క్రికెట్‌ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

Published Wed, Apr 9 2025 1:03 AM | Last Updated on Wed, Apr 9 2025 1:03 AM

క్రికెట్‌ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

క్రికెట్‌ క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం: క్రీడారంగంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారని, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఎంపీ, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక విజ్జి క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి అండర్‌–19 క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారుల ప్రతిభను అడిగి తెలుసుకుని, లక్ష్యం కోసం కష్టపడాలని సూచించారు. ఎంపిక పోటీల్లో విజయనగరం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్‌ వర్మరాజు, అసోసియేషన్‌ సభ్యులు, హెడ్‌ కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement