశ్నించారు. ఎక్కడికి తరలిస్తున్నారని ,అనుమతులు, పర్మిట్లు ఉన్నాయా అని ఆరాతీసిన ఆర్డీఓకు అవేమీ లేవని బొబ్బిలికి తరలిస్తున్నామని డ్రైవర్లు తెలపగా వెంటనే రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ శ్రీనుకు ఆర్డీఓ ఆదేశాలు జారీచేశారు. ఎస్సైపై దాడికేసులో వ్యక్తి అరెస్టురాజాం సిటీ: సంతకవిటి ఎస్సైపై దాడిచేసి ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న సంతకవిటి మండలం జావాం గ్రామదేవత పగడాలమ్మ జాతర నిర్వహించారు. ఈ జాతరలో మద్దూరుశంకరపేట, జావాం గ్రామాల యువకుల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటను నివారించే క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆర్.గోపాలరావుపై మద్దూరుశంకరపేట గ్రామానికి చెందిన యడ్ల రమణ దాడిచేసి మెడలో రెండు తులాల బంగారు చైను తీసుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి నిందితుడిని మద్దూరుశంకరపేట గ్రామంలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సై ఆర్.గోపాలరావు, హెచ్సీ ప్రసాదరావు, పీసీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
రేగిడి: ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఈ కష్టానికి తోడు అదృష్టం కలిసిరావాలి. అప్పుడే ప్రభుత్వ కొలువైనా..ప్రైవేట్ ఉద్యోగమైనా లభిస్తుంది. అటువంటిది రేగిడి మండలంలోని ఓ యువకుడిని ఒకే దఫా మూడు బ్యాంకు ఉద్యోగాలు వరించాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన బెవర చూడామణి ఒకే ప్రయత్నంలో మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించాడు. లోకల్ యూనియన్ బ్యాంకులో ఎల్బీఓగా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రగా ప్రొబేషనరీ ఆఫీసర్గా, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్/క్యాషియర్గా ఉద్యోగాలు సాధించాడు. డిగ్రీ అనంతరం మూడు సంవత్సరాలు విజయవాడలో బ్యాంకు ఉద్యోగాల నిమిత్తం చూడామణి కోచింగ్ తీసుకుంటున్నాడు. చివరికి తన ప్రయత్నం ఫలించి, మూడు ఉద్యోగాలు సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తండ్రి బెవర గోపాలకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, తల్లి గౌరీశ్వరి గృహిణి. కొద్దిపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భంగా చూడామణి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల కష్టంతో పాటు రాజాంలోని ఎస్ఎల్టీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, తన పినతండ్రి ఉదయ్భాస్కర్ రాజా ప్రోత్సాహంతో తాను ఈ కొలువులు సాధించానని వెల్లడించాడు. -
రోబోటిక్స్ కోర్సులకు డిమాండ్
చికెన్నెల్లిమర్ల రూరల్: రానున్న కాలంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్కు సంబంధించిన కోర్సులకు మంచి డిమాండ్ ఉందని గాయత్రి విద్యా పరిషత్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ ధర్వేకర్ అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రోబోతాన్ 2కే25 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న రంగంలో పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టుల మూల్యంకనం చేసి బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి, ప్రొఫెసర్ దీపక్ కుమార్, సన్నీ డియోల్, పీఎస్వీ రమణారావు, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల నడుమ పామాయిల్ మొక్కల తొలగింపు
సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామంలో కొండపై వెలసిన కొండకామేశ్వర స్వామి ఆలయం ఇటీవల దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 84లో 2.70 ఎకరాల భూమి ఉంది. ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడంతో ఆలయ అర్చకుడు అడ్డుపడగా రెండు పర్యాయాలు వాయిదా పడింది. పొలంలోని పామాయిల్ మొక్కలు తొలగిస్తేనే కౌలుకు తీసుకునేందుకు ముందుకు వస్తామని సిరిపురం గ్రామ ప్రజలు పట్టుబట్టడంతో విజయనగరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష బుధవారం గ్రామానికి చేరుకుని జేసీబీ సహాయంతో మొక్కలను తొలగించారు. జేసీబీ పొలంలో దిగుతున్న సమయంలో, మొక్కలు తొలగిస్తున్న సమయంలో అర్చకుల కుటుంసభ్యులు పదేపదే జేసీబీకి అడ్డుతగిలారు. ఈ క్రమంలో అధికారులే రక్షణ కవచంలా నిలబడి వారిని నిలువరించారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందించినా ఎవరూ కనీసం రాలేదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష వాపోయారు. పని పూర్తి కావస్తున్న సమయంలో కేవలం ఇద్దరు పోలీసులు రావడం విశేషం. కార్యక్రమంలో ఈఓ బి.వి.మాధవరావు, రాజాం నవదుర్గ దేవాలయం ఈఓ పి.శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య
● విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఘటన చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తీడ వేదాంత కార్తికేయ(16) విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈనెల 7న విద్యార్థి కార్తికేయ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కోసం విశాఖపట్నంలోని శ్రీచైతన్య కళాశాలలో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి నాలుగు రోజులుగా అసౌకర్యంగా ఉండడంతో కళాశాల యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ మేరకు తల్లిదండ్రులు అచ్యుతరావు, పార్వతి మంగళవారం కళాశాల హాస్టల్కు వెళ్లి విద్యార్థితో మాట్లాడారు. తరువాత విద్యార్థిని హాస్టల్లో ఉంచి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ బుధవారం ఉదయం కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి కార్తికేయ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించగా తల్లిదండ్రులు కుమారుడి వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
డెంకాడ: మండలంలోని చొల్లంగిపేట జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని ఎన్జీఆర్ పురం గ్రామానికి చెందిన జిగిలి రాములప్పడు(54) అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య మహలక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. దీనిపై ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాములప్పడు, భార్య మహలక్ష్మి తమ కుమార్తె వివాహ విషయమై మాట్లాడేందుకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. కుమిలి–విజయనగరం రోడ్డులోని చొల్లంగిపేట జంక్షన్కు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న రాములప్పడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, బైక్ వెనుక కూర్చున్న మహలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు. మృతుడి సోదరుడు జిగిరి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత.. గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి హెచ్సీ ఈశ్వరరావు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన సవలాపురపు సంజీవు, భార్య కొండమ్మ పార్వతీపురం మండలంలోని గోపాలపురంలో చింతాడ కామేశ్వరి (కొండమ్మ చెల్లి) పెళ్లిరోజు వేడుకలకు హాజరై 15న సాయంత్రం ద్విచక్రవాహనంపై గోపాలపురంనుంచి స్వగ్రామం రాజాం వెళ్తురన్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో గరుగుబిల్లి మండలంలోని రావివలస జంక్షన్ సమీపంలో వెనుక కూర్చున్న కొండమ్మ ప్రమాదవశాత్తు బైక్నుంచి జారిపడగా తలకు బలమైన గాయమైంది. దీంతో మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ మేరకు మృతురాలు కొండమ్మ, తండ్రి రేజేటి పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. మృతుడి భార్యకు తీవ్రగాయాలు -
ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలో జరిగిన దొంగతనాల కేసులో చీపురుపల్లి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సివిల్జడ్జి వై.ప్రేమలత ముద్దాయికి ఆరునెలల జైలుశిక్ష విదిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. గరివిడి పోలీస్స్టేషన్ పరిధిలో గల దుమ్మెద, వెదుళ్లవలస,కొండలక్ష్మీపురం గ్రామాల్లో 2019లో దొంగతనాలు జరిగాయి. ఈ సంఘటనలపై అప్పుడే కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో బుదవారం కోర్టులో విచారణ జరపగా నేరం రుజువు కావడంతో ముద్దాయి పున్నాన రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వివరించారు. హుషారుగా ఏనుగుల గుంపుభామిని: మండలంలోని బిల్లుమడ సమీపంలో గల జీడితోటల్లో బుదవారం ఏనుగుల గుంపు హుషారుగా దర్శనమిచ్చింది. రెండు రోజుల క్రితం సింగిడికి చెందిన పింటూ సాంత్రో ఆరటిగెలను ఏనుగులకు అందివ్వబోయి కిందపడి రభస జరిగిన అనంతరం అటవీశాఖాధికారులు ఆందోళన చెందారు. పాలకొండ పారెస్ట్ రేంజర్ వచ్చి పరిస్థితి సమీక్షించి ఏనుగులను రెచ్చగొట్ట వద్దని ప్రజలకు చేసిన సూచనల మేరకు చూపరులు దూరమయ్యారు. ఈ క్రమంలో ఏనుగులు హుషారుగా యథావిధిగా తిరుగుతూ కనిపించాయి. -
ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్
విజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్లో ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది.ఈ పోటీలను ఏఎస్పీ సౌమ్యలత ప్రారంభించారు. ఇటీవలే ఏఆర్ విభాగానికి చెందిన సీహెచ్.గోపాలరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్మారకార్థం ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిద్దామని పోలీస్శాఖ అడ్మిన్ ముందుంచారు. ఏఎస్పీ అనుమతితో పరేడ్ మైదానంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు అన్ని పోలీస్స్టేషన్ల నుంచి లా అండ్ ఆర్డర్, ఏఆర్కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ గోపాల్ రావును స్మరించుకుంటూ తోటి సిబ్బంది ఈ పోటీలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్లో విజయనగరం, గంట్యాడ, కొత్తవలస, బలిజిపేటకు చెందిన టీమ్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.12 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.8 వేలు, తృతీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ.6 వేలు, కన్సొలేషన్ ప్రైజ్కు రూ.4 వేల నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, ఆర్ఐలు గోపాల్రావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ సతీమణి శారద పాల్గొన్నారు. ప్రారంభించిన ఏఎస్పీ -
సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం
● కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 330 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం డివిజన్లో 180, బొబ్బిలి డివిజన్లో 60, చీపురపల్లి డివిజన్లో 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. గతంతో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్గా గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాకు అవసరమైన డ్రోన్లను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు. రైల్వే మూడోలైన్ భూముల పరిశీలన చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని గరివిడి, దువ్వాం, తోండ్రంగి, కొండలక్ష్మీపురం, కొండశంబాం, చుక్కవలస గ్రామాల మీదుగా ఏర్పాటుచేయనున్న రైల్వే మూడోలైన్కు అవసరమైన భూములను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ బుధవారం పరిశీలించారు. రైల్వేలైన్ ఏర్పాటులో అడ్డుంకులపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గరివిడి మండలంలోని కొండలక్ష్మీపురం రైల్వేగేటు వద్ద ఏర్పాటు చేయనున్న రైల్వే వంతెన(ఆర్ఓబీ) వల్ల ఎదురయ్యే సమస్యలపై గ్రామస్తులు ఇటీవల జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆర్ఓబీ నిర్మాణంతో గ్రామానికి, గ్రామంలో ఉండే ఇళ్లకు ఎంతవరకు నష్టం జరగనుందన్న అంశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బి.సురేష్, మండల సర్వేయర్ నాగమణి, తదతరులు పాల్గొన్నారు. దాసరికి కందుకూరి వీరేశలింగం పురస్కారం విజయనగరం టౌన్: సీనియర్ రంగస్థల నటుడు, మూవీ ఆర్టిస్ట్, నందిఅవార్డు గ్రహీత దాసరి తిరుపతినాయుడుకు విశిష్ట కందుకూరి వీరేశలింగం పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా తెలుగు నాటకరంగ దినోత్సవం–2025ను పురస్కరించుకుని కందుకూరి పురస్కారాలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి ప్రదానం చేశాయి. పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా దాసరి అందుకన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ విజయనగరం ఫోర్ట్: తల్లీబిడ్డల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సీ్త్ర, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఆర్డ బ్ల్యూఎస్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల, బాలికల ఆరోగ్యంపై అన్ని శాఖలు దృష్టి సారించాలన్నారు. చక్కని పౌష్టికాహారం అందించడంతో పాటు, వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయాలని, తల్లులకు ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 69,000 మంది చిన్నారుల్లో 4 వేల మంది బరువు తక్కువగా ఉన్నట్టు నివేదికలు తెలియజేస్తున్నాయని, వారికి పౌష్టికాహారం అందించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలన్నారు. 7 వేల మంది మరుగుజ్జు పిల్లలు ఉన్నారని, ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువేనన్నారు. సమావేశంలో ఐటీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా భేగం, డీఈఓ మాణిక్యంనాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత పాల్గొన్నారు. -
నిరసన గళం
● ప్రభుత్వ బడిలో చక్కని చదువు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణంకల్పించారు. నాడు–నేడు పనులతో పాఠశాలలు బాగుపడ్డాయి. ప్రమాణాలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలంటూ డీఈఓ యు.మాణిక్యంనాయుడు గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ బడిలో పిల్లలను చదివించడం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు. – గంట్యాడ -
● పింఛన్ కష్టాలు
చిత్రంలో ఎండకు సొమ్మసిల్లి ముఖం కడుగుతున్న వృద్ధురాలి పేరు బొడబళ్ల సూరమ్మ. గంట్యాడ మండలం శ్రీరాంపురం. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. పింఛన్ రీ వెరిఫికేషన్ కోసం నోటీస్ ఇవ్వడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి బుధవారం వచ్చింది. ఎండతీవ్రత తట్టుకోలేక టెంటు వద్దనే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను పైకిలేపి నీటితో ముఖం కడిగించారు. కాసేపు టెంటులో కూర్చోబెట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. జ్వరంతో బాధపడుతున్నా పింఛన్ తొలగిస్తారన్న భయంతో ఆస్పత్రికి వచ్చానని, ఈ వయస్సులో మా లాంటి వృద్ధులను ఇక్కట్లకు గురిచేయడం తగదంటూ వృద్ధురాలు వాపోయింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు పింఛన్ పాట్లు తప్పడంలేదంటూ అక్కడివారు నిట్టూర్చారు. నడవలేని, రెండు కళ్లు కనిపించని అంధులను కూడా ఆస్పత్రులకు తిప్పుతున్నారంటూ వాపోయారు. – విజయనగరం ఫోర్ట్ -
చక్కెర ఫ్యాక్టరీలపై చర్చ ఎక్కడ?
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సాగిన కేబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం విచారకరమని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, భీమసింగి చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు, యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చి మర్చిపోవడం తగదన్నారు. 2025–26 సంవత్సరంలోనైనా ఫ్యాక్టరీలు తెరిపించి క్రషింగ్ జరిగేలా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మూతపడిన ఫ్యాక్టరీల కార్మికులు, ఉద్యోగులు, రైతు బకాయిలు సుమారు రూ.33 కోట్లు ఉన్నాయని, చాలామంది కార్మికులు ఆందోళనతో చనిపోయారన్నారు. సమావేశంలో ఇప్పలవలస గోపాలరావు, తుమ్మగంటి రామ్మోహనరావు పాల్గొన్నారు. చంద్రబాబు కేబినెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరం హామీ ఇచ్చి మర్చిపోవడంపై ఆందోళన -
వడ్డీకి అప్పు తెచ్చి ఫీజు చెల్లించా
నేను బార్బర్ వృత్తిలో ఉన్నాను. మా అమ్మాయి శ్రావణి విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకెండియర్ చదువుతోంది. గతేడాది వరకు మా అమ్మాయికి ఫీజు రీయింబర్స్మెంట్ ఠంఛన్గా వచ్చేది. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవికావు. ప్రస్తుత ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. చివరకు పరీక్షలు రాయనీయబోమంటే రూ.2ల వడ్డీకి అప్పుతెచ్చి ఫీజు చెల్లించాను. – అడారి సూర్యనారాయణ, గోపాలరాయుడి పేట, బొబ్బిలి మండలం -
ఇబ్బందులు పడుతున్నాం..
విజయనగరం అర్బన్/బొబ్బిలి/సంతకవిటి: చదువుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని, అందరికీ సమాన విద్యావకాశాలు అందాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో విద్యావెలుగులు నింపారు. అనంతరం ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదకుటుంబాల పిల్లల చదువుకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ బడులు, కళాశాలలను బలోపేతం చేశారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలతో పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ను వర్తింపజేశారు. విద్యార్థులకు చదువు కష్టాలను దూరం చేశారు. ఆర్థిక కష్టాలతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో గత ఐదేళ్లూ ఫీజురీయింబర్స్మెంట్ నిధులను ఠంచన్గా విడుదల చేశారు. పేదకుటుంబాల్లో విద్యా దీపం వెలిగించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థుల చదువుకు ఆధారమైన ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని ఎండమావిగా మార్చింది. అధికారం చేపట్టి పది నెలలు గడిచినా నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారింది. తల్లిదండ్రులపై ఆర్థిక భారంమోపుతోంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులకోసం ఒత్తిడి చేయడం, హాల్టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి చెల్లిస్తున్నారు. కొందరు విద్యార్థులు డబ్బులు కట్టలేక, చదువు సాగించే అవకాశం లేక మానసికంగా కుంగిపోతున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ చెల్లించాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలో విద్యాదీవెన పథకానికి అర్హులైన 35,585 మందికి గడిచిన ఏడాదికి మంజూరు చేయాల్సిన రూ.24.24 కోట్లు బకాయి ఉంది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. గడిచిన ఐదేళ్ల పాలనలో విద్యాదీవెన రూపంలో 2,08,960 మంది విద్యార్థులకు రూ.339 కోట్లు, వసతి దీవెన రూపంలో 1,65,232 మంది విద్యార్థులకు రూ.180.69 కోట్ల నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. చదువుకు ఆర్థిక కష్టాలు లేకుండా చేసింది. ఈ ఫొటోలోని వ్యక్తిపేరు రాజాపు రమణ. సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన ఈయన కుమారుడు రాజాంలోని ఓ ప్రైవేట్ ఐటీ కళాశాలలో బీటెక్ థర్డ్ఇయర్ చదువుతున్నాడు. ఒక విడత ఫీజు రీయింబర్స్మెంట్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన మూడు విడతలు ఫీజు విడుదలకాక పోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని పట్టుబట్టింది. చేసేదిలేక అప్పుచేసి రూ.55,000 ఫీజు చెల్లించారు. ఫీజు రాయితీ వస్తుందని తమ కుమారుడిని ఐటీ చదివిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయమే ఆధారంగా జీవించే తమలాంటి చాలామంది రైతులు, రోజువారీ వేతనదారులు తమ పిల్లలను బీటెక్, డిగ్రీలు చదివిస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించకుంటే చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి హాల్టికెట్లు, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ అప్పులు చేసి ఫీజు చెల్లిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు -
లాకౌట్ దిశగా జిందాల్ !
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం లాకౌట్ దిశగా నడుస్తుండడంతో కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. ఎ–షిప్టు, జనరల్ షిప్టుకు వెళ్లిన కార్మికులు విధులను బహిష్కరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని కార్మికులను శాంతింప జేశారు. ఈ పరిశ్రమలో శాశ్వత కార్మికులుగా 57 మంది, కాంట్రాక్టు కార్మికులుగా 249 మంది పని చేస్తున్నారు. గడిచిన మే నెలలో కర్మాగారానికి అవసరమైన ముడిసరుకు లభ్యం కావడం లేదని, ఉత్పత్తికి గిరాకీ లేకపోవడం వంటి కారణాలతో నష్టాలు వస్తున్నాయిని, తప్పనిసరి పరిస్థితుల్లో కర్మాగారం మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య కుదిరిన ఒప్పందంతో ఆగస్టు నెలలో కర్మాగారాన్ని పునఃప్రారంభించారు. మళ్లీ గడిచిన 20 రోజల నుంచి కర్మాగారానికి ముడిసరుకు తేవడం ఆపేశారు. ఉత్పత్తి చేసిన సరుకును పూర్తిస్థాయిలో ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఇదే పద్ధతిలో ముడిసరుకు లేని కారణంగా కర్మాగారానికి లే ఆఫ్ ప్రకటిస్తున్నట్టు నోటీస్లు అతికించి అర్ధాంతరంగా కర్మాగారాన్ని మూసేశారని కార్మిక సంఘం నాయుకులు లగుడు వామాలు వాపోయారు. భవిష్యత్ కార్యాచరణను గురువారం తెలుపుతామన్నారు. ఈ విషయమై కర్మాగారం హెచ్ఆర్ మేనేజర్ గోపాలకృష్ణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. విధులను బహిష్కరించిన కార్మికులు ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ అర్ధాంతరంగా కర్మాగారం మూసేస్తే కార్మికుల పరిస్థితి ఎంటి? -
సూర్యఘర్తో నాణ్యమైన విద్యుత్
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటుచేయాలని, నాణ్యమైన విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని ఎంపీ, విద్యుత్ కమిటీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం మూడువేల సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూర్యఘర్ పలకల ఏర్పాటుకు స్థలాలు లేనిచోట పంచాయతీరాజ్ చెరువు గట్లను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మూడునెలల్లో 10వేల పీఎం సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. సమావేశంలో విద్యుత్శాఖ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, ఈఈలు హరి, త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ పరిశ్రమ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
● పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు పాదయాత్ర ● పోస్టర్లు విడుదల చేసిన సీఐటీయూ నాయకులుచీపురుపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని కర్లాం శ్రీ వెంకటరామా పౌల్ట్రీ పరిశ్రమలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. గడిచిన 40 రోజులుగా కార్మికులు నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా బుధవారం పౌల్ట్రీ పరిశ్రమ నుంచి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయం వరకు నిర్వహించ తలపెట్టిన సామూహిక పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను పరిశ్రమ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మికశాఖ డిప్యూటీ కమీషనర్ ఆదేశాలు కూడా ఉన్నాయని అయినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. అంతేకాకుండా పరిశ్రమలో స్థానికులకే 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్మికులను తీసుకొచ్చి నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం పరిశ్రమ నుంచి కార్మికులంతా ఒక్కటై పాదయాత్రగా బయల్దేరి చీపురుపల్లిలోని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం వరకు పాదయాత్రగా నిరసన తెలుపుతూ వెళ్లనున్నట్లు తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ తలపెట్టిన ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులతో బాటు యూనియన్ నాయకులు టీవీ.రమణ, ఎ.గౌరునాయుడు, ఐ.గురునాయుడు, టి.ఈశ్వరరావు, సూరిబాబు, గొల్లబాబు తదితరులు పాల్గొన్నారు. -
మే 12న పైడితల్లి దేవర మహోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకువచ్చే దేవర మహోత్సవాన్ని వచ్చేనెల 12న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలిపారు. చదురుగుడి వెనుక ఉన్న కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గాడీఖానా, ఎన్సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురువద్దకు తీసుకెళ్లి పూజలు చేస్తామని తెలిపారు. అనంతరం రాత్రి 10 గంటల తర్వాత అమ్మవారిని హుకుంపేట నుంచి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్ద నున్న చదురుగుడిలో ఆశీనులు చేస్తామన్నారు. అప్పటి నుంచి ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు చదురుగుడిలోనే కొలువై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. తలయారీ రామవరపు చినపైడిరాజు మే 5న సాయంత్రం అమ్మవారికి మనవిచెప్పి ఉత్సవ చాటింపు వేస్తారన్నారు. అనంతరం ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపర్ వైజర్ ఏడుకొండలు, తల యారీ చినపైడిరాజు, రమేష్ పట్నాయక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మే 13 నుంచి ఉయ్యాలకంబాల వరకూ చదురుగుడిలోనే అమ్మ దర్శనం ఉత్సవ వివరాలు వెల్లడించిన ఈఓ ప్రసాద్ -
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేయడం తగదని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ అన్నారు. కోట జంక్షన్ వద్ద విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ.... రాష్ట్ర వాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమా ణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై తొలిసంతకం చేశారన్నారు. నేటికీ నోటిఫికేషన్ వెలువడలేదని, నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటూ తీవ్ర నిరాశకు గురువుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రోజుకో ప్రకటన చేస్తూ విద్యార్థిలోకాన్ని అయోమ యానికి గురిచేస్తున్నారన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అసలు వస్తుందో రాదో అన్న పరిస్థితిలో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు గురుజాడ గ్రంథాలయంలో ఈనెల 17వ తేదీన జరగబోయే సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంతోష్, రాము, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేయొద్దు దత్తిరాజేరు: వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.జీవనరాణి దత్తిరాజేరు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిని ఆమె సోమవారం పరిశీలించారు. మందులు నిల్వ చేయడంలో ఫార్మసిస్టు నిర్లక్ష్యం చేయడంపై ప్రశ్నించారు. ఆస్పత్రిలో మెరుగైన ప్రసవ సేవలు అందించాలని వైద్యాధికారి సతీష్కు సూచించారు. గర్భిణులకు నెలవారీ తనిఖీలు చేయాలన్నారు. వెబ్ సైట్లో టీచర్ల సీనియార్టీ జాబితా విజయనగరం అర్బన్: జిల్లాలోని ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా తయారు చేసిన వివిధ కేడర్ టీచర్ల సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు అభ్యంతరాలను స్వీకరించామని, మరో అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ జోన్–1 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్–2 పదోన్నతులతో పాటు సెకెండరీ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పదోన్నతులకు అవసరమైన సీనియార్టీ జాబితాను ‘ఆర్జేడీఎస్ఈవీఎస్పీ.కాం’ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 17వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఆధారాలతో సమర్పించుకోవాలని కోరారు. గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేదిలేదన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్: స్థానిక గాజులరేగకు చెందిన పత్తిగిల్లి దిలీప్కుమార్ సిటీ బస్టాండ్లో నిర్వహిస్తున్న గాయత్రి మెటల్ మార్ట్ షాప్లో 240 కిలోల రాగి,160 కిలోల ఇత్తడి, మూడు ఇన్వర్టర్ బ్యాటరీలతో పాటు 60 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుడు వన్టౌన్ స్టేషన్లో మార్చి 30వ తేదీన ఫిర్యాదు చేయగా వెంటనే స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పెందుర్తి మండలం చినముషిడివాడ అంబేడ్కర్నగర్కు చెందిన పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబు, ఏసు, కృష్ట అనే నలుగురు చోరీకి పాల్పడినట్లు తేలింది. పక్కా సమాచారం మేరకు పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబులను అరెస్ట్ చేసి, ముప్ఫై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
ఆర్థిక అవసరాలకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
● ఎస్పీ అధ్యక్షతన వార్షిక సమావేశం ● రుణాలపై వడ్డీ శాతం 6 నుంచి 4.08కి తగ్గింపు ● మ్యారేజ్ రుణాలు లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు ● పర్సనల్ లోన్ పరిమితి 75 వేల నుంచీ లక్షకు పెంపువిజయనగరం క్రైమ్: హోం గార్డ్స్ ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకోవాల్సిన నిర్ణయాలను స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ అధ్యక్షతన మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హోం గార్డ్స్ పిల్లల వివాహాలకు రుణాల మంజూరుకు క్రెడిట్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తీసుకున్న రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించాలని సొసైటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ పోలీస్శాఖలో హోం గార్డ్స్ అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, వారి ఆర్థిక అవసరాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుందని చెప్పారు. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను ప్రస్తుతం ఉన్న రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామని తెలిపారు. ఇక హోం గార్డ్స్ వారి పిల్లల వివాహాలకు ప్రస్తుతం తీసుకుంటున్న రుణాలను రూ.రెండు లక్షలకు పెంచామన్నారు. తీసుకుంటున్న రుణాలపై వడ్డీశాతం కూడా తగ్గించామని తెలిపారు. సొసైటీని మరింతగా వృద్ధిలోకి తీసుకువచ్చి ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యల నుంచి సలహాలను తీసుకుంటామని ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక 2024–2025 వార్షిక సంవత్సరానికి సొసైటీ ఆదాయ, వ్యయాలను తీసుకుంటున్న నిర్షయాలను సొసైటీ సెక్రటరీ సుశీల సభ్యులకు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత,సీఐలు లీలారావు, చౌదరి, ఆర్ఎస్సై గోపాల నాయుడు సంస్థ సెక్రటరీ సుశీల, నీలకంఠం, డైరెక్టర్లు శంకరరావు, గోపాలరావు, రమణ, మహేశ్వరరావు బంగార్రాజులు పాల్గొన్నారు. -
తాగునీటి పథకాల క్లోరినేషన్ జరగాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా విస్తత చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ పత్రికల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వార్తలపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దష్ట్యా అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, తాగునీటి పరీక్షలు నిర్వహిం చాలని ఆదేశించారు. తాగునీటి పథకాలకు మెట్లు లేకపోతే తక్షణం మెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడినప్పుడు వెంటనే పనులు చేపట్టాలని కోరారు. జిల్లా పరిషత్ నిధులు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, వీరఘట్ట, సీతంపేట తదితర మండలాల నుంచి తాగునీటి సమస్యపై వచ్చిన అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేసవి దృష్ట్యా చలివేంద్రాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అందిన రూ.50 లక్షల ప్రతిపాదనల మంజూరుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. సీతంపేట మండలం మెట్టుగూడ వద్ద తాగునీటిపై వచ్చిన వార్తలకు తక్షణ స్పందించి లీకేజీని పునరుద్ధరించామని గ్రామీణ నీటి సరఫరా డీఈ తెలిపారు. సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య ప్రస్తుతానికి లేదని, ఎప్పటికప్పుడు వాటిపై దష్టి సారించి చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్లు వివరించారు. వీడియో కాన్ఫరెనన్స్లో జిల్లా గ్రామీణ నెట్వర్క్ అధికారి ఒ.ప్రభాకర రావు, జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్రవాహన చోదకుడిని ఢీకొన్న బస్సు
పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం వద్ద మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ద్విచక్రదారుడిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా అమదలవలసకు చెందిన ఇప్పిలి సత్యనారాయణ విజయనగరం జిల్లా రేగిడి మండంలంలో గల చక్కెర కార్మగారంలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో పాలకొండ నుంచి విశాఖ వెళ్తున్న ఓఎంఎస్ సర్వీసు బస్సు గోపాలపురం వద్ద ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు గాయాలపాలు కాగా వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో మూడు ద్విచక్రవాహనాలు చెల్లాచెదురు కాగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా రేగిడిఆమదాలవలస మండలం వండానపేటకు చెందిన కొమ్మోజు గణపతిరావు తన ద్విచక్రవాహనంపై వీరఘట్టం వెళ్తుండగా అదే మండలంలోని చిన్నయ్యపేటకు చెందిన సవిరిగాన సింహాచలం స్కార్పియో వాహనం నడుపుతూ వీరఘట్టం వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం కురుస్తుండడంతో ద్విచక్రవాహనదారు ఉన్నట్లుండి తన వాహనాన్ని కుడివైపు మళ్లించే యత్నం చేశాడు. దీంతో ఆ బైక్ను తప్పించబోయిన స్కారియో వాహన చోదకుడు కూడా పూర్తిగా కుడివైపు తన వాహనం తిప్పడంతో ద్విచక్రవాహదారుడిని వెనక నుంచి బలంగా తాకుతూ అక్కడి వైన్షాపు ముందు నిలిపి ఉన్న మరో రెండు బైక్లను, ముందున ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారు గణపతిరావు గాయాలపాలయ్యడు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240సంతకవిటి ఎస్సైపై దాడి● 1.50తులం బంగారు చైన్ చోరీ ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన సంతకవిటి: మండలంలోని జావాం గ్రామంలో ఇటీవల జరిగిన పగడాలమ్మ తల్లి జాతర బందోబస్తులో ఉన్న ఎస్సైపై దాడి చేసి 1.50 తులం చైన్ చోరీ చేసినట్లు ఏఎస్సై ఎం.వాసుదేవరావు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు డ్యూటీలో మాబ్ను కంట్రోల్ చేస్తు న్న సందర్భంలో ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఎస్సైపై దాడిచేసి చేసి చైన్ లాక్కుని వెళ్లిపోయినట్లు బాధిత ఎస్సై ఆర్.గోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వాసుదేవరావు మంగళవారం తెలిపారు. రైలు ఢీకొని యువకుడి మృతికొమరాడ: మండలంలోని అర్తాం–సోమినాయుడువలస రైల్వే గేటు మధ్యలో రైలు ఢీకొని యువకుడు కొప్పర వెంకటరమణ(26) మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరమణ అర్తాం సమీపంలోని తన పొలానికి వెళ్తున్న క్రమంలో రైల్వేట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగి మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆటో బోల్తా పడి వ్యక్తి..వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన మారడబూడి రమణ (52) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి ఎస్సై బి.దేవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మారడబూడి రమణతో పాటు మరికొందరు కలిసి గ్రామానికి చెందిన ఆటోలో సోమవారం పూసపాటిరేగ మండలం గోవిందపురంలో బంధువుల ఇంటికి వెళ్లి అదే ఆటోలో తిరిగి వస్తుండగా బల్లంకి గ్రామ సమీపంలో గుమ్మడి బందవద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమణ తల వెనుక భాగంలో గాయం కాగా అక్కడికక్కడే చనిపోయాడని, మిగిలిన వారంతా గాయాల పాలైనట్లు మృతుడి భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడు రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 నాటుకోళ్ల మృతివంగర: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణంలో మార్పు వచ్చి గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వంగర, ఎం.సీతారాంపురం, మడ్డువలస, మగ్గూరు, సంగాం, ఓనెఅగ్రహారం తదితర గ్రామాల్లో వర్షం కురవగా . మెట్టమగ్గూరు ఎస్టీ కాలనీలో డ్రైనేజీ పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామానికి చెందిన పక్కి గంగమ్మ, సంగాపు పకీరు, సంగాపు జగన్నాథంలకు చెందిన 20 నాటుకోళ్లు మృతిచెందినట్లు బాధితులు వెల్లడించారు. అలాగే మడ్డువలస డ్రైనేజీలు పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్ల ముందు చేరగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టిప్పర్ దగ్ధంపాచిపెంట: మండలంలోని కేరంగి పంచాయతీ నందేడువలస సమీపంలో మంగళవారం విద్యుత్వైర్లు తాకి ఓ టిప్పర్ దగ్ధమైంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పూడి నుంచి నందేడువలస నూతన రహదారి నిర్మాణానికి టిప్పర్లో మెటల్ రాయి తీసుకువెళ్లి నందేడువలస సమీపంలో ఒంపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టిప్పర్కు విద్యుత్ వైర్లు తాకి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్లు దూకేయడంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే సమయానికి టిప్పర్ పూర్తిగా దగ్ధమైపోయింది.విద్యుత్ వైర్లు రోడ్డు పక్కన తక్కువ ఎత్తులో ఉన్నాయని పలుమార్లు మండల, జిల్లా సర్వసభ్య సమావేశాల్లో అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని జెడ్పీవైస్ చైర్మన్, సర్పంచ్, ఎంపీటీసీ విలేకరులకు తెలిపారు. -
అన్నీ బొంకులే..!
బంకుల్లో ● పెట్రోల్ బంకుల్లో కానరాని సౌకర్యాలు ● జిల్లావ్యాప్తంగా 44 చోట్ల ఏర్పాటు ● అందుబాటులో లేని మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సకిట్లు, తాగునీరు ● ఆపద సమయాల్లో లేని ఫోన్ సౌకర్యం, నాణ్యత తనిఖీ పరికరాలు, ఫిర్యాదుల పెట్టె ● మరమ్మతుల బారిన గాలియంత్రాలుపార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వినియోగదారులకు అందించాల్సిన సేవలను అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమను ఎవరూ ప్రశ్నించరనే భావనతో వారు వ్యవహరిస్తున్న తీరు కానరాని సౌకర్యాల పట్ల తేటతెల్లమవుతోంది. బంకుల్లో నిబంధనల మేరకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు దాదాపు ఏ బంకులోనూ కానరావడం లేదు. వాటిని విధిగా పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ మొక్కుబడిగా ఒకటి రెండు బంకులను తనిఖీ చేసి మమ అనిపించేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ట్యాక్స్లను వసూలు చేస్తున్న యాజ మాన్యాలు సౌకర్యాలు కల్పించడంలో తాత్సారం వహిస్తున్నాయి. వినియోగదారులకు అందాల్సిన సేవలు అందకపోవడంతో యాజమాన్యాలు ట్యాక్స్ లను అప్పనంగా వసూలు చేసి వినియోగదారులకు సేవలు దూరం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పీ, బీహెచ్పీఎల్, ఇండియన్ ఆయిల్, నయారా సంస్థలకు సంబంధించి 44 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని ఆయా ప్రాంతాల్లోని యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. ఈ సౌకర్యాలు ఉండాలి స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రథమ చికిత్స కిట్లు, ఉచితంగా గాలినింపే యంత్రాలు, ఆపద వేళ సమాచారం ఇచ్చేందుకు ఫోన్, నాణ్యత తనిఖీ చేసే బ్లాటింగ్ పేపర్లు, ఫిర్యాదుల పెట్టె తదితరమైన సౌకర్యాలు పెట్రోల్ బంకుల్లో ఉండాలి. అలంకరణకే.. పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా గాలినింపే యంత్రాలు మరమ్మతుల బారిన పడి నిరుపయోగంగా దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో తాగునీరు సౌకర్యం ఏర్పాటు కానరావడం లేదు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు టైర్లలో గాలి నింపమని సిబ్బందిని అడిగితే పనిచేయడం లేదని బదులిస్తున్నారు. మరుగుదొడ్లకు తాళాలు బంకుల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తాళం వేసి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం సిబ్బంది మాత్రమే ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కనీస స్థాయిలో మూత్రశాలలు పరిశుభ్రత లేకుండా అధ్వానంగా, అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కానరాని ప్రథమ చికిత్స కిట్లు ప్రథమ చికిత్స కిట్లు ఏ చోట కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల పెట్టెమాత్రమే ఉండి లోపల ఔషధాలు, ప్రథమ చికిత్స పరికరాలు కనిపించడం లేదు. అలాగే వినియోగదారులకు ఫిర్యాదుల పెట్టె, నాణ్యత తనిఖీకి కావాల్సిన పరికరాలు అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చేందుకు ఫోన్ సౌకర్యం వంటివి కనిపించడం లేదు.మా దృష్టికి వస్తే సమస్య పరిష్కారం బంకుల్లో అందాల్సిన సేవలపై కానీ యాజమాన్యం వినియోగదారుల పట్ల వ్యవహరిస్తున్న శైలిపై కానీ ఫిర్యాదులు వస్తే సంబంధిత బంకు యాజమాన్యంపై చర్యలు చేపడతాం. పార్వతీపురం మన్యం జిల్లాకు సివిల్ సప్లైస్ జీఎంగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించాను. సిబ్బందితో సమన్వయం చేసుకుని బంకుల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఐ.రాజేశ్వరి, జీఎం సివిల్ సప్లైస్, పార్వతీపురం మన్యం జిల్లా -
పాల ఉత్పత్తి పెంపే లక్ష్యం
రామభద్రపురం: భవిష్యత్లో పాల ఉత్పత్తితో పాటు మేలు జాతి దూడల వృద్ధికి ప్రత్యేక దృష్టిసారించామని పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. రామభద్రపురం మండలం ఆరికతోట పంచాయతీ మధుర గ్రామం జగన్నాథపురంలో హెచ్ఎఫ్ పాడి ఆవుకు పిండం బదిలీ పద్ధతిలో జన్మించిన మొదటి గిర్ జాతి దూడను జేడీ వైవీ రమణతో కలిసి మంగళవారం పరిశీలించారు. దూడ ఆరోగ్యానికి అవసరమైన మందులను పాడిరైతుకు అందజేశారు. రాష్ట్రంలో పిండ బదిలీ ప్రక్రియపై 45 మంది పశువైద్యాధికారులకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 350 పశువులకు పిండ బదిలీ ప్రక్రియ జరిపితే 15 నుంచి 20 శాతం ఫలితాలు సాధించగలిగామన్నారు. పిండం బదిలీ పద్ధతిలో మేలు జాతి దూడను సంవత్సరం కాలంలోనే పొందవచ్చన్నారు. దేశీయ గిర్, సాహివాల్, ఒంగోలు జాతి గోవుల పరిరక్షణకు ఈ విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. పిండమార్పిడి ప్రయోగంలో సత్ఫలితాన్ని సాధించిన ఆరికతోట పశువైద్యుడు సురేష్ను అభినందించారు. కార్యక్రమంలో ఎల్డీఏ జి.రాధాకృష్ణ, డీడీ దామోదర్, ఏడీ ఎల్.విష్ణు పాల్గొన్నారు. మేలు జాతి దూడల వృద్ధిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ శ్రీనివాసరావు -
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు.. గ్రీన్సిగ్నల్
గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన భూములు కొత్తవలస: కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూ పరిధి అప్పన్నదొరపాలెం గ్రామ సమీపంలో రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గిరిజన వర్సిటీ కోసం గతంలో గిరిజనుల నుంచి సేకరించిన భూముల్లో పోలీస్ శిక్షణ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్రవేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అప్పన్నదొరపాలెం, జోడుమెరక, తమ్మన్నమెరక గ్రామాల గిరిజనులు పలువురు నిరసన తెలుపుతున్నారు. కనీసం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, 2017లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా శిక్షణ కేంద్రంఏర్పాటుకు పూనుకోవడం తగదంటున్నారు. అప్పన్నదొరపాలెం గ్రామంలో మార్చి 20, 24వ తేదీల్లో విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభలను ఏర్పాటుచేశారు. తమ పిల్లలకు ఉద్యోగాలు, చదువు అవకాశాలు కలుగుతాయన్న ఆశతో వర్సిటీకోసం అప్పట్లో భూములు ఇచ్చామని, భూమికి భూమి, ఇళ్ల స్థలాలు, యువతకు ఉపాధి తదితర ఏడు హామీల్లో నేతలు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గిరిజనులు బహిరంగంగానే విమర్శించారు. శిక్షణ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించారు. వందమంది పోలీస్లతో సభ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. తాము ఉగ్రవాదులమా? అంటూ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు అధికారులను నిలదీశారు. సభను బహిష్కరించారు. ఇదీ పరిస్థితి... 2017 సంవత్సరంలో రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెం, జోడుమెరక, తమ్మన్నమెరక గ్రామాల సమీపంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సర్వేనంబర్ 1–8లో 527 ఎకరాల కొండపోరంబోకు, గెడ్డవాగు భూములతో కలిపి 178 గిరిజన కుటుంబాలకు చెందిన 144 ఎకరాల భూములను సేకరించారు. అప్పట్లో గిరిజనులకు 7 రకాల హామీలు ఇచ్చారు. కనీసం అందులో ఏ ఒక్క హామీని నెరవేర్ఛకుండా హడావిడిగా 2019 ఎన్నికలకు ముందు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో ఆందోళనకు దిగారు. వాటిని పట్టించుకోకుండా రూ.10 కోట్ల ఖర్చుతో కొంతమేర ప్రహరీని నిర్మించారు. అనంతరం 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ గిరిజన యూనివర్సిటీని సాలూరు–మెంటాడ మండలాల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించింది. వర్సిటీ పనులు అక్కడ శరవేగంగా సాగుతున్నాయి. ఆందోళనలు చేసినా... పోలీస్ శిక్షణ కేంద్రం వద్దని, తమ భూములు వెనుకకు ఇవ్వాలంటూ గిరిజనులు విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రజావినతుల పరిష్కారవేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యా యా న్ని, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏడు హామీలు నెరవేర్చని విషయాన్ని అధికారులకు వివరించారు. అయితే, ఇవేవీ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ను అడ్డుకోలేకపోయాయి. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయంచేయాలని, అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు. -
జిల్లా జడ్జికి ఆత్మీయ వీడ్కోలు
విజయనగరం లీగల్: బదిలీపై గుంటూరు వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తికి జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఆత్మీయ వీడ్కోలు పలికింది. స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన వీడ్కోలు సభలో పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపా యాల కల్పనకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృషిని కొనియాడారు. అనంతరం న్యాయమూర్తి దంపతులను గజమాలతో సత్కరించారు. సన్మాన గ్రహీత సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ కేసుల పరిష్కారం, మెగా లోక్అదాలత్లు విజయవంతంగా నిర్వహించడంలో న్యాయవాదుల సహకారం ఎనలేనిదన్నారు. ఉత్తమ సేవలతోనే కీర్తిప్రతిష్టలు లభిస్తాయన్నారు. వీడ్కోలు సభలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశెట్టి రవిబాబు, నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు పి.శివప్రసాద్, బి.సీతారామరాజు, కళ్లెంపూడి వెంకటరావు, బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్నశెట్టి, సీనియర్ న్యాయవాదులు టి.వి.శ్రీనివాసరావు, బెల్లాన రవి, తదితరులు పాల్గొన్నారు. -
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల ఆన్లైన్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి ఇ.అప్పన్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఈటీ ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీ మార్క్స్ లిస్ట్, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టీఈటీ మార్క్స్ లిస్ట్ జిరాక్స్, పాస్ పోర్ట్ ఫొటోలు 2 దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఆర్సీఎం స్కూల్, రూం నంబర్ 8, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా పార్వతీపురం కార్యాలయంలో పని వేళల్లో సమర్పించాలని సూచించారు. -
● రక్తదాతా సుఖీభవ!
చిత్రంలో రక్తదానం చేస్తున్న యువకుడి పేరు శనపతి రాము. రాజాం మండలంలోని పొగిరి గ్రామం. రక్తం అవసరమని వార్త తెలిస్తే చాలు.. పరుగున వెళ్లి రక్తదానం చేయడం అలవాటు. తన 18వ ఏట (2009) నుంచి రక్తదానం చేస్తున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయనగరంలోని మాతృభూమి, గ్రామీణ సామాజిక వైద్యుల సేవా సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని 53వ సారి రక్తదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. గ్రామానికి చెందిన యువత తనను ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. – రాజాం -
పవర్ లిఫ్టింగ్లో కల్యాణి ప్రతిభ
చీపురుపల్లి: పవర్లిఫ్టింగ్ బ్రెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీల్లో పట్టణానికి చెందిన సాకేటి రేణుక కల్యాణి ఉత్తమ ప్రతిభ కనపరిచింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో రేణుక కల్యాణి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో కోచ్ గంగాధర్ ఆమెను అభినందించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు కృష్ణా జిల్లాలోని గుడివాడలో గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో 12వ ఏపీ స్టేట్ కాస్లిక్ పవర్ లిఫ్టింగ్, బ్రెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 84 ప్లస్ కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల విభాగంలో పాల్గొన్న రేణుక కల్యాణి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. అలాగే బ్రెంచ్ ప్రెస్ విభాగంలో రజత పతకం సాధించింది. -
మే 10న జాతీయ లోక్ అదాలత్
పార్వతీపురంటౌన్: న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, వివాదాలను ముందుదశలోనే పరిష్కరించడానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి, మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మే 10వ తేదీన మొదటి జాతీయ లోక్అదాలత్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నామన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడానికి లోక్అదాలత్ వారధిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేకన్నా కేసులను సామరస్యంగా పరిష్కరించుకుని రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా, కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షిదారు వినియోగించుకుని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. -
వెబ్సైట్లో స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితా
● 19వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ ● డీఈఓ యు.మాణిక్యంనాయుడు విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రధానోపాధ్యాయ గ్రేడ్–2 పదోన్నతి ఖాళీ పోస్టుల భర్తీ కోసం స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు పాఠశాల విద్యాశాఖ జోన్–1 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్–2 పదోన్నతి కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారన్నారు. జాబితాను ‘ఆర్జేడీఎస్ఈవీఎస్పీ.కాం’ వెబ్సైట్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 19వ తేదీలోగా ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు, విశాఖపట్నం కార్యాలయానికి ఆధారాలతో సమర్పించాలని సూచించారు. రాజ్యాంగంతో సమానత్వం విజయనగరం క్రైమ్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో అందరికీ సమాన అవకాశాలు సిద్ధిస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక డీపీఓలో ఆంబేడ్కర్ జయంతిని వెనకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటా నికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ నర్సింహమూర్తి పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీలో కోత! బొబ్బిలిరూరల్: మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధిలోని కాశిందొరవలస, డొంగురువలస, ఎరకం దొరవలస గిరిజన గ్రామాల్లోని అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలకు రెండు కేజీలు తగ్గించి డీలర్ పంపిణీ చేశాడు. దీనిపై కార్డుదారులు సోమవారం ఆందోళనకు దిగారు. బియ్యం తక్కువగా రావడం వల్లే రెండు కేజీల చొప్పున తగ్గించి ఇచ్చినట్టు డీలర్ లచ్చన్నదొర తెలిపాడు. విషయం తెలుసుకున్న సీఎస్డీటీ రెడ్డి సాయికృష్ణ గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. డీలర్ను హెచ్చరించి కార్డుదారులకు తగ్గిన బియ్యం మరలా అందజేశారు. గత నెలలో తక్కువ బియ్యం సరఫరా చేయడంతో ఈ నెలకూడా అదే ఇండెంట్ ప్రకారం బియ్యం సరఫరా అయ్యాయని, ఇది తెలియక డీలర్ బియ్యంలో కోత విధించి పంపిణీ చేశారని సీఎస్డీటీ తెలిపారు. కళ్లికోటలో గజరాజులు కొమరాడ: ఇటీవల జియ్యమ్మవలస మండలంలో సంచరించిన ఏనుగులు పాతదుగ్గి మీదుగా సోమవారం కళ్లికోట గ్రామానికి చేరుకున్నాయి. కళ్లికోట, గారవలస, దుగ్గి గ్రామాల రైతులు రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఏనుగుల సంచారంతో జొన్న, కూరగాయల పంటలు నాశనమవుతున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. -
24న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
● యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.నర్సింహరావు విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల ధర్నాలు జరుగుతాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్.వి.నర్సింహరావు అన్నారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పడు మొఖం చాటేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.4,293 కోట్లు నిధులు ఉన్నాయని, వాటితో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ, నాయకులు బి.సత్యం, కె.సంతోష్కుమార్, ఆర్.సతీష్ పాల్గొన్నారు. -
ఇక్కడ సున్నా శాతం
అక్కడ శతశాతం.. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రామభద్రపురం మండలంలోని బూసాయవలస కేజీబీవీ బాలికలు సెకెండియర్లో శతశాతం ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో సెకెండియర్లో 33 మందికి 33 మంది, ఫస్టియర్లో 33 మందికి 32 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్ విద్యార్థిని బి.షర్మిల బైపీసీలో 963/1000 మార్కులు సాధించింది. అయితే, రామభద్రపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షకు హాజరైన 14 మందికి అందరూ ఫెయిలయ్యారు. హైస్కూల్ ప్లస్లను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, విద్యాబోధనకు అర్హత ఉన్న అధ్యాపకులను నియమించకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే కళాశాలలపై నిర్లక్ష్యం తగదంటున్నారు. – రామభద్రపురం -
మా క్లినిక్కు వచ్చేయండి..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి... జిల్లాకే పెద్దది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురైనా తొలుత ఆశ్రయించేది ఈ ఆస్పత్రినే. అందుకే ప్రతి రోజు 1100 నుంచి 1200 మధ్యన ఓపీ నమోదవుతుంది. అయితే, కొందరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సేవలందించే అవకాశం ఉన్నా... తమ సొంత క్లినిక్లలో మంచి సేవలు అందిస్తామని నమ్మించే ప్రయత్నంచేస్తున్నట్టు సమాచారం. ప్రమాదాల్లో గాయపడిన వారిని, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల పట్ల వైద్యులు వ్యవహరిస్తున్న తీరును కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వైద్య ఖర్చులు తట్టుకోలేక ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారిని ప్రైవేటు క్లినిక్లకు రావాలని చెప్పడంపై మండిపడుతున్నారు. కొంతమంది వైద్యులు అయితే చాలా కాలంగా రోగులను క్లినిక్లకు తరలించి ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య సేవలు ఇలా.. వైద్య సేవలు ఇలా.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి, ఎముకలు, న్యూరోమెడిసిన్, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మ, దంత, ఈఎన్టీ, ఎన్సీడీ, పలమనాలజీ ఓపీ విభాగాలు ఉన్నాయి. రోజుకి సగటున 1100 నుంచి 1200 మంది వరకు రోగులు ఆస్పత్రికి వస్తారు. 270 నుంచి 300 మంది వరకు ఇన్పేషేంట్స్గా చికిత్స పొందుతారు. రోజుకు 40 నుంచి 50 మంది వరకు డిశ్చార్జ్ అవుతారు. సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఇక్కడ అయితే రెండు, మూడు రోజులు ఉండాలి మా క్లినిక్లో ఆపరేషన్ చేసిన రోజే ఇంటికి పంపిస్తాం వైద్యుల తీరుతో విస్తుపోతున్న రోగులు ‘గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ ఈశ్వరమ్మ అనే మహిళ చేతిపై చిన్నకాయను తొలగించేందుకు అవసరమైన చికిత్స కోసం కొద్ది రోజుల కిందట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆర్థో (ఎముకల) విభాగానికి వెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆపరేషన్ చేసి చేతిపై ఉన్న కాయ తొలిగించాలని చెప్పారు. సర్వజన ఆస్పత్రిలో అయితే శస్త్రచికిత్స చేసిన తర్వాత రెండు, మూడు రోజులు ఉండాలని, మా క్లినిక్లో అయితే చేసిన రోజే ఇంటికి పంపించేస్తాం అని చెప్పారు. చీటీపై ఫోన్నంబర్ రాసి ఆ మహిళకు ఇచ్చారు. క్లినిక్లో ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టంలేక ఆమె ఇంటి వద్దే ఉండిపోయారు.’ చర్యలు తీసుకుంటాం సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందజేయాలి. అవసరమైతే శస్త్రచికిత్స చేయాలి. క్లినిక్లకు రావాలని చెబితే వెంటనే రోగుల బంధువులు ఫిర్యాదు చేయాలి. ఏ వైద్యుడిపై ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
–8లోమృత్యుంజయుడు పింటూ భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగుల నుంచి తప్పించుకోవడంతో అందరూ పిరిపీల్చుకున్నారు. చీపురుపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ నియమాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పాలన సాగిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పాలన రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చీపురుపల్లి పట్టణం లావేరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ సమానత్వంతో జీవించాలని, విద్యావకాశాలు అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. దీనికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేసి ప్రతిఒక్కరూ చదువుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా మరో రెండు అడుగులు ముందుకు వేసి విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మఒడి, నాడు–నేడుతో పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కక్షపూరితమైన రెడ్బుక్ పాలన సాగిస్తోందన్నారు. మద్యం, గంజాయి, మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, విపక్షాలపై దాడులు, ప్రతిపక్ష సోషల్ మీడియా వారిపై తప్పుడు కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు గెరిడి రామదాసు, నాయకులు ఇప్పిలి తిరుమల, ముళ్లు పైడిరాజు, మజ్జి శంకరరావు, కరణం ఆదినారాయణ, గవిడి సురేష్, అడ్డూరి కృష్ణ, ప్రభాత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ ఎంపీ బెల్లాన -
ఐక్యతకు కారణం అంబేడ్కర్
విజయనగరం అర్బన్: విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశం నేటికీ ఐక్యంగా ఉందంటే అది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగమే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సోమ వారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రితో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ సేతు మాధవన్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.చిట్టిబాబు, జిల్లా అధికారులు, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు స్థానిక జొన్నగుడ్డిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశభక్తి గీతాలకు చిన్నారుల నృత్యప్రదర్శన -
మృత్యుంజయుడు పింటూ
● ఏనుగుల దాడి నుంచి క్షేమంగా బయటకుభామిని: ఏనుగుల ఘీంకారంతో దిక్కులు పిక్కటిల్లుతున్న సాయం సంధ్యా సమయం, మరో వైపు భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగులకు చిక్కాడన్న ప్రచారంతో ప్రజల పరుగులు..ప్రమాద స్థలానికి వెళ్లడానికి ప్రజలకు ధైర్యం చాలడం లేదు. ఏనుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఏనుగులకు అరటిగెల ఇవ్వడానికి వెళ్లిన పింటూ సాంత్రో వాటికి దొరికి పోయాడనే ప్రచారం ఊపందుకుంది. మరో పక్క సింగిడి, బిల్లుమడ, నులకజోడు గ్రామస్తులతో రోడ్డంతా నిండిపోయింది. చివరికి సోమవారం సాయంత్రం పింటూ బయటపడడంతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. మృత్యుంజయుడిగా పింటూ సాంత్రో బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల దాడిలో పింటూ చిక్కుకుని తప్పించుకునే క్రమంలో బురదలో పడిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ అటవీ సిబ్బందితో కలిసి పింటూ సాంత్రోను ప్రజల ముందుపెట్టి వెల్లడించి సింగిడి గ్రామస్తులకు అప్పగించారు. -
విజయనగరంలో క్రికెట్ బెట్టింగ్ల జోరు
● ఏడుగురిపై కేసు నమోదువిజయనగరం క్రైమ్: ఐపీఎల్ జరుగుతున్న వేళ ప్రతిచోటా క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే క్రికెట్ బెట్టింగ్లపై అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాచారం తెలిసిన వెంటనే కేసులు నమోదు చేయాలని సోమవారం ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ సూచనలతో విజయనగరం వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తన బృందంతో కలిసి దాడి చేసి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న స్థానిక ఉల్లి వీధికి చెందిన బుర్లి వాసును పట్టుకుని విచారణ చేయగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో శేఖర్, శ్రీను, అప్పలరాజు, నారాయణరావు, ఓబుల్రెడ్డి, గోల్డ్ శ్రీనులపై కేసు నమోదు చేశారు. -
గంజాయి తరలింపు కేసులో ఆరో నిందితుడి అరెస్ట్
తెర్లాం: గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ఆరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్సై సాగర్బాబు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వారు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. 2024లో రెండు కార్లలో 18.2 కేజీల గంజాయిని రామభద్రపురం నుంచి రాజాం తరలిస్తుండగా తెర్లాం జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, రెండు కార్లను సీజ్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి మండలం ఘాడిగూడకు చెందిన ఆరో నిందితుడు రామభద్రపురం బైపాస్ వద్ద ఆదివారం రాత్రి సంచరిస్తుండగా తెర్లాం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదవ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి కేసును ఛేదించేందుకు కృషిచేస్తున్న ఎస్సై సాగర్బాబు, సిబ్బందిని సీఐ నారాయణరావు అభినందించారు. -
పన్ను వసూలులో నిర్లక్ష్యం..!
● పంచాయతీల్లో పడకేసిన ప్రగతి ● వసూలులో వెనుకబడిన అధికారులు ● బకాయి రూ.కోట్లలోనే..రామభద్రపురం: పంచాయతీల్లో ఇంటి పన్ను, ఆస్తిపన్ను వసూలు విషయంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఫలితంగా ఆయా పంచాయతీలు ఆర్థిక సంక్షోహం ఎదుర్కొంటుండడంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా పడకేసింది. గ్రామాల్లోని గృహాలు, ఖాళీస్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. ఇంటి పన్నుల వసూలు ఇలా.. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మార్చి 31 నాటికి 2023–24 ఏడాదికి సంబంధించి ఇంటి పన్నులు పాతబకాయి రూ.3,31,52,718 కాగా, 2024–25 ఏడాదికి వసూలు చేయాల్సింది. రూ. 15,76,14,332. మొత్తంగా రూ. 19,07,67,050 లు వసూలు లక్ష్యం ఉంది. అయితే ఇందులో పాత బకాయి రూ.2,66,11,654లు, ఈ ఏడాది రూ.13,40,20,752లు వసూలు చేశారు.మొత్తంగా రూ.16,06,32,406 వసూలైంది. ఇంకా పాత బకాయిలు రూ.65,41,064లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.2,35,93,584 బకాయి ఉంది. మొత్తంగా రూ.3,01,34,644లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పడకేసిన ప్రగతి.. పంచాయతీ ఖజానాలో పైసా లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధులు లేక వాటిలో ప్రగతి పనులు పడకేశాయి. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు వీధిదీపాలు, పారిశుద్ధ్యం నిర్వహణకు సొమ్ములేదు. దీంతో గ్రామకార్యదర్శులు, సర్పంచులు గ్రామాల్లో పనులు చేయించుకోలేకపోతున్నారు. వీధుల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు నిధులు లేవు.నీటి పథకాలను అతికష్టం మీద నిర్వహిస్తున్నారు. మోటార్లు కాలిపోతే రూ.వేలల్లో ఖర్చువుతుంది. ఆ సొమ్మును సర్పంచులే భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే వాటిలో బిల్లు చేసుకోవాలన్న ఆశతో సొంత సొమ్మును ఖర్చు పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో వీధి దీపాలు కూడా వెలగడం లేదని, పండగలకు మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.కాళ్లరిగేలా తిరిగినా సీసీ రోడ్డు వేయరు ప్రతి నాయుకుడి దగ్గరికి కాళ్లరిగేలా తిరిగినా మా వీధిలో సీసీ రోడ్డు వేయడం లేదు. ఏళ్లుగా బుగ్గి, బురదలోనే తిరుగుతున్నాం. ఎన్నికల సమయంలో వచ్చిన పెద్ద నాయకుల దృష్టిలో కూడా పెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పడమే కానీ చేయడం లేదు. ఇకనైనా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – బోయిన బాలరాజు, నేరళ్లవలస, జన్నివలసపన్నులు వదిలే ప్రసక్తి లేదు.. గ్రామాల్లో ప్రజల నుంచి ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు రాబడతాం. వదిలే ప్రసక్తి లేదు.త్వరలో వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, అలాగే సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి పక్కా ప్రణాళికతో వసూలు చేస్తాం. ఆస్తి పన్ను చెల్లింపులో ఇప్పుడు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. పన్నులు వసూలైతేనే ప్రగతి పనులకు నిధుల కొరత లేకుండా ఉంటుంది. – వెంకటరమణ, ఈవోపీఆర్డీ, రామభద్రపురం ఆస్తి పన్ను వసూలు ఇలా.. అలాగే పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన మార్కెట్ వేలం, చేపల చెరువులు, దుకాణాలు, చేపల చెరువుల లీజులు, సంతలు, సెల్టవర్స్ తదితర ఆస్తి పన్నులు 2023–24 ఏడాది పాత బకాయిలు రూ.1,65,42,853లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.3,25,95,344 ఉండగా, మొత్తంగా 4,91,38,197 వసూలు లక్ష్యం ఉంది. ఇందులో పాతబకాయి రూ.95,09,074లు, ఈ ఏడాది రూ.2,57,44,030లు వసూలు చేశారు.మొత్తంగా రూ.3,52,53,104 వసూలైంది.ఇంకా పాత బకాయిలు రూ.70,33,779లు, ఈ ఏడాది వసూలు చేయాల్సింది రూ.68,51,314 బకాయి ఉంది. మొత్తంగా రూ.1,38,85,093లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే మార్చి 31 అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ నిలిపివేసినట్లు తెలిసింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్డేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్లీ అందుబాటులోకి రానుందని సమాచారం. -
దళిత అభ్యున్నతే అంబేడ్కర్ ఆశయం
● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణివిజయనగరం అర్బన్: దేశాభివృద్ధికి దళిత అభ్యున్నతే మూలమని, దానినే ఆశయంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసుకున్నారని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. భారతరత్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాల్లో అన్నింటికన్నా ఉత్తమమైన భారత దేశ రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేడ్కర్కు దక్కిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్ గంగునాయుడు మండల, డాక్టర్ కుసుమ్, సుప్రియదాస్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీలో.. అండ్కర్ జయంతి ఉత్సవాలు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో సోమవారం వేడుకగా జరిగాయి. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి యూనివర్సిటీ ఇచ్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ముగిసిన జిల్లా స్థాయి టెన్నిస్ చాంపియన్షిప్
విజయనగరం: విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో రెండురోజుల పాటు కొనసాగిన జిల్లా స్థాయి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణలో సాగి సోమవారం ముగిశాయి. ఈ పోటీల్ల క్రీడాకారులు ఉత్తమమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో దాదాపు అరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 12, అండర్ 16, అండర్ 30, 40, 50 విభాగాల్లో పోటీలకు సిటీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ పోటీలు నిర్వహించి విజేతలకు చాంపియన్ షిప్ ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరానికి టెన్నిస్ క్రీడకు ఉన్న సంబంధాన్ని అంతా మననం చేసుకున్నారు. ప్రతి ఏడాది దివంగత నారాయణ దొర, ముద్దుబాబు, బాబ్జీలు జాతీయస్థాయి పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించేవారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో సిటీ క్లబ్ అధ్యక్షుడు రంగబాబు, జాతీయ టెన్నిస్ మాజీ కోచ్ సన్నిబాబు, శ్రీను, శివాజీల చొరవతో ఈ ఏడాది జిల్లాస్థాయి టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించామని వైభవ్, సాత్విక్, కౌశిక్ కోచ్ గౌరీశంకర్, రామారావు పోటీల ముగింపు కార్యక్రమంలో తెలిపారు. త్వరలో మరిన్ని పోటీలను నిర్వహిస్తామన్నారు. అతి తక్కువ ఫీజ్ తో సిటీ క్లబ్ ఆవరణలో టెన్నిస్ శిక్షణ ఇస్తున్నామని చిన్నారులు ఈ అవకాశం వినియోంచుకోవాలని కోచ్ గౌరీశంకర్ తెలిపారు. -
వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి
● అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేతవిజయనగరం గంటస్తంభం: వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి కోరారు. వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ రెవెన్యూ సహాయకులుగా పైకి విధులు నిర్వహిస్తున్నా వారు అంతర్గతంగా ఆఫీస్ కార్యాలయాల్లో అటెండర్లుగా, స్వీపర్లుగా, డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే అర్హులైన వారికి ప్రమోషన్, నైట్డ్యూటీల రద్దు, జీతంతో కలిపి డీఏలు, భూసర్వేల సందర్భంగా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ప్రసాద్, పైడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రమంతటా ఉన్న దిశ మహిళ పోలీస్స్టేషన్లను మహిళా పోలీస్స్టేషన్లుగా మార్చిన సంగతి విదితమే. విజయనగరం మహిళా పోలీస్స్టేషన్కు రెండో డీఎస్పీగా ఆర్.గోవిందరావు సోమవారం బాధ్యతులు చేపట్టారు. అనంతరం నేరుగా ఎస్పీ ఆఫీస్కు వెళ్లి ఎస్పీ వకుల్ జిందల్ను కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అలాగే స్టేషన్ కు వచ్చిన ప్రతి బాధితురాలి బాధను అర్థం చేసుకుని కేసు నమోదు చేసేలా ప్రవర్తించాలని చెప్పారు. ఇక మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గోవిందరావు 1991లో డిపార్ట్మెంట్లో చేరి జిల్లాలోని ఎస్.కోట, డెంకాడ, సబ్ మైరెన్, విజయనగరం రూరల్ ఎస్సైగా పనిచేశారు. ఇటీవలే విజయనగరం డీఎస్పీగా పనిచేసిన అనంతరం మహిళా స్టేషన్ డీఎస్పీగా తాజాగా బాధ్యతలు చేపట్టారు. -
రెడ్క్రాస్ సొసైటీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు–1(డీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ, అకౌంటెంట్ పోస్టు–1(ఏదైనా డిగ్రీ, టాలీ అనుభవం ఉండాలి), జన ఔషధి మెడికల్ షాపులో ఫార్మసిస్ట్ పోస్టు–1(బి.ఫార్మశీ లేదా డి.ఫార్మసీ విద్యార్హత)కు అర్హత గల అభ్యర్థులు ఈనెల 21 వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 08922–272700, 9493092700, 6305042755 లను సంప్రదించాలని సూచించారు. కరెంట్ పోల్పై తిరగబడ్డ జేసీబీ సాలూరు రూరల్: మండలంలోని కొదమ పంచాయతీ అడ్డుగూడ, కోడంగివలస గ్రామాల మధ్యలో ఘాట్రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ట్రాలీపై తీసుకువెళ్తున్న జేసీబీ తిరగబడి పక్కనే ఉన్న కరెంట్ పోల్పై పడింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం పరిధిలో ఓలేటి వారి ఫారం సమీపంలో నివాసం ఉంటున్న రాహుల్ పండిత్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం నుంచి ఆచూకీ లేవకపోవడంతో తండ్రి ముఖేష్ పండిత్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు.చికిత్స పొందుతూ వీఆర్ఏ మృతిసీతానగరం: మండలంలోని వెంకటాపురం(కామందొరవలస)రెవెన్యూ గ్రామానికి చెందిన వీఆర్ఏ తోట నాగయ్య విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 16న ఇంట్లో చెదలు నివారణకని తెచ్చి ఉంచిన చెదల నివారణ మందును వీఆర్ఏ నాగయ్య యాదృచ్ఛికంగా తాగాడు. చెదల నివారణమందు తాగినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా నాటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతిచెందినట్లు తెలియజేశారు. సోమవారం వీఆర్ఏ తోట నాగయ్య మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు తెలియజేశారు. మృతుడు నాగయ్య అంత్యక్రియల నిమిత్తం తహసీల్దార్ ప్రసన్నకుమార్ ఆదేశాలమేరకు ఆర్ఐ నాగి రెడ్డి శ్రీనివాసరావు, వీఆర్వో బాబూరావు రూ.10వేలు కుటుంబసభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నాగయ్య కుటుంబాన్ని సచివాలయ ఉద్యోగులు పరామర్శించి సానుభూతి వెలిబుచ్చారు. పశువుల రవాణాను అడ్డుకున్న పోలీసులులక్కవరపుకోట: అక్రమంగా వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్న వాహనాలను ఎల్.కోట ఎస్సై నవీన్పడాల్ తన సిబ్బందితో కలిసి సోమవారం అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం అలమండ గ్రామం సంతనుంచి నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాల్లో అధిక పశువులను ఎక్కించి రవాణా చేస్తున్న వాహనాలను భీమాళి జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలతో పాటూ పశువులను పోలీస్స్టేషన్కు తరలించి అక్కడి నుంచి పశువులను సమీపంలో గల గోశాలకు తరలించారు. ఈ మేరకు రెండు వాహనాలను సీజ్ చేసి సంబంధిత డ్రైవర్లను విచారణచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆటో ఢీకొని యువకుడికి గాయాలు
గంట్యాడ: విజయనగరం మండలం కోరుకొండపాలెం గ్రామానికి చెందిన యువకుడు నొడగల గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గణేష్ బైక్పై గంట్యాడ మండలం పెదవేమలి వైపు వస్తుండగా గంట్యాడ మండలం మురపాక నుంచి ఎదురుగా వస్తున్న ఆటో పెదవేమలి, కోరుకొండపాలెం మధ్య గెడ్డ సమీపంలో బైక్ను ఢీకొట్టడంతో గణేష్ కింద పడిపోగా కాలు విరిగిపోయింది. స్థానికులు 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొని మహిళకు..సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో సోమవారం రాత్రి అంటిపేట వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఓ మహిళ గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంటిపేట ప్రజలకు కూడలిగా ఉండే రావిచెట్టు సమీపంలో గాడి లక్ష్మి రోడ్డు దాటుతుండగా బొబ్బిలి మండలం అప్పయ్యపేట గ్రామానికి చెందిన మోటార్ సైక్లిస్ట్ సీతానగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా లక్ష్మిని ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
లలిత.. నీవే ఆదర్శం
● ఇంటర్ బైపీసీలో సత్తా చాటింది ● ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కై వసం నెల్లిమర్ల: నిరుపేద కుటుంబంలో పుట్టిన లలిత నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. తమ స్వగ్రామం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యాభ్యాసం కోసం చేరింది. ఇక్కడే ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో ఉంటూ కళాశాలకు ప్రతిరోజూ నడిచి వెళ్లేది. కష్టం అయితేనేం ఇష్టపడి చదివింది. తాను అనుకున్నది సాధించింది. తాజాగా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. బైపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదీ నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత సాధించిన ఘనత. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత తల్లిదండ్రులు సంగమేష్ , సుశీల ఇద్దరూ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన లలితను కార్పొరేట్ కళాశాలలో చదివించే స్థోమత వారికి లేదు. అందుకే దూరమైనా సరే వసతిగృహం అందుబాటులో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేర్పించారు. గతేడాది ఫస్ట్ ఇయర్ కూడా లలిత స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇప్పుడు 989/1000 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ టాపర్గా నిలిచింది. లతితను విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణి జ్యోతిశ్రీ, సహాయ సంక్షేమాధికారిణి రాజులమ్మ, వసతిగృహ సంక్షేమధికారిణి కృష్ణవేణి అభినందించారు. -
సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ రేపు
విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ నెల 15న డక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ డ్రైవ్ను నిర్వహిస్తుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొడక్షన్ విభాగంలో ట్రైనీ కెమిస్ట్ పొజిషన్ కోసం బీ ఎస్సీ కెమిస్ట్రీ మరియు సీబీజెడ్, డిప్లమా మెకానికల్, బీటెక్ మెకానికల్ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న చివరి సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్స్ లేని పురుషులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉన్న వారు మాత్ర మే అర్హులని తెలిపారు. ఎంపికై న వారు తుని లోని బ్రాంచ్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా కళాశాల ప్రాంగణానికి పూర్తి బయోడే టా, ధ్రువపత్రాలు, పాస్పోర్టు సైజ్ ఫొటోల తో హాజరు కావాలని సూచించారు. పేర్ల నమో దుకు 7012393316, 9032772661 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. రక్తదానంతో ప్రాణదానం విజయనగరం టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు విడనాడి రక్తదానానికి ముందుకు రావా లని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తామాష్ కోరారు. నగరంలోని బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలో రక్తం నిల్వల కొరత కారణంగా తలసీమియా పిల్లలు, గర్భిణుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేసిన 30 మందిని సత్కరించారు. శిబిరంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, శరత్, అశోక్, సాయి, రఘు, సాయిప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 16న ర్యాలీ విజయనగరం టౌన్: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన భారీ ర్యాలీ కి సంబంధించి జిల్లా ముస్లిం సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆబాద్వీధిలో ఉన్న కార్యాలయంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకుడు ఆబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేయడం దారుణమన్నారు. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు షరీఫ్, ముస్తఫా, జాకీర్ హుస్సేన్, మొహమ్మద్ నిజాం, అన్సర్, చిస్తి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా శ్రీవారి చక్రస్నానాలు రాజాం : మండలంలోని అంతకాపల్లి గ్రామంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుని ఉత్స వ విగ్రహాలకు మిధున లగ్నంలో చక్రస్నానా లు నిర్వహించారు. కనుల పండువగా జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఏఈఓ జి. జగన్మోహన్ఆచార్య, ఆలయ పర్యవేక్షకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి పార్వతీపురం టౌన్: భారత రాజ్యాగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. -
పరీక్ష ఫెయిలయ్యానని..
భోగాపురం: మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన మొగసాల స్రవంతి (19) అనే యువతి మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.పాపారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముంజేరు గ్రామానికి చెందిన స్రవంతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 12వ తేదీన వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేకపోడవంతో ఆదివారం మధ్యాహ్నం చీరతో ఊయ్యాల హుక్కుకు ఉరివేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతురాలి తండ్రి సూరిబాబు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి.. రామభద్రపురం: మండలంలోని ఎస్.సీతారాంపురం గ్రామానికి చెందిన మునకాల వెంకటరమణ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వి.ప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణ నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. మూడేళ్లుగా మానేశాడు. అయితే మూడు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల రెండు రోజుల నుంచి ఆ నొప్పి కాస్త ఎక్కువవడంతో చిన్న కుమారుడు కార్తీక్ ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్కు చూపిస్తానని చెప్పినా వినకుండా శనివారం మండలకేంద్రంలోని చిన్నమ్మతల్లి గుడి సమీపంలోని మామిడితోటలో పురుగుమందు తాగేశాడు. దీంతో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. పెద్ద కుమారుడు పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య -
ప్రజలపై గ్యాస్ మంట
విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుతో పాటు వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్ధానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ..కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారన్నారు. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ ఆందోళనకు దిగారని విమర్శించారు. పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతం అవుతున్నారని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే ఎకై ్సజ్ సుంకం రద్దు చేయాలని కోరారు. పెట్రోల్,డీజల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్నగర్ ఽశాఖ సహాయ కార్యదర్శి బూర వాసు, బల్లివీధి శాఖ సహాయ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకురాలు సూరీడమ్మ, మహిళలు పాల్గొన్నారు. మహిళల నిరసన -
ఇంటర్ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం
● ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 6 గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతవిజయనగరం అర్బన్: ‘ఇది విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల భవనం. ఇక్కడి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులు 75 మంది ఎంపీసీ, బైపీసీ కోర్సులలో పరీక్ష రాస్తే అందరూ ఉత్తీర్ణలై శతశాతం ఫలితాల గురుకులాల జాబితాలో చేరింది. అదే విధంగా ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ పరీక్షలు రాసిన 62 మంది విద్యార్ధులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ ఇంటర్ ఎంపీసీలో 454/470 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అధిక మార్కుల తెచ్చుకున్న వారితో ఈ కళాశాల ముందువరుసలో ఉంది. ●● పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండల కేంద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఇది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివిన 73 మంది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సుల విద్యార్థులు 61 మందికి అందరూ పాసై శతశాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ ఇంటర్లో 966/100 మార్కులు తెచ్చుకుని కె.గాయత్రి, పి.శాంతికుమారి జిల్లా స్థాయిలో ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. ప్రథమ ఇంటర్ బైపీసీలో 454/700 మార్కులతో పి.రేవతి జిల్లాలో ముందువరసలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో గురుకులాల విద్యార్థినులు ద్వితీయ ఇంటర్ ఎంపీసీ కోర్సుల ఫలితాల్లో జిల్లా స్థాయి మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి గురుకుల పాఠశాల విద్యార్థిని పి.మేఘన 972/1000, కొమరాడ గురుకుల కళాశాల విద్యార్థిని కె.గాయత్రి 966/1000, పి.శాంతికుమారి 966/1000, వేపాడ గురుకుల విద్యార్థిని ఎం.కావ్య 961/1000 మార్కులతో మొదటి నాలుగు స్థానాలను వరుసగా సాధించారు. అదేవిధంగా బైపీసీలో కూడా మొదటి మూడు స్థానాలు గురుకులాల విద్యార్ధినులే సాధించారు. చీపురుపల్లి గురుకుల విద్యార్థిని కె.కల్యాణి 975/1000, కొమరాడ గురుకుల విద్యార్థిని టి.లోహిత, డి.దుర్గ 974/1000, చీపురుపల్లి విద్యార్థిని కె.రమ్య 968/1000 మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సీఈసీ విభాగంలో నెల్లిమర్ల విద్యార్థినులు కె.శశికళ 959/1000, ఎం.హారిక 927/1000 మార్కులు తెచ్చుకుని వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. హెచ్ఈసీ విభాగంలో భామిని విద్యార్థిని ఎ.రాజేశ్వరి 856/1000 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రథమ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కొమరాడ విద్యార్థిని పి.రేవతి 463/470, గరుగుబిల్లి విద్యార్థిని ఆర్.పూజిత 459/470, వేపాడ విద్యార్థిని సౌజన్య 454/470 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రథమ ఇంటర్ బైపీసీ విభాగంలో కొమరాడ గురుకుల పాఠశాల విద్యార్థిని వై.ప్రశాంతి 433/440, వంగర గురుకుల విద్యార్థినులు కె.హరిప్రియ 432/440, పి.మౌనిక 431/440 మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఎంఈసీ గ్రూప్లో ఎన్.రేణుక 424/440, సీఈసీలో వై.దేవి 421/500, హెచ్ఈసీ గ్రూప్లో డి.సంజన 477/500 మార్కులతో ఆయా గ్రూప్లలో మొదటి స్థానంలో ఉన్నారు. పెరిగిన ఉత్తర్ణత శాతం గత ఏడాది ఫలితాల్లో ప్రథమ ఇంటర్ 82.21 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 86.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా గత ఏడాది ద్వితీయ ఇంటర్లో 87.25 ఉత్తీర్ణత శాతం ఉంటే తాజాగా వచ్చిన ఫలితాల్లో 93.82 శాతం నమోదైంది. -
సత్తా చాటిన గిరిబాలలు
సీతంపేట: కార్పొరేట్ తరహా కళాశాలను తలదన్నేలా కనిపిస్తున్న ఈ భవనం మల్లి గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 71 మంది హాజరు కాగా 70 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 67 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ● సీతంపేట బాలికల గురుకుల కళాశాలలో 163 మంది ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా 160 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 19 మంది పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత చెందారు. ద్వితీయ సంవత్సరంలో 165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ పాసయ్యారు. వృత్తివిద్యాకోర్సులో 25 మందికి 25మంది పాసయ్యారు. సీతంపేటలోని బాలురు గురుకులంలో 165 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరు కాగా 159 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 157 మందికి 153 పాసయ్యారు. ఫలితం ఇచ్చిన మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలు, స్టడీ మెటీరియల్, ప్రత్యేక తరగతులు, పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది నియామకం వంటి చర్యలతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా మొదటిస్థానం సాధించిందని చెప్పవచ్చు. కేజీబీవీతో పాటు పలు కళాశాలల్లో నాడు–నేడు వంటి పనులు జరగడం విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అప్పటి ప్రభుత్వం కల్పిండంతో పాటు అమ్మఒడి పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చెల్లించడం తదితర కారణాలతో గిరిజన విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి మొగ్గుచూపారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల్లో అయితే పరిమితంగా ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ వంటి గ్రూపుల్లో 40 సీట్లు మాత్రమే ఉంటాయి. తమ పిల్లలకు రెసిడెన్షియల్ కళాశాలల్లో సీట్లు కావాలని తల్లిదండ్రులు ఐటీడీఏ పీఓకు మొరపెట్టుకోవడంతో ఆయన చొరవతో రెండు, మూడేళ్లుగా అదనంగా మరో 10 సీట్లు కూడా పెంచుతూ వచ్చారు. ఈ ఫలితాల్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 11 మందికి పైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 900లకు పైబడి మార్కులు సాధించారు. అలాగే 20 మందికి ఫస్టియర్లో 400లకు పైబడి మార్కులు వచ్చాయి. ఇంటర్ ఫలితాల్లో అద్భుతం -
హెచ్సీ కృష్ణమూర్తికి సత్కారం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కె.కృష్ణమూర్తి తనకు నెలకు వచ్చిన జీతంలో కొంతమొత్తాన్ని పేదప్రజలు, పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్న విషయం, అలాగే మరికొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఆదివారం పట్టణ శివారులో ఉన్న సూర్యపీఠం దేవస్థానంలో సాహితీ లహరి, మంచుపల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ కృష్ణమూర్తి సేవలను కొనియాడుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావుల చేతుల మీదుగా సాహితీ లహరి సేవాశ్రీ పురస్కారాన్ని కృష్ణమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో డా.మంచుపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పోలీస్శాఖలో పనిచేస్తూ తన కష్టార్జితంలో కొంతమొత్తాన్ని సామాజిక రంగంలో విస్తృతంగా సేవలు అందించేందుకు కేటాయిస్తున్న కృష్ణమూర్తి సేవలు పలువురికి ఆదర్శమని ప్రశంసించారు. పశువులశాల దగ్ధందత్తిరాజేరు: మండలంలోని పిలింగాలవలసలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో పశువుల శాల, గడ్డివాములు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గండి సింహాచలానికి చెందిన పశువుల శాలకు నిప్పు అంటుకోవడంతో పక్కనే ఉన్న గండి కృష్ణ గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు సమాచారం అందించడంతో బాడంగి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బిల్లుమడ సమీపంలో ఏనుగులుభామిని: మండలంలోని పాత బిల్లుమడ సమీపంలో ఆదివారం ఏనుగుల గుంపు హడావిడి చేసింది. గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించడంతో చూసేందుకు పిల్లలు,పెద్దలు పోటీ పడ్డారు.వరుస సెలవులు కావడంతో పిల్లలతో పెద్దలు బిల్లుమడ గ్రామానికి వెళ్లి ఏనుగులను దగ్గరుండి చూశారు. సందర్శకులు పెరిగి కేకలు వేయడంతో తోటలోకి ఏనుగులు జారుకున్నాయి. ఏనుగుల సమీపంలో ఉండాల్సిన ట్రాకర్స్ వలస రైతు జీడి తోటకాపలాలోనే ఉంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పౌష్టికాహారంపై అవగాహన వంగర: ఇంటి పనుల్లో మహిళలకు పురుషులు సహకారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.కల్యాణి కోరారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని కోనంగిపాడు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్ద పురుషులు అందించాల్సిన సహకారంపై ఆదివారం అవగాహన కల్పించారు. వారికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందేలా చూడడంతో పాటు బరువులు ఎత్తే పనులు వారితో చేయించవద్దన్నారు. రెండేళ్ల వయసు వరకు చిన్నారులను బాగా చూసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారం ప్రయోజనాలను గర్భిణులు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సీహెచ్ రూపావతి, జి.రమణి, జి.పద్మ, ఎన్.లక్ష్మి, పి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు. యువకుడి మృతిపై కేసు నమోదుకొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల బలిఘట్టం గ్రామం జంక్షన్ సమీపంలో శనివారం లారీ ఢీకొని గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఎస్.వినయ్కుమార్ మృతి చెందడంపై సీఐ ఎస్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసినట్లు ఆదివారం ఆయన తెలిపారు.లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చేపట్టినట్లు చెప్పారు. కాగా మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
బస్సు ఢీకొని తండ్రీకొడుకుల మృతి
బలిజిపేట: మండలంలోని వంతరాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట గ్రామానికి చెందిన ముడుసు రామయ్య(30), కుమారుడు పవన్కుమార్(3) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజాం నుంచి ఆటో డ్రైవింగ్ చేసుకుని వస్తుండగా వంతరాం గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామయ్య బలిజిపేట గ్రామానికి చెందిన యాదవ కుటుంబీకుడు. ఆయన ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం కుమారుడిని తీసుకుని రాజులమ్మ యాత్రకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వంతరాం సమీపంలో జరిగిన బస్సు ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో భార్య భవాని, కూతురు రమ్య, కుటుంబసభ్యులు, బంధువులు లబోదిబోమని రోదిస్తున్నారు. రామయ్యకు ఉండడానికి కనీసం ఇల్లుకూడా లేదని, భార్య, కూతురికి ఆరోగ్యం బాగోలేకపోతే రాజులమ్మ మొక్కుతీర్చుకుని వస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భావించిన తండ్రి భార్యను, ఆడపిల్లను ఇంటివద్ద ఉంచి, కొడుకును తీసుకుని వెళ్లాడని బంధువులు తెలిపారు. కుటుంబయజమాని మృతితో భార్య, ఆడపిల్ల నడిరోడ్డున పడ్డారని వాపోతున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య భవాని ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం తరలించినట్లు చెప్పారు. చెట్టును ఢీకొని టిప్పర్ డ్రైవర్..రేగిడి: మండల పరిధిలోని రెడ్డిపేట జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. దీనిపై ఎస్సై పి.నీలావతి అందించిన వివరాల ప్రకారం ఆమదాలవలస వద్ద ఉన్న ముద్దాడపేట ర్యాంప్ నుంచి ఇసుకను తీసుకువెళ్లేందుకు సాలూరు నుంచి డ్రైవర్ టిప్పర్తో వస్తున్నాడు. రాజాం నుంచి పాలకొండ వైపు వేకువజామున 3గంటల సమయంలో మలుపు వద్ద వాహనం అదుపుచేయలేక చెట్టును బలంగా ఢీకొన్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో గాయాలపాలైన డ్రైవర్ తన ఫోన్లో మిగిలిన డ్రైవర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న వారంతా కేబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడిని అనకాపల్లి జిల్లా కోడూరు మండలం గొల్లపేటకు చెందిన పల్లా నాగరాజు (30)గా గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతుడి చిన్నాన్న దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తున్నామన్నారు. మృతుడికి భార్య హేమవర్షిణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సీహెచ్సీకి తరలించామన్నారు.లారీ కింద పడి వ్యక్తి..కొమరాడ: మండలకేంద్రం కొమరాడ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవలస గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మణ్(55)లారీ చక్రాల క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న లారీ రహదారి పక్కగుండా నడిచి వెళ్తున్న లక్ష్మణ్ను ఢీకొంది. దీంతో కింద పడిన లక్ష్మణ్ పై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో నుజ్జునుజ్జై పోయాడు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం -
మృత్యు ఒడిలోకి...
శుభలేఖ ఇచ్చేందుకని బయలుదేరి..పాలకొండ రూరల్: తన పెద్దనాన్న కుమారుడు వివాహం తొలి శుభలేఖను తమ ఇంట పేరంటాళ్లకు చూపించేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో మరో మూడు వారాల్లో ఆ ఇంట జరగాల్సిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పాలకొండ మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు గొర్ల కృష్ణ, భాను దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మోహనరావు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడిని తమ రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. మోహనరావు పెద్దనాన్న కుమారుడికి మే 9వ తేదీన వివాహం నిశ్చయమైంది. దీంతో మోహనరావు అలియాస్ మణి(20) అన్నీ తానై వివాహ ఏర్పాట్లను చూస్తున్నాడు. ఇందులో భాగంగా పెండ్లి శుభలేఖను తొలిత పేరంటాళ్లకు, దేవతలకు చూపించి తరువాత బంధువులకు ఇచ్చేందుకు తన పెద్దనాన్న విశ్వేశ్వరరావుతో కలిసి శనివారం సిద్ధమయ్యాడు. తన బైక్పై పెద్దనాన్నతో కలిసి దుగ్గి – నక్కపేట వెళ్లేందుకు శనివారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక రాజుపేట ఖానాల దాటి వీరఘట్టం రోడ్డుకు తన బైక్ను తిప్పే సమయంలో వీరఘట్టం నుంచి సురేష్ స్కూల్కు చెందిన బస్సు ఢీకొంది. దీంతో బైక్ పైనుంచి మోహనరావుతో పాటు పెద్దనాన్న తుళ్లిపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మోహనరావు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయాడు. ఇంతలోనే తేరుకున్న పెద్దనాన్న విశ్వేశ్వరరావు కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే అక్కడి యువకులు మోహనరావును ఆస్పత్రికి వేరొక బైక్పై తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో 108 వాహనం రావడంతో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మోహనరావు మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. విశ్వేశ్వరరావు స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును స్టేషన్కు తరలించారు. కోటిపల్లిలో విషాదం మోహనరావు అలియాస్ మణి మృతితో కోటిపల్లిలో విషాదం నెలకొంది. పెళ్లి సందడితో ఉండాల్సిన ఆ ఇంట కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి. తమ ఒక్కగానొక్క కుమారుడిపై విధికి కన్ను కుట్టిందని తల్లిదండ్రులు కృష్ణ, భాను గుండెలవిసెలా రోదిస్తున్నారు. వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరొకరికి గాయాలు రాజుపేట వద్ద ఘటన -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240పైడితల్లి చండీయాగం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని శనివారం చదురుగుడి, వనంగుడి ఆలయ ప్రాంగణంలో చండీయాగం ప్రక్రియను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు సాయికిరణ్, దూసి శివప్రసాద్, వెలువలపల్లి నరసింహమూర్తి, తాతా రాజేష్లు యాగప్రక్రియను నిర్వహించి, యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కెఎన్విడివి.ప్రసాద్ పర్యవేక్షించారు.అమ్మవారికి గోరింటాకుతో అర్చన విజయనగరం టౌన్: నగరంలోని సిటీ బస్టాండ్ వద్దనున్న అభయాంజనేయస్వామి ఆలయంలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు వికె.గాయత్రీ శర్మ ఆధ్వర్యంలో శనివారం గోరింటాకుతో అర్చనలు నిర్వహించారు. చైత్ర మాస పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు, నక్షత్ర హారతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బొందిగామ మండలం అలమండ గ్రామానికి చెందిన అలిబిల్లి నాని( 20) విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తనతో పాటు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై గంట్యాడ మండలం తాటిపూడి రిసార్ట్కు పికినిక్కు వెళ్లారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో అక్కడ నుంచి బయలుదేరి విజయనగరం వస్తుండగా గింజేరు దాటిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రిల్స్ను ఢీకొట్టడంతో నానితో పాటు బైక్పై వెనుక కూర్చొన్న వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. నాని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంచార్జ్ ఎస్ఐ అశోక్కుమార్ తెలిపారు. కళ్లల్లో కారం కొట్టి పుస్తెలతాడు అపహరణ రాజాం సిటీ: పట్ట పగలు మహిళ కళ్లల్లో కారంకొట్టి పుస్తెలతాడు అపహరించుకుపోయిన ఘటన మండల పరిధి పొగిరి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జడ్డు చిన్నమ్మడు ఉదయం 7గంటల సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుకభాగంలో ఉన్న తన కళ్లంలో ఆవులకు మేత వేస్తుంది. ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చాడు. ఆమె వద్దకు వెళ్లి తన చేతిలో ఉన్న కారం ఆమె ముఖంపై చల్లి మెడలోని 38 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె పెనుగులాడినప్పటికీ ప్రయోజనం లేక కేకలు వేసింది. ఆమె కేకలు విని అక్కడకు చేరుకున్న తన భర్త నరేంద్రతో పాటు మరికొంత మందికి విషయం చెప్పంది. వెంటనే పుస్తెలతాడు అపహరించుకుపోయిన వ్యక్తి రాజాం వైపు వెళ్తున్నాడని గమనించి వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన సీఐ కె.అశోక్కుమార్ ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు గ్రామస్తుల వద్ద ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. -
నగరంలో కేంద్ర బృందం పర్యటన
విజయనగరం: ప్రభుత్వం తరఫున ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం నగరంలో శనివారం పర్యటించింది. నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్ట్స్ కమిటీ సభ్యులైన డాక్టర్ గౌరవ్ త్రిపాఠి, సుదీప్ శుక్లాదాస్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు శనివారం విచ్చేశారు. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్య సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పీహెచ్సీలను తనిఖీ చేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వీటీ అగ్రహారంలో ఉన్న జొన్నగుడ్డి పీహెచ్సీకి చేరుకుని అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పరిస్థితి, వైద్య పరికరాల పనితీరు వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం 41వ నంబరు సచివాలయం చేరుకుని అక్కడ వివిధ అంశాలను, వైద్య పరమైన సేవలను ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ బృందం సభ్యులు తమ పరిశీలన అంశాలను నమోదు చేసి పీహెచ్సీలకు ర్యాంకింగ్లు ఇవ్వనున్నారు. మరో వారం రోజుల్లో వేరొక బృందం రానున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. -
3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
విజయనగరం క్రైమ్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల పనితీరుపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సెట్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2,125 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. తొలుత ప్రజలు కోరిన చోట కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, ఆలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు అవసరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి డీఎస్పీలకు అప్పగించారు. వీడని ఏనుగుల బెడద జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ ఎరుకలపేట, వెంకటరాజపురం గ్రామస్తులను ఏనుగుల బెడద వీడడం లేదు. శనివారం ఉదయం గవరమ్మపేటలోని అరటి, పామాయిల్ తోటల్లో సంచరించిన ఏనుగులు సాయంత్రానికి ఎరుకలపేట, వెంకటరాజపురం పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. వరి పంటను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం అందజేయాలని కోరుతున్నారు. -
కూటమి కుట్రలు!
చిరుద్యోగులపై కొనసాగుతున్నగంట్యాడ: చిరుద్యోగులపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగుల తొలగింపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండపల్లి ఇలాఖాలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు చిరుద్యోగులను తొలగించారు. కేజీబీవీల్లో పని చేసే కుక్, వాచ్మన్లను, పాఠశాలల్లో పని చేసే ఆయాలు, వాచ్మన్లు, ఉపాధి పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. మండలంలో ఇప్పటికే 15 మంది వీఓఏలను తొలగించారు. తాజాగా పెణసాం వీఓఏ(గ్రామైఖ్య సంఘం సహాయకురాలు)ను కూడా తొలగించారు. పెణసాం గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూడా కూటమి నేతలు పెద్ద రచ్చే చేశారు. పెణసాం వీఓఏ సుంకరి సన్యాసమ్మ(ఇందిర) గడిచిన 14 ఏళ్లుగా పని చేస్తుంది. ఇప్పుడు ఆమెను తొలగించి ఆ స్థానంలో వేరే మహిళను నియమించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల అధ్యక్షులు అంతా ఒక్కటై సన్యాసమ్మ వీఓఏగా బాగానే పని చేస్తున్నారని, సంతృప్తికరంగా సేవలు అందిస్తుందని, ఆమెనే కొనసాగించాలని తీర్మానించారు. అయినా అధికారులు వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. తొలగింపు ఉత్వర్వులు ఇవ్వరట..! ఏదైనా ఉద్యోగిని విధుల నుంచి తొలిగిస్తే ఏ కారణం చేత తొలగిస్తున్నారో.. ఉత్తర్వులు ఇస్తారు. కానీ వెలుగు అధికారులు మాత్రం తొలగింపు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగింపు ఉత్తర్వులు ఉంటే న్యాయ పోరాటం చేసేందుకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. పెణసాం వీఓఏ తొలగింపు ఆమెను కొనసాగించాలని పొదుపుల సంఘాల తీర్మానం అయినా తొలగించిన వైనం మంత్రి కొండపల్లి ఇలాఖాలో తీరిది! తొలగించాం.. రికార్డులివ్వమని చెప్పారు... నేను 14 సంవత్సరాలుగా వీఓఏగా పని చేస్తున్నాను. పొదుపు సంఘాల మహిళల అందరికీ సంతృప్తికర సేవలు అందిస్తున్నాను. వెలుగు సీసీ నిన్ను తొలగించాం.. నీ స్థానంలో వేరొకరిని నియమిస్తాం.. రికార్డులు అప్పగించమని చెప్పారు. ఇలా తొలగిస్తే ఎలా జీవించేది. – సుంకరి సన్యాసమ్మ, వీఓఏ, పెణసాంవీఓఏను తొలగించాం.. పెణసాం వీఓఏను తొలగించాం. వీఓఏలను తొలగింపు ఉత్తర్వులు అంటూ ఏమీ ఇవ్వం. ఇది నిబంధనల మేరకే చేశాం. – కోరుకొండ సులోచనదేవి, ఏపీఎం, వెలుగు -
రంగప్ప చెరువు వద్ద ఉద్రిక్తత
రాజాం సిటీ: పట్టణ పరిధిలోని రంగప్ప చెరువు ఆధునికీకరణ పనుల్లో భాగంగా అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. జేసీబీతో అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత భూమిలో సాగుదారులు అక్కడకు చేరుకుని ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్న భూములు లాక్కోవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఒకింత ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికారులు చెరువు వద్ద ట్రెంచ్లు ఏర్పాటు చేస్తున్న జేసీబీకి అడ్డంగా నిలుచొని నినాదాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు అందించామని, ఇది ప్రభుత్వ భూమి అని, ఈ చెరువుకు ఆనుకుని ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు చెప్పడంతో బాదితులు నిరసన తెలిపారు. 114 సర్వే నంబర్లో దళితులకు, స్వతంత్ర సమరయోధులకు పేరిట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, దీంట్లో తాము సాగు చేసుకుంటున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని, భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నామని సాగుదారులు బి.అప్పారావు, ఎన్.ఆదియ్య, తవిటినాయుడు, ఎన్.గడ్డియ్య, శంకర్ తదితరులు అధికారుల ఎదుట వాపోయారు. ఇప్పుడు అధికారులు ఇలా తమ భూమిని లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 70 కుటుంబాల వారు రోడ్డున పడతామని, పేదల భూములను కాపాడాల్సిందిపోయి తమ పొట్ట కొట్టొద్దంటూ జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక భూమికి సంబంధించి సరైన పత్రాలను చూపాలని పేర్కొంటూ అక్కడ నుంచి వెనుదిరిగారు. భూ సాగుదారుల ఆందోళన -
అనుభవానికి పెద్దపీట
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులుగా రాజన్నదొర, బెల్లాన సాక్షి ప్రతినిధి, విజయనగరం: అత్యంత కీలకమైన వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ)లో సీనియర్ నాయకులైన మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లకు చోటుదక్కింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేకు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి కొత్తగా రూపొందించిన పీఏసీ సభ్యుల జాబితాను శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మొత్తం 33 మంది సభ్యుల ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పీడిక రాజన్నదొరకు, విజయనగరం జిల్లా నుంచి బెల్లాన చంద్రశేఖర్కు అవకాశం కలిగింది. పీడిక రాజన్నదొర.. ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేసి 2004లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాజన్నదొర అడుగుపెట్టారు. తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేగా, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి విజయనగరంలో సీనియరు నాయకులైన బొత్స సత్యనారాయణ, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, సూర్యనారాయణ దేవ్ ఆశీస్సులతో ప్రజానేతగా ఎదిగారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. బెల్లాన చంద్రశేఖర్... గ్రామ స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బెల్లాన చంద్రశేఖర్ తర్వాత జిల్లా స్థాయి దాటి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2004 నుంచి 2008 వరకూ చీపురుపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా, తర్వాత 2008లో చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. అనూహ్యంగా 2011లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. 2019లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా 2015 నుంచి 2016 వరకూ సేవలందించారు. ఎంఏ, బీఎల్ చదివిన చంద్రశేఖర్ తొలుత న్యాయవాదిగా పనిచేశారు. చీపురుపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు. -
సాయి స్థూపం శంకుస్థాపన
విజయనగరం టౌన్: కాశీవిశ్వేశ్వర సహిత శ్రీ షిర్డీసాయి దక్షిణాభి ముఖ అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద 40 అడుగుల సాయి స్థూపానికి శనివారం శంకుస్ధాపన నిర్వహించారు. స్థానిక రీమాపేట ఉమామహేశ్వరనగర్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, షిర్డీసాయి సేవక్ సంఘ్ ఉప్పల బాపిరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా 40 అడుగుల సాయి స్థూపం నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్థూపంపై కలువ పువ్వులో ఆశీనులైన సాయి నిలువెత్తు విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందన్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులు రాసిన సాయినామకోటి పుస్తకాలను, నవధాన్యాలతో సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. -
వేతనాలు ఇవ్వండి మహాప్రభో!
రామభద్రపురం: పని చేసినా పస్తులే.. అనేలా ఉపాధి హామీ పథకం వేతనదారుల పరిస్థితి తయారైంది. గత 10 వారాలుగా పనులకు వెళ్తున్నా వేతనాలు మాత్రం చెల్లించడం లేదని రామభద్రపురానికి చెందిన వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజువారీ కూలి డబ్బులపై ఆధారపడే కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నామని పేర్కొంటున్నారు. నచ్చిన కూర వండుకుని ఇష్టంగా తిని చాలా రోజులైందని వాపోయారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. మరోవైపు కడుపు మాడిపోతున్నా కష్టపడి పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి తాము చూడలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ వేతనాలు అందివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
విజయనగరం: జిల్లా కేంద్రం వేదికగా జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఉల్లాస భరిత వాతావరణంలో ప్రారంభమైంది. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో అండర్ – 12, 16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ వయస్సుల కేటగిరీల్లో శనివారం నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతి ప్రధానోత్సవం చేయనున్నారు. టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలను త్వరలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు రామారావు, రంగబాబు, వైభవ్ తెలిపారు. జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను ఒకప్పుడు సిటీ క్లబ్ నిర్వహించిందని, ఎందరో అంతర్జాతీయ ఆటగాళ్లు సిటీ క్లబ్లో ఆడారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టెన్నిస్ జాతీయ స్థాయి క్రీడాకారులు సన్యాసిరాజు, కోచ్ గౌరీశంకర్, నిర్వాహకులు సాత్విక్, కౌశిక్, సీనియర్ ప్లేయర్స్ ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం -
నోటిఫికేషన్ ఇచ్చారు... పోస్టుల భర్తీ మరిచారు..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన కూటమి నేతలు... ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. చిరుద్యోగులకు వేదన మిగుల్చుతున్నారు. మరోవైపు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల భర్తీలోనూ నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. పోస్టులను భర్తీ చేస్తారా, లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఐసీడీఎస్ పరిధిలోని డీసీపీయూ, శిశుగృహ, చిల్డ్రన్ హోమ్లలో పోస్టుల భర్తీకి 2023 నవంబర్ 20వ తేదీన అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ పక్రియ చేపడుతున్న తరుణంలో ఎన్నికలకోడ్ రావడంతో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కా రు పాత నోటిఫికేషన్ను రద్దుచేసి 2024 సెప్టెంబర్ 4న కొత్తగా 23 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన భర్తీచేసే పోస్టులు 5, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేవి 9, పార్ట్టైమ్ పోస్టులు 9 ఉన్నాయి. వీటికోసం 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా పోస్టుల భర్తీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ కొద్ది రోజుల కిందటే పీడీగా బాధ్యతలు స్వీకరించానని, పోస్టుల భర్తీ పక్రియపై ఆరా తీసి భర్తీకి చర్యలు తీసుకుంటానన్నారు. శిశుగృహ, బాలసదన్లలో పోస్టుల భర్తీకి 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్ 23 పోస్టులకు 640 మంది అభ్యర్థులు దరఖాస్తు ఇప్పటికీ భర్తీ చేయని వైనం -
ఎర్రచెరువు ఆక్రమణల తొలగింపు
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ఉన్న ఎర్రచెరువు ఆక్రమణలను రెవిన్యూ అధికారులు శనివారం తొలగించారు. తహసీల్దారు కార్యాలయంలో ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గ్రామానికి చెందిన పలువురు చెరువు ఆక్రమణలపై తహసీల్దారు హేమంత్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆక్రమణలను పరిశీలించాల్సిందిగా ఆర్ఐ, వీఆర్వోలను తహసీల్దారు ఆదేశించారు. దీంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమణకు గురైన ఎర్రచెరువును పరిశీలించి, చూడగా ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించి తహసీల్దార్కు విషయం తెలియజేశారు. దీంతో ఆయన ఆక్రమణలు తొలగించాలని ఆదేశించడంతో జేసీబీతో చెరువు గర్భంలోని ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ భూములు గానీ చెరువు గర్భాలను గానీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమూర్తినాయుడు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
మే 20న దేశ వ్యాప్త సమ్మె
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ పార్వతీపురం: దేశ వ్యాప్తంగా మే 20న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ వెల్లడించారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం చేయాలన్నారు. రానున్న మే డే రోజున పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మెడకు ఉరితాడు లాంటిదన్నారు. కష్టపడే కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పద్ధతుల్లో విరివిగా ప్రచారం చేసి మే 20న చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొనేలా చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, కార్యవర్గ సభ్యులు బీవీ రమణ, ఎన్వై నాయుడు, ఆర్.రాము, కె.సాంబమూర్తి, వి.ఇందిర పాల్గొన్నారు. -
నిలిచిన బలసలరేవు వంతెన.. తొలగని చింత
● మాట ఇచ్చి మరచిపోయిన పవన్కళ్యాణ్ ● గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెనకోసం పోరాడిన ప్రజలు ● వారికి సంఘీభావంగా పోరాటంలో పాల్గొన్న జనసేనాని ● ప్రజల పోరాటాన్ని గుర్తించి వంతెన మంజూరుచేసిన జగన్మోహన్రెడ్డి ● రూ.87 కోట్ల కేటాయింపు ● కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదలని పనులు రాజాం: సంతకవిటి మండలం వాల్తేరు గ్రామ సమీపంలో నాగావళి నదిపై బలసలరేవు వద్ద వంతెన నిర్మితమైతే వేలాది మంది రాకపోకలకు అనువుగా ఉంటుంది. శ్రీకాకుళానికి దారి దగ్గరవుతుంది. వంతెన నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. చివరకు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వంతెన మంజూరు చేసింది. బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇసుకలపేట వరకు వంతెన పనులకు శ్రీకారం చుట్టింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.87 కోట్ల కేటాయించింది. పనులు ప్రారంభించి వేగవంతం చేయించింది. నదిలో పిల్లర్ల నిర్మాణం మూడోవంతు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో వంతెన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయా యి. ఇంతవరకూ వంతెన పనుల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వంతెన కోసం మాట్లాడకపోవడంపై జనం మండిపడుతున్నారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షలో భాగంగా 2019 అక్టోబర్ 20న వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్న పవన్కళ్యాణ్ ఇప్పుడు కినుక వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, అప్పటి సీఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన జనసేనాని ఇప్పుడు అదే నాయకుడి చేతిలో కీలుబొమ్మ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడగకుండానే వంతెన మంజూరుచేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బలసలరేవు వద్ద వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ పలు సర్వేలు నిర్వహించింది. అవసరమైన నిధులను అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో అప్పటి ఎమ్మెల్యే కంబాల జోగులు సాధించుకున్నారు. సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలిగించడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మార్చారు. 560 మీటర్లు పొడవున 16 పిల్లర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. రెండు వైపులా వంతెన అప్రోచ్ నిర్మాణం కోసం 14 ఎకరాల భూమిని రైతుల వద్ద సేకరించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది. పనులు జరుగడం లేదు వాల్తేరు వద్ద నాగావళి నది గుండా వందలాది మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తారు. వర్షాకాలంలో నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కంబాల జోగులు కృషితో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వంతెన నిర్మాణానికి రూ. 87 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వంతెన పనులను పట్టించుకోకపోవడం విచారకరం. – గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్సార్సీపీ సంతకవిటి మండలాధ్యక్షుడు, వాల్తేరు -
కాళ్లుపట్టుకుంటేనే ఉపాధి పని
జియ్యమ్మవలస రూరల్: ‘సుమారు 500 మంది వేతనదారుల మధ్య కాళ్లపై పడి క్షమాపణ చెబితేనే ఉపాధిహామీ పనికల్పిస్తాం.. లేదంటే పనికి రానివ్వం’ అంటూ ఫీల్డు అసిస్టెంట్, మేట్ల వేధింపులకు ఓ వేతనదారు మనస్థాపానికి గురైంది. గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జియ్యమ్మవలస మండలం జోగులమ్మ పంచాయతీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థాని కులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లుగా పనిచేస్తున్న టీడీపీ నాయకులు ఎలకల శంకర బాబు, కాబోతుల ఇల్లంనాయుడు కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ ముద్రవేసి వేతనదారుల ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కోవలో వేతన దారు బూరి గౌరమ్మ, భర్త త్రినాథరావును వేధింపులకు గురిచేశారు. ఉపాధి పని ఇవ్వకుండా.. పనికి వెళ్లినా ఒక గ్రూప్ నుంచి వేరే గ్రూప్లోకి మార్పు చేస్తూ, హాజరు వేయకుండా మనోవేదనకు గురిచేశారు. ఈ విషయమై పలుమార్లు జియ్యమ్మవలస పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. కాళ్లు పట్టుకుంటేనే పని ఇస్తామని వేధించడంతో మనస్థా పానికి గురైన బూరి గౌరమ్మ శుక్రవారం మధ్యాహ్నం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే ఆమెను చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ల గా డాక్టర్ ఎల్.వంశీకృష్ణ చికిత్స అందించారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులమని ముద్రవేసి కొన్నాళ్లుగా పని కల్పించడంలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గౌరమ్మను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం నాయకులు కొత్త సంస్కృతిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకుల వేధింపులు మనస్థాపంతో వేతనదారు ఆత్మహత్యాయత్నం మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శ -
కార్యకర్తలకు అండగా ఉంటాం
విజయనగరం రూరల్: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త మురళీరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా మురళీరాజు భార్య సుష్మ తన పిల్లలతో కలిసి శుక్రవారం జెడ్పీ కార్యాలయానికి వచ్చి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని గుడివాడ గ్రామంలో అట్రాసిటి కేసుపై విజయనగరం డీటీసీ డీఎస్పీ పి.వీరకుమార్ శుక్రవారం విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన జి.కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై బి.దేవిపై నమోదైన కేసులో డీఎస్పీ గ్రామంలోని ఎస్సీ కాలనీలోను, పాన్షాపు వద్ద సాక్షులు, ఫిర్యాదుదారులను విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. డీఎస్పీతో పాటు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు విచారణలో పాల్గొన్నారు. ఆరు కేజీల గంజాయి స్వాధీనంవిజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆరు కేజీల గంజాయి పట్టబడింది. ఒడిశా నుంచి ఓ వ్యక్తి ట్రైన్లో గంజాయితో వచ్చి స్టేషన్లో దిగాడన్న పక్కా సమాచారంతో వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రామ్గణేష్లు హుటాహుటిన స్టేషన్కు వెళ్లి రిజ్వరేషన్ కౌంటర్ పక్కనే ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వద్ద ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, అనుగూరు పంచాయతీ పరిధి, లాటింగ్కు చెందిన 32 ఏళ్ల రమాకాంత్ బెహరాను అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసునమోదు చేసి కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి 14 రోజలు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. 870 లీటర్ల సారా పట్టివేత● నలుగురి అరెస్టు సీతంపేట: మండలంలోని సుందరయ్యగూడ ప్రాంతంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఏఈఎస్ ఏఎస్ దొర ఆధ్వర్యంలో సారా బట్టీలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 870 లీటర్ల సారా పట్టుకున్నారు. సారా వండడానికి సిద్ధం చేసిన 1250 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ఏఈఎస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వూయక మురళి, బిడ్డిక ఆదినారాయణ, వి.సంజీవరావులతో పాటు నల్లబెల్లం సరఫరా చేసిన లబ్బకు చెందిన జాన్ సురేష్ను అ రెస్టు చేసినట్లు చెప్పారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు త ప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మొ బై ల్ పార్టీ టీమ్ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మ యి, పాలకొండ ఎస్సైలు ఫణీంద్రబాబు, ఎల్ .తిరుపతిరావు, వాసుదేవరావు పాల్గొన్నారు. ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టురాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలోని మామిడిచెట్టు కింద పేకాట ఆడుతున్న ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నామని, వారి దగ్గర నుంచి రూ. 6140లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు చెప్పారు. మరో ఏడుగురు పేకాట రాయుళ్లు.. రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అమృత ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్థలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని శుక్రవారం అరెస్టు చేశామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై వై.రవికిరణ్తో పాటు సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారన్నారు. ఈ దాడిలో పేకాటరా యుళ్ల నుంచి రూ.62,430లుతోపాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకంపార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశామేరకు శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నలుగురిని కమిటీలో నియమించారు. వివరాలిలా.. -
ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ప్రచార క్యాదర్శిగా జీవీ శ్రీనివాస్
సీతానగరం: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సీతానగరం మండలకేంద్రానికి చెందిన గన్నవరపు వెంకట శ్రీనివాస్ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోనూ రు సతీష్శర్మ, హెచ్కే మనోహర్రావు ఉత్తర్వులు జా రీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నూతనంగా నియమితులైన రాష్ట్ర ప్రచారకార్యదర్శి గన్నవరపు వెంకట శ్రీనివాస్ మండలకేంద్రంలో మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని తెలియజేశారు. ఆయన ఎంపిక పట్ల ఉమ్మడి జిల్లా బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. -
సురక్షిత ప్రసవాలే లక్ష్యం
పార్వతీపురంటౌన్: మాతా, శిశు ఆరోగ్య శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆశా నోడల్ అధికారులతో ఎన్జీఓ హోమ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ భాస్కరరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేశారు. మాతా, శిశు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, గర్భిణిగా నమోదు చేసినప్పటి నుంచి ప్రసవానంతరం వరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య తనిఖీలు, వైద్యపరీక్షలు, నెల వ్యవధిలో రెండు డోసుల టిడి ఇంజక్షన్, ప్రతిరోజూ ఐరన్, కాల్షియం మాత్రలు, నిర్దేశించిన కాల వ్యవధిలో కనీసం నాలుగు తనిఖీలు తప్పనిసరి అని తెలిపారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు సత్వరమే గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని, సురక్షిత ప్రసవమే ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. సాధారణ ప్రసవాలు పీహెచ్సీల్లో జరిగేలా చూడాలని చెప్పారు. గిరిశిఖర, మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులను నెల/రెండు నెలలు ముందుగానే వసతి గహాల్లో చేర్చాలని సూచించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయడం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన గర్భిణుల్లో హీమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందేలా పర్యవేక్షించాలని సూచించారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆశ కార్యకర్తలకు ఆరోగ్యశాఖ పంపిణీ చేసిన యూనిఫాంను ప్రోగ్రాం అధికారులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో డీఐఓ డా.ఎం.నారాయణరావు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, డా.రఘుకుమార్, డీపీహెచ్ఎన్ఓ ఉషారాణి, డీపీఓ లీలారాణి, డీసీఎం విజయలత, డెమో సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే కళంకం
● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు అక్రమం, అన్యాయం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యమనే సౌధానికి నాలుగో స్తంభమైన పత్రికలను అణచివేసేందుకు క్రిమినల్ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ పాలనలో సర్వసాధారణమైపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యానికే కళంకం అని విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఇటీవల సాక్షి, ప్రజాశక్తి రిపోర్టర్లపైనా ఇక్కడి మంత్రుల ప్రోద్బలంతో వారి అనుచరులు స్వల్ప కారణాలకే ఫిర్యాదు చేయడం, అవెంతవరకూ న్యాయసమ్మతమో కనీసం పరిశీలన లేకుండానే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేస్తున్నారని ప్రస్తావించారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మారకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పాత్రికేయులపై కేసులు భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
అక్షరంపై దాడి సిగ్గుసిగు్గ
● పత్రికా స్వేచ్ఛను హరించడానికే అక్రమ కేసులు ● కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టు సంఘాల నిరసన విజయనగరం అర్బన్: వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు, నిజాలు ప్రచురించే పత్రికలపై కూటమి ప్రభుత్వం దాడులకు దిగడం, పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం సిగ్గుసిగ్గు అంటూ జర్నలిస్టు సంఘాలు నినదించాయి. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపాయి. సాక్షి దిన ప్రత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేయడాన్ని ఖండించాయి. విజయనగరం కలెక్టరేట్ గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, పత్రికా ప్రతినిధులు ఆందోళన చేశారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్యచేసిన ఉదంతాన్ని వెల్లడించినందుకు కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. ఇది అక్షరంపై దాడిచేయడమేనన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ వినతిని ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వీఎస్ఎస్వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు, ప్రధాన కార్యదర్శి వ్యాస్, వివిధ పత్రికల సంపాదకులు పంచాది అప్పారావు, కొల్లూరి జగన్నాథ శర్మ, వై.ఎస్.పంతులు, సాక్షి టీవీ జిల్లా బ్యూరో అల్లు యుగంధర్, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు. కేసులు తగవు రాష్ట్రంలో పత్రికలకు స్వేచ్ఛలేకుండా పోయింది. రోజురోజుకీ జర్నలిస్టులపై ప్రభుత్వ దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘటనలను చూస్తూ జర్నలిస్టులు ఊరుకోరన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ఏ పత్రికై నా ఇచ్చిన వార్తలో అసత్యాలుంటే న్యాయస్థానాలున్నాయి. వాటిని ప్రభుత్వం ఆశ్రయించాలే తప్ప క్రిమినల్ కేసులు పెట్టి పత్రికల స్వేచ్ఛను హరించేందుకు పూనుకోవడం అప్రజాస్వామికం. – కొల్లూరి జగన్నాథశర్మ, జర్నలిస్టు ● -
పగలు, రాత్రి తేడా లేకుండా..!
● అనధికార విద్యుత్ కోతలు ● ఎండ వేడమికి ఇబ్బంది పడుతున్న జనం ● ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేత విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమితో పాటు ఉక్కబోతను భరించలేక అవస్థలు పడుతున్నారు. ఫ్యాన్ కింద సేదతీరుదాం అంటే విద్యుత్ కోతల వల్ల ప్రజలకు అవకాశం లేని పరిస్థితి. కొద్దిమందికి మాత్రమే ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఇన్వర్టర్స్ లేని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ కోతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10, 15 నిమిషాల పాటు పదేపదే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 నిమిషాల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇస్తాం. విద్యుత్ కోతలే ఉండవు, చార్జీలు కూడా పెంచబోమని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇవ్వాల్సిన సమయంలోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పవర్కట్ అని కాకుండా రకరకాల కారణాలతో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇష్టానుసారం కోతలు పెడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా ఎప్పడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు తప్పని ఇబ్బందులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అకాశంలో చిన్నపాటి మబ్బు వేసినా వ్యవసాయ విద్యుత్కు సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో పదేపదే విద్యుత్ నిలిపివేయడం వల్ల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ద్వారా పంటలకు సాగునీరు అందించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. రోజులో నాలుగు, ఐదుసార్లు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల విద్యుత్ ఎప్పడువస్తుందో ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతరాయంగా 9గంటల పాటు విద్యుత్ అందేది. గృహ వినియోగదారులకు కూడా 24 గంటల పాటు విద్యుత్ అందేది. అత్యవసరంగా విద్యుత్ కోత విధించాల్సి వస్తే అధికారికంగా ప్రకటించేవారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7,41,828 జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7, 41, 828 ఉన్నాయి. వాటిలో కేటగిరి–1 కి సంబంధించి 6,04,535, కేటగిరి–2 కనెక్షన్లు 65, 194 ఉన్నాయి. కేటగిరి–3 కనెక్షన్లు 2,822 ఉన్నాయి. కేటగిరి –4 కనెక్షన్లు 14,168, కేటగిరి–5 కనెక్షన్లు 55,109 ఉన్నాయి. ప్రతిరోజూ విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రతిరోజూ పగలు లేదా రాత్రి పూట 10, నుంచి 15 నిమిషాల పాటు 2,3 పర్యాయాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవికాలం కావడంతో పగలు, రాత్రి కూడా ఉక్కబోత కారణంగా ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ కిందికి వెళ్దామంటే విద్యుత్ సరఫరా ఉండడం లేదు. ఆర్. నాగేశ్వరావు, వినియోగదారు, పెదవేమలి గ్రామం గంట్యాడ మండలం విద్యుత్ కోతలు లేవు అధికారికంగా ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదు. ఎండవేడిమికి కొన్ని చోట్ల ట్రిప్ అవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళ ఎక్కడైనా సమస్య తలెత్తితే విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ఎక్కడ సమస్య వచ్చినా విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: పోలీస్శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం వెల్ఫేడ్ డే ను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు డీపీఒలో ‘వెల్ఫేర్ డే’ను ఎస్పీ నిర్వహించి మాట్లాడుతూ సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలను విజ్ఙాపనల రూపంలో ఈ వెల్ఫేర్ డే ద్వారా తీసుకుంటున్నట్లు చెప్పారు. వారి సమస్యలు,సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన చాంబర్కు వచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను సావధానంగా ఎస్పీ ఆలకించారు. సిబ్బంది చెప్పిన సమస్యలను వారి ముందే ఓ నోట్ బుక్లో నోట్ చేసుకున్నారు. వెంటనే అక్కడిక్కడే సూపరింటెండెంట్ను తన చాంబర్కు పిలిపించుకుని సిబ్బంది ఇచ్చిన విజ్ఙాపనలకు తగిన వివరణలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సిబ్బంది సమస్యలకు పరిష్కారానికి తగిన చర్యలు చేపడతానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మొత్తం ఆరుగురు సిబ్బంది వారి సమస్యలను వెల్ఫేర్డేలో ఎస్పీకి విన్నవించుకున్నారు. -
అటకెక్కుతున్న ఇటుక
● పడిపోయిన విక్రయాలు ● ముందుకు సాగని పరిశ్రమరాజాం: మట్టి ఇటుకల తయారీ పరిశ్రమ గతేడాది వరకూ మూడు ఇటుకలు ఆరు బట్టీలు అన్న చందంగా నడిచింది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో పుట్టగొడుగుల్లా ఇటుక పరిశ్రమలు పుట్టుకొచ్చేవి. ఒక్కో బట్టీ వద్ద నాలుగు నుంచి ఐదు కుటుంబాలు జీవనం సాగించేవి. ఏటా ఇటుకల ధరలు పెరుగుతూ వచ్చేవి. వేసవితో పాటు అన్ని కాలాల్లో వాటి సీజన్ నడిచేది. మట్టి ఆధారంగా ఈ ఇటుకలకు డిమాండ్ కూడా అధికంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కొంతకాలంగా ఇటుకల వ్యాపారం మందగించింది. ఇటుకలు కొనే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వాటి ధర పతనమైంది. నిర్మాణాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇటీవల ఈ పరిశ్రమలు ఎత్తేసి, వేరే పనులకు కుటుంబాలు వలసపోతున్నాయి. వాటిని నమ్ముకుని పెట్టుబడి పెట్టిన వ్యాపారులు సొమ్ముచేసుకోలేక తంటాలు పడుతున్నారు. అమాంతం పడిపోయిన ధర గతంలో ట్రాక్టర్ (2000) ఇటుకల ధర రూ.10 వేలు ఉండేది. ఈ ధర ఆయా ఇటుక బట్టీల వద్ద పలికేది. రవాణా చార్జీలు అదనంగా రూ.1500లు నుంచి రూ.2500లు వరకూ ఉండేవి. రాజాం మండలంలోని పొగిరి, కొత్తపేట, పెనుబాక తదితర ప్రాంతాల్లో ఇటుకకు డిమాండ్ ఉండేది. రేగిడి మండలంలోని కుమ్మరి అగ్రహారం, తాటిపాడు, లక్ష్మణవలస, ఖండ్యాం ప్రాంతాల వద్ద ఇటుక తయారీ అధికంగా ఉండడంతో పాటు తరలింపు కూడా చాలా ఎక్కువగా ఉండేది. సంతకవిటి మండలంలోని రంగారాయపురం, మేడమర్తి, పోడలి, తాలాడ ప్రాంతాల్లో ఇటుక బట్టీలకు మంచి డిమాండ్ ఉండేది. ఇటుక ధరల్లో తగ్గేది లేదన్నట్లుగా వ్యాపారులు విక్రయాలు చేసేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇటుక పరిశ్రమలు ముందుకు నడవడంలేదు. బట్టీల వద్ద ట్రాక్టర్ ఇటుక ధర ఒక్కసారిగా రూ.7,500లు, రూ.8వేలకు పడిపోయింది. కొన్ని పరిశ్రమల వద్ద ఇటుకలను కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. నిర్మాణాలు మందగించడంతో ఇటుక పరిశ్రమల వద్ద ఇటుకలు అలానే దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి ఇటుకల విక్రయాలు జరగకపోవడంతో వాటి నిమిత్తం పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా ఇటుకబట్టీలు తడిసిముద్దవుతున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులతో పెట్టిన ఇటుకబట్టీలు వ్యాపారం లేక వెలవెలబోతుండగా, ఇటుక పరిశ్రమలు పెట్టిన వ్యాపారులు, రైతులు దివాలా తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజాం నియోజకవర్గంలో 210కి పైగా ఇటుక పరిశ్రమలు ఉన్నాయి. ఇటుక బట్టీ నిలిపివేశాం మండలంలోని అగ్రహారం వద్ద మాకు ఇటుకల బట్టీ ఉండేది. గత ఏడాదికాలంగా డిమాండ్ తగ్గిపోయింది. దీంతో చేసేదిలేక ఇబ్బందులు పడ్డాం. అప్పులకు వడ్డీలు చెల్లించలేక వేరే పనులు చేస్తూ అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. కె. వెంకటరమణ, ఇటుకల వ్యాపారి, అగ్రహారం, రేగిడి మండలం పెట్టుబడి లేక నష్టపోతున్నాంగతంలో ఇటుకలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఈ డిమాండ్ లేదు. మండలంలోని ఓ గ్రామం వద్ద రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు ఇటుకబట్టీలు పెట్టాం. పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఎం.అప్పలనాయుడు, ఇటుకల వ్యాపారి, రాజాం -
ఎస్సీ యువత ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక
విజయనగరం టౌన్: జిల్లాలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.21.13 కోట్ల ఖర్చుతో 509 యూనిట్ల ఏర్పాటుకు షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ రూపొందించిన ప్రణాళిక అమలుకు అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న శ్రీకారం చుడతామన్నారు. బ్యాంకుల నుంచి రూ.1174.76 లక్షలను రుణాల రూపంలో అందజేస్తామన్నారు. రూ.832.64 లక్షల సబ్సిడీ వర్తింపజేస్తామని చెప్పారు. షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి కల్పన కోసం 32 రకాల స్వయం ఉపాధి పథకాల నుంచి ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువగల యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. దీనికోసం మే 10వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్కు ఏపీఓబీఎమ్ఎమ్ఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 506 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ గల 152 యూనిట్లు కేటాయిస్తారు. వీటిలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం ఉంటుంది. లబ్ధిదారుని వాటా 5 శాతం చెల్లించాలి. ప్యాసింజర్ ఆటో, కారు, గూడ్స్, ట్రక్ వంటి వాహనాల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్ల కొనుగోలు కోసం ఐదుగురితో కూడిన గ్రూప్లకు రుణాలు మంజూరుచేస్తారు. రూ 40 లక్షల వ్యయం కాగల ఒక్కో యూనిట్ను ఐదు గ్రూపులకు మంజూరు ఉంటుంది. ఇందులో రూ.32 లక్షలు సబ్సిడీగా లభిస్తుంది. బ్యాంకు నుంచి రూ.6 లక్షలు రుణంగా మంజూరవుతుంది. మిగిలిన రూ.2 లక్షల మొత్తం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. -
పీఎంశ్రీ రాష్ట్ర బృందం పర్యటన
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎంశ్రీ పథకం రాష్ట్ర బృందం సభ్యులు డాక్టర్ ఎస్.ప్రసాద్, జి.మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ సహాయకులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పీఎంశ్రీ పథకం కింద మన్యం జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు, క్రీడామైదానం, ల్యాబ్లు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ 19 పాఠశాలలు మోడల్ పాఠశాలలుగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులన్నీ సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారుల సహకారం, సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం పనులు జరుగుతున్న తీరు, సమస్యలను 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.రమాజ్యోతి, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, ఇంజినీరింగ్ సహాయకులు, సెక్టోరల్ సిబ్బంది 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్ సామగ్రి సీజ్
విజయనగరం: నగరంలో నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1110 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, తన బృందంతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్లాస్టిక్ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న ప్లాస్టిక్ దుకాణాల వద్దకు వెళ్లి నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలను గుర్తించి మొత్తం 1,110 కేజీల ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుని విశాఖ జిల్లా మధురవాడలో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్ల నయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో తామ కృషి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు అనధికారికంగా ప్లాస్టిక్ విక్రయాలను సాగిస్తున్నారన్నారు. ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేస్తూ ప్లాస్టిక్ను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నారు. ఇక నుంచి నిరంతరం దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ప్లాస్టిక్ వినిమయం జరగకుండా పూలు, కూరగాయల దుకాణాలు ఇతరత్రా చిన్నచిన్న దుకాణాల వద్దకు వెళ్లి తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అయితే కొంతమంది నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ అమ్మకాలు సాగించడంతో నగరంలో ప్లాస్టిక్ వినిమియం జరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఆదేశించడంతో 1110 కేజీల నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని, ఎనర్జీ ప్లాంట్ కు తరలించామన్నారు. ఇక నుంచి ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ ను విక్రయించినట్లు గుర్తిస్తే సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారీగా అపరాధ రుసుము విధించి, దుకాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు, రవిశేఖర్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ల వినియోగంలో సెంచూరియన్ సహకరించాలి
విజయనగరం అర్బన్: వ్యవసాయం, ఉద్యాన వనాల అభివృద్ధిలో డ్రోన్ల వినియోగానికి సహకరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సెంచూరియన్ వర్సిటీ చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్రాజుతో కలెక్టర్ భేటీ అయ్యా రు. సెంచూరియన్ యూనివర్సిటీలో చేపడుతున్న కోర్సుల వివరాలను, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ గురించి కలెక్టర్కు చాన్స్లర్ వివరించారు. యువతకు నైపుణ్యం ఇవ్వడానికి తాము సిద్ధంతా ఉన్నాయని చాన్స్లర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్రాజు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న కో ర్సులు, నైపుణ్య శిక్షణలు, సీడాప్ ఒప్పందం గురించి వివరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ త్వరలో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా యువతకు నైపుణ్య కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్లతో వ్యవసాయం ఇతర రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. దీనికి కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ తాను త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. వ్యవసాయంలో ప్రస్తుతం మామిడి పంట ఉన్నందున తెగుళ్లు నివారణకు డ్రోన్ల ద్వారా కృషి చేయాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
రేగిడి ఘటనపై విచారణకు కమిటీ
● ముగ్గురు జిల్లా అధికారులతో ఏర్పాటు ● నివేదిక ఆధారంగా చర్యలు ● సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సాక్షి, పార్వతీపురం మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 9న ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’బాలికా ఆశ్రమం భద్రమేనా?’ శీర్షికన ప్రచురితమైన కథ నానికి ఆయన స్పందించారు. పాఠశాలలో చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై కురుపాం తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం ముగ్గురు జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహిళా శిశు సంక్షేమశాఖ పథక అధికారిణి, ఎస్సీ సంక్షేమం–సాధికారత అధికారి విచారణ కమిటీ సభ్యులుగా ఉంటారని వివరించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమగ్ర విచారణ జరపాలి: గిరిజన సంఘాల డిమాండ్ రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్యం పేరిట పురుష ఉపాధ్యాయులు గిరిజన బాలికలను బయటకు.. ప్రైవేట్ ఆస్పత్రికి, ఆర్ఎంపీ వద్దకు తీసుకుని వెళ్లారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ట్రైబల్ రైట్స్ ఫోరం, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పాలక రంజిత్కుమార్, పల్ల సురేష్, మువ్వల అమర్నాథ్, ఆరిక చంద్రశేఖర్, ఇంటికుప్పల రామకృష్ణ, చెల్లూరు సీతారాం, కోలక గౌరమ్మ, బి.రవికుమార్, బీటీ నాయుడు తదితరులు మాట్లాడుతూ.. బాలికల పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను నియమించడమే అనేక సమస్యలకు కారణమన్నారు. రేగిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా డిప్యూటీ మేట్రిన్ ఉండగా.. పురుష ఉపాధ్యాయులు బాలికలను వైద్యంపేరిట బయటకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. తక్షణమే మహిళా అధికారులతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
పత్రికల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే ఊరుకోం. దాడులతో జర్నలిస్టుల బాధ్యతను అడ్డుకోలేరు. జర్నలిస్టులపై దాడులే లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు సరైనది కాదు. వార్తలో తప్పుంటే ఖండించాలి. భయపెట్టే విధంగా క్రిమినల్ కేసులంటూ అరెస్టు నోటీసులు ఇవ్వడం దారుణం. కేసులు పెట్టి పత్రికలపై పెత్తనం చెలాయించాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం బయటకు రావాలి. జర్నలిస్టులపై ప్రభుత్వ తీరు మారకపోతే ఐక్యపోరాటాలు కొనసాగుతాయి. – పీఎస్ఎస్వీ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే -
● రోడ్డు మీద రోడ్డు..
చిత్రం చూశారా.. చక్కగా ఉన్న రోడ్డుపై మళ్లీ రోడ్డు వేస్తున్నారన్న సందేహం కలుగుతోందా... అయితే ఆ రోడ్డు కథ తెలుసుకోవాల్సిందే. ప్రజాధనం దుర్వినియోగం తీరును పసిగట్టాల్సిందే. బొండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి–26 నుంచి బొండపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని శ్రీమన్నారాయణ ఆలయం వరకు 2024 మార్చిలో రూ.20 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు వేసిన ఏడాదికే మళ్లీ జాతీయ రహదారి నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు రూ.40 లక్షల ఉపాధిహామీ నిధులతో 3.7 మీటర్ల వెడల్పు, 300 మీటర్ల పొడవున సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను రెండు రోజులుగా చేపడుతున్నారు. గతంలో వేసిన సిమెంట్ రోడ్డు చక్కగా ఉన్నా దానిపై రోడ్డు వేయడాన్ని చూసిన వారు ముక్కునవేలేసుకుంటున్నారు. శ్రీమన్నారాయణ గుడి నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు ఉన్న మట్టి రోడ్డును సిమెంట్ రోడ్డు నిర్మించేవరకు ఫరవాలేదని, గతంలో జాతీయ రహదారి నుంచి గుడివరకు నిర్మించిన రోడ్డుపై మళ్లీ రోడ్డు వేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి ఈ రోడ్డే నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలిస్తే నిధులు కొల్లగొట్టే తీరు బయటపడుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీరాజ్ జేఈ పి.అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జాతీయ రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయడంతో పాటు, గుడి నుంచి హైస్కూల్ వరకు నిర్మాణం చేయని మట్టిరోడ్డుపై సిమెంట్ రోడ్డు వేస్తున్నట్టు తెలిపారు. – బొండపల్లి -
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం
కూటమి సర్కారు వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి మత్స్యకారుల సంక్షేమానికి ఎటువంటి భరోసా లేదు. చింతపల్లిలో జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసింది. నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఏడాది అవుతున్నా కనీసం స్పందన లేదు. మత్స్యకారులు వేట సాగక వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం జీవనభృతి మంజూరు చేయాలి. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ పనులు ప్రారంభించాలి. – బర్రి దాసు, మత్స్యకారుడు, చింతపల్లి ● -
● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి విజయనగరం ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. సీఎం చంద్రబాబు సర్వేలతో కాలక్షేపం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్మి బూర వాసు, బలిజివీధి శాఖ కార్యదర్మి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకులు సూరీడమ్మ, ఏఐటీయూసీ నాయకులు ఆల్తి మరయ్య పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
● అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు
చిత్రాల్లో కనిపించిన కుళ్లిన కోడిగుడ్లు గజపతినగరం మండలంలోని సీతారామపురం, కొణిశ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినవి. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, గర్భిణులకు కుళ్లిన గుడ్లను ఎలా వండిపెట్టేదని ప్రశ్నిస్తున్నారు. నెలలో నాలుగుసార్లు అంగన్ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా, మూడుసార్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత సీడీపీఓ నాగమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కోడిగుడ్లు కుళ్లిపోతే లబ్ధిదారులకు ఇవ్వవద్దని కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కుళ్లిన గుడ్ల ఫొటో తీసి పంపితే వాటి స్థానంలో సంబంధిత కాంట్రాక్టర్తో మంచి గుడ్లను సరఫరా చేయిస్తామన్నారు. – గజపతినగరం రూరల్ -
పింఛన్ల కోసం.. పేదల నిరసన
చీపురుపల్లి: ఒకటి కాదు రెండు కాదు.. పది నెలలుగా ఎదురు చూశారు... పింఛన్ మంజూరైతే ఆర్థిక కష్టాలు తొలగుతాయని, జీవనానికి భరోసా దొరుకుతుందని ఆశపడ్డారు.. వారి ఆశలు అడియాసలే కావడం, పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నాళ్లు ఆకలితో అలమటించాలంటూ మండిపడ్డారు. కూటమి నేతల తీరును దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్ల వయస్సు నిండితే పింఛన్ మంజూరు చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయినా పింఛన్ మంజూరు కావడంలేదంటూ వితంతువులు గోడు వినిపించారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, తక్షణమే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చీపురుపల్లిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. చీపురుపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో అర్హత ఉండి ఆన్లైన్ చేసుకుని పింఛన్లు మంజూరు కాని లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి, మెయిన్రోడ్, ఆంజనేయపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఏఓ ప్రవీణ్కు, పంచాయతీ కార్యాలయంలోని శానిటరీ ఇన్స్పెక్టర్కు జి.వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం పింఛన్ లబ్ధిదారుల నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామని, శాసనమండలిలో ప్రస్తావిస్తానని చెప్పారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్పీ నోటిఫికేషన్ అంటూ రెండో వారం వచ్చినా ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఊసేలేదని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ మంజూరు, మత్స్యకార భరోసా వంటి ఎన్నో పథకాలను అటకెక్కించారన్నారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడంతో ఏ పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తాజాగా వంట గ్యాస్ ధరలు పెంచి పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, నియోజకవర్గ వలంటీర్ విభాగం అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు పతివాడ రాజారావు, ఇప్పిలి గోవింద, రఘుమండ త్రినాథరావు, మీసాల రమణ, చందక గురునాయుడు, అధికార్ల శ్రీనుబాబు, బాణాన రమణ, రేవళ్ల సత్తిబాబు, మీసాల ఈశ్వరరావు, గవిడి సురేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్నా పది నెలలుగా మంజూరుకాని పింఛన్లు భర్తలు చనిపోయినా, వృద్ధాప్యం ఆవరించినా అందని పింఛన్ చీపురుపల్లిలో భారీ ర్యాలీ ప్రభుత్వ తీరుపై నిరసన పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత పేదలకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులు జీవనానికి ఇబ్బంది ఏడాది కిందటే భర్త మృతి చెందాడు. ఎలాంటి ఆధారం లేక వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు మంజూరు కాలేదు. అధికారులు, సచివాలయ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తే... కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని చెబుతున్నారు. – సఖినేటి పద్మ, రిక్షాకాలనీ, చీపురుపల్లి మేజర్ పంచాయతీ పింఛన్ ఎప్పుడిస్తారు? ఏడాదిన్నర కిందట భర్త చనిపోయాడు. పింఛన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఎన్నికల కోడ్ అంటూ అప్పట్లో మంజూరు చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పింఛన్ ఎప్పుడిస్తారో తెలియడంలేదు. – రేగిడి సూరమ్మ, విజయరాంపురం, చీపురుపల్లి మేజర్ పంచాయతీ కనికరించడం లేదు.. భర్తకు పింఛన్ వచ్చేది. ఆయన చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. వితంతువులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. బతకడం కష్టమవుతోంది. – కొంగరాపు లక్ష్మి, పర్ల, చీపురుపల్లి మండలం -
రూ.20 వేలు భృతి ఇస్తామన్నారు...
వేటనిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన భృతి ఇంతవరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా ఇంతవరకు భృతి చెల్లించలేదు. దానిగురించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. దీనిపై పోరాటం చేస్తాం. – బర్రి చిన్నప్పన్న, మత్య్సకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు భృతి ఏది బాబూ.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతిని ఇంతవరకు చెల్లించకపోవడం దారుణం. సంక్షేమ పథకాలు దేవుడెరుగు కనీసం... ప్రతి ఏటా ఇస్తున్న వేట నిషేధ భృతి ఇవ్వకపోవడం అన్యాయం. – వాసుపల్లి అప్పన్న, మత్స్యకారుడు, తిప్పలవలస భృతి చెల్లింపునకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. మత్య్సకారుల వేట నిషేధ భృతి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. నిధులు విడుదల కాలేదు. ఈ నెల 15 వ తేదీ నుంచి చేపలవేట నిషేధం అమల్లోకి వస్తుంది. – ఎం.విజయకృష్ణ, ఇన్చార్జి డీడీ, మత్య్సశాఖ -
● రోడ్డెక్కిన ‘మురుగు’ సమస్య
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణలోపం వెరసి మురుగు సమస్య తరచూ రోడ్డెక్కుతోంది. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ కూడలి వద్ద ఉన్న మురుగు కాలువలో కొద్దిరోజులుగా పూడికలు తొలగించడం లేదు. పూడిక పేరుకుపోయి మురుగునీరు గురువారం రోడ్డుపై ప్రవహించింది. నగరవాసుల ఫిర్యాదుతో మేల్కొన్న కార్పొరేషన్ యంత్రాంగం పొక్లెయిన్తో కాలువలో పూడికల తొలగింపు పనులకు ఉపక్రమించింది. మురుగు రోడ్డెక్కితో తప్ప అధికారులకు బాధ్యత గుర్తు రాలేదంటూ స్థానికులు గుసగుసలాడారు. – విజయనగరం -
కిరణ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
రాజాం సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ చేబ్రోలు కిరణ్పై చర్యలు తీసుకోవాలని మండల వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, వైఎస్సార్ సీపీ నియోజవర్గ మహిళా నాయకురాలు ఎస్.అరుణ రాజాం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల నీచంగా మాట్లాడే కిరణ్పై తక్షణమే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లావేటి రాజగోపాలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, యాలాల వెంకటేష్, సర్పంచ్లు కొర్ను ఈశ్వరరావు, కరణం తులసినాయుడు, తదితరులు ఉన్నారు. 15న ఐటీఐలో నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా ● ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి విజయనగరం అర్బన్: పట్టణంలోని వీటీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన 27వ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా (పీఎంఎన్ఏఎం) నిర్వహిస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి గురువారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అప్రెంటీస్ షిప్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. మైలాన్ ల్యాబొరేటరీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిడెడ్, జయభేరి ఆటోమోటివ్ లిమిటెడ్, శ్యాంసంగ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ (ఎస్ఆర్ఎస్, నవదీప్ ఎలక్ట్రానిక్స్), పిట్టీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్, జేవై సొల్యూషన్, డెక్కన్ ఫెర్రోఅల్లోయీస్, వోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని పేర్కొన్నా రు. ఎంపికైన వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్కార్డు, రెండు పాస్ఫొటోలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 98491 18075, 98499 44654 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనంతరం అభ్యర్థులు నమోదు చేయాల్సిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. -
మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’
కొండల మధ్యన విసిరేసినట్లు ఉన్న తాన్నవలస గ్రామంసాలూరు/సాలూరు రూరల్ : ఏ ఆధారం లేని తనకు పింఛన్ సొమ్ము వస్తే జీవనం సాఫీగా సాగించవచ్చని భావించింది. తొమ్మిదినెలలు దాటినా ఆ ఎదురుచూపులు అలాగే మిగిలిపోయాయి. చివరకు పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తూ.. ఆకలితో అలమటించి ఓ గిరిజన వితంతువు తనువుచాలించిన హృదయ విదారక సంఘటన గిరిజన సంక్షేమ శాఖామంత్రి, సీ్త్రశిశుసంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో బుధవారం జరిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ(62) పింఛన్ కోసం తిరుగుతూ, ఆకలితో అలమటిస్తూ బుధవారం రాత్రి తనువు చాలించింది. ఆమె భర్త కన్నయ్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పింఛన్ వచ్చేది. అయితే 2023 డిసెంబరు 6న కన్నయ్య మరణించాడు. భర్త మరణించిన కారణంగా తనకు పింఛన్ మంజూరుచేయాలని ఆమె స్థానిక సచివాలయానికి వెళ్లింది. అయితే ఆమెకు ఫింఛన్ మంజూరయ్యేలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మంజూరు కాలేదు. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సుమారు 9నెలలు కావస్తున్నా నేటికీ ఆమెకు పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో ఆ ఒంటరి వృద్ధురాలికి స్థానికులు సాయం చేయగా పొట్ట పోషణ చేసుకునేది. ఈ క్రమంలో పింఛన్ సొమ్ము రాక, ఆకలితో అలమటిస్తూ బుధవారం తనువుచాలించింది. ఈ హృదయ విదారక సంఘటనతో స్దానికులు భావోద్వేగానికి లోనయ్యారు. వితంతువులతో రాజకీయమా..? ఇటువంటి సంఘటనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబర్ నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ మంజూరుచేయాల్సి ఉంది. కూటమి పాలనలో భర్త మరణించినా భార్యకు వితంతు పింఛన్ మంజూరు కాకపోవడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు గాలికొదిలేసిన పాలకులు వితంతువుల పట్ల కూడా ఇంత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తారా? అంటూ కూటమి ప్రభుత్వ వికృత చర్యలపై మండిపడుతున్నారు.మరణించిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ ఇది దారుణం కూర్మరాజుపేటలో గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణమ్మ పింఛన్ మంజూరుకాక కుటుంబపోషణకు ఆధారం లేక ఆకలితో మరణించడం చాలా బాధాకరం. ఇది నన్ను బాగా కలిచివేసింది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి వారు లక్షల్లో ఉండొచ్చు. వారు మనుషులు కాదా? వారి కష్టాలు నేటి పాలకులకు పట్టకపోవడం అత్యంత శోచనీయం. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే ఆలోచించి, అర్హులందరికీ పింఛన్లు అందించాలి. –పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం -
డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేయడం తగదని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ అన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై తొలిసంతకం చేశారన్నారు. కానీ నేటికీ నోటిఫికేషన్ వెలువడలేదని, నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటూ తీవ్ర నిరాశకు గురువుతున్నారన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అసలు వస్తుందో రాదో అన్న అయోమయ పరిస్ధితిలో పలువురు అభ్యర్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాకు పోస్టుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని, తక్కువ పోస్టులు మంజూరు చేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 16,347వేల పోస్టులు కాకుండా 25వేలతో మెగా డీఎస్సీ నిర్వహించేలా చూడాలని, నిరుద్యోగ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. త్వరితగతిన డీఎస్సీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వెలువడేలా చూడాలని, తక్షణమే మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు
● జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి విజయనగరం ఫోర్ట్: క్షయ రోగుల కుటుంబసభ్యులకు క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి తె లిపారు. ఈ మేరకు స్థానిక అరుంధతి నగర్లో ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ రోగుల కుటుంబసభ్యులకు చేస్తున్న స్కిన్ (సీ వై–టీబీ) టెస్టును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ రోగుల కుటుంబసభ్యులకు స్కిన్ టెస్టు చేయనున్నామని చెప్పారు. 48 నుంచి 72 గంటల్లో ఈ పరీక్ష రిజల్ట్ వస్తుందన్నారు. ఈ పరీక్షలో 5ఎంఎంగా నిర్ధారించిన ఎడల టీబీ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు అర్చన దేవి, అశోక్ పాల్గొన్నారు. ఒకే ఈతలో రెండు ఆవుదూడలుగజపతినగరం: మండల కేంద్రంలోని ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ పీవీవీ గోపాల రాజు జెర్సీ ఆవు ఒకే ఈతలో రెండు జెర్సీ ఆడపెయ్యలకు జన్మనిచ్చింది. ఈ విధంగా కవలలు పుట్టడం చాలా అరుదని స్థానిక పశువైద్య శాఖ ఎ.డి చంద్రశేఖర్ అన్నారు. గురువారం పీవీవీ గోపాల రాజుకు చెందిన ఆవు, దానికి పుట్టిన రెండు ఆడపెయ్యలు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించానని ఎ.డి చంద్రశేఖర్ తెలిపారు. ఒకే ఈతలో జన్మించిన ఆవుపెయ్యిలను పలువురు ఆసక్తిగా తిలకించారు. రూ.కోటి 72 లక్షల విలువైన సిగరెట్లు సీజ్● శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల విజిలెన్స్ ఎస్పీ విజయనగరం క్రైమ్: ఎలాంటి ట్యాక్స్లు చెల్లించకుండా ఒడిశా నుంచి ఏపీలోకి వచ్చిన రూ.కోటి 72 లక్షల విలువ గల సిగరెట్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజయనగరంలోని ఎంవీఆర్జీఆర్ కాలేజ్ సమీపంలో గల సూర్య లేఅవుట్లో సుంకర పేట వద్ద ఓ గోడౌన్లో సిగరెట్లు డంప్ చేస్తుండగా రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాన్లో అగ్గిపెట్టెలు బిల్లులతో రవాణా చేస్తున్నట్లు తొలుత తమకు సమాచారం అందిందన్నారు. అయితే మ్యాచ్బాక్స్ బిల్లు పేరుతో 3 లక్షల 16 వేల సిగరెట్ బాక్స్లు సరఫరా చేస్తున్నారని, తర్వాత అందిన సమాచారంతో సూర్య లే అవుట్ వద్ద ఉన్న ఓ గొడౌన్లో దాడిచేసి వ్యాన్లో ఉన్న సిగరెట్ల లోడును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిరాదరణకు గురైన బాలికకు సంరక్షణగుమ్మలక్ష్మీపురం: కురుపాం మండల కేంద్రంలోని శివన్నపేట గ్రామంలో నిరాదరణకు గురైన 11 ఏళ్ల బాలికను మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ చొరవతో..మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.కనకదుర్గ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు బాలబాలికల వసతి గృహానికి గురువారం తరలించారు. తల్లిదండ్రులు వదిలేసిన ఓ బాలిక శివన్నపేటలో తిరుగుతూ ఎవరైనా తినడానికి ఇస్తే తింటూ..రోజుకో ఇంటి గడపలో తలదాచుకుంటోందన్న సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ దేవ్ బాలిక సంరక్షణ నిమిత్తం ఐసీడీఎస్ పీడీ కనకదుర్గకు తెలియజేశారు. దీనిపై స్పందించిన పీడీ ఆ బాలికను బాలబాలికల వసతి గృహంలో చేర్పించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణకు ఆదేశించగా..ఆయనతో పాటు జిల్లా లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్ బాలికతో మాట్లాడి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి సూచనల మేరకు వసతి గృహంలో చేర్పించారు. కార్యక్రమంలో కురుపాం మహిళా సంరక్షణ అధికారి రోజారాణి, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు. -
ప్రతి కుటుంబం లక్ష ఆదాయం పొందాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రతికుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం పొందాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జీవనోపాధి కల్పనలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం సంపాదించాలని ఇందుకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, వశుసంవర్థక సంబంధిత ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంపకాల యూనిట్ల ఏర్పాటు వల్ల పొందే ఆదాయ మార్గాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 110 ఎకరాల్లో పనస పంట వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబం రూ.లక్ష ఆదాయం పొందేందుకు అవసరమైన పెట్టుబడి, వేతనాలు, చెల్లింపు, ఖర్చులు తదితర అంశాలతో స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి డీఎస్ దినేష్ కుమార్ రెడ్డి, డీఆర్డీఎ పీడీ ఎం.సుధారాణి, జిల్లా ఉద్యానశాఖాధికారి బి. శ్యామల, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వి.రాధాకృష్ణ, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
బాత్రూమ్లో పడి వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: పట్టణంలోని వివేకానంద కాలనీలో బాత్రూమ్లో పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పట్టణ పోలీసులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన కోరాడ సూర్యనారా యణ (46)అలియాస్ సురేష్ అనే వ్యక్తి ఈనెల 8న తన స్వగృహంలో ఉన్న బాత్రూమ్లో పడి మృతిచెందాడు. గురువారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది వచ్చి పరిశీలించి సూర్యనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచామందించగా ఉగాది రోజున కన్నవారి ఇంటికి వెళ్లిన భార్య హుటాహుటిన వచ్చింది. ఉగాది రోజున భార్య ఊరికి వెళ్లగా సూర్యనారాయణ ఒక్కడే ఇంటిలో ఉంటూ మద్యం తాగిన మత్తులో బాత్రూమ్లో పడిపోయి ఉంటాడని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.మురళీధర్ తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన -
గిరిజన బాలింత మృతి
సాలూరు: పాచిపెంట మండలంలోని గిరిశిఖర మోదుగ పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన బాలింత సేబి లక్ష్మి(30) మరణించింది. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్లో ఆమెను తీసుకురాగా ఆస్పత్రిలో బెడ్ మీద వేయగానే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మి సుమారు రెండు నెలల క్రితం మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికాగా పాచిపెంట సీహెచ్సీకి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఒకరోజు వైద్యం తరువాత ఆమెను మళ్లీ గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే ఆమెకు పచ్చకామెర్లు వచ్చాయని పసర వైద్యం చేయించినట్లు తెలియవస్తోంది. దీంతో ఒళ్లంతా వాపులు రావడంతో సాలూరు ఏరియా ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకువచ్చారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షిని వివరణ కోరగా, గురువారం ఉదయం ఆస్పత్రికి ఆమెను తీసుకువచ్చారని, బెడ్ మీద వేసిన కొన్ని నిమిషాల్లోనే మరణించిందన్నారు. సెప్టిక్షాక్ విత్మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మృతిచెందినట్లు చెప్పారు. ఆమెకు పచ్చకామెర్లు రావడంతో ఇంటివద్ద పసర వైద్యం చేయించామని బంధువులు చెప్పారన్నారు. పసర వైద్యమే కారణమా? -
రెండు వారాల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లను పథకం రాష్ట్ర అధికారుల బృందం ఆదేశించింది. పీఎంశ్రీ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ విభాగ సిబ్బందితో స్థానిక యూత్ హాస్టల్లో గురువారం రాష్ట్రబృందం అధికారులు డాక్టర్ ఎం.ప్రసాదరావు, మహేశ్వరరెడ్డి, జయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ పథకం మంజూరైన 34 పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సివిల్వర్క్స్’లో భాగంగా కెమిస్ట్రీ ల్యాబ్స్, లైబ్రరీ రూమ్స్, ప్లే ఫీల్డ్స్, కిచెన్ గార్డెన్ రియిన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర పనుల వివరాలను పాఠశాలల వారీగా తెలుసుకున్నారు. అదేవిధంగా అకడమిక్ పురోభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత పనులకు నిధులు మంజూరయ్యాయని జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎస్ఏ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, ఏఎంఓ బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణం పరిధిలోని మలిచర్ల ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ పథకం పనులను రాష్ట్ర బృందం పరిశీలించింది. విద్యార్థి మిత్ర స్టాక్ పాయింట్ పరిశీలన పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ పథకానికి సంబంధించిన సామగ్రి స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్ష రాష్ట్ర అధికార బృందం సందర్శించింది. త్వరలో జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు అందజేసే స్కూడెంట్ కిట్స్ను భద్రపరిచే ప్రదేశాలను పరిశీలించారు. జిల్లాకు వచ్చిన కిట్స్ ప్రతి విద్యార్థికి అందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. పీఎంశ్రీ స్కూల్స్ అభివృద్ధిపై రాష్ట్ర బృందం సమీక్ష -
వలంటీర్లను మోసం చేయడం తగదు
విజయనగరం: వలంటీర్లను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో వలంటరీ వ్యవస్థ వంచన దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపొందించిన కరపత్రాలను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ 9న అప్పటి టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలంటీర్ల జీతం రూ. 5 వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు జీతం పెంచకపోవడం దారుణమన్నారు. పైగా ఆ వ్యవస్థే లేదని చెబుతున్న నాయకులు బుడమేరు వరదల సమయంలో వారి సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు స్పందించి వలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, లోపింటి రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, వేముల వంశీ, ఈర్ల రవిరాజ్, ఉపమాక సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
వల్లంపూడి ఎస్ఐని సస్పెండ్ చేయాలి
వేపాడ: వల్లంపూడి ఎస్ఐ బి.దేవిని తక్షణమే సస్పెండ్ చేయాలని, గుడివాడలో జరిగిన సంఘటనలో తప్పుడు కేసులను రద్దు చేయాలని కోరుతూ దళితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఏపీ దళిత కూలీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గాలి ఈశ్వరరావు, దళిత నాయకుడు కిరణ్ ఆధ్వర్యంలో ముందుగా అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఐ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం స్టేషన్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం, యాతపేట, వల్లంపూడి మీదుగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ జె.రాములమ్మకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా బాధితులు గుడివాడ మోహన్, గాలి ఈశ్వర్వవు మాట్లాడుతూ గుడివాడలో మార్చి 11న రాత్రి జరిగిన ఘటనలో నమోదు చేసిన తప్పుడు కేసులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వీరాకుమార్, ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్ఐ నవీన్పడాల్ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు దళితుల ధర్నా తహసీల్దార్కు వినతిపత్రం అందజేత -
తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం
బిల్లుల భారం మోయలేం ● విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు జెడ్పీ నుంచి రూ.కోటి చొప్పున నిధుల కేటాయింపు ● తాగునీటి పంపింగ్కు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడి ● పింఛన్ల తొలగింపుపై వాడీవేడిగా సాగిన చర్చ ● సంక్షేమ పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమన్న జెడ్పీ చైర్మన్ ● మంత్రి ఆరోపణలకు కౌంటర్ ● సమావేశానికి డుమ్మా కొట్టిన మంత్రి, కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు హాజురుకాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు.. విద్యుత్ బిల్లుల భారం వినియోగదారులు మోయలేని విధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు అన్నారు. నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో ఉన్న తన ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు, ఒక ఏసీ వినియోగిస్తున్నామని, నెలకు రూ.లక్ష బిల్లు ఇచ్చారని సభలో ప్రస్తావించారు. నెల్లిమర్ల మండలం సారపల్లి గ్రామంలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు మంజూరులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన సామగ్రిని రైతు భరోసా కేంద్రంలో నిరుపయోగంగా వదిలేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యలను తెలియజేశారు. విజయనగరం: వేసవి దృష్ట్యా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు తొలిప్రాధాన్యమివ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. శివారు ప్రాంతాల ప్రజలు సైతం తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదన్నారు. దీనికోసం జిల్లా పరిషత్ తరఫున జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వేసవిలో తాగునీటి సరఫరా, పింఛన్ల తొలగింపు, విద్య, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, ఉపాధి హమీ, హౌసింగ్ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలోని అన్నిబోర్ వెల్స్, తాగునీటి పథకాలు తనిఖీచేసి మరమ్మతులకు గురైతే వెంటనే బాగుచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. తోటపల్లి, చంపావతి, ఆండ్ర జలాశయాల పరిధిలోని బోరు బావులను ముందే రీచార్జి చేసుకునేందుకు అనుమతులు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. నీటి పంపింగ్కు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పింఛన్ల వెరిఫికేషన్ కోసం ఏ ఆధారంలేని దివ్యాంగులు ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసే శిబిరాలకు హాజరుకావడం కష్టంగా ఉంటోందని, ప్రభుత్వమే సచివాలయ సిబ్బందిని తోడు పంపాలని కోరారు. వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. సీహెచ్సీల్లో వైద్యుల పోస్టులు భర్తీచేసి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పింఛన్ల తొలగింపుపై జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మధ్య వాడీవేడిగా చర్చసాగింది. అర్హుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల పింఛన్లు తొలగించారంటూ వాఖ్యానించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ పాలన సమయానికి ఇచ్చే పింఛన్లు ఎన్ని..? కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు ఎన్ని అన్నది స్పష్టంగా లెక్కలు ఉన్నాయని, మరి ఎందుకు పింఛన్లు తగ్గాయంటూ ప్రశ్నించారు. సర్వేల పేరుతో పింఛన్ల తొలగిస్తున్నారని ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. గత ప్రభుత్వం ప్రతీ ఆరునెలలకోసారి అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, సంక్షేమ పథకాలు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. సభ సాక్షిగా ప్రజలకు మంచి జరగాలన్నదే అభిమతంగా సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. కూటమి నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు...? ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి..? 50 సంవత్సరాలకే పింఛన్ మంజూరు..? మహిళలకు ఉచితబస్సు వంటి సూపర్ సిక్స్ హమీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అధికారంలో ఉండి పనులు చేయకుండా గత ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద విజయనగరం జిల్లాలో 2,75,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. టీడీపీ చేసిన తప్పిదాల కారణంగా ఆయకట్టు తగ్గిపోయే పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా జెడ్పీకి నిధులకు మంజూరు చేయలేదన్నారు. మంత్రి కొండపల్లి స్పందిస్తూ 15వ ఆర్థిక సంఘం పద్దు కింద రూ.9 కోట్ల నిధులు మంజూరు చేశామని సమాధానమివ్వగా... అవి కేంద్ర ప్రభుత్వం నిధులని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన జనరల్ ఫండ్స్ నిధులు మంజూరు చేయలేదన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఇవ్వాల్సిన గౌరవం వేతనం విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగిన పాలనపై చర్చకు సిద్ధమైతే మేము సిద్ధమన్నారు. చర్చ మధ్య లో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని జోక్యం చేసుకుని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కారణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా చాలడం లేదంటూ వాఖ్యానించడంతో సభలో ఉన్న సభ్యులు ఆమైపె ప్రశ్నల వర్షం కరిపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీల్లో ఎన్ని అమలు చేశారో స్పష్టమైన సమాధానం చెప్పాలని సభ్యులంతా ప్రశ్నించడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు కలెక్టర్ అంబేడ్కర్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించడంతో సభలో మిగిలిన అంశాలపై చర్చ సాగింది. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు, జెడ్పీ సీఈఓ బెహరా వెంకట సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరే హాజరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి సంధ్యారాణితో పాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 11 ఎమ్మెల్యేలు ఉండగా.. గజపతినగరం ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సభకు గైర్హాజరయ్యారు. ఇదే విషయమై మంత్రి శ్రీనివాస్ను విలేకరుల ప్రశ్నించగా.. తక్కువ సమయంలో సమాచారం అందించడంలో వారంతా హాజరుకాలేకపోయారని సమాధానం ఇచ్చారు. పింఛన్ల తొలగింపుపై రచ్చ ఆలోచన చేస్తున్నాం పింఛన్లపై చర్చలో గతేడాది నవంబర్ కంటే ముందు భర్తలు కోల్పోయిన మహిళలకు వితంతు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అసలైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతోనే తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. కార్లు, బైక్లు నడిపేవారికి పింఛన్లు ఎలా మంజూరు చేస్తామన్నారు. ఉపాధిహామీ వేతన బకాయిలు జనవరి 14 నుంచి చెల్లించాల్సి ఉందని, ఈ నెల 13, 14 తేదీల్లో చెల్లిస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఉపాధిహామీ పనులు పంచాయతీ తీర్మానాలతో సంబంధంలేకుండా, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని సభ్యులు ప్రస్తావించగా, కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ స్పందిస్తూ గ్రామసభల్లో తీర్మానం చేసిన పనులనే చేపడుతున్నట్టు చెప్పారు. నాణ్యతలోపించే పనులు తన దృష్టికి తీసుకొస్తే తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు అవసరమైన మెటీరియల్ను ఎంపీ నిధులతో సమకూర్చుతామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ లో ఓల్టేజీ సమస్య వేధిస్తోందన్నారు. బొబ్బిలి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు ఒకే సారి బదిలీ చేశారని, కొత్తవారు వచ్చే వరకు వీరిని కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. సభలో చర్చించిన కొన్ని అంశాలు.. విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని, సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని సభ్యులు కోరారు. ఉపాధి హమీ పథకం మేట్ల అక్రమ నియామకాలను అరికట్టాలని, మండల తీర్మానాలు లేకుండా వెండర్స్తో పనులు చేయించడం తగదని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కురుపాం, గరుగుబిల్లి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆయా మండలాల సభ్యులు కోరారు. జీఎల్పురంలో పలు గ్రామాల్లో తాగు నీటి సమస్యను పరిష్కారించాలని ఇటీవల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సొంతింటి నిర్మాణం కోసం సచివాలయానికి వెళ్తే అక్కడి ఇంజినీరింగ్ అసిస్టెంట్ టీడీపీ నేతల నుంచి అనుమతి ఉండాలంటూ దరఖాస్తును చెత్త బుట్టలో పడేశారని దత్తిరాజేరు జెడ్పీటీసీ సభ్యుడు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
వెబ్సైట్లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 10, 11, 15, 16, 19, 21 తేదీల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10 నుంచి సాయింత్రం 5 గంటలలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు. ఐటీఐ పరికరాల కొనుగోలుపై విచారణ బొబ్బిలి: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐకు రూ.90లక్షల విలువైన యంత్ర పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.వి.రమణారావు, విజిలెన్స్ అంధికారులు రెండు రోజులుగా డీడీ ఆధ్వర్యంలో సిబ్బందిని విచారణ చేస్తున్నారు. వర్చువల్ డ్రైవింగ్ సిస్టం, ఆన్లైన్ శిక్షణ తరగతులకు సంబంధించిన విలువైన పరికరాలను పరిశీలించి, ధరలపై ఆరా తీసినట్టు సమాచారం. పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని డీడీ తెలిపారు. ఎస్టీ కమిషన్ చైర్మన్కు సమస్యల ఏకరువు సాలూరు: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు వద్ద గిరిజనులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సాలూరు మండలంలోని మారేపా డు, తాడిలోవ, పాలికవలస గిరిశిఖర గ్రామాలకు డీవీజీ బుధవారం కాలినడకన వెళ్లారు. తొలుత మారేపాడు వెళ్లిన చైర్మన్కు అక్కడి గిరిజనులు తమ సమస్యలను తెలియజేశారు. తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నామని, గ్రామానికి రోడ్డు సదుపా యం లేదని, పిల్లల ఆధార్ నమోదు సమస్యలు అధికంగా ఉన్నాయని, పోడు పట్టాలు అందజేయలేదని వివరించారు. అనంతరం ఆయన అంగన్వా డీ కేంద్రంలో పిల్లలకు వండిపెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. మరో తాగునీటి పథకం, పోడు పట్టాలు మంజూరు చేయాలని తాడిలోవ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. పాలికవలసలో అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు భర్తీ చేయాలని, శ్మశానానికి రోడ్డు మంజూరుచేయాలని, పోడు పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. పెదపదంలో గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భూములు సర్వే చేశారే తప్ప పట్టాలు మంజూరు చేయలేదన్నారు. దీనిపై డీవీజీ స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ పార్వతి, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
దారికాచి దోపిడీ.. జాగ్రత్త..!
శృంగవరపుకోట: ఎస్.కోట మండలంలోని బొడ్డవర నుంచి తాటిపూడి మీదుగా విజయనగరం వెళ్లే రోడ్డులో దారిదోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటున్నారు. గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన ముప్పన సత్యనారాయణ బుధవారం ఉదయం జీడిపిక్కలు కొనుగోలుకు బొడ్డవర వైపు బైక్పై వెళ్తుండగా రెండు బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను ఆపారు. వారిలో ఇద్దరు సత్యనారాయణను పట్టుకుని సొమ్ము గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆయన జేబు గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో పిడిగుద్దులు గుద్ది తుప్పల్లో తోసేశారు. అతని వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కొని పరారయ్యారు. కొద్ది నిమిషాలకు తేరుకున్న సత్యనారాయణ ముషిడిపల్లిలో సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో అక్కడి మహిళా పోలీస్ ఎస్.కోట పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. తాటిపూడి రోడ్డులో ఇటీవల ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో బైక్లపై వచ్చేవారిని టారర్గెట్ చేస్తూ బైక్ రిపేర్ అయ్యిందని, లిఫ్ట్ కావాలని, పక్క ఉన్న వ్యక్తికి ఆరోగ్యం బాగులేదని.. ఇలా రోజుకో వేషంతో ఏమారుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తక్షణమే ఆ రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటుచేయాలని, సీసీ కెమెరాలు అమర్చి దొంగతనాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆయుర్వేద వైద్యశాలలో మందుల కొరత
● ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ● గంట్యాడ మండలానికి చెందిన వి. నారంనాయుడు మోకాళ్ల నొప్పులతో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు కొద్ది రోజుల క్రితం వెళ్లాడు. అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద ముందుల దుకాణంలో కొనుగోలు చేశాడు. ● విజయనగరం మండలానికి చెందిన పి.లక్ష్మి చర్మ సంబంధిత వ్యాధితో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లగా అక్కడి వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసింది. వీరిద్దరే కాదు. అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇదే. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని. ప్రజారోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అల్లోపతి వైద్యం తర్వాత ఆయుర్వేద వైద్యానికి అంత ప్రాధాన్యం ఉంది. అయితే ప్రస్తుతం ఆయుర్వేద వైద్యశాలలో మందులు లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. సాధారణ వ్యాధులకు కూడా లేని మందులు ఆయుర్వేద వైద్యశాలలో సొరియాసిస్, మధుమేహం, కీళ్లనొప్పులు, గైనిక్ సమస్యలు, జీర్ణ కోశ వ్యాధులు, మూత్ర వ్యాధులు, న్యూరాలజికల్ సమస్యలు, గుండెజబ్బులు, రుమటైడ్ ఆర్థరైటిస్, శ్వాసకోశసమస్యలకు సంబంధించిన మందులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రస్తుతం లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యుడికి చూపించిన తర్వాత మందుల గది వద్దకు వెళ్లిన రోగులకు అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉంది. ఇండెంట్ పెట్టాం చాలావరకు మందులు అయిపోయాయి. మందులు పంపించాలని ఇండింట్ పెట్టాం. ఇంకా రాలేదు. ఎం.ఆనంద్రావు, వైద్యాధికారి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల -
రోగనిరోధకశక్తి పెంపుదలతో వ్యాధులు దూరం
● త్వరలో దేశంలో ఇమ్యునో థెరపీ డ్రగ్స్ ● వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: ఇమ్యునో థెరపీ డ్రగ్స్తో శరీరం ఏ వ్యాధికి గురైనా దానిని అదుపు చేయడానికి అవకాశం ఉంటుందని వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మెడికల్ స్కిల్స్ అనే వర్క్షాపును వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వర్ మాట్లాడుతూ రానున్న కాలంలో వివిధ రకాల వ్యాధులకు మాత్రలు, ఇంజక్షన్లకు బదులుగా ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో ఆ విధానం ఇప్పటికే కొనసాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా అనేక వ్యాధులను నియంత్రించాలంటే ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ చికిత్స కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. వ్యాధుల నియంత్రణ యాంటిజన్, యాంటిబాడీ ప్రతి చర్యలపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్లనే కోవిడ్ సమయంలో యాంటిబాడీ కణాలు ఎక్కువగా చనిపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఎక్కువ మంది మత్యువాతపడ్డారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇమ్యునాలజీకి ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. అంతేకాకుండా మన దేశంలో వివిధ రకాల అలెర్జీలతో బాధపడుతున్న వారి సంఖ్య 35 శాతం ఉందని, వాటికి చికిత్సనందించే వైద్యులు మాత్రం దేశ వ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే ఉన్నారన్నారు. త్వరలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం, వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ సంయుక్తంగా మెడికల్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ప్రోగ్రాం అనే కొత్త కోర్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రొపెసర్ శాంతమ్మ, రిజిస్ట్రార్ డాక్టర్ పి.పల్లవి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎంఎల్ఎన్ ఆచార్యులు, డాక్టర్ చైతన్య, ఫోరెన్సిక్, అనస్థీషియా విద్యార్థులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్
దత్తిరాజేరు: బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గడసాం గ్రామానికి చెందిన ఇనుగంటి సురేష్కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్శర్మ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని బ్రాహ్మణుల అభ్యుదయానికి పాటుపడతానని, గజపతినగరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న బ్రాహ్మణుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం అధికార ప్రతినిధిగా త్రిశూల్కుమార్ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఉత్తరాంధ్ర జోన్ అధికార ప్రతినిధిగా విజయనగరం పట్టణానికి చెందిన త్రిశూల్ విద్యాసంస్థల అధినేత వెంపటి శంకరనారాయణ (త్రిశూల్ కుమార్)ను నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కేమనోహర్రావుల నుంచి ఎంపిక ఆదేశాలు తనకు వచ్చినట్లు త్రిశూల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం
బొండపల్లి: ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.మురళి పెర్కొన్నారు. ఈ మేరకు బొండపల్లి మండలకేంద్రంలో మూడు రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్, హార్ట్వెల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా ,ధ్యానం శిక్షణ తరగతుల్లో భాగంగా చివరిరోజు బుధవారం ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. అనారోగ్యం నుంచి బయట పడాలంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు జేఎస్ఎన్.రాజు, జె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణ
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్ధకశాఖ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రెడ్డి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు స్థానిక పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం పశు సంవర్థకశాఖ అధికారుల సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సీహెచ్. దీనకుమార్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ టి.ధర్మారా వు, కోశాధికారిగా డాక్టర్ కేవీరమణ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఆర్. శారద ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు అఽధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు బాలకృష్ణ వ్యవహరించారు. డీసీహెచ్ఎస్గా డాక్టర్ పద్మశ్రీ రాణివిజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)గా డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న ఆమె ఉద్యోగోన్నతిపై రెగ్యులర్ డీసీహెచ్ఎస్గా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం డీసీహెచ్ఎస్ పరిధిలో ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు డీసీహెచ్ఎస్ కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికనెల్లిమర్ల: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అండర్–19 విభాగం జిల్లా జట్టును నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో బుధవారం ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో నాగ వెంకట్(48–50), రోహిత్(50–55), ఎర్రి నాయుడు(55–60), ప్రవీణ్(60–65), కిరణ్(70–75), సూర్య తేజ(80–85), బాలకుమార్(85–90), లోకేష్(90+)లు ఎంపికయ్యారు. వీరు త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపిక పోటీలను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిల అప్పలనాయుడు, జనరల్ సెక్రటరీ లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కాళ్ల మహేష్ తదితరులు నిర్వహించారు. వడదెబ్బతో వ్యక్తి మృతిబొబ్బిలి: ఎండ వేడిమికి తాళలేక తెర్లాం మండలం కె.సీతారాంపురానికి చెందిన కోస్టు సింహాచలం(58) బొ బ్బిలి రైల్వేస్టేషన్లో బుధవారం మృతిచెందాడు. యాత కులస్తుడైన సింహాచలం వెదురుతో తయారయ్యే బుట్టలు, కోళ్ల గూళ్ల ను పటిష్టంగా ఉంచే నల్లుకట్టే పని చేస్తుంటాడు. ఈ పనిమీదనే రాయగడ వెళ్లి పనిముగించుకుని తిరిగి స్వగ్రామం వచ్చే సమయంలో బొబ్బిలి రైల్వేస్టేషన్లో దిగి ఎండ వేడిమికి సేదతీరుతూ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు.రెండో ప్లాట్ఫాంపై మృతి చెందిన వ్యక్తి సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే హెచ్సీ బి ఈశ్వరరావు తెలిపారు. -
ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్: మహిళ మృతి
● మరో నలుగురిరు మహిళలకు గాయాలురామభద్రపురం: మండలంలోని గొల్లలపేట గ్రామం వద్ద బుధవారం ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టగా జరిగిన ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అదే ఆటోలో ఉన్న మరో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణితో ఉన్న ఓ మహిళను చూసేందుకు గొల్లలపేట గ్రామం నుంచి కొట్టక్కి గ్రామానికి ఆటోలో ఐదుగురు మహిళలు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా ఆ గ్రామం దాటాక సచివాలయం సమీపంలోని శ్మశానం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న బాలి లక్ష్మి(37) అక్కడికక్కడే మృతిచెందగా బాలి పద్మావతి, బాలి రమణమ్మ, లెంక సత్యవతి, బాలి వాసవిలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, మృతురాలి భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ వ్యవసాయకూలీ కాగా వారికి ఇద్దరు కుమార్తెలు లలిత, హేమ ఉన్నారు. -
పోలీస్ శాఖలో నలుగురికి కారుణ్య నియామకాలు
విజయనగరం క్రైమ్: పోలీస్శాఖలో కారుణ్య నియామకాలు మొదలయ్యాయి.ఈ మేరకు శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి శాఖలో మృతిచెందిన నలుగురి కుటుంబసభ్యులకు గురువారం ఎస్పీ వకుల్ జిందల్ నియామక పత్రాలను అందజేశారు. పోలీస్శాఖలో ఆర్మ్డ్, లా అండ్ ఆర్డర్లో వివిధ కారణాలతో ఇటీవల కొందరు మృతి చెందడంతో ఆయా కుటుంబాలలో కారుణ్య నియాకాలను భర్తీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కుటుంబాలలో అర్హత ఉన్న వ్యక్తులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా తరుణ్కుమార్, కోమలత, స్వామినాథ్, సాయిరెడ్డిలకు ఎస్పీ వకుల్ జిందల్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారు. ఏఆర్ విభాగంలో పనిచేసిన ఏఆర్ హెచ్సీలు వెంకటరావు, అప్పలనాయుడు, సివిల్లో పనిచేసిన ఏఎస్సై కుమారస్వామి, హెచ్సీ చంద్రశేఖర్ ఇటీవలే అనారోగ్యాలతో మరణించారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వరలక్ష్మి, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి పాల్గొన్నారు. ఆర్డర్స్ ఇచ్చిన ఎస్పీ వకుల్ -
అంధ విద్యార్థులకు ఉచిత వసతి, విద్యాబోధన
గజపతినగరం: ఒకటవ తరగతి నుంచి 10వతరగతి వరకు విద్యాభ్యాసంతో పాటు భోజన, వసతి సౌకర్యాన్ని అంధ విద్యార్థులకు ఉచితంగా కల్పించనున్నామని ఆసక్తి గల విద్యార్థులు చేరాలని బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్ సుధాకర్ బుష్మి, బి.త్రినాథం, పి.రాజులు తెలిపారు. ఈ మేరకు బుధవారం గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావుకు కరపత్రాలను అందజేసి విలేకరులతో మాట్లాడారు. గజపతినగరం, పురిటిపెంట, ఎం.వెంకటాపురం గ్రామాల్లో వారు పర్యటించి దృష్టి లోపం గల విద్యార్థులకు ప్రభుత్వ అనుసంధానంతో కూడిన బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ అన్నిరకాల సదుపాయాలను అందిస్తుందని ఆసక్తిగల వారు ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుని ఉన్నతమైన స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంఈఓ కార్యాలయం, భవిత సెంటర్ సిబ్బందిని కలిసి కరపత్రాలను అందజేశారు. బొబ్బిలి ఏషియన్ ఎయిడ్ స్కూల్ టీచర్స్ -
ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్
● ఉమ్మడి జిల్లా కలెక్టర్లు డాక్టర్ బీఆర్అంబేడ్కర్, శ్యామ్ప్రసాద్విజయనగరం అర్బన్: భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. స్వర్ణాంద్ర–2047 కెపాసిటీ బిల్డింగ్పై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు రెండు రోజుల వర్క్షాప్ బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ వర్క్షాప్కు హాజరైన కలెక్టర్లు అంబేడ్కర్, శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు సంబంధించిన డ్రాప్ ప్లాన్ను రూపొందించామని అలాగే నియోజకవర్గాలకు కూడా ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గ ఎంఎల్ఏల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాల భౌగోళిక పరిస్థితిని బట్టి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రగతికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 6,500 పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామికంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందుతాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉద్యాన పంటల సాగును విస్తరించాలి మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు ఒకే ప్రణాళిక పనిచేయదని, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రాథమిక రంగంలో ఉద్యాన పంటల సాగును విస్తరించడం, పశుసంపదను వృద్ధి చేయడం తదితర చర్యలపై సూచించారు. పండ్లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వర్క్షాప్ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్య ఆర్ధిక సూచికల ద్వారా, డేటాను సమీకరించడం, దానిని విశ్లేషించడం, ప్రణాళికలను రూపొందించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్షాప్లో ప్రణాళిక శాఖ విశ్రాంతి డైరెక్టర్, సలహాదారులు సీతాపతిరావు, మూడు జిల్లాల సీపీఓలు పి.బాలాజీ, వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజగకవర్గాల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
40 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న నవోదయం 2.0 దాడుల్లో భాగంగా బుధవారం జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో 40 లీటర్ల సారాతో డి.సుందరం అనే వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ వ్యక్తి వద్ద లభించిన సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అలాగే సారా సరఫరా చేసే బొమ్మాళి అరుణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరఘట్టంలో 60 లీటర్ల సారా..వీరఘట్టం: మండలంలోని పొల్లరోడ్డులో బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా బైక్పై వస్తూ బైక్ వదిలేసి ఓ వ్యక్తి పరారవడంతో సోదా చేసి బైక్పై ట్యూబ్లో 60 లీటర్ల సారా ఉన్నట్లు గుర్తించామని ఎస్సై జి,కళాధర్ తెలిపారు. సారాను స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశామని ఎస్సై చెప్పారు. బైక్పై సారా తరలిస్తున్న వ్యక్తి స్థానిక కొండవీధికి చెందిన దుర్గారావుగా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ దాడులుమెరకముడిదాం: మండలంలోని పలుగ్రామాల్లో వినియోగిస్తున్న అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బుదరాయవలస, సోమలింగాపురం, ఇప్పలవలస గ్రామాల్లో వ్యవసాయ పంపసెట్లకు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై దాడులు నిర్వహించి, ఆయా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్న రైతులకు అపరాధరుసుం విధించారు. అలాగే పలు విద్యుత్ కనెక్షన్లను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు చిట్టితల్లి, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
వీరఘట్టంలో ఆవులు, మేకల దొంగలు
వీరఘట్టం: గడిచిన రెండేళ్లుగా వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గొల్లవీధి, తెలగవీధి, పెరుగువీధి, మేకలవీధితో పాటు పలు వీధుల్లో ఆవులు, మేకలు, దూడలను ఆగంతుకులు ఎత్తుకుపోతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు తెలగవీధిలోని ఓ ఇంటి ముందు ఉన్న రెండు ఆవులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఆగంతుకులు తప్పించుకుని పారిపోయారని తెలగవీధికి చెందిన వారు స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. తెలగవీధిలో మూగజీవాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారనే విషయం తెలియడంతో చాలా వీధుల నుంచి బాధితులు పోలీస్స్టేషన్కు వచ్చారు. రెండేళ్లుగా మా పశువులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు తెలియజేశారు. గురువారం పూర్తి స్థాయిలో అందరం కలిసి ఫిర్యాదు చేసేందుకు బాధితులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఆవులు, మేకలను దొంగిలిస్తున్న వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానికులు -
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
● ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడువిజయనగరం: క్రీడారంగంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారని, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఎంపీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక విజ్జి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి అండర్–19 క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారుల ప్రతిభను అడిగి తెలుసుకుని, లక్ష్యం కోసం కష్టపడాలని సూచించారు. ఎంపిక పోటీల్లో విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ వర్మరాజు, అసోసియేషన్ సభ్యులు, హెడ్ కోచ్లు పాల్గొన్నారు. -
షెడ్యూల్ మేరకు పదో తరగతి మూల్యాంకనం
● విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ముగించాలని విద్యాశాఖ ఆర్జేడీ బి.విజయభాస్కర్ ఆదేశించారు. విజయనగరం సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. మూల్యాంకన ప్రాంగణంలో టీచర్లకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు ఉన్నారు. బాధ్యతల స్వీకరణ ˘విజయనగరం అర్బన్: జిల్లా ఖజానాశాఖ ఉప సంచాలకుడిగా వి.నాగమహేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్ఏఎస్ కుమార్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం నాగమహేష్ను ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా డీటీ అండ్ ఏఓ ఏ.మన్మథరావు, ఏటీఓ కె.శ్రీనివాసరావు, ఉమ్మడి విజయనగరం జిల్లా ఉప ఖజానా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైవాడ కాలువలో ఆటో బోల్తా ● తప్పిన ప్రమాదం ● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు వేపాడ: మండలంలోని బల్లంకి నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో రైవాడ కాలువపై ఏర్పాటుచేసిన తాత్కాలిక కల్వర్టుపై మంగళవారం ఆటో అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఆటోలో బల్లంకి గ్రామానికి వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటోను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. జనవరిలో రైవాడ కాలువపై ఉన్న కల్వర్టు కూలిపోవడంతో గ్రామస్తులు తాటిదుంగలతో తాత్కాలిక కల్వర్టును ఏర్పాటుచేశారు. దీనిపై నుంచి గతంలో పిక్కలారీ వెళ్లడంతో కూలిపోయింది. ఇదే తాత్కాలిక కల్వర్టుపై ఇప్పుడు ఆటో బోల్తాకొట్టింది. జీవీఎంసీ అధికారులు, స్థానిక పాలకులు స్పందించి బల్లంకి–ఆనందపురం రోడ్డులో రైవాడ కాలువపై శాశ్వత కల్వర్టు నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. -
డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి
విజయనగరం క్రైమ్: డ్రగ్స్ నియంత్రణకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఏఎస్పీ పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా విజయనగరం ఉండేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ఈగిల్ అనే ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వింగ్కు ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క శాఖ తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. గంజాయి వ్యసనానికి అలవాటు పడిన వారిని గుర్తించి సన్మార్గంలో పెట్టేందుకు అందరూ కృషి చేయాలని ఏఎస్పీ సౌమ్యలత సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి శ్రీనాథుడు, డిజేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నపూర్ణ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు లలిత, త్రినాథ్ రావు, డిస్ట్రిక్ సర్వేలైన్స్ అధికారి డా.సత్యనారాయణ,సెట్విజ్ సీఈఓ సోమేశ్వరరావు,ఈగిల్ జేఓ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఎస్పీ సౌమ్యలత -
బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం!
బొబ్బిలి: పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి గడ్డ.. నేడు కుటిల రాజకీయాలకు కేరాఫ్గా మారింది. నిండా ఏడాది పదవీ కాలం లేని మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం బొబ్బిలి రాజులు బెదిరింపు, ప్రలోభ రాజకీయాలకు తెరతీయం చర్చనీయాంశంగా మారింది. ఓ పార్టీ గుర్తుతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ మారిన నాయకుడు... ఇప్పుడు ఆ మచ్చను కౌన్సిలర్లకు అంటగట్టే ప్రయత్నాన్ని బొబ్బిలి ప్రజలు ఛీకొడుతున్నారు. పార్టీ మారిన కౌన్సిలర్ల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. విశాఖ కేంద్రంగా బొబ్బిలి రాజులు నడుపుతున్న కుటిల రాజకీయాలకు అవిశ్వాస తీర్మానం రోజున భంగపాటు తప్పదని బహిరంగంగా చెబుతున్నారు. ● ఇదీ పరిస్థితి... బొబ్బిలి మున్సిపాలిటీలో 31 వార్డులకు టీడీపీకి 10 మంది కౌన్సిలర్లుండగా వైఎస్సార్సీపీ నుంచి 21 మంది కౌన్సిలర్లు గెలిచారు. దీంతో చైర్మన్ పీఠాన్ని అప్పట్లో వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్ పీఠంపై బొబ్బిలి రాజులు కన్నేశారు. బలం లేకున్నా... వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ఎరవేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లతో కలెక్టర్ అంబేడ్కర్కు నోటీసు ఇప్పించారు. అయితే, కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మాత్రం ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరే నీచపు పనికి ఒడిగట్టమని స్పష్టంచేస్తూ నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డారు. రాజుల మాయమాటల్లో పడిన కౌన్సిలర్లకు హితబోధ చేసేందుకు మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రాజులను వీడి వాస్తవాలను గ్రహించాలని కౌన్సిలర్లకు వారి కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న నిర్వహించే అవిశ్వాస తీర్మానం రోజున పార్టీకి వ్యతిరేకంగా చెతులెత్తే పరిస్థితి లేదన్నది సమాచారం. రాజులు ఎన్ని శిబిరాలు నిర్వహించినా ధర్మమే గెలుస్తుందని, చివరకు రాజులకు భంగపాటు తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, స్థానిక సీనియర్ కౌన్సిలర్లు రేజేటి ఈశ్వరరావు, చోడిగంజి రమేష్ నాయుడు కౌన్సిల్ను కాపాడుకునే అంశంపై న్యాయవాదుల సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుల సలహాలు పాటిస్తున్నారు. టీడీపీ కోరి తెచ్చుకున్న ఈ ముప్పుతో వారే అవస్థల పాలవుతారని, దగాకు పాల్పడిన కౌన్సిలర్లు కర్మ సిద్ధాంతానికి లోబడి ముప్పు ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు, నాయకులతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి నిలకడలేని నైజం.. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నాలుగో వార్డు కౌన్సిలర్ అమ్మన్నమ్మ నిజాయితీగా ఉన్నా ఆమె కుమారుడు మాత్రం నిలకడలేని నైజం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అటుఇటు రెండు వైపులా ఉన్నట్టు నటించడంపై ఆ వార్డు ప్రజలు మండిపడుతున్నారు. నీచపుబుద్ధిని పక్కన పెట్టాలంటూ వార్డు పెద్దలు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. టీడీపీ నిర్వహిస్తున్న శిబిరంలో కొంత మంది మహిళా కౌన్సిలర్లను వారి భర్తలు, కుమారులకు చెప్పకుండా నేరుగా పలు ప్రాంతాలకు తిప్పుతుండడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా సుజయ్కృష్ణరంగారావు నచ్చచెబుతున్నట్టు తెలిసింది. టీడీపీకి నమ్మకంగా ఉంటున్న వారిలో ఇద్దరు వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై టీడీపీ కూడా వారిని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సంవత్సరం కూడా లేని పదవి కోసం అర్రులు చాచడం, డబ్బుకు కక్కుర్తిపడి సొంత వార్డులోని ఓటర్ల వద్ద పరువు పోగొట్టుకోవడం, ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం అవసరమా అన్న ఆలోచనతో కొందరు కౌన్సిలర్లు రాజుల చెర నుంచి బయటకు వచ్చేందుకు దారులు వెతుకుతున్నారనే ప్రచారం సాగుతోంది.