Vizianagaram District News
-
భక్తజన తీర్థం
నెల్లిమర్ల రూరల్: శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం భక్తజన తీర్థంగా మారింది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ శివుని మంత్రం జపించారని విశ్వసించిన భక్తులు.. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి రాముడి సన్నిధిలో శివరాత్రి జాగరణ చేశారు. శివకేశవులకు భేదంలేదని చాటారు. రామస్వామివారి ఆలయం, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ ఆలయం, రామకోనేరు, బోడికొండ, గురుభక్తుల కొండ, దుర్గాభైరవ కొండ ప్రాంతాలన్నీ భక్తజనంతో కిక్కిరిసాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో కాగడాలు వెలిగించి రాత్రంతా శివజాగరణ చేశారు. ప్రత్యేక అభిషేకాలు రామాలయ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమాసదాశివ ఆలయంలో అర్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో బుధవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించారు. 11 రకాల ఫలరసాలు, భస్మ, చందన, హరిద్రా కుంకుమ, సుగంధ ద్రవ్య, నారికేళ జలాలతో శివుడికి మహాభిషేకం చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మహాలింగోద్భవ సమయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భస్మపూజ, అష్టమూర్తి హారతి, త్రయంబిక మంత్రజపం జరిపారు. వెలుగులు పంచిన శిఖర జ్యోతి రామతీర్థం బోడికొండ పర్వతంపై శిఖరదీపాన్ని సాయంత్రం 6 గంటలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెలిగించారు. దీనికి కావాల్సిన సామగ్రిని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమకూర్చారు. రెండు రోజుల పాటు శిఖర దీపం కొండపై వెలగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పర్వతంపైకి చేరుకొని శిఖరదీపాన్ని దర్శించుకున్నారు. ఈఓ వై.శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై గణేష్, పోలీస్ సిబ్బంది ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సేవలందించారు. సతివాడ, కొండవెలగాడ వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మిమ్స్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో వైద్య సేవలు కొనసాగాయి. శివరాత్రికి తరలివచ్చిన ఆశేష భక్తజనం ఆలయ ప్రాంగణంలో జాగరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిఖర జ్యోతి -
నేడే పోలింగ్
● ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● ఓటు హక్కు వినియోగించుకోనున్న ఉపాధ్యాయులు విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరంలో ఓటర్ల సంఖ్య 2,166 ఉండడంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ప్రక్రియను వీడియా రికార్డింగ్ చేస్తారు. ఓటర్లు ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుకెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 175 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్), ఏపీఓ, ఇద్దరు అదనపు పోలింగ్ అధికారులు, ఒక సూక్ష్మ పరిశీలకులను నియమించారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, ఆర్డీఓ కార్యాలయాల వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. విజయనగరం డివిజన్లో 4 రూట్లు, చీపరుపల్లి, బొబ్బిలి డివిజన్లో రెండేసి రూట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రూట్ పర్యవేక్షణకు ఒక రూట్ ఆఫీసర్, ఒక సెక్టార్ ఆఫీసర్ను నియమించారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద పోలింగ్ సిబ్బందికి బుధవారం ఉదయమే ఎన్నికల సామగ్రిని అందజేశారు. మొత్తం 8 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏఆర్ఓగా వ్యవహరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు పర్యవేక్షించారు. జేసీ ఎస్.సేతుమాధవన్ చీపురుపల్లిలో పర్యటించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్డీఓ సత్యవాణితో మాట్లాడి ఏర్పాట్లను తెలుసుకున్నారు. పీఓలు, సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నిక ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన వివరాలు మొత్తం ఓటర్ల సంఖ్య: 5,223 పోలింగ్ కేంద్రాలు: 29 పోలింగ్ సమయం: విధులు నిర్వహిస్తున్న సిబ్బంది: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 175 మంది -
ఆ పాదముద్రలు పులి పిల్లలవి కాదు
చీపురుపల్లి రూరల్ (గరివిడి): అవి పులి పిల్లల పాదముద్రలు కాదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబ్బారావు స్పష్టంచేశారు. గరివిడి మండలం శివరాం గ్రామంలోని ఓ రైతు పొలంలో పులి పిల్లల పాదముద్రలు కనిపించాయన్న వార్తతో గ్రామస్తులు భయాందోళన చెందారు. తహసీల్దార్ సీహెచ్ బంగార్రాజుతో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో తహసీల్దార్, ఆర్ఐ అచ్యుతరావు, ఫారెస్టు రేంజ్ అధికారి కలిసి పాదముద్రలను పరిశీలించారు. అవి పులి పిల్లలవి కాదని, వేరే జాతి జంతువుల పిల్లల అడుగులుగా నిర్ధారించారు. -
పకడ్బందీగా చదువుప్రణాళిక
వంగర: జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో ఈ ఏడాది పదోతరగతి, ఇంట ర్మీడియట్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉమ్మడి విజయనగరం గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి అన్నారు. 100 రోజుల చదువు ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నట్టు తెలిపారు. వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకులాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. తొలుత వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ చేశారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. అనంతరం డార్మిటరీ, తర గతి గదులు, క్రీడామైదానం పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై బోధన ప్రణా ళిక అమలుతీరుపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో నీట్, ఐఐటీ, ఎంసెట్ వంటి పోటీపరీక్షలకు ప్రత్యేక తర్ఫీదునిస్తామని తెలిపారు. కేఎల్వైఈఎస్ విధానంలో గురుకుల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వంగర, ఉంగరాడమెట్ట గురుకులాల ప్రిన్సిపాల్స్ సాన పద్మజ, పేడాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ ప్యాచ్వర్కుల ఖర్చు రూ.50లక్షలు! కింది చిత్రం చూశారా... అది గజపతినగరం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి నుంచి మెంటాడ వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో పురిటిపెంట వరకు 1.4 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ (కూటమి నాయకుడు) అధికార బలంతో అక్కడక్కడ ప్యాచ్వర్క్లు చేసి నిధులు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్యాచ్ వర్క్లను తూతూ మంత్రంగా చేసేశారు. ఈ రోడ్డును చూసిన వారు ఇంత చిన్నపనికి రూ.50 లక్షల ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తుండడం తో బిల్లులు మంజూరు చేసేందుకు అధి కారులు వెనుకంజవేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆర్అండ్బీ జేఈ అజయ్వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా 1.4 కిలోమీటర్ల రెగ్యులర్ రోడ్డుకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. అయితే పూర్తిస్థాయిలో 1.4 కిలోమీటరు వరకూ రోడ్డు వేయలేదని, మధ్యమధ్యలో రోడ్డు పాడైనచోట మాత్రమే రోడ్డు వేసినట్టు తెలిపారు. ఇది ప్యాచ్వర్కు కాదని, రెగ్యులర్ రోడ్డేనని చెప్పుకొచ్చారు. కేవలం రూ.39 లక్షలు మాత్రమే కాంట్రాక్టర్కు వెళ్తుందని, మిగిలిన రూ.11లక్షలు జీఎస్టీ, నాక్, సీనరీకి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏదేమైనా నిధులు ఎక్కువ, పని తక్కువ అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. పనుల పేరుతో కూటమి ప్రభుత్వం పార్టీ నాయకుల జేబులు నింపేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. – గజపతినగరం రూరల్ -
వణికిస్తున్న జ్వరాలు
శృంగవరపుకోట: ధారపర్తి పంచాయతీ పరిధిలో 11 గిరిజన గూడలు ఉన్నాయి. అన్నీ ఇంచుమించుగా కొండలపై ఉన్న గ్రామాలే. సరైన రహదారి సదుపాయం లేదు. రాళ్లదారిలోనే రాకపోకలు. అత్యవసర వేళ డోలీయే దిక్కు. ఆరోగ్య సేవలకు ఆశ కార్యకర్తే ఆధారం. ఇప్పుడు రాయిపాలెం, కురిడి గ్రామాల్లోని చిన్నారులను జ్వరాలు వణికిస్తున్నాయి. ఇదే పంచాయతీలో గతంలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇప్పుడు జ్వరాల వ్యాప్తితో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పిల్లలను భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగుతీస్తున్నారు. ఇప్పటికే రాయిపాలెం, కురిడి గ్రామాలకు చెందిన 12 మంది పిల్లలు ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ విషయం పత్రికల్లో బుధవారం ప్రచురితం కావడంతో కొట్టాం పీహెచ్సీ సిబ్బంది స్పందించారు. డాక్టర్ మానస ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. మరో ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. జ్వరాలతో ఆస్పత్రిలో చేరి పత్రికల్లో వార్తలు వస్తే తప్ప గ్రామాలవైపు కన్నెత్తి చూసేవారే ఉండరని గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కనీసం ప్రాథమిక వైద్యసేవలు కూడా అందని ద్రాక్షగా మారాయని చెబుతున్నారు. చిన్నారులను పరామర్శించిన డీఎంహెచ్ఓ ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న 12 మంది గిరిజన చిన్నారులను డీఎంహెచ్ఓ జీవనరాణి బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చిన్నారుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు. సాధారణ వైరల్ జ్వరాలే అని, ఆందోళన అవసరం లేదన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలే జ్వరాల వ్యాప్తికి కారణమని వైద్యురాలు మానస తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ను వైద్యపరీక్షలకు పంపించామన్నారు. అయితే, ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి వచ్చిన వైద్యాధికారులు ఆయా గ్రామాలను సందర్శించకుండానే వెనుదిరగడం గమనార్హం. మంచంపడుతున్న చిన్నారులు ఆస్పత్రికి వస్తే తప్ప అటువైపు చూడని వైద్యులు జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని వైనం అన్నింటికీ ఆశ కార్యకర్తే దిక్కు -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బొబ్బిలి: పట్టణంలోని కొత్త ఎరుకల వీధికి చెందిన గేదెల సోములు(29) మనస్తాపంతో తాను నివసిస్తున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తరచూ తనను ఎవరూ ఖాతరు చేయడం లేదని సోములు విసుక్కుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తిట్టుకుండే వాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి శంబర పండగకు వవెళ్లారు. అక్కడ దర్శనం సమయంలో కాస్తా ఆలస్యమైంది. ఆ సమయంలో ఎవరో త్వరగా వెళ్లమని ముందకు తోయడంతో భార్యపై చిరాకుపడ్డాడు. సోములు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి వచ్చేసినా అదే ఆలోచనతో బాధపడ్డాడు. రాత్రి సమయంలో ఇంట్లోని మొదటి గదిలో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య ఇరుగుపొరుగు సాయంతో వచ్చి కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేష్ తెలిపారు. -
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో.. మహాశివరాత్రి వేడుకలు
విజయనగరం టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్దానిక కంటోన్మెంట్లో ఉన్న బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. అద్దాలతో అలంకరణ చేసిన శివలింగాల ప్రదర్శన భక్తిభావాన్ని పెంపొందించింది. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలను ఆయా స్ధానాల్లో ఏర్పాటుచేసి, వాటి విశిష్టతను బ్రహ్మకుమారీలు వివరించారు. బ్రహ్మకుమారీస్ ఇన్చార్జ్ బీకే. అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో బ్రహ్మకుమారీలు, భక్తులు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణతకు కృషి
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామని.. ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను బట్టి ఏ, బీ, సీ, డీలుగా విభజించి, వారిలో విద్యానైపుణ్యాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ప్రధానంగా చదువులో సీ, డీ గ్రేడ్ల్లో ఉన్నవారిపై దృష్టి సారించి, ఉత్తీర్ణత మార్కులు సాధించేలా బోధన సాగిస్తున్నామన్నారు. ప్రత్యేక తరగతులను తనతో పాటు కలెక్టర్, ఇతర అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న పలు అంశాలపై ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ● గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎం జన్మన్ పథకం కింద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 1,450 గ్రామాలుంటే.. అందులో 416 పీవీటీజీ గ్రామాలున్నాయి. వీటిలో పీఎం జన్మన్ పథకం కింద తాగునీరు, గృహనిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు, పీఎం సూర్యఘర్ కింద సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నాం. డీఏ – జేజీవీఏ(ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్స్ అభియాన్) పథకం కింద ప్రతిపాదనలు పంపుతున్నాం. ఇందులో భాగంగా పక్కా ఇళ్లు, నీటి సరఫరా, కమ్యూనిటీ కుళాయిలు, విద్యుత్, మొబైల్ మెడికల్ యూనిట్లు, ఆయుష్మాన్ కార్డులు వంటి సౌకర్యాలు కలగనున్నాయి. ● ఆర్టికల్ 275(1) పనుల కింద షెడ్యూల్డ్ తెగల గ్రామాల్లో రక్షిత తాగునీరు, రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్తు, గృహ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధానమిస్తున్నాం. గోకులం షెడ్లు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలనూ త్వరితగతిన పూర్తి చేయాలని చెబుతున్నాం. ● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 54 వన్ధన్ వికాస కేంద్రాలు (వీడీవీకే) ఉన్నాయి. ఇందులో 300 మంది వరకు సభ్యులుగా ఉంటారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్, బ్రాండింగ్ కల్పించి అదనపు ఆదాయం వచ్చేలా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడీవీకేలను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాలకు రూ.4 కోట్ల వరకు నిధులు మంజూరుకాగా, ఇందులో సుమారు రూ.40 లక్షల వరకు వెచ్చించి ఎనిమిది చింతపండు కేకు మిషన్లు, రెండు మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్లు, రెండు పసుపు పిండి తయారు చేసే మిషన్లు కొనుగోలు చేశాం. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. ● ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ఆదివాసీ మహోత్సవం జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లో మన వీడీవీకేల తరఫున రెండు వెళ్లాయి. మిల్లెట్స్, బిస్కెట్స్, కొండ చీపుర్లు స్టాల్స్ను మనవాళ్లు ప్రదర్శనలో ఉంచారు. ● పార్వతీపురం ఏఎంసీలో జీడి ప్రాసెసింగ్ యూనిట్ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ మొదటి వారానికి సిద్ధం కానుంది. టెన్త్లో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి గిరిజనుల అభివృద్ధికి చర్యలు ‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ ఆశ్రమ, ఏకలవ్య పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు కలెక్టర్, పీవో ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఐటీడీఏ పరిధిలోని విద్యాలయాల్లో సన్నద్ధత తీరును ఆమె ‘సాక్షి’కి వివరించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 40 ఆశ్రమ పాఠశాలలు ఉండగా 1,518 మంది.. జోగింపేట, కురుపాం, భద్రగిరి, పి.కోనవలస, కొమరాడ, భద్రగిరి(బాలురు) తదితర ఆరు గురుకులాల్లో 415 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. వీరందరికీ మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా... ఈఎంఆర్ఎస్కు సంబంధించి 211 మంది సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయని వివరించారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. ఏపీఆర్జేసీ మొదటి సంవత్సరం 675 మంది, ద్వితీయ సంవత్సరం 660 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. సిలబస్ పూర్తి.. పదోతరగతి, ఇంటర్మీడియట్కు సంబంధించిన సిలబస్ మొత్తం పూర్తి అయ్యిందని ఆమె తెలిపారు. పదిలో రివిజన్ కూడా పూర్తి అయ్యిందని, ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా పెట్టి వారిలో పరీక్షలు అంటే భయం పోగొట్టేలా సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వారిపై మరింత శ్రద్ధ చూపి ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యంపైనా దృష్టి.. విద్యార్థుల ఆరోగ్యంపైనా పీవో ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రక్తహీనత ఉన్నవారికి ఐరన్ మాత్రలతో పాటు.. పాలు, గుడ్లు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. -
రెండు కేసులు నమోదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన కొప్పుశెట్టి కోటేశ్వరరావు, పలిశెట్టి శీతయ్యలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో 5గురు వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేశామని హెచ్సీ వంజరాపు జనార్దనరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..కొప్పుశెట్టి కోటేశ్వరరావు పొలంలో సర్వే మొక్కలను పలిశెట్టి శీతయ్యకు చెందిన నాటు బండ్లు కుమ్మేయడంతో గొడవ జరిగింది. పలిశెట్టి శీతయ్య, లక్ష్మణరావు, గోవిందలు తనపై దాడి చేశారని కొప్పుశెట్టి కోటేశ్వరరావు.. కొప్పుశెట్టి కోటేశ్వరరా వు, శ్రీనులు తమపై దాడి చేశారని పలిశెట్టి శీతయ్య ఫిర్యాదు చేయడంతో పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. -
పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
చీపురుపల్లి: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎనిమిది మండలాలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదం, గుర్ల, రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో ఎన్నికల నిర్వహణకు నియమించిన పోలింగ్ సిబ్బందికి కిట్లను ఆర్డీఓ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. సజావుగా పోలింగ్ నిర్వహణ జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బొబ్బిలి: పట్టణంలోని కొత్త ఎరుకల వీధికి చెందిన గేదెల సోములు(29) మనస్తాపంతో తాను నివసిస్తున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తరచూ తనను ఎవరూ ఖాతరు చేయడం లేదని సోములు విసుక్కుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తిట్టుకుండే వాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి శంబర పండగకు వవెళ్లారు. అక్కడ దర్శనం సమయంలో కాస్తా ఆలస్యమైంది. ఆ సమయంలో ఎవరో త్వరగా వెళ్లమని ముందకు తోయడంతో భార్యపై చిరాకుపడ్డాడు. సోములు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి వచ్చేసినా అదే ఆలోచనతో బాధపడ్డాడు. రాత్రి సమయంలో ఇంట్లోని మొదటి గదిలో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య ఇరుగుపొరుగు సాయంతో వచ్చి కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేష్ తెలిపారు. -
పోలీసుల అదుపులో చీటీల మోసగాళ్లు
భోగాపురం: మండల కేంద్రం భోగాపురంలో కొన్ని సంవత్సరాలుగా చీటీలు, చిన్నచిన్న ల్యాండ్ వ్యాపారాలు చేసుకుంటూ భార్యాభర్తలు తిరుమరెడ్డి మురళి, తులసి కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఇలా జీవనం సాఫీగా సాగిపోతున్న సమయంలో గడిచిన రెండు నెలలుగా చీటీదారులకు, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పకుండా ఊరిలోనూ కనిపించకుండా బయట తిరుగుతున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ.30కోట్లు నష్టపోయామని బాధితులు పోలీసులు ముందు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు తిరుమరెడ్డి మురళి, తులసిలను రాజమహేంద్రవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి తగరపువలస ఉన్న ఇంటితో పాటు, భోగాపురంలో ఉన్న రెండు ఇళ్లు,, కొన్ని రకాల ల్యాండ్కు సంబధించిన రికార్డులను స్వాధీనం చేకుసుకున్నారు. అనంతరం విజయనగరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ బుధవారం తెలిపారు. వంగరలో అగ్నిప్రమాదంవంగర: మండల కేంద్రం వంగరలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కర్రి రాములు గడ్డివాము దగ్ధం కాగా దేవకివాడ రామినాయుడు, రౌతు అసిరినాయుడులకు చెందిన జీడి, మామిడి చెట్లు ఆహుతయ్యాయి. సమాచారం మేరకు రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో కాలిన ఇల్లువంగర: మండల పరిధి కింజంగి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పెంకుటిల్లు కాలిపోయింది. బుధవారం గ్రామానికి చెందిన గంట లక్ష్మి ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు రాజాం ఫైర్ ఆఫీసర్ టి.మోహనరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక శకటంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో నగదు కొంత కాలిపోయిందని బాధితురాలు గంట లక్ష్మి అధికారులకు తెలిపింది. ఈ ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని వీఆర్వో గెడ్డాపు శ్రీనివాసరావు వెల్లడించారు. మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టుబొబ్బిలి: తెర్లాం మండలం కుసుమూరులో 14 మద్యం సీసాలతో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ పి.చిన్నంనాయుడు విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 48 గంటల పాటు మద్యం విక్రయాలు నిషేధించామని, అయినా ఇతర ప్రాంతాల్లో మద్యం విక్రయాలను చేపడుతున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా మద్యం సీసాలతో దొరికితే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబాటు
● మార్కెట్ కమిటీల లక్ష్యం రూ.12.89 కోట్లు ● ఈనెల10 నాటికి సాధించింది రూ.7.41కోట్లువిజయనగరం ఫోర్ట్: వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లు ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్య సాధనకు గడువు తక్కువ కాలమే ఉండడంతో మార్కెట్ కమిటీలు లక్ష్యాన్ని సాధించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సాధించగలిగితే వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతుబజార్లు, వ్యవసాయ చెక్పోస్ట్లు ఉంటాయి. వాటి నిర్వహణ, కార్యకలాపాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోనే జరుగుతాయి. ఆదాయ లక్ష్యం రూ. 12.89 కోట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2024–25 సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యం రూ.12.89 కోట్లు. ఈ నెల 10 వతేదీ నాటికి వ్యవసాయ మార్కెట్ కమిటీలు సాధించిన ఆదాయం రూ.7.41 కోట్లు ఇంకా రూ. 5.48 కోట్లు ఆదాయం సాధించాల్సి ఉంది. మార్చి నెలఖారు లోగా ఈ లక్ష్యాన్ని సాధించాలి. వ్యవసాయ చెక్పోస్టులు, గోదాములు, వ్యాపార లావాదేవీల ద్వారా ఆదాయం వస్తుంది. వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సామగ్రిని తరలించే వాహనాల నుంచి రుసుమును వ్యవసాయ చెక్ పోస్టుల వద్ద సిబ్బంది వసూలు చేస్తారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న షాపుల నుంచి సెస్లు, మార్కెట్ కమిటీల్లో జరిగే వ్యాపారలావాదేవీల ద్వారా, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి గొదాముల అద్దెద్వారా మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది.శతశాతం సాధించేందుకు కృషిజిల్లాలో ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు రూ.7.41 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. ఇంకా రూ. 5.48 కోట్లు సాధించాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నందున శతశాతం ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తాం. బి.రవికిరణ్, మార్కెటింగ్శాఖ ఎ.డి జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, పూసపాటిరేగ, కొత్తవలస, చీపురుపల్లి , మెరకముడిదాంల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో 12 వ్యవసాయ చెక్పోస్టులు ఉన్నాయి. -
అవయవదానానికి అంగీకారం
చీపురుపల్లి రూరల్ (గరివిడి): వారంతా చదువుకున్న యువత. ఉన్నతంగా ఆలోచించారు. అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరణాంతరం తమ శరీర అవయవాలు బూడిదలో కలిసిపోకూడదని, ఈ సమాజంలో అవయవాల లోపంతో జీవిస్తున్న మరెంతోమందికి తమ మరణాంతరం తమ అవయవాలతో మంచి జరగాలనే సంకల్పంతో అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బీవీ.గోవిందరాజులు గ్రామానికి వెళ్లి అవయవదాన ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు గ్రామానికి చెందిన 120 మంది యువత, గ్రామస్తులు అవయవదానానికి అంగీకారం తెలుపుతూ అంగీకార పత్రాలపై సంతకాలు చేసి మానవీయత సంస్థ వ్యవస్థాపకుడు బీవీ.గోవిందరాజలుకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామయువత, పెద్దలు తలాడ సుబ్బలక్ష్మి, పెనుమత్స సాంబమూర్తిరాజు,గుడివాడ నారాయణరావు, పిల్ల నారాయణరావు, కోన పైడినాయుడు, బార్నాల సూరప్పలనాయుడు, శనపతి అప్పలనాయుడు, గుడివాడ శ్రీరాంనాయుడు, జమ్మాన తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందడుగు వేసిన వెదుళ్లవలస యువత -
ప్రైవేట్కే వాహనాల ఫిట్నెస్..!
● గుర్ల మండలంలో ఫిట్నెస్ కేంద్రం ఏర్పాటు ● జిల్లాలోని కమర్షియల్ వాహనాలన్నింటికీ ఇక్కడే బ్రేక్ ● కంప్యూటర్ ఓకే చేస్తేనే వాహనాలకు సర్టిఫికెట్ ఆర్టీఓ ధృవీకరణ అవసరం లేదు జిల్లాలోని కమర్షియల్ వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు ఆర్టీఓ అధికారులు నేరుగా వాహనాలను నడిపి వాటికి బ్రేక్ చేసేవారు. అచ్యుతాపురం వద్ద ప్రైవేట్ ఫిట్నెస్ కేంద్రం ద్వారా ఆర్టీఓ అధికారుల ప్రమేయం లేకుండానే ఇప్పుడు వాహనాలకు బ్రేక్ చేస్తున్నారు. ఆన్లైన్లో వచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని ఆర్టీఓ అధికారులు వాహనాలను తనిఖీలు చేసినప్పుడు చూపిస్తే ఎటువంటి కేసులు నమోదు చేయరు. బ్రేక్తో పాటు వాహనాల పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఆన్లైన్లో అందజేస్తారు. గుర్ల: జిల్లాలోని కమర్షియల్ వాహనాలైన నాలుగు చక్రాలు, మూడు చక్రాలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలకు ఫిట్నెస్ (బ్రేక్) ధ్రువీకరణ పత్రం గురించి ఆర్టీఓ కార్యాలయానికి ఇకపై వెళ్లనవసరం లేదు. ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న మధ్యవర్తులకు చెక్పెట్టిన ప్రభుత్వం..వాహనాలకు ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం అందించేందుకు జిల్లాలోని గుర్ల మండలం అచ్యుతాపురం వద్ద రాజస్థాన్కు చెందిన ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. అచ్యుతాపురం వద్ద ఏర్పాటు చేసిన ఫిట్నెస్ కేంద్రానికి ఆన్లైన్లో శ్లాట్ బుక్ చేసుకున్న వాహన యాజమానులు వారికి కేటాయించిన తేదీలలో వాహనాలను తీసుకురావాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి అచ్యుతాపురం ఫిట్నెస్ కేంద్రం వద్దకు బ్రేక్ కోసం వాహనాలు రావడం ప్రారంభమైంది. కంప్యూటర్ ఒకే అంటేనే గతంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ కోసం వచ్చిన వాహనాలను పూర్తిస్థాయిలో చెక్చేసి చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటిని వెంటనే గుర్తించి రిపేర్ చేసుకుని వచ్చిన వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రం అందజేసేవారు. ఇప్పుడు మాత్రం ఫిట్నెస్ ధృవీకరణ పత్రం కోసం వచ్చిన వాహన యజమానులు శ్లాట్ బుక్ చేసుకుని రావాలి. వాహనాలు ఏ మాత్రం కండిషన్ లేకపోయినా, చిన్న చిన్న రిపేర్లను కంప్యూటర్ గుర్తించినా వారి శ్లాట్ రద్దవుతుంది. పూర్తి కండిషన్లో ఉన్న వాహనాలకు మరుసటి రోజు ఫిట్నెస్గా ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. ఆన్లైన్లో మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంది. ఆర్టీఓలకు సంబంధం లేదు వాహనాలకు ఫిట్నెస్ కోసం ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. ఆ సంస్థ ఏ విధంగా వాహనాలకు ఫిట్నెస్ తనిఖీ చేస్తుందో సమాచారం లేదు. ఫిట్నెస్ తనిఖీలు చేస్తున్న సంస్థ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశాలనుసారం మా విధులు నిర్వహిస్తాం. దుర్గాప్రసాద్, ఆర్టీఓ, విజయనగరం -
గిరిశిఖర గ్రామాల్లో జ్వరాల పంజా
శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని కురిడి, రాయిపాలెం గ్రామాలు విషజ్వరాలతో మంచంపట్టాయి. కురిడిలో 11 మంది పిల్లలు జ్వరాల బారిన పడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాయిపాలెంలోనూ ఇదే పరిస్థితి. వాహనాలు వెళ్లే దారిలేకపోవడంతో పిల్లలను భుజాలపై మోసుకుంటూ కొండలుదిగి ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వైద్యులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి సేవలందించాలని ఏపీ గిరిజన సంఘ నాయకుడు జరతా గౌరీష్, గ్రామస్తులు కోరారు. – ఎస్.కోట -
రామక్షేత్రంలో.. శివారాధన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం ఏటా ‘రామతీర్థం’ ఆలయంలో ఆవిష్కృతమవుతోంది!. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఒడిశా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ ఒక దశాబ్దాల అద్భుతంగా అలరారుతోంది. మరో వైపు బౌద్ధులు నడయాడిన గురుభక్తుల కొండ.. ఎదురుగా పచ్చని నీటితో కనిపించే రామకోనేరు.. ఇలా ఆ ప్రాంత మంతా అత్యంత సుందర నిలయమై భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ● రామతీర్థ మహత్యం.. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణపరమాత్మను కూడా తోడు రమ్మని అడిగారు. అందుకు కృష్ణ పరమాత్మ వారితో.. తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతుడనై సంచరించానని, ఆనాటి రామావతారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వనవాస కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు చెప్పాడు. సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలను స్కృష్టించి పాండవులకు అందించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు రామతీర్థం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించారని, స్వామివారిని సేవించి వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారని ప్రతీత. తర్వాత పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ నిర్మించిన దేవాలయాన్ని పరమ నిష్టాగరిష్టుడైన వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వేదగర్భుడు, వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని వారి మత ప్రచారాన్ని చేసుకుంటూ కాల క్రమేపి రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారు. వాళ్ల మత సిద్ధాంతాలకు భయపడిన వేదగర్భుని వంశీయులు సీతా రామలక్ష్మణ విగ్రహాలను భూగర్భంలో దాచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. శివరాత్రి జాగరణ... ఏటా రామస్వామివారి కల్యాణోత్సవాలు, రథయాత్ర, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్టాభిషేకాలు, విఖసన జయంతి, పవిత్రోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గోపురోత్సవం, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన అశేష జనావళి నడుమ గిరి ప్రదక్షణం జరుగుతుంది. వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరపడమనేది ఇక్కడి ప్రత్యే కత. ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ముందురోజే క్షేత్రానికి చేరుకుని కోనేటిలో స్నానమాచరించి నిష్టాగరిష్టులై శివరాత్రి జాగరణ చేసి తరిస్తుంటారు. నీటి మడుగులో విగ్రహాలు విజయనగరం పూసపాటి వంశీయులు 1650వ సంవత్సరంలో కుంభిళాపురం (నేడు కుమిలి గ్రామం)ను రాజధానిగా చేసుకొని పాలిస్తుండేవారు. ఆ గ్రామానికి చెందిన ఏకుల వంశానికి చెందిన ఓ ముసలావిడ కట్టెల కోసం వెళ్లి అరణ్యంలో చిక్కుకుంది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్వామివారు ప్రకాశవంతమైన తేజస్సుతో దర్శనమిచ్చి కాపాడారు. మేము ఇక్కడ కొలువై ఉన్నామని, మాకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పమని సాక్షాత్తూ స్వామివారే ఆమెకు చెప్పారట. మరుసటి రోజు తెల్లవారు జామున రాజు కలలో కూడా సాక్షాత్కరించి ముదు సలి చెప్పి నట్లు చేయమని ఆజ్ఞాపించారు. ఉదయం ముదుసలి చెప్పినట్లుగా పుణ్యస్థలానికి చేరుకొని వెతికితే నీటిమడుగులో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కనిపించాయి. దేవాలయ నిర్మాణానికి ఆ రాజు 1200 ఎకరాల పంట భూమిని రాసిచ్చి భీష్మ ఏకాదశి రోజున స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి నేటికీ శ్రీరామచంద్రమూర్తి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. -
–8లో
బీమా డ్రామా..! కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసింది. బీమా ప్రీమియం చెల్లించిన రైతులకూ పలు కొర్రీలతో ధీమా లేకుండా చేస్తోంది.● విశిష్టతల సమాహారం రామతీర్థ క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతం బోడికొండగా వ్యవహారంలో ఉంది. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించినట్లుగా చిహ్నాలున్నాయి. పర్వత శిఖరాన కోదండరాముని ఆలయం, దాని పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ పేరుతో నీటికొలను ఉంది. ఈ నీటి మడుగు నుంచి పడమర దిశగా ఇరుకురాయి, దాని మధ్య నుంచి వెళితే భీముని బొర్ర చిహ్నం ఉంటుంది. అక్కడే భీముడు వంట చేయడానికి ఉపయోగించిన గాడి పొయ్యి కూడా ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి పిలిస్తే ఆ పిలుపు మూడుసార్లు ప్రతిధ్వనిస్తుంది. పాండవుల ఐదు పంచలు, సీతమ్మవారి పురిటి మంచం తదితర చిహ్నాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహలు ఉన్నాయి. చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళుతుంటారు. రామతీర్థం రామాలయంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మిదేవి, మాధ వస్వామి, భూభుజంగ వరహాలక్ష్మి స్వామి, ఆ ళ్వారుల సన్నిధి, శ్రీరామక్రతువు స్తంభం, సదాశివస్వామివార్ల ఉపాలయాలున్నాయి. నిర్విరామంగా ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. -
సర్వం సిద్ధం!
విజయనగరం టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రమైన మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలను డీఆర్వో శ్రీనివాసరావు, ఆర్డీఓ డి.కీర్తి, వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, డీటీ సంజీవ్ సోమవారం సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ● టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్కు ఏర్పాట్లు ● 5,223 మంది ఓటర్లకు 29 పోలింగ్ కేంద్రాలు ● ఎన్నికల నిర్వహణకు 150 మంది నియామకం ● సాధారణ ఎన్నికల్లా సాగిన ప్రచారం ● ‘గాదె’కే గెలుపు అవకాశాలు ● రెండో ఓటు అయినా వేయండని టీడీపీ నేతల ప్రలోభాలు ● బ్యాలెట్ ఓటు రహస్యమే సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార హోరుకు తెరపడింది. గురువారం జరిగే పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహించాల్సిన వివిధ కేడర్ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయ్యింది. విజయనగరం జిల్లాలో ఉన్న 5,223 మంది ఓటర్ల కోసం 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రొసీడింగ్ అధికారి, ఇద్దరు ఏపీవోలు, ఒక ఓపీవోతో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ను కేటాయించారు. గత కొద్దిరోజులుగా పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించారు. దాదాపు 150 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. గతి తప్పిన ప్రచారం.. శాసన మండలిలో మేధావి సభ్యులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈసారి గతి తప్పింది. పోటీల్లో ఉన్న ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం చూసి ఉపాధ్యాయ వర్గం ముక్కున వేలేసుకుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా రాజకీయ పార్టీల ప్రచారం చేయడం శాసన మండలి చరిత్రలో చూడలేదని ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమని పలువురు టీచర్లే ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలు, ఎంపీతోపాటు ప్రత్యేకించి నియోజకవర్గానికి రాజకీయ నాయకులను ఒక ఇన్చార్జిగా వేశారు. ప్రతీ విద్యాలయానికి వెళ్లి ప్రతి ఓటరును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘గాదె’కే గెలుపు అవకాశాలు! జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ గత కొద్దిరోజుల వరకు రసవత్తరంగా ఉండేది. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల ప్రచార శైలిని పరిశీలిస్తే... పోలింగ్ తేదీ దగ్గర పడిన కొద్ది పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కె.విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు మధ్య ద్విముఖంగా మారింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల ఓటింగ్ను పరిశీలిస్తే గెలుపు అభ్యర్ధులకు రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారింది. టీడీపీ ప్రకటించిన అభ్యర్ధి రఘువర్మపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్పష్టంగా కనిపించడంతో రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకు రావడం కష్టమే. గతంలో పోటీచేసినప్పుడు వచ్చినట్లే ఈసారి కూడా రెండో ప్రాధాన్యత ఓటు అధికంగా గాదె శ్రీనివాసుల నాయుడు తెచ్చుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో ఓటు కోసం టీడీపీ నేతల ప్రలోభాలు... టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రఘువర్మ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవలేమని ముందుగానే ఆ పార్టీ అధిష్టానం గ్రహించినట్లుంది. ఈ నేపఽథ్యంలో రెండో ఓటు అయినా వేయండని టీడీపీ నేతలు తమ ప్రచారాల్లో టీచర్లను ప్రలో భాలకు గురుచేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు నేరుగా వెళ్లి ప్రధానోపాధ్యాయుల చాంబరల్లోని సీటులో కూర్చొని స్థానిక ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసిన సంఘటనలు జిల్లాలో జరిగాయి. చివరికి వారి ఒత్తిడి తారస్థాయి చేరింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవులు స్థానిక మెనానిక్ టెంపుల్ సమావేశ మందిరంలో, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు స్థానిక క్షత్రియ కళాక్షేత్రంలో విందు భోజనాలు, అనంతరం తాయితాలు ఇచ్చి ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రలోభాలు పెట్టిన సంఘటనలు కనిపించాయి. బ్యాలెట్ ఓటు రహస్యమే... టీడీపీ నేతల ఒత్తిడి నేపథ్యంలో ఓటు స్వేచ్ఛపై ఉపాధ్యాయుల్లో పలు అనుమానాలు వస్తు న్నాయి. ఓటు ఎవరికి వేసిందీ తెలిసిపోతుందేమోనని ఉపాధ్యాయులు బయపడనవసరం లేదు. శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ నిబంధనలు మేరకు బ్యాలెట్ ఓటు కౌంటింగ్ సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. అన్ని పోలింగ్ బూత్ల ఓట్లను కలిపేసి ఒక డబ్బాలో వేసి కౌంటింగ్ చేస్తారు. ఓటు ఎక్కడ వేసిందో, ఎవరు వేసిందో తెలియదు. టీడీపీ నేతల ఒత్తిడికి భయపడి ఓటు హక్కు స్వేచ్ఛను కోల్పోవద్దని మేథావులు సూచిస్తున్నారు.పోలింగ్ గదుల పరిశీలన -
ఆధార్ కేంద్రం తనిఖీ
రాజాం: పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆధార్ కేంద్రాన్ని ఇన్చార్జి ఆర్ఐ అబ్బాసుతో పాటు వీఆర్వో శ్రీనివాసరావు మంగళవారం తనిఖీచేశారు. ఇక్కడ అనధికార వసూళ్లపై ‘ఆధార్ కేంద్రంలో అక్రమ వసూళ్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ ఎస్.కె.రాజు స్పందించారు. కేంద్రం పనితీరు, సేవల వివరాలు, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రూ.100లు కంటే అధికంగా నగదు వసూళ్లపై నిర్వాహకులతో మాట్లాడి హెచ్చరికలు జారీచేశారు. పలువురు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆధార్ కేంద్రాన్ని సక్రమంగా నడపాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. 27, 28 తేదీల్లో జీఎంఆర్ ఐటీలో స్టెప్కాన్ సదస్సు రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో ఈ నెల 27, 28 తేదీల్లో స్టెప్కాన్ 17వ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్న సుమారు 4వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య వినూత్న ఆలోచనలు, చురుకైన సృజనాత్మక చర్చలు, సమకాలీన ఆలోచనలకు సదస్సు వేదిక కానుందన్నారు. ఆర్ఆర్ఆర్ (రిలైజ్, రిఫైన్, రీడిఫైన్) అనే నినాదంతో 17వ సారి నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సును ఆంధ్రప్రదేశ్ మాజీ ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి ప్రారంభిస్తారన్నారు. ప్రాజెక్టు ఎక్స్పో, స్టార్టప్ ఇండియా కాంటెస్ట్తోపాటు పేపర్ ప్రజెంటేషన్, జీఎంఆర్ ప్రీమియర్ లీగ్ వంటివి ప్రధాన ఈవెంట్లు కానున్నాయని తెలిపారు. ప్రతి ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్లాగ్ షిప్ ఈవెంట్లుగా హ్యాక్హబ్, వెబ్ అస్త్ర, నావిగేషన్ చాలెంజ్, క్యాడ్మానియా, హైడ్రోహైక్ 2.0, రోబోరష్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి కన్వీనర్గా డాక్టర్ జె.శ్రీధర్, కో కన్వీనర్గా డాక్టర్ ఎం.సతీష్ వ్యవహరిస్తారని తెలిపారు. -
తల్లికి వందనం అందక.. తల్లికి తోడుగా
● ఆర్థిక ఇబ్బందులతో బడి బయట బాలికఈ చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు జ్యోతి. రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈమె పాఠశాలకు వెళ్లకుండా గాజులు, బొట్లు, తిలకం, చిన్నచిన్న క్లిప్లు తదితర మహిళలకు సంబంధించిన వస్తువులు గ్రామంలోని వీధుల్లో కేకలు వేస్తూ అమ్ముతూ కనిపించింది. ఏం తల్లి బడికి వెళ్లడం లేదా?చదువుతున్నావా? లేదా? అని సాక్షి ప్రశ్నించగా తాను స్థానిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నానని, తన తల్లి రోజూ ఈ వస్తువులు అమ్మేదని, ఆమెకు జ్వరం రావడంతో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తాను బడికి సెలవు పెట్టి అమ్ముతున్నానని చెప్పింది. వారు స్థానిక బైపాస్ రూట్ సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయం వెనుక గుడారాల్లో నివాసం ఉంటున్నారు. పాఠశాలకు పిల్లలు వస్తున్నారా? లేదా అన్న విషయం ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందజేసేది. అప్పుడు పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే వారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే ఇలా పిల్లలు బడికి వెళ్లకుండా చదువుకు దూరమవుతున్నారని ఆ వీధిలోని మహిళలు చర్చించుకోవడం విశేషం. – రామభద్రపురం -
27న అండర్–14 ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–14 బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ శిక్షకుడు డీవీ చారి ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులో గల విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలు పాల్గొనవచ్చన్నారు. ఆ రోజు జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విజయనగరం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 837473707 నంబర్ను సంప్రదించాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలుశిక్షదత్తిరాజేరు: పోక్సో కేసులో పెదమానాపురం గ్రామానికి చెందిన ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి మంగళవారం తీర్పు ఇచ్చినట్లు పెదమానాపురం ఎస్సై జయంతి తెలిపారు.ఎస్సై తెలిపిన ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి. పెదమానాపురం గ్రామానికి చెందిన యువకుడు మారోజు వెంకటేష్ అదే గ్రామానికి చెందిన బాలికకు ట్యూషన్ చెబుతూ ఏర్పడిన పరిచయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేర్వేరు ప్రాంతాలకు తీసుకువెళ్లి శారీకంగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ మేరకు 29.6.23న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ఫైల్ చేయగా విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి శిక్షపడినట్లు ఎస్సై తెలిపారు. -
బీమా పరిహారం అందజేత
పార్వతీపురంరూరల్: పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్శాఖలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కె.బుల్లిబాబు కుటుంబానికి పోలీసు శాలరీ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో భాగంగా తొలివిడతగా యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.38 లక్షల చెక్కును ఎస్పీ మాధవ్రెడ్డి మంగళవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా సిబ్బంది వేతనాలను పోలీసు శాలరీ ప్యాకేజీ స్కీమ్లో భాగంగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా పోలీసు సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు సంబంధిత బ్యాంకులు బీమా మొత్తాన్ని ఇన్సూరెన్స్గా అందజేస్తాయన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖాపరంగా మంజూరు చేసిన విడో ఫండ్ రూ.50వేలు చెక్కును కూడా మృతుడు బుల్లిబాబు కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే అనారోగ్యం కారణంగా మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ పోలిరాజుకు పోలీసుశాఖ పరంగా మంజూరు చేసిన రూ.25వేల చెక్కును కుటుంబసభ్యులకు ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం
పంటల బీమాకు సంబంధించి వరిపంటకు ఎకరాకు రూ.42 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి రూ.630 రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మినుము పంటకు ఎకరాకు రూ.20 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి ఎకరాకు రైతు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పెసర పంటలకు సంబంధించి ఎకరాకు రూ.20 వేలు వర్తిస్తుంది. దీనికి ప్రీమియం రైతు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంటకు సంబంధించి ఎకరాకి రూ. 540 చెల్లించాలి. దీనికి రూ.36 వేలు బీమా వర్తిస్తుంది. జీడి మామిడికి ఎకరాకు రూ.30 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి రైతు ప్రీమియం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. -
బీమా డ్రామా..!
● వివరాలు సరిగా లేవని కంపెనీ నుంచి రైతులకు మేసేజ్లు ● పంటల బీమా ఎగ్గొట్టే ప్రయత్నం ● రబీలో రెండు నెలల క్రితం ప్రీమియం చెల్లించిన రైతులు ● జిల్లాలో 12, 633 హెక్టార్లలో పంటలకు బీమా చెల్లింపు ● ప్రీమియం చెల్లించిన రైతులు 1,23,771 మందివిజయనగరం ఫోర్ట్: ‘‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సిరిపురపు తాతబాబు అనే రైతు పెసర పంటకు సంబంధించి 2024 డిసెంబర్ నెలలో బీమా ప్రీమియం చెల్లించాడు. తాజాగా భూమి వివరాలు, బ్యాంకు వివరాలకు వ్యత్యాసం ఉందని ఆ రైతుకు సోమవారం మెసేజ్ వచ్చింది. దీంతో రైతు ఉలిక్కి పడ్డాడు. బీమా ప్రీమియం చెల్లించిన రెండు నెలల తర్వాత పత్రాల్లో వ్యత్యాసం ఉందని మెసేజ్ రావడం ఏమిటని ఆందోళన చెందుతున్నాడు. అలాగే గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన లోకవరపు ఆదినారాయణ కూడా డిసెంబర్ 2024లో పెసర, మినుము పంటలకు బీమా ప్రీమియం చెల్లించాడు. ఆ రైతుకు కూడా రెండు రోజుల క్రితం భూమి వివరాలు, బ్యాంకు వివరాల్లో వ్యత్యాసం ఉందని మెసేజ్ వచ్చింది. ’’ ఇలా ఈ ఇద్దరు రైతులకే కాదు. వేలాది మంది రైతులకు ఈ విధంగా బీమా కంపెనీ నుంచి మెసేజ్లు రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడింది. దీంతో రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించారు. అయితే ఇప్పడు ఆ పంటల బీమాను కూడ ఎగ్గొట్టే ప్రయత్నం బీమా కంపెనీ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీల నుంచి రైతులకు వస్తున్న మెసేజేలే ఈ ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పంటల బీమా ప్రీమియం చెల్లిస్తే ఇప్పడు భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకుకు సంబంధించిన పత్రాల వ్యత్యాసం కారణంగా ఽబీమా దరఖాస్తును తిప్పి పంపనున్నట్లు మెసేజ్ రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గంట్యాడ మండలం పెదవేమలిలో సాగులో ఉన్న పెసర పంటరబీలో దెబ్బతిన్న అపరాల పంటలు 2024– 25 రబీసీజన్లో సాగు చేసిన అపరాల (పెసర, మినుము) పంటలు అప్పటల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు, బీమా కంపెనీ వారు బీమా చెల్లించాల్సి ఉంది. అయితే అధిక మొత్తంలో బీమా చెల్లించాల్సి వస్తుందనే నెపంతో కంపెనీ వారు బీమా చెల్లించే మొత్తం తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మెసేజ్లు పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బీమా ప్రీమియం దరఖాస్తులో వ్యత్యాసం ఉందని మెసేజ్లు పంపిస్తున్నారు. చాలా మంది రైతులు ఆ మెసేజ్లు చూసుకోరు. దీంతో పంటల బీమాకు వారు అర్హులు అయినప్పటికీ బీమా పొందలేరు. డబ్బులు కట్టాం..బీమా వస్తుందనే ధీమాలో రైతులు ఉంటారు. కానీ మెసేజ్కు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మీరు బీమాకు అనర్హులని కంపెనీవారు చెప్పే అవకాశం ఉందనే వాదనలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. మెసేజ్లు చూసుకోలేని వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది.బీమా ఎగ్గొటే ప్రయత్నమే రైతులు అపరాలకు బీమా ప్రీమియం చెల్లించి రెండు నెలలు అవుతోంది. ఇప్పడు భూమి వివరాలకు, బ్యాంకు వివరాలకు వ్యత్యాసం ఉందని మెసేజ్లు పెడుతున్నారు. చాలామంది రైతులు మెసేజ్లు చూడరు. అటువంటి వారిని అనర్హులుగా గుర్తించి బీమా ఎగ్గొంటేందుకు బీమా కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనిపై జాయింట్ కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశాం. – బుద్ధరాజు రాంబాబు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడుమెసేజ్ల విషయం తెలియదు పంటల బీమా పథకానికి సంబంధించి బీమా కంపెనీ నుంచి రైతులకు మెసేజ్లు వచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – వి. తారాకరామారావు, జిల్లా వ్యవసాయాధికారి -
భక్తులకు ఇబ్బందులు కలగరాదు
నెల్లిమర్ల రూరల్: శివరాత్రి ఉత్సవాలకు రామతీర్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ దాట్ల కీర్తి సూచించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తరాదని, భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి అధికారి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని క్యూల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని మున్సిపల్, నగర పంచాయతీ అధికారులకు సూచించారు. క్యూలో ఉన్న భక్తులకు మంచినీరు పంపిణీ చేయాలని, చిన్న పిల్లలను గుర్తించి పాలు అందజేయాలన్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలని కోరారు. అనంతరం దేవస్థానం సిబ్బందితో మాట్లాడి ఉత్సవాల విజయవంతానికి చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సుదర్శనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి రాతపరీక్ష ద్వారా 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతివరకు ఆంగ్లమాధ్యమంలో మిగిలి ఉన్న సీట్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ డీడీ కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీడబ్ల్యూఆర్ఎస్, పి.కోనవలస (బాలురు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 3 సీట్లు, 7వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఏపీటీడబ్ల్యూఆర్యుజేసీ, కురుపాం (బాలికలు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 2, 8వ తరగతిలో 2 సీట్లు ఉన్నాయి. ఏపీటీడబ్ల్యూఆర్ఎస్, భద్రగిరి (బాలురు) 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 6 సీట్లు, 7వ తరగతిలో 2, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 8 సీట్లు ఉన్నాయి. ఏపీటీడబ్ల్యూఆర్ఎస్, కొమరాడ (బాలురు) 5వ తరతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 4, 7వ తరగతిలో ఒకటి, 9వ తరగతిలో నాలుగు సీట్లు ఉన్నాయన్నారు. హెచ్టీటీపీఎస్://టీడబ్ల్యూఆర్ఇఐఎస్సెట్.ఏపీపీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 6న ఏపీటీడబ్ల్యూఆర్ (బాలుర) పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలికల) కురుపాం, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలుర) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్(బాలుర) కొమరాడ కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో వివరించారు. -
అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు
విజయనగరం: వినియోగదారులకు తూనిక ప్రకారం అందించాల్సిన నిత్యావసర వస్తువుల తూకంలో తేడా రావడంతో పాటు ప్యాకింగ్ ధరల కన్నా అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్న వ్యాపారస్తులపై తూనికలు కొలతలు శాఖ అధికారులు దాడులు నిర్వహించి పలు కేసులు నమోదు చేశారు. ఆ శాఖకు సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎం.దామోదరనాయుడు విజయనగరం రైల్వేస్టేషన్, బస్టాండ్ ఇతర చోట్ల పలు రకాల వ్యాపార సంస్థలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి మొత్తం 8 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడాన్ని గుర్తించి 3 కేసులు నమోదు చేశారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో సామాన్య ప్రయాణికుడిలా పలు దుకాణాల వద్ద శీతల పానీయాలు, తినుబండారాల ప్యాకెట్టు కొనుగోలు చేసి ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించినట్లు గుర్తించి వారిపై 5 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో మాట్లాడుతూ వినియోగదారులకు ముద్రించిన ధరకే ప్యాకెట్లు విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు మోసాల పట్ల పలు సూచనలు చేసి ఎవరైనా తూకంలో గాని, కొలతలో గానీ లేదా ప్యాకెట్లపై ముద్రించిన ధర కంటే అధికంగా విక్రయించినట్లు గుర్తిస్తే తమ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని బూశాయవలస గ్రామానికి చెందిన వ్యక్తి బస్సు ఢీకొనడంతో గాయపడి బాడంగి సీహెచ్సీలో సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మడక కృష్ణ(62)తన ఇంటికి వెళ్లిపోవడానికి సోమవారం సాయంత్రం జాతీయ రహదారి దాటుతుండగా విజయనగరం నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుడు మడక శ్రీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 48 గంటల పాటు మద్యం అమ్మకాలు బంద్పార్వతీపురంటౌన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేసినట్లు ఎకై ్సజ్ ఈఎస్ బి.శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని మద్యం దుకాణాలకు సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 53 మద్యం దుకాణాలు, 8 బార్లకు సీల్ వేశామన్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు కూడా వాటిని యూసివేయాలని ఆదేశించారు. మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ శివరాత్రి జాతర సందర్భంగా నెల్లిమర్ల–బొప్పడాం రహదారిలో పూర్తిస్థాయిలో నిఘా పెట్టామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మద్యం షాపులను మూసివేశామని, బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అక్రమంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు సాగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. పెద్దమనసు చాటుకున్న చిన్నారిమెరకముడిదాం: ఆ బాలుడు వయసులో చిన్నవాడే.. కానీ మనసు పెద్దదని చాటుకున్నాడు. మెరకముడిదాం జెడ్పీ ఉన్నతపాఠశాలలో ఆరురోజులుగా అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ శిక్షణ తరగతులకు హాజరైన భైరిపురం అంగన్వాడీ కార్యకర్త సుజాత తన చెవికి ఉన్న బంగారు చెవిదిద్దను పారేసుకున్నారు. అది ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆమె తోటి అంగన్వాడీ కర్యకర్తలతో కలిసి పాఠశాల పరిసరాలన్నీ వెతికినీ దొరకలేదు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఎంఈఓలకు, పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులకు అంగన్వాడీ కార్యకర్త సుజాత బంగారు చెవి దిద్దు పోగొట్టుకున్న విషయాన్ని తెలియజేసి ఎవరికై నా దొరికితే తీసుకువచ్చి అందజేయాలని చెప్పారు. కొద్దిసేవటి తరువాత పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న ఆరవతరగతి విద్యార్థి గంట్యాడ శ్యామ్ప్రసాద్కు ఆ చెవిదిద్దు కనిపించింది. దానిని వెంటనే తీసి పాఠశాల ఉపాధ్యాయులకు అందజేసి తన పెద్దమనసును చాటుకున్నాడు. శ్యామ్కుమార్ అందజేసిన చెవిదిద్దును ఎంఈఓ చంద్రశేఖర్ పాఠశాల హెచ్ఎం ఎల్లంనాయుడు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, లక్ష్మిల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త సుజాతకు అందజేశారు. అలాగే నిజాయితీగా తనకు దొరికిన బంగారు చెవిదిద్దును తిరిగి అందజేసిన శ్యామ్కుమార్ను ఎంఈఓలు చంద్రశేఖర్ పాఠశాల ఉపాద్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది అభినందించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు. -
ఉత్తమ రైతుగా శ్రీనివాసరావు
గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన కురుమునెల్లి శ్రీనివాసరావు జిల్లా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. నాగపూర్లో ఆదివారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో తను పండించిన పంటలను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయంలో పద్మశ్రీ సాధించిన సీవీ రెడ్డి, భూషణ్త్యాగి, ప్రకృతి వ్యవసాయం రీజినల్ డైరెక్టర్ రాజ్పూత్ చేతులు మీదుగా సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకర పంటలు పండించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో జిల్లా ఉత్తమ రైతుగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. -
జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు
విజయనగరం ఫోర్ట్: పంటల దిగుబడి పెంచడం, నాణ్యమైన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, సేంద్రియ సాగును ప్రోత్సహించడం, మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, రుణసాయం అందించి ప్రోత్సహించడం కోసం జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. క్లస్టర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తన చాంబర్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించారు. దత్తిరాజేరులోని పోరలి, సరేవలస, టి.బూర్జవలస, గడసాం గ్రామాలను ఒక క్లస్టర్గాను, రామభద్రపురం గ్రామాన్ని ఒక క్లస్టర్గా ఎంపిక చేశామన్నారు. దత్తిరాజేరు క్లస్టర్లో 283 కుటుంబాలు, రామభద్రపరం క్లస్టర్లో 290 కుటుంబాలు ఉన్నాయన్నారు. మూడేళ్లలో రూ.40 లక్షల వ్యయంతో క్లస్టర్ పరిధిలోని రైతు లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సహాయాన్ని అందించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖల వారీగా సమగ్ర ప్రణాళికను రుపొందించాలన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, డీఆర్డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
సాంకేతిక సామర్థ్యాల పెంపునకు ‘పాల్ ల్యాబ్’
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించేందుకు పాల్ల్యాబ్లు దోహదపడతాయని రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మాధవీలత, ధనలక్ష్మి అన్నారు. జిల్లాకు కొత్తగా పాల్ ల్యాబ్లు మంజూరైన పాఠశాల ప్రిన్సిపాల్/ ప్రధానోపాధ్యాయులు, మేథ్స్, లాంగ్వేజ్ సబ్జెక్టు టీచర్లకు కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలను విద్యార్థులకు బోధించాలన్నారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రయోగశాలల నిర్వహణ, ట్యాబ్ల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఎస్ఎస్ఏ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధన సాగించాలన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎస్ ఏపీఓ గోపీచంద్, ఏఎస్ఓలు సూర్యారావు, సీహెచ్జగన్మోహన్, ఏపీఓ డీఈఓ ఆఫీస్ విశేశ్వరరావు, పార్వ తీపురం మన్యం జిల్లా ఏఎస్ఓ వి.కిరణ్కుమార్ పాల్గొన్నారు. రీసోర్స్ పర్సన్గా కాన్విజేషన్ టీప్ ప్రతినిధులు రూపేష్, రమేష్లు వ్యవహరించారు. శిక్షణలో 116 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మాధవీలత, ధనలక్ష్మి -
ఏం తెస్తారో చూడాలి!
బడ్జెట్లో.. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కూటమి ప్రజాప్రతినిధులు బడ్జెట్లో ఏం తెస్తారో చూడాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సూపర్ సిక్స్ సహా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క గ్యాస్ సిలెండర్ మినహా గత తొమ్మిది నెలల పాలనలో మరేదీ అమలుచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే స్వల్ప కాలంలోనే ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దాని ప్రభావం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. విజయనగరం ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలలో గట్టెక్కడానికి అమలు సాధ్యం కానీ హమీలు గుప్పించి... తీరా అధికారం దక్కించుకున్నాక కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమ పాలన గాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పాలన సాగిస్తోందని విమర్శించారు. పీపీపీ ముసుగులో చివరకు సాగునీటి కాల్వల సహా ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్అండ్బీ రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని, టోల్ గేట్లు పెట్టి సామాన్య ప్రజల నడ్డివిరిచేస్తారని చెప్పారు. తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చుచేస్తున్నారు? కేవలం 10 నెలల పాలనా కాలంలోనే లక్షా10 వేల కోట్ల రూపాయల అప్పుచేసిన కూటమి ప్రభుత్వం... ఆ మొత్తాన్ని ఒక్క సంక్షేమ కార్యక్రమానికీ కేటాయించని వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు స్థానిక పాలకులు ఎంతమేర సాధించుకొస్తారో చూస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కేంద్రం నుంచి అనుమతులు తెచ్చిందని, నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించిందని, ఎన్నికల సమయానికి 30 శాతం మేర పనులు పూర్తయ్యాయని జెడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. అంతా తామే చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతోందని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జల్జీవన్ మిషన్ పథకంలో ఎన్ని కుళాయిలు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, కొప్పులవెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, గంట్యాడ జెడ్పీటీసీ నరసింహమూర్తి పాల్గొన్నారు. నిరుద్యోగులపై లాఠీచార్జి అమానుషం... భోగాపురం ఘనత వైఎస్సార్సీపీదే... నిర్వీర్యం చేసిన ఘనత కూటమిదే... సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీతో యువతకు లక్షల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ హమీలు గుప్పించిన కూటమి నేతలు... గడిచిన పది నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రోస్టర్ విధానాన్ని సరి చేసిన తరువాతనే గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జీ చేయించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒకలా, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకలా, విద్యాశాఖ మంత్రి మరోలా ప్రకటనలిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు. వారిని నమ్మి పరీక్ష వాయిదా పడుతుందనుకున్నవారంతా తీవ్రంగా నష్టపోయారని, పరీక్షలకు హాజరుశాతం బాగా తగ్గిపోయిందని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గ్రామస్థాయిలో ప్రారంభించిన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను ఇప్పుడు నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా సేవలు రైతులకు దూరమయ్యాయని చెప్పారు. ఎరువులు, విత్తనాలకు ఇష్టానుసారం ధర పెంచేసి ప్రైవేటు వ్యాపారస్తులు వారిని గుల్ల చేస్తున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అటకెక్కించి రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఇక కొత్త పింఛన్లు కోసం అర్హులైన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయని చెప్పారు. వికలాంగుల పింఛన్లలో అనర్హుల ఏరివేత పేరుతో దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లి అవయవలోపాన్ని నిర్ధారించుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు. -
ఆధార్ కేంద్రంలో అక్రమ వసూళ్లు!
రాజాం: రాజాం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ఆధార్ సెంటర్లో అధిక మొత్తంలో వసూళ్లపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్లో సవరణలు, చేర్పులు, మార్పు లు, యాక్టివేషన్, జనరేషన్, కొత్త ఆధార్ కార్డుల మంజూరు తదితర సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.50లు తీసుకోవాల్సిన సేవకు రూ.150 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రశ్నించిన వారికి సేవలు అందించడంలేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ ఎస్.కె.రాజు వద్ద ప్రస్తావించగా రాజాం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రాన్ని పరిశీలిస్తామని, అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆపరేషన్ ద్రోణగిరికి విజయనగరం ఎంపిక
విజయనగరం అర్బన్: ఆపరేషన్ ద్రోణగిరి పేరుతో జియో స్పేషియల్ డేటా ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ (జీడీపీడీసీ) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాజెక్టుకు విజయనగరం ఎంపికై ందని జేసీ సేతుమాధవన్ తెలిపారు. దేశంలోని 5 రాష్ట్రాల్లోని ఐదు జిల్లాలు ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయగా, అందు లో ఏపీ నుంచి విజయనగరం జిల్లా ఒకటని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జీడీపీడీసీ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, రవాణా, అటవీ, డీఆర్డీఏ, డ్వామా, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జలవనరులు తదితర శాఖల వద్ద ఉన్న డేటాతో ఆయా శాఖల్లోని పలు అంశాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. జీడీపీడీసీ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి మాట్లాడుతూ ప్రాజెక్టు అమలు రోడ్మ్యాప్ను రూపొందించేందుకు కీలక వాటాదారులను ఒకచోట చేర్చామన్నారు. వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాల కోసం భౌగోళిక డేటా పరిష్కారాలను పెంచడమే ఆపరేషన్ ద్రోణగిరి లక్ష్యమన్నారు. నిజ సమయ వ్యవసాయ పర్యవేక్షణ, సలహాలతో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, కృత్రిమ మేధా శక్తితో కూడిన ఆప్టిమైజేషన్ ప్లీట్ ట్రాకింగ్ ఉపయోగించి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణ ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి పరిష్కారాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ నోడల్ జియోస్పేషియల్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ (జీఐఏ)గా ఐఐటీ తిరుపతి కీలక పాత్ర వహిస్తోందన్నారు. విజయనగరం జిల్లా భారతదేశంలో భౌగోళిక నాయకత్వ అభివృద్ధికి నమూనాగా మారుతుందన్నారు. జీవన భృతులు పెంపొందించేందుకు, ఆర్థిక, సాంకేతిక పరమైన అభివృద్ధికి ఈ అధ్యయనం ఉపకరిస్తుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో రైతులకు కచ్చితమైన సమాచారం లేకపోడం వల్ల నష్టపోతున్నారని, అలాంటి సమాచారాన్ని వాస్తవ సమయంలో ఇచ్చినట్లు చూడాలని కోరారు. సన్న, చిన్నకారు రైతులకు మార్కెట్లో జోక్యం, ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచాలన్నారు. అంతకుముందు కమిటీ ప్రతినిధులు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు ఐఐటీ సంస్థలు, కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్లో వర్క్షాప్ సాంకేతిక సమస్యలకు పరిష్కారం: జేసీ సేతుమాధవన్ -
భోజనం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజనంలో నాణ్యత, పరిమాణం తగ్గుతుందనే అంశంపై ‘మనసులోనే మధనపడుతూ..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు అందించిన భోజనాన్ని సంబంధిత ఆస్పత్రి మిత్రలు సోమవారం పరిశీలించారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు పరిశీలించారు. 550 క్యూసెక్కుల సాగునీరు సరఫరా వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువల నుంచి 550 క్యూసెక్కుల సాగునీటిని ఆయకట్టుకు సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో 10వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు వీలుగా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హుండీల ఆదాయం రూ.2,29,121లు చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 2025 జనవరి 3 నుంచి 2025 ఫిబ్రవరి 24 వరకు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకుల రూపంలో రూ.2,29,121ల ఆదాయం వచ్చినట్టు కోటమ్మ అమ్మవారి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, కానిస్టేబుల్ ఎం.సరస్వతి పాల్గొన్నారు. షాపు చిన్నది.. బిల్లు పెద్దది గరుగుబిల్లి: చిన్న షాపుకు పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో వినియోగదారుడు బెంబేలెత్తిపోతున్నాడు. గరుగుబిల్లి మండల కేంద్రంలో మధుసూదనరావు నిర్వహిస్తున్న మెడికల్ షాపుకు జనవరి నెలకు 38 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.16,579లు, ఫిబ్రవరి నెలలోనూ అదే మొత్తంలో యూనిట్ల వినియోగానికి రూ.8,265లు విద్యుత్ బిల్లు వచ్చింది. మండల విద్యుత్శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బిల్లును సరిచేస్తామని చెప్పారని షాపు నిర్వాహకుడు తెలిపారు. గూడ్స్ రైలులో పొగలు కొమరాడ: రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న గూడ్స్రైలు నుంచి పొగలు వ్యాప్తి చెందాయి. గుమడ రైల్వేస్టేషన్కు రాగానే 17 నంబర్ వ్యాగన్ నుంచి పొగలు ఒక్కసారిగా రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలును నిలిపి పార్వతీపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళం పొగను అదుపుచేశారు. ప్రమాదమేమీ లేదని, ఘటన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం...
సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డికి అపూర్వ ఆదరణ లభించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నాయకుడికి బ్రహ్మరథం పట్టారని వివరించారు. రాాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గుంటూరు మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ఆయనకు భద్రత కల్పించకుండా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
ఏసీబీకి చిక్కిన కమిషనర్
పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగరపంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ పట్టణం సీతంపేట రోడ్డులోని కోటదుర్గ నర్సింగ్హోమ్లో 2017లో పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలైన గర్భిణి ప్రసవించారు. ఆ బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆస్పత్రి నుంచి నగరపంచాయతీ కార్యాలయానికి దరఖాస్తు చేయగా జనన ధ్రువపత్రం మంజూరు చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రసవతేదీకి విరుద్ధంగా నర్సింగ్హోమ్ డాక్టర్ రౌతుభారతి నమోదుచేశారంటూ మరో ఉపాధ్యాయురాలు నగరపంచాయతీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన పంచాయతీ అధికారులు తప్పును నిర్ధారించి జననధ్రువీకరణ పత్రం రద్దుచేశారు. వైద్యురాలితో రూ.500 ఫైన్ కట్టించారు. సరిచేసి ఇవ్వాలంటూ ఉపాధ్యాయురాలితో మళ్లీ దరఖాస్తు చేయించారు. చర్యలు తీసుకోకుండా ఫైన్తో సరిపెట్టేశారంటూ ఫిర్యాదుదారు ఆర్టీఐ కమిషన్ను ఆశ్రయించారు. దీనిని అవకాశంగా మార్చుకున్న కమిషనర్... ఆర్టీఐ కమిషన్ వద్దకు వెళ్లాలంటే రూ.30 వేలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం చెల్లించాలని వైద్యురాలు భారతిని డిమాండ్ చేశారు. ఆమె రూ.20వేలు చెల్లించేందుకు అంగీకరించి, విషయం ఏసీబీ అధికారులకు చేరవేశారు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో నర్సింగ్ హోమ్కు కమిషనర్ తన డ్రైవర్ రాజును పంపించారు. అప్పటికే రూ.20వేల మొత్తానికి రంగుపూసిన 40 నోట్లును రాజుకు ఆమె అందజేశారు. అక్కడే మాటువేసి ఏసీబీ అధికారులు రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించడంతో కమిషనర్ తీసుకోమని చెప్పారని తెలిపాడు. ఆయనకు గట్టిగా హెచ్చరించి ఆ డబ్బుతో కమిషనర్ ఇంటి వద్దకు చేరుకుని రాజును లోపలకు పంపించారు. రాజు చేతిలో ఉన్న డబ్బులు కమిషనర్కు అందించగానే ఏసీబీ అధికారులు దాడిచేసి కమిషనర్ను అరెస్టు చేశారు. అక్కడ నుంచి కమిషనర్ను నగర పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి రెండు గంటల పాటు విచారణ జరిపారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు కె.భాస్కరరావు, ఎస్.వి.రమణ, ఎస్ఐలు డి.సత్యారావు, కె.వాసునారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. రూ 20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
ఉత్సాహంగా చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓపెనింగ్ స్థాయి చదరంగం పోటీలకు అనూహ్యస్పందన లభించింది. భోగేశ్వరరావు–ఝాన్సీరాణి మెమోరియల్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు స్థానిక రింగ్రోడ్డులో ఉన్న ఫైర్ చెస్ స్కూల్లో ఆంధ్రా చెస్ అసోసియేషన్ సీఈఓ కేవీ. జ్వాలాముఖి పర్యవేక్షణలో జరిగాయి. ఈ పోటీలలో ఐదు జిల్లాల నుంచి దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా జె. నాగరాజు, బి.శ్రావ్యశ్రీ, బి.సాకేత్ నిలిచారు. వారికి నిర్వాహకులు నగదు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫైర్ చెస్ స్కూల్ సిబ్బంది పి. అర్చన, ఎన్.పద్మ, ఎ.దామోదర రావు పాల్గొన్నారు.నాలుగు ఆవుల అపహరణదత్తిరాజేరు: మండలంలోని తాడెందొరవలస కళ్లాల్లో ఉన్న నాలుగు ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున అపహరించినట్లు సర్పంచ్ పూడి తిరుపతిరావు తెలిపారు. గ్రామంలోని సుంకరి గోవిందమ్మకు చెందిన మూడు ఆవులు, తమటాడ రాముకు చెందిన ఒక ఆవును గుర్తు బొలెరో వ్యాన్లో వచ్చి తరలించుకుని వెళ్లి పోయినట్లు అక్కడ అడుగులను బట్టి తెలుస్తోందని ఈ విషయమై ఎస్ బూర్జవలస పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించినట్లు సర్పంచ్ చెప్పారు. సారా స్థావరాలపై దాడులు● 60 లీటర్ల సారా, 95 ప్యాకెట్లు స్వాధీనం పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలోని పాత రెల్లివీధిలో ముందస్తు సమాచారం మేరకు సారా స్థావరాలపై పట్టణ సీఐ కె.మురళీధర్ ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు నిర్వహించారు. పాత రెల్లివీధిలో రెండుచోట్ల దాడులు నిర్వహించగా కోలబుట్టమ్మ అనే మహిళ ఇంట్లో 60లీటర్ల సారా అలాగే కోల రవికుమార్ అనే వ్యక్తి ఇంట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న 95 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. -
ఆరోగ్యకరమైన ఆహారం చిరుధాన్యాలతో సాధ్యం
విజయనగరం అర్బన్: ఆరోగ్యరమైన ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు కీలకంగా నిలుస్తాయని అందుకే వాటితో తయారైన ఆహారాన్ని సూపర్ ఫుడ్గా పిలుస్తారని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణి అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక కేంద్రియ గిరిజన యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంగణంలో ‘మిల్లెట్స్ క్వెస్ట్ 2025: బిల్డింగ్ రెసిలెన్స్, ఫీడింగ్ ది వరల్ట్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే సెమినార్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో వివరించారు. 21వ శతాబ్దంలో మిల్లెట్ల వినియోగం, సంరక్షణ ప్రాముఖ్యత, ఆవశ్యకతను వెలుగులోకి తీసుకురావడం ఈ సెమినార్ ఉద్దేశమని తెలపారు. ఆరోగ్యకరమైన ఆహారం చిరుధాన్యాల ద్వారా అందుతుందని దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వాటిని పండించే రైతును ప్రోత్సహించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సి.తారాసత్యవతి హాజరవగా రీసోర్స్ పర్సన్లుగా పర్యావరణవేత్త ప్రకృతివనం ప్రసాద్, మధ్యప్రదేశ్కు చెందిన మిల్లెట్స్ రాయబారి లహరిబాయి, గిరిజన రైతు పడాల భూదేవి, నారీశక్తి పురస్కార్, ఒడిశాలోని కోరాపుట్ మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియా రైమతి ఘియురియా హాజరయ్యారు. అనంతరం ముఖ్యఅతిథులను వీసీ ప్రొఫెసర్ కట్టిమణి ఘనంగా సత్కరించారు. గిరిజన అధ్యయన విభాగాధిపతి డాక్టర్ అనిరుధ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి వర్సిటీలో మిల్లెట్ రెసిలెన్స్ సదస్సు ప్రారంభం -
ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర
పార్వతీపురంటౌన్: స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర అని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందనన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకు సీల్డ్ కవర్లో అందించాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. దీనికోసం నియమించిన పరిశీలకులు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షించవలసి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా చూడడమే కాకుండా, ఉల్లంఘన జరిగితే, ఆ సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రతి పరిశీలకుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను తు,చ తప్పక పాటించాలని, అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన చేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో సూక్ష్మ పరిశీలకుల విధులు, బాధ్యతలపై మెటీరియల్ ఇప్పటికే అందజేశామన్నారు. దాన్ని క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవా లని సూచించారు. ఎన్నికల ముందు రోజు నుంచే సమర్థవంతంగా విధులను నిర్వర్తిస్తూ, విజయవంతం చేయాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి హేమలత -
సర్వం సిద్ధం
బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయశాఖతో పాటు ఇతర శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశాయి. తాగునీరు, విశ్రాంతి షెల్టర్లు, ప్రత్యేక క్యూలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాదిలా ఈ సారి కూడా సుమారు లక్షకు పైగా భక్తులు రావచ్చునని పోలీస్, దేవాదాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి 30 ఆర్టీసీ బస్సులు, విజయనగరం నుంచి 40 ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. -
గిరిశిఖర గ్రామాల్లో నిలిచిన పనులు
సాలూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో మంజూరైన రోడ్ల పనులు నిలిచిపోయాయని పాచిపెంట మండలం కేరంగి, మిలియాకంచూరు తదితర పంచాయతీల సర్పంచ్లు వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు రాజన్నదొరను సాలూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో మీరు మంజూరుచేసిన కొండమోసూరు నుంచి అల్లంపాడు రోడ్డు, కేరంగి రోడ్డు జంక్షన్ నుంచి దొరలుద్దంగి రోడ్డు పనులు నేటికి ప్రారంభం కాలేదన్నారు. అంతేకాకుండా సర్పంచ్లైన తమకు తెలియకుండా తమ పంచాయతీల్లో పనులు చేపట్టడానికి కొంతమంది కాంట్రాక్టర్లు వస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వాపోయారు. ఈ మేరకు రాజన్నదొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, స్థానిక సర్పంచ్లకు తెలియకుండా పనులు చేపట్టరాదని,సర్పంచ్ల హక్కులకు భంగం కలిగితే అండగా తాను ఎప్పుడూ ఉంటానని స్పష్టంచేశారు. మాజీ డిప్యూటీ సీఎం వద్ద వాపోయిన గిరిజన సర్పంచ్లు -
విధి నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యం
విజయనగరం క్రైమ్: శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్శాఖకు అత్యంత ముఖ్యమైనదని అందులోనూ ఆర్మ్డ్ రిజర్వ్కు కీలకమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం ఏఆర్ సిబ్బంది 14 రోజుల మొబిలైజేషన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ముందుగా ఏఆర్సిబ్బంది పరేడ్ను తిలకించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ కీలకమన్నారు. నిరంతరం వెపన్స్తోనే సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి దృష్టి పోలీస్శాఖపైనే ఉంటుందని, ప్రజలు అను నిత్యం మన తీరును గమనిస్తూ ఉంటారని, అందుకు పోలీసులు మార్గదర్శకంగా ఉండాలని ఎస్పీ హితవు పలికారు. విధి నిర్వహణలో క్రమ శిక్షణ ఎంతో అవసరమన్నారు. దాన్ని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఏఆర్ సిబ్బందే కీలక పాత్ర పోషిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఈ పునశ్చరణ తరగతులలో వీఐపీల భద్రత, పైరింగ్, మాబ్ ఆపరేషన్, వ్యక్తిత్వ వికాసం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలాగే అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం, రైట్ గేర్ ఆపరేషన్, యోగా వంటి అంశాల్లో ఏఆర్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో పరేడ్ కమాండర్గా ఆర్ఎస్సై గోపాలనాయుడు వ్యవహరించగా సిబ్బంది పరేడ్ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ వీరకుమార్, ఆర్ఎస్సైలు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, రూరల్ సీఐ లక్ష్మణరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్ పునశ్చరణ ముగింపు వేడుకల్లో ఎస్పీ వకుల్ జిందల్ -
జాగరణకు వేళాయె..!
రామతీర్థంలో ఏర్పాట్ల పరిశీలనభక్తులకు ఇబ్బందులు కలగకుండా... జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కూలో ఉండే చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు సరఫరా చేస్తాం. ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ దష్ట్యా బారికేడ్లను ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి వీఐపీ పాస్లు జారీ చేయలేదు. జాతర విజయవంతానికి అన్ని శాఖల సహకారం కోరాం. బోడికొండపైకి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించి దేవస్థానానికి సహకరించాలి. – శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానంప్రత్యేక ఆకర్షణగా పర్వతంపై శిఖరదీపం శివరాత్రి పర్వదినాన తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని పర్వతంపై మూడు రోజుల పాటు ఏ విధంగా శిఖరజ్యోతిని వెలిగిస్తారో..రామతీర్థం బోడికొండపై కూడా గడిచిన ఐదేళ్ల నుంచి శిఖర జ్యోతిని వెలిగిస్తున్నారు. ఏటా శిఖర జ్యోతి ప్రజ్వలన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శిఖరజ్యోతిని వెలిగించేందుకు అవసరమైన వనరులను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తమ సొంత నిధులతో సమకూర్చారు. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ప్రత్యేక పూజల నడుమ శిఖర జ్యోతిని వెలిగిస్తారు.నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలో అతి పెద్ద పుణ్యక్షేత్రం రామతీర్థం. మూడు జిల్లాల భక్తుల అపార నమ్మకం రామక్షేత్రం. వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కినా ప్రతి ఏటా జరుగుతున్న శివరాత్రి జాతరే రామక్షేత్రానికి ప్రత్యేకం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరుగుతున్నప్పటికీ హాజరైన భక్తుల సంఖ్య అంతంత మాత్రమే. కానీ శివరాత్రికి రెండు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకు మాత్రం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా రామక్షేత్రానికి విచ్చేస్తారు. తొలి రోజు రాత్రంతా స్వామివారి క్షేత్రంలో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో జాగరం ఉంటారు. మరుసటి రోజు ఉదయం రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా శ్రీరాముడిని అనంతరం క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేవాదాయ శాఖ ఏర్పాట్లు భక్తులకు రామతీర్థం ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50, అలాగే ఉమాసదాశివ ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50గా కల్పిస్తున్నారు. భక్తుల కోసం 25వేల లడ్డూ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేశారు. అలాగే ఎండ తీవ్రతను దష్టిలో పెట్టుకుని చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్యూలలో తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే దేవస్థానానికి విద్యుత్ వెలుగుల అలంకరణ పూర్తయింది. శివాలయం, ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గంలోనూ ట్యూబ్లైట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేశఖండన శాల వద్ద తోపులాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. కొండవెలగాడ, సతివాడ పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించనున్నారు. రామతీర్థానికి ఇలా చేరుకోవాలి జిల్లా కేంద్రం విజయనగరానికి 13కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండగా నెల్లిమర్లకు తూర్పుదిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం–శ్రీకాకుళం వయా నెల్లిమర్ల రహదారిలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి విజయనగరం కోట నుంచి నేరుగా ప్రై వేట్ వాహనాలు ఉంటాయి. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చిన భక్తులు రణస్థలం మార్కెట్ వద్ద దిగి సతివాడ–నెల్లిమర్ల వాహనాలను ఆశ్రయించవచ్చు. రణస్థలం నుంచి రామతీర్థం 18కిలోమీటర్ల దూరం వస్తుంది. జాతర సందర్భంగా విజయనగరం, రణస్థలం నుంచి ప్రతి పది నిముషాలకు ఒక బస్సు ప్రయాణికులకు సేవలందిస్తుంది. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ముందుగా సీతారామస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. విజయనగరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు కల్యాణ మంటపం ప్రాంగణంలో, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ప్రాథమిక పాఠశాల వద్ద పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్ కోసం సీతారామునిపేట, దన్నానపేట జంక్షన్ల వద్ద ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రామాలయం, శివాలయంతో పాటు రామకోనేరు, ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద మూవింగ్ పార్టీలుగా బందోబస్తును విభజించామని, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, దొంగతనాలు, ఈవ్టిజింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మఫ్టీలో సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, ఎస్ఐ గణేష్, ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పటిష్ట పోలీస్ బందోబస్తు
మహాశివరాత్రి జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. అల్లరు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. ఐదుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 54 మంది ఏఎస్సైలు, హెచ్సీలు, 94 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఆరుగురు హోంగార్డులు, ఎస్టీఎఫ్, మూడు రోప్ పార్టీలతో జాతర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. – వకుల్ జిందల్, ఎస్పీ, విజయనగరం● -
బైక్, వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద సోమవారం వ్యాన్, ద్విచక్రవాహనం ఢీ కొనగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండకెంగువ గ్రామానికి చెందిన బెవర లక్ష్మణ(40),బెవర కృష్ణ,బెవర గురుమూర్తి కలిసి వారి కళ్లం నుంచి ఆవుపాలు పట్టుకుని ద్విచక్రవాహనంపై గ్రామంలోకి వెళ్తున్నారు. ఇంతలో అదే గ్రామం నుంచి రామభద్రపురం వైపు వస్తున్న వ్యాన్ వారి బైక్ను ఢీ కొట్టింది. దీంతో లక్ష్మణకు, తమ్ముడు కృష్ణకు తీవ్రగాయాలవగా గురుమూర్తికి స్వల్పగాయమైంది. స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం ముగ్గురిని రామభద్రపురం పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాడంగి సీహెచ్సీకి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో లక్ష్మణ చికిత్స పొంందుతూ మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద విషయాలు తెలుసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లక్ష్మణకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోక్సో కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షతెర్లాం: పోక్సో కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి సోమవారం తీర్పు వెలువరించినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తమ్మయ్యవలస గ్రామానికి చెందిన బొమ్మాళి అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. ఆ యువతి పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించడంతో 2019లో తెర్లాం పోలీస్స్టేషన్లో అనిల్పై పోక్సో కేసు నమోదైంది. దీనిపై అప్పటి తెర్లాం ఎస్సై నవీన్పడాల్ కేసు నమోదు చేయగా, బొబ్బిలి రూరల్ సీఐ బీఎండీ ప్రసాద్ కేసు దర్యాప్తు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించారు. రెండు కేసుల్లో ఇద్దరికి 6 నెలల జైలుశిక్షగంట్యాడ: రెండు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఎస్సై సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం 2018వ సంవత్సరంలో మండలంలోని లక్కిడాం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న మహిళను అడ్డగించి మెడలో రెండున్నర తులాల పుస్తెలతాడును లాక్కుపోయిన కేసులో, జగ్గాపురంలో రాత్రి ఇంట్లో ప్రవేశించి పుస్తెలతాడు దొంగలించిన కేసులో గుమ్మడి సురేష్, కోమటిపల్లి శ్రీను అనే వ్యక్తులకు విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ బుజ్జి పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషిన్ తరఫున శాంతిగౌతమి వాదించారు. రేకులషెడ్డు కూల్చివేతలో ఇరువర్గాలపై కేసుబొండపల్లి: మండలంలోని గొల్లలపేట గ్రా మంలో రేకుల షెడ్డు కూల్చివేసిన ఘటనకు సంబంధించి ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. ఈనెల 22 శనివారం గ్రామానికి చెందిన పీతల గుర్రయ్య రేకుల షెడ్డును గ్రామానికి చెందిన పీతల రాము కూల్చివేసినట్లు ఫిర్యాదు చేయగా..తాము కూల్చివేయలేదని గుర్రయ్యపై రాము ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాబోధన
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది మార్చి నెలలో జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కష్టపడి పనిచేస్తున్నారని గురుకులాల కో ఆర్డినేటర్ ఎస్ రూపవతి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని సోమవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి మంచిఫలితాలు సాధించాలని కోరారు. జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరం పరీక్షలకు టెన్త్లో 360 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 287 మంది, రెండవ సంవత్సరం పరీక్షలకు 223 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఏడాది అన్ని గురు కులాల్లో ప్రణాళికాబద్ధంగా విద్యను భోదిస్తున్నారన్నారు. అనంతరం జోగింపేట పాఠశాలలో వంటశాలను, వంటలను, మైదానాన్ని, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ రూపవతిని ప్రిన్సిపాల్ మధుబాబు, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జేవీఎస్ మధు, సీనియర్ అధ్యాపకుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రూపవతి -
రాష్ట్రంలో చంద్రన్న పగ, దగా పథకాలే..
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో చంద్రన్న పగ.. చంద్రన్న దగా సంక్షేమ పథకాలే అమలవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపానపోలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని పేర్కొన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకు పురిటి గడ్డలాంటిదని, ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తే.. సాధించేవరకూ పట్టువదలరని కొనియాడారు. అలాంటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసేందుకు అన్నివిధాలా తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి కృషి చేశారన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వారిచ్చిన ప్రతి హామీని అమలుచేసేలా ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. కూటమి 8 నెలల పాలనలో రూ.లక్షా 20 వేల కోట్లు అప్పు చేసిన సీఎం చంద్రబాబు.. ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కన్నా వైఎస్ జగన్ సేన స్ట్రాంగ్గా ఉందని, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది మంది కార్యకర్తలు, ప్రజలు, అభిమానులున్నారన్నారు. వైఎస్ జగన్ అంటే ఒక శక్తి.. ఆయన చా లా స్ట్రాంగ్ అని స్పష్టం చేశారు. ప్రజలే మా బలమన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఒకరిద్దరు వెళ్లినంత మాత్రానా ఎటువంటి నష్టం లేదన్నారు. గ్రూప్–2 అభ్యర్థుల యువగళం చూశాం ఎన్నికలకు ముందు లోకేష్ యువగళమంటూ తిరిగాడు.. అసలు సిసలైన యువగళం విశాఖ కేంద్రంగా గ్రూప్–2 అభ్యర్థులు చేశారని కన్నబాబు అన్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేస్తామంటూ నమ్మించి అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగులనే కాదు.. మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజరాణి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్కు మార్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, పీవీ సురేష్, సాడి పద్మా రెడ్డి, ఇమ్రాన్, ముఖ్యనేతలు కోలా గురువులు, రొంగల జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, మొ ల్లి అప్పారావు, రవిరెడ్డి, పేర్ల విజయచందర్, కాయల వెంకటరెడ్డి, పేడాడ రమణికుమారి, మారుతీప్రసాద్, బోని శివరామకృష్ణ, శ్రీదేవి వర్మ, మాధవివర్మ, పీలా వెంకటలక్ష్మి, కాళిదాస్రెడ్డి, సనపల రవీంద్ర భరత్, అల్లంపల్లి రాజుబాబు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది గ్రూప్–2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారు వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా కన్నబాబు బాధ్యతల స్వీకరణ -
మనసులోనే.. మధనపడుతూ...!
వారంతా ఆరోగ్యశ్రీ రోగులు.. నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి పలు ఆస్పత్రుల్లో లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భోజనం బాగా లేకున్నా... ఇవ్వాల్సినంత పరిమాణంలోనే ఇవ్వకున్నా... ఆ రోగులు మనసులోనే మధనపడుతూ వైద్య సేవలు పొందుతున్నారు. భోజనం బాగాలేదని బయటకు చెబితే సేవల్లో ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శిస్తారోనని వారంతా కలత చెందుతూ లోలోపల బాధపడుతూ వైద్య సేవలు పొందుతున్నారు. భోజనం మెనూ ఇలా... ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రోగులకు ఉదయం 150 గ్రాముల గల మూడు ఇడ్లీ, 100 గ్రాముల చట్నీ, మిల్క్ బ్రెడ్ ఏడు సైల్స్ ఉన్నవి (140 గ్రాములు, బన్సీ రవ్వ ఉప్మా రవ్వ (300 గ్రాములు) వీటిల్లో ఏదో ఒకటి పెట్టాలి. అదేవిధంగా 150 ఎం.ఎల్ పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం మూడు పుల్కాలు (ఒక్కోటి 30 గ్రామలు బరువు ఉండాలి) గాని, 450 గ్రాముల సోనామసూరి వండిన అన్నం, వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు(30 గ్రాములు కందిపప్పు ఉండాలి), 50 గ్రాముల గల ఉడికించిన గుడ్డు, 100 గ్రాముల పెరుగు, అరటి పండు ఒకటిగాని సీజనల్గా దొరికే పండుగాని ఇవ్వాలి. రాత్రికి 3పుల్కాలు (30 గ్రాములు బరువు ఉండేవి) గాని సోనామసూరి రైస్ 450 గ్రాములు వండిన అన్నం, మిక్స్డ్ వెజిటిబుల్ కర్రీ ఒక కప్పు, సాంబారు (కంది పప్పు 30 గ్రాములు ఉండాలి), 50 గ్రాముల ఉడికించిన గుడ్డు ఒకటి, 150 గ్రాముల పాలు రెండు టీ స్పూన్ల పంచదారతో కలిపి ఇవ్వాలి. కానీ ఈ మెనూ చాలా నెట్వర్క్ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అన్నంతో పాటు, పాలు, కూర, సాంబారు, పెరుగులోనూ నాణ్యత, పరిమాణం పాటించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అన్నం, పెరుగు, పరిమాణం తక్కువగా ఉంటుందనే విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. సాంబారులో వేయాల్పిన పరిమాణంకు తగ్గట్టుగా కంది పప్పు వేయడం లేదని చెబుతున్నారు. ప్రతీ రోజు ఈ భోజనాన్ని ఆరోగ్యశ్రీ అధికారులు, సిబ్బంది పరిశీలించాల్సి ఉండగా, పరిశీలన పూర్తి స్థాయిలో జరగడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ● ఆరోగ్యశ్రీ భోజనంలో డొల్లతనం...! ● నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ● జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు 25 ● ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రులు 9 ● 46 పీహెచ్సీల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలు ● ఈ ఆస్పత్రుల్లో కేటాయించిన బెడ్లు 1220 ● సగటున ప్రతీ రోజు 1000 నుంచి 1200 మందికి భోజనాలు విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథ కం కింద చికిత్స పొందే రోగులకు అందించే భోజ నంలో నెట్వర్క్ ఆస్పత్రులు నిబంధనలు పాటించ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ నిబంధనలను పక్కనపెట్టి ఏదో పెట్టాం.. వారే తింటారన్న చందాన నెట్వర్క్ ఆస్పత్రులు భోజనం పెడుతున్నట్టు రోగుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. నాణ్యత... పరిమాణం రెండూ పాటించడం లేదన్న ఆరోప ణలు ఉన్నాయి. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిబంధనలు అసలు పాటించడం లేదన్నది రోగుల అభిప్రాయంగా ఉంది. వాస్తవానికి సాధారణ రోగుల కంటే ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన భోజనం అందించాలి. లోలోపల.. ఆరోగ్యశ్రీ రోగులకు అందించే భోజనం బాగాలేకపోయినా రోగులు బయటకు చెప్పలేకపోతున్నారు. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కింద పేషంట్ జాయిన్ అవుతాడో అక్కడే పూర్తి స్థాయిలో చికిత్స పొందాల్సి రావడంతో బయటకు చెబితే వైద్య సేవలు అందించడంలో నూ ఇబ్బందులు పెడతారని మనసులోనే.. మధన పడుతున్నారు. కానీ బయటకు చెప్పడం లేదు. జిల్లాలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు 25 జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆస్పత్రి, అమృత, ఆంధ్ర, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి, కావేరి, కొలపర్తి, మువ్వగోపాల, నెప్రో ప్లస్, పీజీ స్టార్, పుష్పగిరి విక్టోరియా రెటినో ఇనిస్టిట్యూట్, క్వీన్స్ ఎన్ఆర్ఐ, సంజీవిని సూపర్ స్పెషాలటీ, బాబూజీ, శ్రీసాయి సూపర్ ఆస్పత్రి, శ్రీసాయికృష్ణ, సాయి పీవీఆర్, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్రైజ్, స్వామి కంటి ఆస్ప త్రి, తిరుమల మెడికవర్ ఆస్పత్రి, వెంకటరామ, వెంకటపద్మ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం ఉంది. ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రులు 55 ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్సీలు 9 ఉన్నాయి. పీహెచ్సీలు 46 ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్సీ, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, రా జాం ఏరియా ఆస్పత్రి, ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, బాడంగి సీహెచ్సీ, భోగాపురం సీహెచ్సీ, బొబ్బిలి సీహెచ్సీ, నెల్లిమర్ల సీహెచ్సీ, ఘోషాస్పత్రి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో 1220 బెడ్లు కేటాయింపు ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 1220 బెడ్లు కేటాయించా రు. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో 751, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రిల్లో 321, పీహెచ్సీల్లో 148 బెడ్లు కేటాయించారు. ఇందులో సగటున 1000 నుంచి 1200 మంది వరకు రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి మెరుగైన భోజనం అందించాల్సి ఉంది. భోజనాన్ని పరిశీలిస్తాం.. ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యతతో కూడిన మెరుగైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలి. ప్రతీ రోజు ఆరోగ్యమిత్రాలను భోజనం రుచి చూడాలని చెబుతున్నాం. ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజనాన్ని పరిశీలిస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కొయ్యాన అప్పారావు, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి కో – ఆర్డినేటర్ -
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
విశాఖ–లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని విశాఖ న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆరు జిల్లాల న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులందరూ విశాఖకు హైకోర్టు బెంచ్, కేంద్ర పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందడుగు వేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం వంటి సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లాలంటే చాలా భారంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ అన్ని రకాలుగా మోసానికి గురైందని వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్న విశాఖకు హైకోర్టు బెంచ్ కేటాయించడం అన్ని విధాల శ్రేయోదాయకమన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.నరసింహారావు మాట్లాడుతూ విశాఖలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయశాఖకు అభ్యంతరాలు ఉండకపోవచ్చన్నారు. 1993లో హైకోర్టుమెంట్ సాధనకు న్యాయవాదులు చేసిన ఉద్యమాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యంతో పోరాడతామన్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయస్థానానికి హాజరవుతామని వివరించారు. సీనియర్ న్యాయవాది లక్ష్మీరాంబాబు, బార్ కౌన్సిల్ ఉపా ధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఏవీ పార్వతీశం, కృష్ణశేఖర్, పూర్వ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, పాలకొండ, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, అనకాపల్లి, చోడవరం, తుని, యలమంచిలి, విజయనగరం, ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు. న్యాయవాద సంఘం కార్యదర్శి డి.నరేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. -
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఆశించిన స్థాయిలో అభ్యర్థులు హాజరు కాలేకపోయారు. దీనికి ప్రభుత్వ తీరే కారణమని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. చివరి క్షణం వరకు పరీక్ష జరుగుతుందో.. లేదోనన్న సందిగ్ధత వల్లే హాజరు కాలేకపోయారని ఇటు అభ్యర్థులు, అటు వారి తల్లిదండ్రుల
విజయనగరం అర్బన్/గంటస్తంభం: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది. పరీక్షకు 84.69 శాతం అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్లో ప్రతిభ చూపిన వారికి ఒక పోస్టుకు వంద మంది వంతున ఈ పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. నిజానికి ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్కు హాజరు కాకపోవడం సహజంగా ఉండదు. కానీ జిల్లాలో సుమారు 16 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా ఈ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సందిగ్దతత వల్ల ఈ పరిస్థితి నెలకొందని పలువు రు అభిప్రాయపడుతున్నారు. చివరి క్షణం వరకు పరీక్ష వాయిదా పడుతుందని, దానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో దూర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు అలా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అయితే పరీక్ష వాయిదా పడదు.. ఆ వార్త ఫేక్.. పరీక్ష యధావిధిగా జరుగుతుందని ఒక్క రోజు ముందు పబ్లిక్ కమిషన్ ప్రకటించింది. దీంతో దూర ప్రాం చివరి వరకూ అభ్యర్థుల్లో గందరగోళం ప్రశాంతంగా ముగిసిన పరీక్ష అభ్యర్థుల హాజరు శాతం 84.69 మాత్రమే.. కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ సేతుమాధవన్ తాల్లో ఉన్న అభ్యర్థులు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో హాజరు శాతం తగ్గిందని అభ్యర్థులు పేర్కొన్నారు. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని శిక్షణ పొందుతూ విజయనగరంలో పరీక్ష కేంద్రాలున్న అభ్యర్థులు రావడానికి శనివారం రాత్రికి రాత్రి ఇబ్బంది పడ్డారు. గాజులరేగకు చెందిన ఒక అభ్యర్థి హైదరాబాద్ నుంచి శనివా రం రాత్రి 11.30గంటలకు విజయనగరం చేరుకొని స్థానిక మహరాజా కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారు. ఇలా ఇబ్బంది పడి పరీక్షకు హాజరైన వారు అన్ని కేంద్రాల్లో కనిపించారు. అభ్యర్థుల హాజరు శాతం 84.69 మాత్రమే... జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 12 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ – 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు పేపర్లకు ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మెయిన్స్కి అర్హత పొందిన 6,265 మంది అభ్యర్థులలో 84.69 శాతంతో 5,306 మంది పరీక్షకు హాజరయ్యారు. గైర్హాజరు అయిన వారు 959 మంది ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా యంత్రాంగం పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. పట్టణంలోని జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ, సీతం ఇంజనీరింగ్ కేంద్రాలను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ పరిశీలించారు. ఆయనతో పాటు డీఆర్ఓ శ్రీనివాసమూర్తి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కట్టుదిట్టమైన భద్రత
విజయనగరం క్రైమ్: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. 12 కేంద్రాల్లో 180 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో పలు విద్యార్థి సంఘాలు రోస్టర్ విధానాన్ని ప్రకటించాక పరీక్ష నిర్వహించాలంటూ కోట వద్ద ధర్నా జరిపిన నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. నగరంలో జేఎన్టీయూ, సీతం, ఎంవీజీఆర్జీ, చైతన్య, ఆర్కే, గాయత్రి, ఎంఆర్ కళాశాల, లెండీ కళాశాల ఇలా ఏడు రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు ఒక్కో సీఐని పర్యవేక్షణ అధికారిగా నియమించి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మొత్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందల్ ప్రకటించారు. -
బర్డ్ఫ్లూపై ఆందోళన అనవసరం
పార్వతీపురంటౌన్: జిల్లాలో బర్డ్ఫ్లూ సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఉదంతులు, అపోహాలు నమ్మవద్దని, ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బర్డ్ఫ్లూ నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బర్డ్ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని స్పష్టం చేశారు. బర్డ్ఫ్లూ సోకిన ప్రాంతాల ప్రజలు అరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాకుండా వైరస్వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు జాగ్రత్తలు అవసరమని తెలిపారు. ఏదైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యసిబ్బందికి తెలియజేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇంటింటి నిఘా కోసం ఆశ కార్యర్తలు, ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు, ఎంఎన్ఓలతో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోడుగుడ్లు, చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేసుకోవడంతో పాటు వంటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 160 డిగ్రీల వద్ద వేడిచేసి తినాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
ఆటో, బైక్ ఢీ: ఇద్దరికి గాయాలు˘
బొబ్బిలి రూరల్: దత్తిరాజేరు మండలం విజయరాంపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వస్తుండగా వవెనుకనుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఆదివారం మండలంలోని రంగరాయపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విజయరాంపురానికి చెందిన గౌరి ఆమె కుమారుడు సునీల్ కుమార్లు గాయపడగా వారిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించి చికిత్స అందజేశారు. రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తికి.. చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్లో ఒక రైలు బదులు పొరపాటున మరో రైలు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దూబ అప్పన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 ఈఎంటి జయముని, పైలట్ సీహెచ్.తవిటినాయుడులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళికి చెందిన దూబ అప్పన్న చీపురుపల్లి రైల్వేస్టేషన్లో హౌరా–చెన్నయ్ మెయిల్ ఎక్కి తరువాత తాను ఎక్కాల్సిన రైలు కాదని తెలుసుకుని దిగుతుండగా ప్రమాదవశాత్తూ కాలు ఇరుక్కపోయింది. ఇంతలోనే రైలు కదలడంతో కుడి కాలు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. అలరించిన సంగీత విభావరి విజయనగరం టౌన్: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 67వ వార్షికోత్సవం పురస్కరించుకుని బండారు చిట్టిబాబు పర్యవేక్షణలో బండారు రమణమూర్తి సంగీత దర్శకత్వంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన లలిత సంగీత విభావరి ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. వేణువుపై వెల్లంకి కూర్మనాథం, కీబోర్డుపై సోమేష్, ప్యాడ్స్పై బాబూరావు, తబలాపై రమణమూర్తి సహకరించారు. వ్యాఖ్యాతగా మండా వెంకట కామేశ్వరరావు, గాయకులు సాయి ప్రశాంతి, శ్రీవిద్య, శారద, శైలజ, పావని, భాస్కర్ తమవంతు సహకారం అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ మండపాక రవి, కాళ్ల నిర్మల, సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
సెంచూరియన్లో ముగిసిన గజజ్యోతి వేడుకలు
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ95 శ్రీ160 170నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో గజజ్యోతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ప్రముఖ పాప్ సింగర్ రేవంత్ ముగింపు వేడుకలకు హాజరై తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించాడు. పలు సినీ గీతాలను ఉత్సాహంగా ఆలపించడంతో యువతీ, యువకులు డ్యాన్సులు చేసి సందడి చేశారు. అనంతరం వర్సిటీ విద్యార్ధులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు, వీసీ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్ఎస్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉర్రూతలూగించిన గాయకుడు రేవంత్ -
కనులపండువగా సిరిమాను చెట్టు ఊరేగింపు
సాలూరు: సాలూరు పట్టణంలో మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ తల్లి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కీలకమైన అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సుమారు 50 జతల ఎద్దులు, 2 ట్రాక్టర్లతో వేలాదిమంది భక్తులు తరలిరాగా పురవీధుల్లో అమ్మవారి సిరిమాను ఊరేగింపు వేడుకగా జరిగింది. దారిపొడవునా భక్తులు ముర్రాటలు, పసుపు కుంకుమలు సిరిమానుపై వేసి పూజలు చేశారు. ఎడ్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తూ, అంతరించిపోతున్న నాటి సంప్రదాయం మళ్లీ గుర్తుకువచ్చేలా చేశాయి. పులివేషాలు, తీన్మార్, సన్నాయి మేళం నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానికంగా ఆధ్యాత్మికతతో కూడిన సందడి వాతావరణం నెలకొంది. -
విజయనగరం
సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025కళా ఇది నీకు తగునా..! సిరిమాను చెట్టు ఊరేగింపు సాలూరు పట్టణంలో మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ తల్లి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. –8లోచిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. –8లోగుర్ల: ఎమ్మెల్యే కమిడి కళావెంకటరావు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళ్తే.. గుర్ల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కళా వెంకటరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతుగా శనివారం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఎమ్మె ల్యే కోడ్ను ఉల్లంఘించి హైస్కూల్ హెచ్ఎం, కళాశాల ప్రిన్సిపాల్ సీట్లలో కూర్చొని ఎన్నికల ప్రచా రం చేశారు. ఎన్నికల్లో రఘువర్మకు ఓటు వేయాల ని ఉపాధ్యాయులకు సూచించారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కళావెంకటరావు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్సీ అజశర్మ విశాఖపట్నంలోని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కళావెంకటరావుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూస్రీల్ యథేచ్ఛగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ప్రభుత్వ అధికారుల సీట్లలో కూర్చొని దర్జాగా ప్రచారం -
‘చీకటి పువ్వు’కు ప్రథమ బహుమతి
● ద్వితీయ బహుమతి దక్కించుకున్న కొత్త పరిమళం ● ఘనంగా ముగిసిన నాటక పోటీలునెల్లిమర్ల: నరగపంచాయతీ పరిధిలోని జరజావుపేటలో మూడు రోజులపాటు జరిగిన ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీల్లో కరీంనగర్ చైతన్య కళాభారతి కళాకారులు ప్రదర్శించిన ’చీకటి పువ్వు’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కతిక సేవా సంఘం కళాకారులు ప్రదర్శించిన ’కొత్త పరిమళం’ నాటికకు లభించింది. కాగా తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశాఖపట్నం తెలుగు కళా సమితి కళాకారులు ప్రదర్శించిన ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత?’ నాటిక నిలిచింది. శనివారం అర్థరాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ చనమల్లు వెంకటరమణ, నగర పంచాయతీ వైస్చైర్మన్ సముద్రపు రామారావు. అవనాపు సత్యనారాయణ, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు ఉత్తమ దర్శకుడు బహుమతి మంచాల రమేష్ (చీకటి పువ్వు), ఉత్తమ రచయిత బహుమతి కేకేఎల్ స్వామి (కొత్త పరిమళం), ఉత్తమ నటుడు బహుమతి పి.వరప్రసాద్ (నిశ్శబ్దమా నీ ఖరీదెంత)కు లభించాయి. ద్వితీయ ఉత్తమ నటుడుగా డి.గిరిబాబు (చీకటి పువ్వు), ఉత్తమ నటిగా జి.లహరి (చీకటి పువ్వు) ద్వితీయ ఉత్తమ నటిగా డి.హేమ (నిశ్శబ్దమా నీ ఖరీదెంత)ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా రాంబాబు (నిశ్శబ్దమా నీ ఐరీదెంత), ఉత్తమ సహాయ నటుడుగా శోభన్ బాబు(కొత్త పరిమళం) ఉత్తమ విలన్గా దలం (కొత్త పరిమళం), ఉత్తమ హాస్యనటుడిగా బి.కన్నబాబు (నిశ్శబ్దమానీ ఖరీదెంత)కు బహుమతులు లభించాయి. ఉత్తమ రంగాలంకరణ రమణ (కొత్త పరిమళం), ఉత్తను సంగీతం లీల –మోహన్ (చీకటి పువ్వు), ఉత్తమ ఆహార్యం రమణ (కొత్త పరిమళం) జ్యూరీ బహుమతులు సత్యనారాయణ (దేవరాగం), డి.రాధాకృష్ణ (ఎడా రిలో వాన చినుకు) భుజంగరావు (రైతే రాజు)కు లభించాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కుసుమాల నాగభూషణం, కేవీ మంగారావు, మానాపురం సత్యనారాయణ వ్యవహరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సముద్రపు రామారావు, అవనాపు సత్యనారాయణ, ఎంఎం నాయుడు, నల్లి బంగారు చంద్రశేఖర్, తుమ్ము వెంకటరమణ, జనాప్రసాద్, మద్దిల సన్యాసిరావు, కాళ్ల రాజశేఖర్, డొంక కష్ణ, మద్దిల వాసు, ముత్యాల నాయుడు, కనకల హైమావతి నిర్వాహక కమిటీ ప్రతినిధులు ఈపు విజయకుమార్, ఆరిపాక శ్రీనివాసరావు,ఆరిపాక రాము తదితరులు పాల్గొన్నారు. -
చిచ్చు రేపిన డీలర్ ఉద్యోగం
నెల్లిమర్ల రూరల్: ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారి అది కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో గ్రామంలో ఏం జరుగుతోందో తెలియక ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అసలు తగాదాలకు చోటే లేని గ్రామంలో రాజకీయ అశాంతి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని పెద్ద బూరాడపేట గ్రామంలో టీడీపీకి చెందిన రేకపాటి వెంకట పాపారావు కుటుంబసభ్యులు గత 40 ఏళ్లగా రేషన్ షాపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల రేషన్ షాపు డీలర్ పోస్ట్కు నోటిఫికేషన్ ఇవ్వడంతో జనసేన నాయకుడు మక్కువ హరి సతీమణి కుమారిని డీలర్గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలానికి చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామంలో ‘గుడ్ మార్నింగ్ జనసేన’ కార్యక్రమం పేరిట ఆదివారం పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరీ గ్రామంలోని రచ్చబండ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులను డీలర్ పోస్ట్ విషయమై టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి డీలర్గా తమ పార్టీకి చెందినవారే వ్యవహరిస్తున్నారని తమను కాదని నిన్నమొన్న వచ్చిన జనసేన నాయకుడికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో తాము ఏది చెబితే అదే జరుగుతుందని జనసేన నాయకులు బదులివ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. క్షణాల్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకుని కొట్లాడుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మక్కువ సత్యం అప్పలరాజు చేయి విరిగిపోవడంతో నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అసలు జనసేన ఉనికి లేకపోయినప్పటికీ ఎంతో శ్రమించి పార్టీ విజయనాకి సహకరించామని తమపై దాడికి పాల్పడి మనోభావాలు దెబ్బతీశారంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెనుగులాటలో పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పోలీస్ పికెట్ ఏర్పాటు గ్రామంలో శాంతి భధ్రతలకు విఘాతం కలగడంతో స్థానిక ఎస్సై గణేష్ హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. సీఐ రామకృష్ణ గ్రామాన్ని సాయంత్రం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి తగాదాకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కాగా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో చర్చలు కొనసాగుతున్నాయి. జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య కొట్లాట ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులు -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
గుర్ల: మండలంలోని గరికివలస, ఆనందపురం రోడ్డుపై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఆదివారం దగ్ధమైంది. గరికివలస నుంచి భోగాపురం వెళ్తున్న గడ్డి ట్రాక్టర్కు ఆనందపురం రోడ్డుపై ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో మంటలు చేలరేగాయి. సమాచారం మేరకు విజయనగరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆదుపుచేశారు. ఈ ప్రమాదంలో గడ్డి మొత్తం కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. డివైడర్ను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలుబొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామం వద్ద గల బైపాస్ రోడ్డుపై ఒంపల్లి గ్రామానికి వెళ్లే జంక్షన్ వద్ద డివైడర్ను గజపతినగరానికి చెందిన బి.బాలు తన ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో విజయనగరంలోని మహరాజా కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదం గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేష్ తెలిపారు. రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతిగంట్యాడ: మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద ఆదివారం రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి స్కూటీపై అల్లాడ ఆనంద్, కుమార్ రాజాలు, చెల్లూరుకు చెందిన దాసరి నారాయణరావు బైక్పై అదే రోడ్డులో వెళ్తుండగా గింజేరు జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి స్కూటీని బైక్ ఢీకొట్టింది. దీంతో స్కూటీ వెనుక కూర్చున్న అల్లాడ ఆనంద్ తుళ్లి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీని నడుపుతున్న కుమార్రాజాకు, మోటార్ బైక్ నడుపుతున్న దాసరి నారాయణరావుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని 108 అంబులెన్సులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సాయి కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యపార్వతీపురం టౌన్: సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన చొంగలి కృష్ణమూర్తి చాలాకాలంగా మెడ, రెండుభుజాల నొప్పితో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం నొప్పిని భరించలేక గడ్డిమందు తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా
విజయనగరం క్రైమ్: డ్రోన్స్, సీసీ కెమెరా నిఘాతో నేరాల కట్టడి, నియంత్రణకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీస్శాఖ ఐడీ పార్టీలతో పాటు డ్రోన్స్ను వినియోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం విజయనగరంలో మూడు డ్రోన్ కెమెరాలతో పాటు కొత్తగా సీసీ కెమెరాలను కూడా వినియోగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇదే విషయాన్ని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు మూడు సబ్ డివిజన్లైన బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం పరిధిలో పండగలు, ఉత్సవాలు, ర్యాలీలు వంటి బహిరంగ కార్యక్రమాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా డ్రోన్స్ వినియోగిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం ఉన్న మూడు డ్రోన్స్తో పాటు సీసీ కెమెరాలను కూడా వినియోగిస్తున్నామన్నారు.ఈ మూడు సబ్ డివిజన్ల పరిధిలో అన్ని సంస్థలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆయా సంస్థల ప్రతినిధులతో సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే రహదారి ప్రమాదాలు అరికట్టేందుకు, ఈవ్టీజింగ్ నియంత్రణ, చైన్ స్నాచింగ్లు జరగకుండా ఉండేందుకు డ్రోన్స్ వాడుతున్నామన్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో బ్లాక్స్పాట్లను గుర్తించి తద్వారా అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రోన్స్తో పాటు సీసీ కెమెరాలను సంబఽంధిత సంస్థలు, ప్రతినిధులతో కొనుగోలు చేయించి అమర్చుతున్నామని ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ తరహాలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో బహిరంగంగా మద్యం తాగిన వారిని గుర్తించామని చెప్పారు. అలాగే మద్యం తాగి వాహనాలను నడిపిన వారిని గుర్తించి దాదాపు 4,300 కేసులు కేసులునమోదు చేశామని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ -
టీడీపీ అగచాట్లు!
టీచర్ల ఓట్ల కోసం...సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనమండలిలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే అది పూర్తిగా వారికి సంబంధించిన వ్యవహారం. తమ సమస్యలపై పెద్దల సభలో గళం వినిపించే వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీ. పార్టీలకు అతీతంగా జరగాల్సిన మేధావి వర్గం ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తి కాస్తా టీడీపీ నాయకుల అతి జోక్యంతో పక్కదోవ పడుతోంది. ఏకంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావునే రంగంలోకి దించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ప్రెస్మీట్లు పెట్టి మరీ మద్దతు ప్రకటించారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు సార్వత్రిక ఎన్నికలను తలపించేలా విద్యాసంస్థల వెంబడి తిరుగుతున్నారు. ఇదంతా చూస్తున్న టీచర్లు లోలోనే రగిలిపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ, జనసేన నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది నెలల పాలన అనుభవమయ్యేసరికి టీడీపీ తత్వం బోధపడింది. ఈ పరిస్థితుల్లో తాము మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు ఆశించిన స్థాయిలో ఓట్లు రావనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలే స్వయంగా తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి దిగుతున్నారు. వారు పనిచేస్తున్నారో లేదో చూడటానికి మళ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ పెద్దలు పరిశీలకులను పెట్టారు. వారుగాక మండల స్థాయిలో టీడీపీ నాయకులకు టీచర్ల ఓట్లు అన్నీ పడేలా చూడాలని హుకుం జారీ చేశారు. తమ ఎనిమిది నెలల పాలనలో విద్యారంగానికి చేసిన మేలు ఏమిటో, టీచర్ల సమస్యలు ఏమి పరిష్కరించారో చెప్పుకోలేక... గత ప్రభుత్వంపైనే ఇంకా నిందలేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ సానుకూల వాతావరణం కనిపించకపోయేసరికి ప్రత్యర్థి ఉపాధ్యాయ సంఘాల్లోని ఓటర్లకూ గాలం వేస్తున్నారు. కనీసం రెండో పాధ్యాన్యత ఓటు అయినా రఘువర్మకు వేయండని బతిమిలాడుకుంటున్నారు. మరోవైపు గతంలో రెండు దఫాల ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్టీయూ అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయగౌరి కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ● రెండో ఓటే కీలకం... టీచర్లకు ఏంచేశారు? సార్వత్రిక ఎన్నికల సమయంలో టీచర్లకు ఇచ్చిన హామీలేవీ ఈ ఎనిమిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. పీఆర్సీ గురించి కనీసం కమిటీ వేయలేదు. నూతన పీఆర్సీ వచ్చేవరకు ఇచ్చే ఐఆర్ అమలు చేయలేదు. కరువు భృతి బకాయి చెల్లింపులు ఇవ్వలేదు. ఏపీజీఐ, పీఎఫ్ తదితర రుణాల నిధులు విడుదల చేయలేదు. ఏళ్లతరబడి నిలిచిపోయిన సరెండర్ లీవ్ల ఎన్క్యాష్మెంట్ చేయట్లేదు. ప్రధానమైన హామీలలో 117 జీవో రద్దు చేసినట్లే చేసి అదే లక్ష్యంతో ఉన్న ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానం అమలు చేసింది. విద్యారంగం అభివృద్ధికి దోహదం చేసే తల్లికి వందనం, సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను గాల్లో పెట్టేశారు. గత ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసేశారు. కొత్తగా డీఎస్సీ ప్రకటించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులుపడట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయం తగదు 8 నెలల పాలనపై అసంతృప్తి... మానవ వనరుల అభివృద్ధికి కీలకమైన విద్యారంగం రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వ ఎనిమిది పాలనలో రోజురోజుకీ దిగజారిపోయింది. పేద, బడుగు వర్గాలను విద్యావంతులను చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలన్నింటినీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కేసింది. ఈ ధోరణులను ఎండగట్టే మేధావులు చట్టసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడా తమకు అనుకూలమైనవారినే గెలిపించుకుంటే ఇక నిరసన గళమే ఉండదనే ఆలోచనలో టీడీపీ నాయకులు పనిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్న ఏపీటీఎఫ్ (257) అభ్యర్థి రఘువర్మ తరఫున ప్రచారానికి వస్తున్న వారిని టీచర్లు గట్టిగానే నిలదీస్తున్నారు. గత రెండు రోజుల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు పర్యటించిన ఎస్.కోట, బొబ్బిలి, విజయనగరం ప్రాంతాల్లో చీదరింపులు ఎదురయ్యాయని కూటమి ప్రభుత్వ సానుభూతి టీచర్లే చెప్పుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విజయనగరం జిల్లాలో 5,223 మంది ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,333 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పీఆర్టీయూ తరఫున బరిలోకి దిగిన గాదె శ్రీనివాసులనాయుడు, యూటీఎఫ్ మద్దతుతో పీడీఎఫ్ తరఫున పోటీచేస్తున్న కోరెడ్ల విజయగౌరి, టీడీపీ కూటమి మద్దతుతో ఏపీటీఎఫ్ తరఫున అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కానీ టీడీపీ, జనసేన నేతృత్వంలో కూటమి ప్రభుత్వ విధానాల ఫలితంగా రఘువర్మ ఈ పోటీలో వెనుకబడ్డారు. గత ఆరేళ్లలో ఆయన ఏ రోజూ సభలో మాట్లాడలేదని, టీచర్ల సమస్యల గురించి ఆయన పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా గమనించిన టీడీపీ నాయకులు ఇప్పుడు రెండో ఓటు గురించి తాపత్రయపడుతున్నారు. తొలి ప్రాధాన్య ఓటు ఎవరికి వేసినా రెండో ప్రాధాన్య ఓటు అయినా రఘువర్మకు వేయండని టీడీపీ నాయకులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ ఆ పప్పులేవీ తమ వద్ద ఉడకవని పోటీ సంఘాల టీచర్లు తెగేసి చెబుతున్నారు. విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో రాజకీయం తగదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో శనివారం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ అభివృద్ధికి మార్గదర్శకులని, ఓటు ఎవరికి వేయాలో వారికి తెలుసునని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల నాయకులు వారిని ప్రలోభపెట్టడం, సూచనలు, సలహాలు ఇవ్వడం విచారకరమన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. సమావేశంలో మాతృభూమి సేవా సంఘ కార్యదరర్శి ఇప్పలవలస గోపి, పౌరవేదిక ప్రతినిధి తుమ్మగంటి రామమోహనరావు, తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో రచ్చ ఉపాధ్యాయులను ప్రభావితం చేసేలా సమావేశాలు నియోజకవర్గాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు మండలాలవారీగా టీడీపీ నాయకుల మోహరింపు టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యంపై టీచర్ల గుర్రు రెండో ప్రాధాన్య ఓటు కోసం ప్రత్యర్థి సంఘాలవారికీ టీడీపీ వల వర్మకు ససేమిరా వేయబోమంటున్న పోటీ వర్గాలు ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల నిలదీస్తున్న టీచర్లు -
గడ్డి మందు తాగిన వ్యక్తికి అస్వస్థత
పార్వతీపురం టౌన్: గడ్డి మందు తాగిన వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన చొంగళ కృష్ణమూర్తి భార్య బంగారమ్మ తెలిపిన వివరాల మేరకు కృష్ణమూర్తి చాలా కాలంగా మెడ, రెండు భుజాల నొప్పితో బాధ పడుతున్నాడు. గత మూడు రోజులుగా నొప్పిని భరించలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుని గడ్డి మందు తాగాడు. దీంతో కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అవుట్పోస్టు ఏఎస్ఐ నిమ్మకాయల భాస్కరరావు వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. పుష్పాలంకరణలో శ్రీనివాసుడు విజయనగరం టౌన్: నగరంలోని టీటీ డీ కళ్యాణ మండపం ఆవరణలో కొలువైన శ్రీనివాసుడు పుష్పాలంకరణలో శ నివారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆ లయ ప్రధాన అర్చకుడు పీవీ.నరసింహాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చన లు నిర్వహించారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో పూజలు చేశారు. -
గ్రూప్–2 అభ్యర్థులపై దుశ్చర్య
విజయనగరం క్రైమ్: రోస్టర్ విధానంలో స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరుద్యోగ అభ్యర్థులను చెదరగొట్టి ఆందోళనను విరమింపజేశారు. ఈ దృశ్యాలను చూసిన నిరుద్యోగ అభ్యర్థులు పోలీసులు, కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ విజయనగరం కోట కూడలి వద్ద అభ్యర్థులు శనివారం ఉదయం నుంచి ఆందోళన తలపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో అభ్యర్థులంతా సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో విజయనగరం కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అభ్యర్థుల ధర్నాతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్టౌన్, టుటౌన్ సీఐలు తమ సిబ్బందితో కోట కూడలి వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించకుంటే క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు వినకపోవడంతో డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బలవంతంగా జీపుల్లో ఎక్కించి కొందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరిని దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. కోట, బొంకులదిబ్బ, మూడు లాంతర్లు, గురజాడ అప్పారావు రోడ్లలో కనిపించిన అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి రాత్రి సమయాన దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. బలవంతంగా జీపులో తరలింపు -
ఏసీబీ అధికారినంటూ బెదిరింపు ఫోన్ కాల్స్..!
నెల్లిమర్ల రూరల్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని, వీఆర్ఓ గోవింద డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద చనమల్లుపేటకు చెందిన రైతు అబద్ధం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రైతు ఆరోపణపై విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఘటనను ఆసరాగా తీసుకున్న గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి సదరు వీఆర్ఓ గోవిందకు శనివారం బెదిరింపు కాల్స్ చేశాడు. తాను ఏసీబీ కార్యాలయం నుంచి డీఎస్పీని మాట్లాడుతున్నానని, రైతు ఆత్మహత్యా ప్రయత్నం ఘటనపై ఆదివారం సాయంత్రంలోగా అరెస్ట్ చేస్తామంటూ బెదిరించాడు. పెళ్లి అయ్యిందా.. పిల్లలున్నారా... వంటి ప్రశ్నలతో హడలెత్తించాడు. రైతు శశనివారం కూడా పాయిజన్ తాగేందుకు ప్రయత్నించాడని వీఆర్ఓకు చెప్పి భయపెట్టాడు. వీఆర్ఓ భార్యతో కూడా మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పాడు. పాపకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన తరువాత, భయపడాల్సిన అవసరం లేదని సీఐ ఇంటికి వచ్చి కోర్టులో ప్రవేశపెడతారని చెప్పాడు. చివరిగా.. ఎవరికీ విషయం చెప్పొద్దని, ఈ అంశంలో తహసీల్దార్ను బుక్ చేద్దామని, నిన్ను తప్పిస్తా రూ.2లక్షలు ఇవ్వగలవా? అని డబ్బులు డిమాండ్ చేశాడు. తాను అప్పుల్లో ఉన్నానని, డబ్బులు ఇవ్వలేనని వీఆర్ఓ చెప్పగా.. సరే ఏదో చేద్దామంటూ కట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత ఈఓపీఆర్డీ శంకర్ జగన్నాధంకు కూడా అదే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. తహసీల్దార్, ఎంపీడీఓల ఫోన్ నంబర్లు ఇవ్వాలని అడిగాడు. కార్యాలయ అడ్రస్ వివరాలు చెబితే అక్కడికి వచ్చి చెబుతానని ఈఓపీఆర్డీ బదులివ్వగా సదరు నకిలీ అధికారి కాల్ కట్ చేశాడు. కాగా ఇద్దరికీ 81054 28257 ఫోన్ నంబరు నుంచే కాల్ వచ్చింది. కాగా ఏసీబీ నకిలీ డీఎస్పీ ఫోన్ కాల్స్తో అధికార వర్గాల్లో చర్చ సాగింది. రైతు ఆత్మహత్యా యత్నం పేరిట బ్లాక్మెయిల్ రూ.2లక్షలు ఇవ్వాలని వీఆర్ఓకు డిమాండ్ -
సబ్జైల్ తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో జిల్లా సబ్జైల్ను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు వివక్ష చూపించరాదన్నారు. అనంతరం జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను, ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. మెనూపై ఆరా తీశారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఉచిత న్యాయసేవ అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. -
కళారంగానికి బ్రహ్మానందం సేవలు అద్వితీయం
● ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు ● జరజాపుపేటలో ముగిసిన తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నెల్లిమర్ల రూరల్: కళారంగానికి ఆరిపాక బ్రహ్మానందం చేసిన సేవలు అద్వితీయమని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు కొనియాడారు. మండలంలోని జరజాపుపేట గ్రామంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారకార్థం మూడురోజుల పాటు నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా సురేష్బాబు మాట్లాడుతూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో అలనాటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. బ్రహ్మానందం మాష్టారు తన నటనతో జరజాపుపేట పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారని, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. అనంతరం కళాకారులను ప్రోత్సహిస్తూ విజేతలకు రూ.10వేలు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్సీ ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, పార్టీ నగర పంచాయతీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ చనమళ్లు వెంకటరమణ, నాయకులు తోట తిరుపతి, మద్దిల వాసు, తుమ్ము వెంకటరమణ, నల్లి చంద్రశేఖర్, కనకల హైమావతి, ఎంఈఓ ఈపు విజయ్కుమార్ పాల్గొన్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం విజయనగరం ఫోర్ట్: చిరుధాన్యాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇటీవల కాలంలో చిరుధాన్యాల వినియోగం పెరిగిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకురా లు డాక్టర్ సి.తారాసత్యవతి అన్నారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల కిసాన్ మేళాను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికమన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడితే చిరుధాన్యాలను ఉపఉత్పత్తులుగా తయారు చేసుకునే యంత్ర పరికరాలను అందిస్తామన్నారు. కిసాన్ మేళాలో చోడి, కొర్ర, సామ తదితర చిరుధాన్యలతో తయారు చేసిన బిస్కెట్స్, మిక్సర్, మురుకులు, నువ్వు ఉండలు వంటి ఆహార పదార్థాల స్టాల్స్ను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో గిరిజన ఉప ప్రణాళిక ప్రాజెక్టు పరిశీలకుడు కె. శ్రీనివాసబాబు, ప్రాజెక్టు ఇన్చార్జి సంగప్ప, అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆదిలక్ష్మి, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్రో, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు నర్సుపల్లి అనురాధ, త్రివేణి, తదితరులు పాల్గొన్నారు. -
సెకీ విద్యుత్ ఒప్పందంపై.. దుష్ప్రచారం బట్టబయలు
వంగర: సెకీ విద్యుత్ ఒప్పందంపై టీడీపీ, ఎల్లోమీడియా చేసిన దుష్ప్రచారం బట్టబయలైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో నిబంధనలు మేరకు సెకీ విద్యుత్ ఒప్పందం జరిగిందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పరిపాలనకు మచ్చుతునకగా పేర్కొన్నారు. ఇరువాడలో విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. 7వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చారిత్రాత్మకమని, జగన్తోనే నిజమైన సంపద సృష్టి సాధ్యమన్నారు. ఎల్లోమీడియా, టీడీపీలకు ఏఆర్ఆర్ తీర్పు చెంపపెట్టువంటిదన్నారు. కూటమి ప్రభుత్వానికి పాలన చేతకాక గత ప్రభుత్వంపై తప్పులునెట్టివేసేందుకు చేస్తోందన్నారు. కారుచౌకుగా విద్యుత్ కొనుగోలు జగన్మోహన్రెడ్డి హయాంలోనే జరిగిందని ప్రజలు నేడు గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజలను మోసగించిన సీఎం చంద్రబాబు... ఎన్ని పథకాలు అమలు చేశారో ప్రజలకు అర్ధ మైందన్నారు. ఆయన వెంట వంగర, వీరఘట్టం మండలాల ఎంపీపీలు ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, దమలపాటి వెంకటరమణ, పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, సర్పంచ్లు పెద్దిరెడ్డి విజయ, మరిచర్ల విజయలక్ష్మి, బెజ్జిపురం విజయ్కుమార్, శనిపతి సత్యారావు, చందక తాతబాబు, పార్టీ నాయకులు బెవర నూకంనాయుడు, బొంతు వెంకటరావు, వేమిరెడ్డి సూర్యనారాయణ ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
టమాటా పంటను కొనుగోలు చేస్తాం..
బొబ్బిలి: టమాటా తదితర కూరగాయల పంటలను రైతులు కోసే ముందు సమాచారమిస్తే తాము వచ్చి రైతుబజార్లలో ఉన్న ధరలకే కొనుగోలు చేస్తామని బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈశ్వరరావు, ఉద్యాన శాఖాధికారి మోహనకృష్ణ అన్నారు. ఈ నెల 19న సాక్షి ప్రధాన సంచికలో రైతు కష్టం..పశువుల పాలు అన్న శీర్షికన ప్రచురితమయిన కథనానికి ఇరు శాఖల అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో టమాటా, కూరగాయలు పండిస్తున్న రైతుల పొలాలను వారు సందర్శించారు. రైతులకు అవసరమయిన సూచనలు చేశారు. గిట్టుబాటు ధరల కోసం ముందుగా తమను సంప్రదించాలని, కచ్చితంగా రైతుబజార్ల ధరలకు కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రైతులు కూడా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయకుండా 15 రోజుల చొప్పున వ్యవధి తీసుకుని సాగు చేయడం వలన ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగుతుందన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సోలార్ శీతల గిడ్డంగులు, కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు 75 శాతం రాయితీతో మంజూరు చేస్తామన్నారు. వీహెచ్ఏలు హైమావతి, అప్పలనాయుడు, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు. ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు -
రేకుల షెడ్డు ధ్వంసం
బొండపల్లి: మండలంలోని గొల్లలపేట గ్రామంలో జిరాయితీ భూమిలో నిర్మించుకున్న రేకుల షెడ్డును పొక్లయినర్తో కూల్చివేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీతల గుర్రయ్యకు చెందిన రేకుల షెడ్డు అదే గ్రామానికి చెందిన పీతల రాము కూల్చివేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు వీఆర్ఓ కె.ప్రభాకరరావు దృష్టికి తీసుకువెళ్లారు. జిరాయితీలో రేకుల షెడ్డు ఉన్నందున తామేమి చేయలేమని పోలీసులకు ఆశ్రయించాలని ఆయన సూచించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ యు.మహేష్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం నుంచి మదుపాడ వెళ్తున్న మోటార్ సైకిల్ మానాపురం నుంచి గజపతినగరం వైపు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మదుపాడ గ్రామానికి చెందిన గోపి, రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన విజయనగరం టౌన్: నగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో ఉన్న పోలింగ్ గదులను పరిశీలించారు. లైట్లు, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్సైలు రామగణేష్, రవి, కళాశాల సూపర్వైజర్ ప్రసాద్, డీటీ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. వృద్ధులపై చిన్నచూపు వద్దు ● సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ రాజాం సిటీ: వృద్ధులపట్ల చిన్నచూపు తగదని సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ అన్నారు. రాజాం పట్టణ పరిధి కొండంపేటలోని అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె శనివారం సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు, అందుతున్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఉండి నిరాదరణకు గురైన వారి వివరాలు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని అన్నారు. అనంతరం ఆశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పి.శ్రీనివాస్, ఎస్.పోలారావు, కె.సాయిప్రశాంత్కుమార్, పి.చైతన్యకుమార్, ఎం.ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఇద్దరిపై పోక్సో కేసు నమోదు
సీతంపేట: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్న ఉపాధ్యాయుడు, వాచ్మేన్పై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపారు. పాఠశాలలో పని చేస్తున్న ఓ సబ్జెక్టు ఉపాధ్యాయుడు విద్యార్థినిలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మేన్పై కూడా ఇలాంటి ఆరోపణలతో ఫిర్యాదు అందడంతో అతనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించామన్నారు. -
ఏఆర్ సిబ్బంది మాక్ ఆపరేషన్
విజయనగరం క్రైమ్: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినపుడు సకాలంలో వాటిని అదుపు చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చేది ఆర్మర్డ్ రిజర్వు పోలీసు. అటువంటి ఏఆర్ సిబ్బంది శిక్షణ తరగతులను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో శనివారం ఆయన ప్రారంభించారు. పోలీసు శాఖలో వెపన్స్ పట్టే ఏఆర్ సిబ్బందికి నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ గోపాలనాయుడు, రమేష్కుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు గజపతినగరం రూరల్: బొండపల్లి మండలం రాచకిండాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోనకి తీసుకొని మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జె.జనార్దనరావు శనివారం తెలిపారు. నిందితుడు నుంచి పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమంగా బెల్టు షాపులను గ్రామాల్లో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో ఎస్ఐ సి.నరేంద్రకుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, సిబ్బంది రాజు గంగాధరుడు, వి.అప్పారావు, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యా యత్నం సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... గెడ్డలుప్పి గ్రామానికి చెందిన సోంగల కృష్ణమూర్తి కడుపు నొప్పి తట్టుకోలేక అనారోగ్యానికి గురయ్యాడు. నొప్పులు తట్టుకోలేక ఇంట్లో వ్యవసాయ క్రిముల నివారణ మందును తాగాడు. కృష్ణమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు గుర్తించిన కుటుంబీకులు 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
వాలీబాల్ పోటీల విజేత ఎస్.కోట
కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ లిమిటెడ్ కర్మాగారం సహకారంతో జిల్లా వాలీబాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో భారత్ డిఫెన్స్ అకాడమి గ్రౌండ్లో జరుగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో శృంగవరపుకోట నియోజకవర్గం జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది. ఫైనల్లో పార్వతీపురం జట్టుపై ఎస్.కోట జట్టు విజయం సాధించింది. పార్వతీపురం, కురుపాం, విజయనగరం జట్లు వరుసగా ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచాయి. ప్రథమ, ద్వితీయ విజేతలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదుగా వరుసగా రూ.1,25,000లు, రూ.60వేలు నగదు బహుమతితో పాటు మెమోంటోలు అందజేశారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.30వేలు, 25వేలు చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. శారడ కర్మాగార యాజమాన్యం క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం కర్మాగార ప్రతినిధులు సనత్కుమార్, ప్రభాత్మోహన్ మాట్లాడుతూ శారడ కర్మాగారం సహకారంతో జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అందుకు తమ వంతు సహకారం పూర్తి స్థాయిలో అందజేస్తామన్నారు. పోటీలను జాతీయ వాలీబాల్ కోచ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గవర సూరిబాబు, స్కూల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.కృష్ణంరాజు నిర్వహించారు. కార్యక్రమంలో భారత్ డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ కడారి రాజు, శారద కర్మాగార ప్రతినిధులు అశోక్కుమార్, చౌదరి, మూర్తి, హెచ్.సన్యాసిరావు, జి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 9 జట్లు -
విద్యుత్ శాఖకు.. బకాయిల గుదిబండ!
విద్యుత్ శాఖకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.కోట్లలో మొండి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. సామాన్యులు ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేసే ఆ శాఖాధికారులు రూ.కోట్లలో బకాయి పడిన ప్రభుత్వ శాఖల జోలికి వెళ్లలేరు. ఎందుకంటే అవి ప్రభుత్వ శాఖలు. దీంతో రూ.కోట్ల మొండి బకాయిలు విద్యుత్ శాఖకు గుది బండగా మారాయి. విద్యుత్ భవన్ ● రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు ● ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన మొత్తం రూ.57.51కోట్లు ● అత్యధికంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి రూ.34.84 కోట్ల బకాయి ● వైద్య ఆరోగ్య శాఖ బకాయిలు రూ.5.55 కోట్లు ● మున్సిపల్ శాఖ బకాయి రూ.6.76 కోట్లు విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖకు మొండి బకాయిలు గుదిబండగా మారాయి. వివిధ ప్రభుత్వ శాఖలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది ఆ శాఖకు గుది బండగా తయారైంది. బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు ఆయా శాఖలకు ప్రతి నెలా లేఖలు రాయడం తప్ప బకాయిలు వసూలు కావడం లేదు. ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు అధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏదైనా గృహ వినియోగదారు బిల్లు చెల్లించడం నాలుగైదు రోజులు ఆలస్యమైతే విద్యుత్ సిబ్బంది వారి ఫీజులు కట్ చేస్తారు. కానీ రూ.కోట్ల బకాయిలున్న వాటిని వసూలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి రూ.57.51 కోట్లు బకాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ శాఖకు రూ.57.51 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు రూ.34.84 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ వారు రూ.5.55 కోట్లు, మున్సిపల్ శాఖ రూ.6.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ శాఖ రూ.4.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. లేఖలు రాస్తాం.. విద్యుత్ శాఖకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయా శాఖలకు లేఖలు రాస్తాం. వారికి బడ్జెట్ వచ్చినపుడు బకాయిలు చెల్లిస్తుంటారు. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
గిరిజన యూనివర్సిటీతో ఎంఆర్ కళాశాల ఒప్పందం
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీతో పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి సమక్షంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 ప్రకారం పరిశోధన, విజ్ఞాన మార్పిడి, నైపుణ్య మార్పిడి మరియు ఇంటర్నషిప్లు, విద్య, విద్యార్థులు ఉద్యోగం పొందే విధంగా ఉపాధి నైపుణ్యాలు అందించే విధంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, పరిపాలన విభాగాధికారి డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, ఎంఆర్ కళాశాల ఎస్టాబ్లేస్మెట్, అక్రిడేషన్ కన్వీనర్ డాక్టర్ పి.గణపతిరావు పాల్గొన్నారు. -
గ్రూప్–2 అభ్యర్థుల ఆందోళన
విజయనగరం అర్బన్: గ్రూప్–2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ విధానం సవరించాకే మెయిన్స్ పరీక్షలు జరపాలని పరీక్ష రాయనున్న అభ్యర్థులు డిమాండ్ చేశారు. విజయనగరం కోట కూడలిలో శుక్రవారం ఆందోళన చేశారు. తమ డిమాండ్లను ప్లకా ర్డుల రూపంలో ప్రదర్శించారు. ఈ నెల 23న నిర్వహించే పరీక్షను తక్షణమే వాయిదా వేయా లని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల కొన్ని రిజర్వేషన్ కేటగిరీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రోస్టర్’ సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి కోట కూడలిలో నిరసన -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామానికి చెందిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుషిణి గ్రామానికి చెందిన చనమల్లు అబద్ధం అనే రైతు 20 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కొంతమంది వద్ద ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అప్పటినుంచి భూమిని తానే సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భూమిని సర్వేచేసి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. రైతు వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రెవె న్యూ అధికారులు ఏడాదిగా తిరస్కరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూ విక్రయదారులు... అబద్ధం సాగుచేస్తున్న భూమిని వారిపేరున ఆన్లైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు శుక్రవారం ఉదయం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. సాగుబడిలో ఉన్న భూమికి మ్యుటే షన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపునకు దిగాడు. మ్యుటేషన్ కోసం వీఆర్వో తనను లంచం అడిగారని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను వారించి పురుగుమందు డబ్బాను లాక్కు న్నారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ భూమి కొనుగోలుకు సంబంధించి రైతు వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల మ్యుటేషన్ చేయలేకపోతున్నట్టు చెప్పారు. వీఆర్వో గోవింద్ మాట్లాడుతూ రైతు అబద్ధం సాగులో ఉన్న భూమిని ఆయన పేరిట మ్యుటేషన్ చేయాలని రెండు నెలలుగా తనపై ఒత్తిడి తెస్తున్నారని, పట్టా రైతులతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సలహా ఇచ్చానని చెప్పారు. ఆ రైతు నుంచి ఎటువంటి లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. సాగులో ఉన్న భూమికి మ్యుటేషన్ చేయాలని వినతి పురుగుమందు డబ్బాతో రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన