Vizianagaram District Latest News
-
గ్రూప్–2 అభ్యర్థుల ఆందోళన
విజయనగరం అర్బన్: గ్రూప్–2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ విధానం సవరించాకే మెయిన్స్ పరీక్షలు జరపాలని పరీక్ష రాయనున్న అభ్యర్థులు డిమాండ్ చేశారు. విజయనగరం కోట కూడలిలో శుక్రవారం ఆందోళన చేశారు. తమ డిమాండ్లను ప్లకా ర్డుల రూపంలో ప్రదర్శించారు. ఈ నెల 23న నిర్వహించే పరీక్షను తక్షణమే వాయిదా వేయా లని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల కొన్ని రిజర్వేషన్ కేటగిరీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రోస్టర్’ సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి కోట కూడలిలో నిరసన -
వినతుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
కొత్తవలస: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందిన వినతుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తవలస తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్పై సమీక్షించారు. సుమారు 57 వినతుల పెండింగ్లో ఉండడంపై తహసీల్దార్ బి.నీలకంఠరావును ప్రశ్నించారు. అర్జీలు పెట్టుకున్న కొంతమంది ఫిర్యాదుదారులను కార్యాలయానికి రప్పించి కలెక్టర్ మాట్లాడారు. కొత్తవలస గ్రామానికి చెందిన గొరపల్లి గణేష్ అర్జీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి తనకు రావాల్సిన భూమి ఇప్పించాలని ఏళ్లతరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయాడు. దీంతో పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏకు నివేదిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ డి.కీర్తి, సర్వేశాఖ ఎ.డి. కె.వెంకటరమణ, తహసీల్దార్ బి.నీలకంఠరావు, డీటీ పప్పుహరి, ఆర్ఐ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామానికి చెందిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుషిణి గ్రామానికి చెందిన చనమల్లు అబద్ధం అనే రైతు 20 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కొంతమంది వద్ద ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అప్పటినుంచి భూమిని తానే సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భూమిని సర్వేచేసి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. రైతు వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రెవె న్యూ అధికారులు ఏడాదిగా తిరస్కరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూ విక్రయదారులు... అబద్ధం సాగుచేస్తున్న భూమిని వారిపేరున ఆన్లైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు శుక్రవారం ఉదయం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. సాగుబడిలో ఉన్న భూమికి మ్యుటే షన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపునకు దిగాడు. మ్యుటేషన్ కోసం వీఆర్వో తనను లంచం అడిగారని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను వారించి పురుగుమందు డబ్బాను లాక్కు న్నారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ భూమి కొనుగోలుకు సంబంధించి రైతు వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల మ్యుటేషన్ చేయలేకపోతున్నట్టు చెప్పారు. వీఆర్వో గోవింద్ మాట్లాడుతూ రైతు అబద్ధం సాగులో ఉన్న భూమిని ఆయన పేరిట మ్యుటేషన్ చేయాలని రెండు నెలలుగా తనపై ఒత్తిడి తెస్తున్నారని, పట్టా రైతులతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సలహా ఇచ్చానని చెప్పారు. ఆ రైతు నుంచి ఎటువంటి లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. సాగులో ఉన్న భూమికి మ్యుటేషన్ చేయాలని వినతి పురుగుమందు డబ్బాతో రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన -
లోక్అదాలత్ను విజయవంతం చేయండి
విజయనగరం లీగల్: వచ్చేనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్కుమార్, ఏఎస్పీ అంకిత సురాన అన్నారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీకాదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవీరత్నకుమారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బి.రమ్య, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలీస్ అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
కోడి పందాలపై పోలీసుల దాడి
● అదుపులోకి 9 మంది నిందితులు ● రూ.13,760 నగదు స్వాధీనంలక్కవరపుకోట: గ్రామాల్లో నిర్వహించే తీర్థాల సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలపై లక్కవరపుకోట పోలీస్లు కొరడా ఝుళిపించారు. కోడి పందాలు, ఏట్లాట (నాణాలు తిప్పే ఆట) వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఎస్సై నవీన్పడాల్ తన సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో గల మామిడి తోటల్లో రహస్యంగా నాణాలు తిప్పే జూదం ఆటపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ 10,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆదే గ్రామ శివారు గల పశువుల కళ్లాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై దాడి చేశారు. అక్కడ పందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 కోడి పుంజలు, రూ.3,560 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
2.75 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందని కర్మాగార యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా లోని దూర ప్రాంతాల నుంచి చెరకును క్రషింగ్ కోసం సకాలంలో ఫ్యాక్టరీకి తీసుకొచ్చే ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి చెరకును నరికించే ఏర్పాట్లు చేశామని వివరించారు. నేడు చిరుధాన్యాల కిసాన్ మేళా విజయనగరం ఫోర్ట్: గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం చిరుధాన్యాల కిసాన్మేళా నిర్వహిస్తామని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాత్రో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సి.తారా సత్యవతి, వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 300 నుంచి 350 మందికి ఉపకరణాలు అందజేస్తామన్నారు. 139 క్వింటాళ్ల టమాటా కొనుగోలు విజయనగరం ఫోర్ట్: ౖరెతుల నుంచి 139 క్వింటాళ్ల టమాటాను కొనుగోలుచేసినట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ బి.రవికిరణ్ తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటాను ఎం.ఆర్.హెచ్ రైతు బజార్లలో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైద్య పరీక్షల్లో కచ్చితత్వం అవసరం ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ల్యాబ్ టెక్నీషియన్లు చేసే వైద్య పరీక్షల్లో కచ్చితత్వం ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణలో ల్యాబ్టెక్నీషియన్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసెడెంట్ కర్రోతు సత్యం అప్పలనాయుడు, ప్రతినిధులు మరిపి ఎర్రినాయుడు, శోభ గోవింద, శ్రీధర్, సాయి, తదితరులు పాల్గొన్నారు. రామతీర్థంలో మహాశివరాత్రి ఏర్పాట్లు నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయంలో క్యూల ఏర్పాట్లను ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. శివరాత్రి రెండు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు పులిహోరా, శనగల ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అమ్మకానికి సుమారు 30వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ సేవా సంఘాల సభ్యులు విధులు నిర్వర్తిస్తారన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
గ్రీన్ కెమిస్ట్రీ రంగంలో అధిక ఉద్యోగావకాశాలు
విజయనగరం అర్బన్: గ్రీన్ కెమిస్ట్రీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని, ఆ దిశగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ అండ్ సస్టైనబుల్ కెమిస్ట్రీ’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా నైపుణ్యం, పరిశోధన ఆధారిత ఆవిష్కరణ సవాళ్ల పరిష్కారానికి వర్సిటీ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో గల వివిధ పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు కెమిస్ట్రీలో కొత్త పద్ధతులను అన్వేషించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాయి ఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బీవీ శశిధర్, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అఖిల కుమార్ సాహూ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల రసాయన ప్రక్రియల ప్రాముఖ్యత, స్థిరమైన పారిశ్రామిక పద్ధతుల అవసరం, గ్రీన్ కెమిస్ట్రీలో తాజా పరిశోధన ధోరణులను వివరించారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్ జి.సత్యనారాయణ (ఐఐటీ హైదరాబాద్), డాక్టర్ రాంబాబు దండేలా (ఐసీటీ భువనేశ్వర్), డాక్టర్ యాదగిరి డొంగారి (రూర్కీ ఐఐటీ), డాక్టర్ తిరుపతి బార్గా (ఐఐఎస్ఈఆర్ బెర్హంపూర్), ప్రొఫెసర్ రాజశేఖర్రెడ్డి (వీఐటీ వెల్లూరు) పాల్గొని రసాయనిక శాస్త్ర రంగంలోని ఉద్యోగ అవకాశాలను, నూతన పోకడలు, పరిశోధనాంశాలు, నైపుణ్యాన్ని ప్రెజెంటేషన్ చేశారు. సెమినార్ కన్వీనర్, రసాయనిక శాస్త్ర విభాగధిపతి ప్రొఫెసర్ ఎం.శరత్చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సెమినార్ కో కన్వీనర్స్ డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ పడాల కిషోర్, రిజిస్ట్రార్, డీన్స్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. గిరిజన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి -
అంగన్వాడీలకు మరుగుదొడ్లు ఉండాల్సిందే...
విజయనగరం ఫోర్ట్: ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి మరుగుదొడ్లు ఉండాల్సిందేనని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టంచేశారు. మరుగుదొడ్లు ఉన్న భవనాల్లోకి అంగన్వాడీ కేంద్రాలను మార్చాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తూ విద్యుత్, మరుగుదొడ్లు సదుపాయం లేని అంగన్వాడీ కేంద్రాల వివరాలను తక్షణమే తెలియజేయాలన్నా రు. పిల్లల బరువు, ఎత్తుకొలతల నమోదు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రుక్షనా భేగం, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విద్యుత్శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీఈఓ మాణిక్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
విజయననగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం అదుపులో తీసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్, వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రేవతి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. రాయగడ, విజయనగరానికి చెందిన ఇద్దరు యువకులు చెడు వ్యసనాలను అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు విజయనగరం ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద ఇద్దరు నిందితులు గంజాయి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రేవతి ఘటనా స్థలికి వెళ్లి నిందితులను పట్టుకుని విచారణ చేసి వారి దగ్గర ఉన్న రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
చీపురుపల్లి: ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ జి.సత్యవాణి హెచ్చరించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పీసీ, పీఎన్డీటీ చట్టం–1994 అమలుపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఆడపిల్లలపై వివక్ష తగదన్నారు. గర్భస్రావాలను ప్రోత్సహించడం నేరమన్నారు. స్కానింగ్ కేంద్రాలు పక్కాగా రికార్డులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎన్.సూర్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరరావు, చిన్నపిల్లల వైద్యులు డా.ఎం.నాయక్, సీ్త్ర వైద్య నిపుణులు అర్చన, హ్యూమన్ రైట్స్ ప్రతినిధి వి.పద్మలత, ఏఓ ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ సత్యవాణి -
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సాలూరు రూరల్: పార్వతీపురం జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు పోలీస్శాఖ ఆధ్వర్యంలో గడిచిన మూడు నెలల పాటు నిర్వహించి శుక్రవారం మండలంలోని తోణాం గ్రామంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో సాలూరు మండలం మెండంగి గిరిజన యువత విజేతలుగా నిలిచారు. అలాగే ద్వితీయ స్థానంలో మక్కువ మండలం కోన టీమ్ గెలుపొందింది. గెలుపొందిన టీమ్లకు ఎస్పీ మాధవ రెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా మహరాణా బహుమతులు అందజేశారు. అలాగే సెమీ ఫైనల్లో పాల్గొన్న పాచిపెంట, మక్కువ, సాలూరు, పార్వతీపురం రూరల్ టీమ్లకు వాలీబాల్ కిట్లతో పాటు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ రెడ్డి మాట్లాడుతూ గరిజన యువతకు ఆటలపోటీలపై ఆసక్తిని పెంపొందించేందుకు పోలీసుశాఖ తరఫున ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలలో మత్తుపదార్దాలు ఎవరైనా సరఫరా చేసినట్లు సమాచారం తెలిసినట్లు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదుచేయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై, నరసింహమూర్తి పోలీసులు పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా -
దొంగల వీరవిహారం..!
గజపతినగరం: మండల కేంద్రంలో శుక్రవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో 8షాపుల షట్టర్లను ధ్వంసం చేసి నగదు, వస్తుసామగ్రి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరంలో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న 8షాపులను దొంగలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ 8షాపుల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వెంకి మొబైల్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాపులో 27సెల్ఫోన్లు, రూ.లక్షా51వేల420 నగదు చోరీకి పాల్పడినట్టు షాపు యజమాని తెలిపారు. దీంతో పాటు గజపతినగంలో డీ మార్ట్స్, ఆర్కే ఫ్యామిలీ మార్ట్, సూపర్ ఎం, ఉమెన్స్/కిడ్స్ జోన్, ఎస్ఎస్ ఫుట్ వేర్, వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, తిరుమల ట్రేడర్స్, ఎస్ఎస్ ఫుట్వేర్ మొత్తం 8షాపుల షట్టర్లను ధ్వంసం చేసి కౌంటర్లలో ఉన్న నగదు, వస్తువులను దొంగిలించారు. ఉమెన్/మెన్/కిడ్స్ జోన్ బట్టల షాపులో కౌంటర్లో ఉన్న నోట్లు రూ.10వేలు, చిల్లర రూ.5వేలు మొత్తం రూ.15వేలు పోయినట్లు యజమాని ఆగూరు ఆచారి తెలిపారు. అలాగే మిగతా షాపుల్లో కూడా కొంత నగదు, వస్తువులు పోయినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ, క్లూస్ టీమ్ గజపతినగరం టౌన్లోను, మెంటాడ జంక్షన్లో చోరీకి గురైన 8షాపులను డీఎస్పీ భవ్య క్షేత్ర స్థాయిలో పరిశీలించి దొంగతనం జరిగిన తీరును స్థానిక సీఐ జీఏవీ రమణ, ఎస్సై లక్ష్మణరావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్టీమ్ ద్వారా వివరాలను, ఫింగర్ ప్రింట్లను తీయించి దర్యాపు చేశారు. సీసీఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించి వారిజాడ కనిపెట్టి అదుపులోకి తీసుకునేలా దర్యాప్తు చేయాలని స్థానిక ఎస్సై లక్ష్మణరావును ఆదేశించారు. సీసీ ఫుటేజీల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. 8షాపులను ఒకేరోజు షట్టర్లు పగులగొట్టి లోపలికి ఎలా ప్రవేశించారో అంతుపట్టని విధంగా సినీఫక్కీలో చోరీ జరిగినట్లు ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. డీఎస్పీ భవ్య వెంట క్లూస్ టీమ్ సిబ్బందితో పాటు స్థానిక సీఐ, ఎస్సైలు జీఏవీ రమణ, లక్ష్మణరావులు ఉన్నారు. పోలీసుల వైఫల్యానికి నిదర్శనం: సీపీఎం గజపతినగరం: ఎన్నడూ లేనివిదంగా ఒకేరోజు గజపతినగరంలో 8షాపుల్లో చోరీ జరగడం పోలీసుల వైఫల్యమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జి.శ్రీనివాస్, రాకోటి రాములు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం గజపతినగరం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా దొంగతనాలు జరగడం దుర్మార్గమన్నారు. గజపతినగరంలో గంజాయి, బెట్టింగులజోరు, మత్తులో తగాదాలు, కత్తులతో పొడుచుకునే సంఘటనలు, ఏసమయంలోనైనా మద్యం దొరకడం వంటివి పెరిగి పోవడంతో సమాజం పూర్తిగా ఛిన్నాభిన్నం అయిపోయిందన్నారు. దీనిని గాడిలో పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 8షాపుల్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు వేగవంతంగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. గజపతినగరంలో 8 షాపుల్లో చోరీ షాపుల షట్టర్లు ధ్వంసం నగదు, వస్తు సామగ్రి అపహరణ -
వివాహిత మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని నీలంరాజు పేటకు చెందిన వివాహిత దేవిప్రియ(21) విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందిన ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన దేవిప్రియ, నెల్లిమర్ల మండలంలోని నీలంరాజుపేటకు చెందిన లోకనాథం నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయనగరం పట్టణంలోని పూల్బాగ్లో అద్దెఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దేవిప్రియ అనారోగ్యానికి గురికావడంతో భర్త తొలుత నెల్లిమర్ల మిమ్స్కు తీసుకువెళ్లాడు. ఛాతీలో నొప్పి రావడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే దహన సంస్కారాల నిమిత్తం భర్త, బంధువులు దేవి ప్రియ మృతదేహాన్ని స్వగ్రామమైన నీలంరాజుపేటకు శుక్రవారం తీసుకువచ్చారు. విషయం కాస్తా మృతురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు నెల్లిమర్ల పోలీస్స్టేషన్కు వచ్చి తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన విజయనగరం పరిధిలో జరగడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించగా వివాహిత కుటుంబ సభ్యులు విజయనగరం టూ టౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా నీలంరాజుపేటలో వివాహిత మృతదేహాన్ని ఏఎస్సై సతీష్, సిబ్బంది పరిశీలించారు. -
జిల్లాలో బర్డ్ఫ్లూ లేదు
● గుడ్లు, మాంసం రవాణాపై ఆంక్షలు లేవు ● పశు సంవర్థక శాఖ జేడీ వైవీ రమణవిజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాధి సోకిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పెంపకం పరిశ్రమ కలిగిన రైతులు, పౌల్ట్రీ యాజమానులు జిల్లాలోని కోళ్లకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా జీవ భద్రత చర్యలు చేపట్టాలని పశు సంవర్థకశాక జేడీ డాక్టర్ వైవీ రమణ తెలిపారు. కోళ పరిశ్రమ యాజమానులు, రైతులకు శుక్రవారం పశు సంవర్థకశాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బర్డ్ఫ్లూ లేదని, గుడ్లు, కోడి మాంసం ఉత్పత్తులను 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో వండుకుని ప్రజలు అందరూ నిర్భయంగా తినొచ్చని పేర్కొన్నారు. కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్తో కలిసి పశు సంవర్థకశాఖ త్వరలో కోడిమాంసం, గుడ్ల వంటకాలతో జిల్లా కేంద్రంలో త్వరలోనే ఒక మేళాను నిర్వహించి ప్రజల్లో ఉన్న అపొహలు తొలగించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో బహుళార్థ పశు వైద్యశాల ఉప సంచాలకురాలు డాక్టర్ జి.మహాలక్ష్మి, పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎంబీవీ ప్రసాద్, ఎ.డి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ స్టాంపులు విక్రయిస్తే కఠిన చర్యలు
● సబ్రిజిస్ట్రార్ శ్రీనువాసులు ● సాక్షి కథనానికి స్పందన వీరఘట్టం: మండల కేంద్రంలో స్టాంపులను కలర్ జిరాక్స్ తీసి విక్రయిస్తున్నారని శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ‘జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు’ కథనంపై అధికారులు స్పందించారు.ఈ మేరకు పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తయాచేస్తున్న స్టాంపుల మాదిరిగా నకిలీవి తయారుచేస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ హెచ్చరించారు.కొద్దిరోజుల్లో వీరఘట్టం–పాలకొండ పట్టణాల్లో కలర్ జిరాక్స్లు తీస్తున్న అన్ని షాపులు తనిఖీ చేస్తామన్నారు. అలాగే ప్రజలు కూడా తమ అవసరాలు కోసం ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న స్టాంపులు నకిలీవా? ఒరిజనల్వా? అని పరిశీలించుకోవాలని సూచించారు. స్టాంపుల విక్రయాలకు ప్రైవేట్ జిరాక్స్ షాపులకు ఎటువంటి అనుమతులు లేవని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.ఖలీల్బాబుకు స్పిరిట్యువల్ సైంటిస్ట్ అవార్డ్విజయనగరం టౌన్: విశ్వసమైక్యతకు కృషిచేస్తున్న సూఫీ పరంపర వారసుడు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఖలీల్బాబుకు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సెంటర్, ఆంధ్రాయూనివర్సిటీ అనుబంధ డీన్వాన్ల్యూవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్, ఆంధ్రాయూనివర్సిటీ సంయుక్తంగా స్పిరిట్యువల్ సైంటిస్ట్ అవార్డును అందజేశాయి. ఈ మేరకు శుక్రవారం డీన్వాన్ వాన్ల్యూవెన్ సెంటర్ ఈడీ చల్ల కృష్ణ విజయనగరంలో ఉన్న దర్బార్కు వచ్చి ఖలీల్బాబును సత్కరించి అవార్డు ప్రదానం చేశారు. ఖాదర్బాబాపై భక్తితో తాను స్వయంగా రాసిన ఇంగ్లీష్ కవితలతో కూడిన పుస్తకాన్ని ఖలీల్బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకుడు డాక్టర్ పీవీ.గోపాలరాజు, అహమ్మద్ బాబు, రంగారావు బాబాయ్, సంతోష్, జ్ఞానేశ్వర్, ఖాదర నాగూర్ తదితరులు పాల్గొన్నారు. బత్తిలి పోలీసుల ఔదార్యం● ఆరు తులాల బంగారంతో బ్యాగ్ అప్పగింత భామిని: మండలంలోని బత్తిలి పోలీసులు బంగారం పోగొట్టుకొన్న బాధితుల విషయంలో శుక్రవారం తమ ఔదార్యం చాటుకుని ఆదర్శంగా నిలిచారు. బత్తిలి వచ్చే ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన ఆరు తులాల బంగారు వస్తువులతో ఉన్న బ్యాగ్ను బాలేరుకు చెందిన బాధితులు వడ్డివాడ రామకృష్ణ దంపతులకు ఆప్పగించి ప్రజల మొప్పు పొందారు. కొత్తకోట నుంచి ఆర్టీసీ బస్సులో బాలేరు వస్తూ బంగారు వస్తువులు ఉన్న బ్యాగ్ మరిచిపోయి వారు దిగిపోయారు. వెనువెంటనే బాలేరు వైఎస్సార్సీపీ నాయకుడు మేడిబోయిన చలపతి ఆధ్వర్యంలో బత్తిలి ఎస్సై డి.అనిల్కుమార్కు సమాచారం ఇవ్వడంతో బత్తిలిస్టేషన్ సిబ్బందికి సమాచారం అందించి ఆర్టీసీ బస్సులో బంగారు వస్తువులతో గల బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. బత్తిలి స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకుడు చలపతి సమక్షంలో బాధితులకు బంగారు వస్తువుల బ్యాగ్ అందించి పలువురి మన్ననలు పొందారు. ఘనంగా ముగిసిన దుర్గాలమ్మ తీర్థంలక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామదేవత దుర్గాలమ్మ అమ్మవారి తీర్థం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీల్లో మొత్తం 8 ఎడ్లబళ్లు పాల్గొనగా వాయిల్పాడుకు చెందిన శ్రీమరిడిమాంబ ఎడ్లు ప్రథమస్థానం సాధించాయి. కలగాడకు చెందిన పోలిపర్తి సత్తిబాబు ఎడ్లు ద్వితీయ స్థానం, వావిలపాడుకు చెందిన పరిదేశమ్మతల్లి ఎడ్లు తృతీయ స్థానం, దేవరాపల్లికి చెందిన వీరాంజనేయ ఎడ్లు నాలుగవ స్థానం, దేవరాపల్లికి చెందిన శ్రీలక్ష్మీనరసింహ ఎడ్లు 5వ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. -
పొలంపిలుస్తోందికి స్పందన కరువు
● వారానికి నాలుగు గ్రామాల్లో నిర్వహించాలి ● రెండు గ్రామాల్లో నిర్వహించి మమ అనిపిస్తున్న వైనం ● కార్యక్రమాలకు ఇతరశాఖల అధికారుల గైర్హాజరు ● పట్టించుకోని అధికారులుపార్వతీపురం టౌన్: రైతులకు సాగుపై అవగాహన కల్పించి సస్యరక్షణలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది వ్యవసాయం లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో వ్యవసాయశాఖ అధికారులతో పాటు అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు వ్యవసాయాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు గ్రామాల్లోని రైతుల క్షేత్రాలను సందర్శించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలి. విత్తన ఎంపిక మొదలు ఎరువులు, పురుగు, తెగులు నివారణ మందులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అన్ని సమస్యలపై నేరుగా చర్చించి అవగాహన కల్పించాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. వ్యవసాయశాఖ అధికారులు మినహా మిగిలినవారు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో మంగళ, బుధవారాల్లో రెండు గ్రామాలు చొప్పున వారానికి నాలుగు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి పొలాలను పరిశీలించి అభ్యుదయ రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. కాని నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడంతో లక్ష్యానికి దూరంగా సాగుతోంది. కార్యక్రమం నిర్వహణ ఇలా.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ లక్ష్యంగా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ, అనుబధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు పొలం బాట, పంటసాగుపై చర్చలు జరపాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయాలి. వ్యవసాయ, అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించాలి. క్షేత్ర సమస్యలకు తక్షణమే పరిష్కారం సూచించాలి. తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, ఎక్కువ నికర ఆదాయం దిశగా ప్రోత్సహించాలి. మిగతా అధికారులు ఎక్కడ? ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులతోపాటు అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీష్, వెటర్నరీశాఖ, మార్కెటింగ్ అధికారులు, విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, విద్యుత్, జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. వారితో పాటు రైతుమిత్ర సంఘాలు, భూసార పరిరక్షణ అధికారులు హాజరై వ్యవసాయ అభివృద్దికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, రాయితీ, సబ్సిడీలను వివరించి రైతుల్లో చైతన్యం పెంచాలి. 2024–25 ఏడాదికి సంబంధించి సెప్టెంబరు 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడత షెడ్యూల్ పూర్తయి ప్రస్తుతం రెండో విడత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్లో జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మిగిలిన శాఖ అధికారుల జాడ లేదని రైతులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం లేక కార్యక్రమం డీలా! ఏ రోజు ఏ గ్రామంలో కార్యక్రమం జరుగుతుందో గ్రామాల్లో ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతులు ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు వారి షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు వెళ్లి అటుగా వచ్చి వెళ్లే రైతులను కూర్చోబెట్టి కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విత్తు నుంచి ఉత్పత్తి వరకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై చాలా మందికి అవగాహన భ్రమగానే మారిందని విమర్శలు ఉన్నాయి. అనుబంధ శాఖల అధికారులు హాజరు కావాలి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అన్ని అనుబంధ శాఖ ల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా శాఖల పథకాలను తెలియజేసి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు చేపడతాం. – రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
26న జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు
బొండపల్లి: ఈనెల 26న మండలంలోని కొత్తపాలెం గ్రామంలో శ్రీ కృష్ణమ్మ పేరంటాలు తల్లి మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలతో పాటు ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీలు, గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ బొడ్డు రాము, గ్రామ సర్పంచ్ బొడ్డు సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల్లో విజేతలకు నగదు పారితోషకాలను అందజేయడంతో పాటు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలు, పోటీదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఉల్లాసంగా ‘శారడ’ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
● ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన 9 జట్లు ● రెండు రోజుల పాటు జరగనున్న పోటీలు కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామం సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ లిమిటెడ్ కర్మాగారం సహకారంతో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు కొత్తవలస –విజయనగరం రోడ్డులో గల బారత్ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్లో శుక్రవారం ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, శారడ పరిశ్రమ వైస్ప్రెసిడెంట్ సనత్కుమార్, ప్రభాత్ మోహన్ ప్రారంభించారు. జాతీయ వాలీబాల్ కోచ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గవర సూరిబాబు, స్కూల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.కృషంరాజుల నిర్వహణలో పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గల 9 నియోజకవర్గాల నుంచి ఒక్కో టీమ్ వచ్చినట్లు తెలిపారు. ప్రతి టీమ్కు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ పోటీలు లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు రూ.1,25,000, ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు రూ.60,000, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.30,000, నాల్గోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు, క్రీడాకారులకు టీషర్టులను, బాల్స్, నెట్లను శారడ కర్మాగారం సమకూర్చినట్లు తెలిపారు. శనివారం ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు, సర్పంచ్లు మదినా అప్పలరమణ, పీతల కృష్ణ, శారడ కార్మగారం ప్రతినధులు ఆశోక్కుమార్ చౌదరి, మూర్తి, హెచ్.సన్యాసిరావు, జి.శంకరావు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
డెంకాడ: విజయనగరం జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధిలో గల డీజే దాబా ఎదురుగా విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై జరిగిన ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందాడు. పెదతాడివాడ వద్ద ఉన్న ఒక కల్యాణ మంటపంలో ఫంక్షన్కు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండగా, ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొట్టడంతో విద్యార్థి మండ రాజా(17) అక్కడికక్కడే మరణించాడు. మృతుడి తండ్రి మండ గంగరాజు మండలంలోని పినతాడివాడలోని ఒక చర్చిలో పాస్టర్గా ఉంటూ కుటుంబంతో పాటు జీవనం సాగిస్తున్నారు. మృతుడి తండ్రి గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. కారు ఢీకొని మహిళ.. పూసపాటిరేగ: మండలంలోని కామవరం జంక్షన్లో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొనడంతో అక్కడకక్కడే మృతి చెందింది. పూసపాటిరేగ మండలకేంద్రంలోని కునుకువారి కళ్లాలకు చెందిన పతివాడ రమ (32) కామవరం జంక్షన్లో గుడికి వెళ్లే నిమిత్తం రహదారి దాటుతుండగా కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. మృతురాలికు భర్త తవిటినాయుడుతో పాటు ఇద్దరు కుమారులు తరుణ్, మహేంద్రలు ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి పోలీసులు తరలించారు. ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి.. చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. మృతుడి జేబులో శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్కు జనరల్ టికెట్ కూడా ఉంది. అంతేకాకుండా మృతుడు ధరించిన తెలుపు రంగు చారల షర్టుపై ఆరాధన టైలర్స్, ఎస్.పేట అనే లేబుల్ ఉంది. -
నాటిక పోటీలు ప్రారంభం
నెల్లిమర్ల: జరజాపుపేటలోని నల్లి సూరిబాబు స్మారక కళాప్రాంగణంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శించిన రైతే రాజు, ఎడారిలో వాన చినుకు నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ప్రారంభోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులు సీహెచ్ వెంకటరమణ, ఎస్.రవిశేఖర్ మాట్లాడుతూ రంగస్థల నటుడు ఆరిపాక బ్రహ్మానందం కళారంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కళలకు కాణాచి అయిన జరజాపుపేటలో నాటక పరిషత్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ఈపు విజయ్ కుమార్, అవనాపు సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు, ఆరిపాక రాము, తదితరులు పాల్గొన్నారు. -
పాలవలస కుటుంబానికి ఓదార్పు..
పాలకొండలో ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత జగన్మోహన్రెడ్డి పాలకొండ పట్టణంలోని పాలవలస విక్రాంత్ ఇంటి వద్దకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.45 సమయంలో అక్కడకు చేరుకున్న జగన్.. తొలుత దివంగత పాలవలస రాజశేఖరం చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరం సతీమణి ఇందుమతి చేతిలో చేయివేసి ధైర్యం చెప్పారు. రాజశేఖరం కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పిరియా విజయ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్బాబు, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, కుంభా రవిబాబు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్కుమార్, గొండు కృష్ణమూర్తి, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలేరాజేష్, పేరాడ తిలక్, గొడ్డేటి మాధవి, జమ్మాన ప్రసన్న కుమార్, జయమణి, రేగాన శ్రీనివాస్, నెక్కల నాయుడుబాబు, కేవీ సూర్య నారాయణరాజు, అంధవరపు సూరిబాబు, పిరియా సాయిరాజ్, ధర్మాన కృష్ణ చైతన్య, కరిమి రాజేశ్వరరావు, మెంటాడ పద్మావతి, చింతాడ రవికుమార్, కిల్లి సత్యనారాయణ, పాలిన శ్రావణి, దుంపల లక్ష్మణరావు, చెట్టి వినయ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలేరాజేష్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు నెక్కల నాయుడుబాబు -
చిన్నారులకు ఎక్స్రే తిప్పలు..!
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు సీహెచ్ లోక్షిత. బొండపల్లి మండలం గొట్లాం గ్రామం. ఛాతిలో కఫం పట్టడంతో చిన్నారిని మూడు రోజుల కిందట ఘోషా ఆస్పత్రి పిల్లల వార్డులో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారికి ఎక్స్రే తీయించుకోవాలని చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. విజయనగరం ఫోర్ట్: ఈ ముగ్గురు చిన్నారులే కాదు. ప్రతిరోజు ఘోషా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చి ఎక్స్రే అవసరమైన చిన్నారులకు ఎదురువుతున్న సమస్య ఇది. ఘోషా ఆస్పత్రిలో మాన్యువల్ ఎక్స్రే యూనిట్ ఉన్నా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వజన ఆస్పత్రికి డిజిటల్ ఎక్స్రే కోసం పంపిస్తున్నారు. ఎక్స్రేకోసం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఘోషా ఆస్పత్రిలో ఉన్న ఎక్స్రే యూనిట్ను వినియోగిస్తే వ్యయప్రయాసలు తప్పేవని పేర్కొంటున్నారు. ఎక్స్రే కోసం రెండు, మూడు గంటలు ఆస్పత్రిలో నిరీక్షించాల్సి వస్తోందన్నారు. జిల్లా వైద్యాధికారులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఎక్స్రే కోసం కోసం ఘోషా ఆస్పత్రి నుంచి జీజీహెచ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఘోషా ఆస్పత్రిలో ఎక్సరే యూనిట్ ఉన్నా జీజీహెచ్కు పంపిస్తున్న వైనం అవస్థలు పడుతున్న చిన్నారులు -
అనుమానంతోనే భార్య హత్య
దత్తిరాజేరు: ఈనెల 6న గుచ్చిమి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో భార్య యాకల గౌరమ్మను అనుమానంతోనే భర్త సత్యం హతమార్చాడని బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య తెలిపారు. నిందితుడు పెదమానాపురం బీసీ కాలనీ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై జయంతి, సీఐ రమణ పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పెదమానాపురం పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య వివరాలు వెల్ల డించారు. స్వగ్రామం చుక్కపేట నుంచి పొలం పనులకు వెళ్తుండగా తోట వద్ద కొడవలితో హత్య చేసి అక్కడి నుంచి చెరువులో సెల్ఫోన్ పడేసి రక్తపు మరకలు కడుక్కుని మరడాం, మేడపల్లి, పోరాం, ఉద్దంగి వద్ద జాతీయ రహదారి దగ్గరలో నిందితుడు వేసుకున్న షర్ట్ను విప్పేసి తువ్వాలు కప్పుకుని బొండపల్లి మండలం గొల్లుపాలెంలో ఐదు రోజుల పాటు గొర్రెల కాపరులతో ఉన్నాడు. వారు డబ్బులు ఇవ్వక పోవడంతో పెందుర్తిలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పని చేయగా కూలి రూ.2వేలు రావడంతో ఆ డబ్బులతో బుధవారం సాయంత్రం పెదమానాపురం వచ్చాడు. భార్య మృతి చెందిందా? లేదా? పిల్లలు ఎలా ఉన్నారో? ఊరి పరిస్థితి తెలుసుకోవడానికి నిందితుడు పెదమానాపురం వచ్చిన సమాచారంతో పోలీసులకు పట్టుబడడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. -
జననేత కరచాలనం కోసం...
● జగన్తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారూ పోటీ పడ్డారు. గోడలు, గేట్లు గెంతారు. ● జగనన్నను చూసేందుకు పాలకొండ రోడ్డులో దారి పొడవునా జనం వేచిచూశారు. ఇళ్ల డాబాపైకి ఎక్కి ఆశగా చూశారు. ● అభిమానులు అడుగడుగునా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ● మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాలకొండ చేరుకున్నారు. సాయంత్రం 4.15 నిమిషాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ● పట్టణంలో పలువురు చిన్నారులను ఆయన దగ్గరకు తీసుకోవడంతో తల్లిదండ్రులు మురిసిపోయారు. ● క్యాన్సర్తో బాధపడుతున్న ఐదేళ్ల కుమారుడి కష్టాన్ని పాలకొండకు చెందిన ముదిల జ్యోతి జగన్మోహన్రెడ్డికి వివరించగా.. చిన్నారి ఆరోగ్య బాధ్యతను మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. సైలెన్సర్ల ధ్వంసం విజయనగరం క్రైమ్: వాహనాలకు పెద్ద శబ్దాలు వచ్చేలా సైలెన్స్ర్లను ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి బాలాజీ జంక్షన్ వద్ద దాదాపు 300 సైలెన్స్ర్లను రోడ్డురోలర్తో గురువారం ధ్వంసం చేయించారు. అధిక శబ్దం వచ్చేలా సైలెన్స్ర్లను ఏర్పాటుచేసిన వాహనచోదకుల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సూరినాయుడు, ఎస్ఐలు భాస్కరరావు, నూకరాజు, రవి, మురళీ, లక్ష్మీప్రసన్నకుమార్, సురేంద్ర నాయుడు, రేవతి తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై విస్తృత ప్రచారం విజయనగరం అర్బన్: ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్లో ఇంటి వద్ద నుంచి అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలు పొందేందుకు వీలుగా రూపొందించిన వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం 95523 00009 వాట్సప్ నంబర్ ద్వారా 158 రకాల ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో వెయ్యి సేవలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో అత్యంత నిరుపేదల గుర్తింపుకోసం మార్చి 8 నుంచి సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6న జిల్లా అధికారులతో దీనిపై సమావేశం నిర్వహిస్తామని, మార్చి 7న మండల స్థాయిలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగ నున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రూప్–2 పరీక్ష
విజయనగరం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం విజయనగరంలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ... అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు ఏదైనా ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డును తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ ప్రతినిధులు డి.మల్లికార్జునరెడ్డి, డి.నాగభూషణం, టి.నందగోపాల్, తదితరులు పాల్గొన్నారు. సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్: 08922 236947 ఏర్పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ -
గంజాయి అక్రమ రవాణా నిందితుడి అరెస్టు
రామభద్రపురం: 2019లో ఐషర్ వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పరారైన నిందితుడు డ్రైవర్ కిల్లో చిరంజీవి స్థానిక బైపాస్ రోడ్డులో పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో కాకర్లవలస జంక్షన్ వద్ద సాలూరు మీదుగా రామభద్రపురం వైపు వస్తున్న గంజాయితో ఉన్న వ్యాన్ 2019 జూన్ 17వ తేదీన స్థానిక పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబూరుగు మండలం తామర వీధి గ్రామం నుంచి 266 కిలోల గంజాయిని ఐషర్ వ్యాన్తో అక్రమంగా తరలిస్తుండగా కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో ఎస్సై బి.లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యాన్ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్ కిల్లో చిరంజీవి పరారవడంతో క్లీనర్ వెల్లంగి రమేష్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేిశారు. ఇన్నాళ్ల తరువాత స్థానిక బైపాస్ రోడ్డులో అప్పటి నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం పోలీసులు చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. -
పాలకొండంత అభిమానం
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ/పాలకొండ రూరల్: అభిమానం ఎక్కడికీ పోలేదు.. మమకారం ఇసుమంతైనా తగ్గలేదు.. ఆప్యాయత అణువంతైనా మారలేదు. మన్యం ప్రజలకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధ్య విడదీయరాని అనుబంధం పాలకొండ సాక్షిగా గురువారం నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డిపై తమ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న మమకారం ఆయన పర్యటనలో కనిపించింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పాలకొండ రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.అడుగడుగునా అభిమాన వర్షం..వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన... విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వీరఘట్టం రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు ఆయనకు అక్కడ ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణి వెంట రాగా.. రోడ్డు మార్గంలో రాజాం జంక్షన్, కోటదుర్గ జంక్షన్ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాలకొండలోని పాలవలస ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర అభిమానులు ద్విచక్ర వాహనాలతో ఆయన వెంట హుషారుగా కదిలారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల జగన్ ఎక్కడా వాహనం దిగనప్పటికీ... మధ్యమధ్యలో ప్రజల అభిమానంతో కారు మీద నుంచే ఆగి, అభివాదం చేసుకుంటూ వెళ్లారు.పాలవలస ఇంటి వద్ద మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు. -
చికెన్ వినియోగంపై అపోహలు వద్దు
● జిల్లాలో బర్ట్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవు ● హెూటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావువిజయనగరం: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేనని, చికెన్ వినియోగంపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని మయూర హోటల్లో జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా పాల్గొని ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు మీడియా సహకారం కావాలని కోరారు. కేవలం రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బర్డ్ఫ్లూలక్షణాలు కనిపించాయని, విజయనగరం జిల్లాలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. హోటల్స్ పరంగా తాము నిత్యం దాడులు నిర్వహిస్తున్నామని, ఎవరైనా కల్తీ చేసినట్లు నిరూపితమైతే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పుకార్లు రావడంతో హోటల్స్ వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయన్నారు. ప్రజలు చికెన్ వినియోగింవచ్చన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నవీన్, శ్రీనివాసరావు, కాళ్ల సునీల్, మహమ్మద్ అకితుల్లా, రోహిత్, ఈశ్వర్, పఠన్, చందు తదితరులు పాల్గొన్నారు. -
విందులో విష సంస్కృతి
చర్యలు లేవుప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతోంది. పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా దారి మళ్లించి ప్లాస్టిక్భూతం ప్రజల మధ్యకు వస్తోంది. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాలి, ప్రతి ఒక్క ఉద్యోగికి ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యం కల్పించాలి. ఆర్వీజే నాయుడు, రాజాం పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్, చర్యలు తీసుకుంటున్నాంరాజాం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం. తొలుత షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం చేస్తున్నాం. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపై దృష్టిసారిస్తాం. వాటితో పాటు వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఫిర్యాదుచేయాలి. సీహెచ్. ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్, రాజాం ● విచ్చలవిడిగా ప్లాస్టిక్ బఫే ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు ● కలుషితమవుతున్న ఆహారపదార్థాలు ● ప్రమాదకరంగా పరిశ్రమల పరిసర ప్రాంతాలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం ● వాటర్ ప్లాంట్లుల్లోనూ అదే పరిస్థితిరాజాం: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న విందు భోజనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. శుభకార్యక్రమాలు, పెళ్లిళ్లు, పూజలు, పేరంటాళ్ల పండగ వంటి కార్యక్రమాల్లో నిర్వహించే సామూహిక భోజన కార్యక్రమాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. గతంలో ఈ భోజనాల్లో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు వినియోగంలోకి వచ్చాయి. వాటిని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాటిలో భోజనాలు చేసే వ్యక్తులు క్యాన్సర్ వంటి భయానక రోగాలబారిన పడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వాటితో పాటు ఆయా కార్యక్రమాల వద్ద వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా ప్రమాదకర వ్యాధులను ప్రజలకు అంటగడుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల వద్ద ప్లాస్టిక్ కవర్లు పోగులుగా ఏర్పడి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అంతా కలుషితమే ఇప్పుడు ప్రతి గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికోసం వినియోగిస్తున్న ముడిసరుకు చాలా ప్రమాదకరంగా ఉంది. వాటితయారీ అనంతరం వచ్చిన వ్యర్థాలు ఆయా పరిశ్రమల పక్కన పొలాల్లో, చెరువుల్లో పడేయడంతో ఆయా ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వాటిని అన్నసంతర్పణలు, భోజనాల్లో వినియోగించిన తరువాత ప్లేట్లను ప్రధాన రహదారులు, చెరువుల పక్కన వదిలేయడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర రసాయనాలతో కలుషితంగా మారుతున్నాయి. మానవుని ఆరోగ్యంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలిన ఆహార పదార్థాలు తినడం ద్వారా పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. అలాగే ఆయా కార్యక్రమాల వద్ద వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ వినియోగం ప్రమాదరంగా మారుతోంది. అవి ఏళ్ల తరబడి భూమిలో కలవడంలేదు. వాటిని పడేస్తున్న పంటపొలాలు, చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పర్యావరణం కలుషితమై చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకర రసాయనాలు పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వాటి తయారీలో వినియోగిస్తున్నారు. మోట్రో సోమిన్, బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటున్నాయి. వాటిలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసిన వెంటనే కరిగి ఆయా ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. దీంతో చర్మసంబంధిత వ్యాధులతో పాటు ప్రమాదకర క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు శశికుమార్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారుడు అర్హత సాధించాడు. ఈనెల 20 నుంచి 23 వరకు కటక్లో జరగనున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన శశికుమార్ ఎంపికయ్యాడు. ఈ క్రీడాకారుడు గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. శశికుమార్ ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవీపీ రాజు, అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణరావు, ట్రెజరర్ శివకుమార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
మహాశివరాత్రికి రామతీర్థంలో గట్టి పోలీస్ బందోబస్తు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై దేవస్థానం సిబ్బందితో చర్చించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులకు దన్నానపేట జంక్షన్ వద్ద, విజయనగరం వైపు నుంచి వచ్చే భక్తులకు సీతారామునిపేట జంక్షన్ వద్ద పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జాతరలో నిరంతర నిఘా ఉంటుందని, డ్రోన్స్ను వినియోగించి గస్తీ నిర్వహిస్తామన్నారు. ఆకతాయల కదలికలపై నిఘా పెడతామని, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై గణేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. సీఐ రామకృష్ణ -
ఉపాధ్యాయసంఘాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పార్టీల కతీతంగా స్వతంత్రంగా, కేవలం ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్నానని గాదెశ్రీనివాసులునాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మెరకముడిదాం మండలంలోని భైరిపురం, గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి, గరుగుబిల్లి, సాతాంవలస జెడ్పీపాఠశాలలతో పాటు మెరకముడిదాం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, గర్భాం ఏపీ మోడల్స్కూల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి నట్లయితే చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే మహిళలకు అవసరమైన మరిన్ని సెలవులను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆల్తిరాంబాబు, జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మండలానికి చెందిన పలు యూనియన్ల నాయకులు ఆర్.సింహాద్రి, టీవీవీఎల్.నరసింహులు, కృష్ణ, సత్తారు రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎస్ ఇప్పించండి కాగా మెరకముడిదాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెశ్రీ నివాసులనాయుడిని మెరకముడిదాం మండలానికి చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు (పార్ట్టైమ్ ఉద్యోగులు, సీఆర్ఎంటీలు, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది) కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తమకు ఎంటీఎస్ ఇప్పించాలని, అలాగే తమను పార్ట్టైమ్ ఉద్యోగులుగా కాకుండా ఒకేషనల్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం పరిగణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన గాదె శ్రీనివాసులునాయుడు తాను గెలుపొందిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్కుమార్, శంకర్రావు, సత్యవతి, ఉగాది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు -
లలిత క్రీడా వైభవం
విజయనగరం: చైన్నెలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా ఈ నెల 17 నుంచి వరకు జరిగిన 23వ పారా జాతీయస్థాయి చాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో జిల్లాకు స్వర్ణపతకం దక్కిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన కిల్లక లలిత 400 మీటర్ల పరుగు పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. గతం లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించిన లలిత చైన్నెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్ సాధించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించినట్లు చెప్పారు. ఈ విజయం క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పారా జాతీయపోటీల్లో పతకం సాధించిన లలితతో పాటు కోచ్ తబరీష్లను కలెక్టర్ డాక్టర్.బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామిలు అభినందనలు తెలియజేశారు. పారా జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణపతకం -
రాష్ట్రస్థాయి వెటరన్ షటిల్ పోటీలకు పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న వెటరన్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్టు గురువారం పయనమైంది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం 30 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా జట్టుకు కోచ్ అండ్ మేనేజర్లుగా వై.కుసుం బచ్చన్, నున్న సురేష్లు వ్యవహరించనున్నారు. ఈ బృందంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది క్రీడాకారులు కుసుం బచ్చన్, టీఎల్.సుబ్బారావు, మల్లికార్జునరావు అపర్ణ బాబా, గణేష్, నవీన్కుమార్, ఖలీ లుల్లా, ఎం. శ్రీను, పైడిరాజు పాల్గొననున్నారు. ఈ బృందానికి జిల్లా గుర్తింపుతో టీ షర్ట్స్ను జిల్లా సంఘం చైర్మన్ ఇందుకూరి రఘురాజు బహుకరించగా, జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేఏ నా యుడు జిల్లా సంఘం ద్వారా క్రీడాకారులకు ప్రవేశరుసుము, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లిస్తున్నారు. జి ల్లా జట్టుకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
వైఎస్సార్సీపీలో సంస్థాగత నియామకాలు
విజయనగరం: రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్పార్సీపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీలో నూతన నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. నూతనంగా నియామకమైన నాయకులు రానున్న నాలుగు సంవత్సరాల పాటు పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నూతన నియామకాలు ఇవే.. నూతన నియామకాల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజాంకు చెందిన టంకాల అచ్చంనాయుడు, బొబ్బిలి నుంచి చొక్కాపు లక్ష్మణరావు, నెల్లిమర్ల నుంచి పతివాడ అప్పలనాయుడు, విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సీనియర్ కార్పొరేటర్ శెట్టి వీర వెంకట రాజేశ్వరరావు, గజపతినగరం నుంచి పాండ్రంకి సంజీవరావు, చీపురుపల్లి నుంచి శిరవూరు వెంకటరమణ రాజు, ఎస్ కోట నుంచి నూకల కస్తూరి నియామకమయ్యారు. జిల్లా పార్టీ కోశాధికారిగా రాజాం నియోజకవర్గానికి చెందిన సిరిపురపు. జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గజపతినగరం నుంచి వర్రి నరసింహమూర్తి, నెల్లిమర్లకు చెందిన అల్లాడ సత్యనారాయణమూర్తి, చీపురుపల్లి నుంచి ఇప్పిలి అనంత్ , విజయనగరం నుంచి సంగంరెడ్డి.బంగారు నాయుడు, బొబ్బిలి నుంచి తమ్మిరెడ్డి దామోదర్ రావులు నియమితులయ్యారు. అదేవిధంగా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా విజయనగరం నుంచి బొద్దాన అప్పారావు, కిలారి రాంబాబు, గజపతినగరం నుంచి తొత్తడి సత్తిబాబు, సుంకరి రామునాయుడు, బొబ్బిలి నుంచి చెలికాని.మురళీకష్ణ, ఆవు సత్యనారాయణ, రాజాం నుంచి కనకాల సన్యాసినాయుడు, కిమిడి ఉమామహేశ్వరరావులను నియమించారు. ఎస్.కోట నుంచి పినిశెట్టి వెంకటరమణ, పినిశెట్టి కష్టప్ప దొర, చీపురుపల్లి నుంచి శీర.అప్పలనాయుడు, నెల్లిమర్ల నుంచి లంక లక్ష్మణరావు, కర్రోతు వెంకటరమణలు నూతన కమిటీలో స్థానం దక్కించుకున్నారు. జిల్లా కార్యదర్శులుగా విజయనగరానికి చెందిన దుప్పాడ సునీత, కునుకు నాగరాజు, గజపతినగరం నుంచి బండారు బంగారమ్మ, సుమల గోవింద, బొబ్బిలి నుంచి సీహెచ్ సత్యనారాయణ, భమిడిపాటి విశ్వనాథశర్మ, రాజాం నుంచి ఎస్.రమేష్ నాయుడు, గడి మధుసూదనరావు, ఎస్.కోట నుంచి ఎం.అప్పారావు, పల్లా భీష్మా, చీపురుపల్లి నుంచి కొణిశి కృష్ణంనాయుడు, కరిమజ్జి శ్రీనివాసనాయుడు, నెల్లిమర్ల నుంచి బుగత రమణ, జి.మురళీమోహనరావులు నియామకమయ్యారు. అదేవిధంగా పార్టీ స్పోక్స్ పర్సన్గా రాజాం నుంచి ఉత్తరావల్లి సురేష్ముఖర్జీ, బొబ్బిలి నుంచి బి.సత్యనారాయణ, చీపురుపల్లి నుంచి రేగిడి లక్ష్మణరావు, గజపతినగరం నుంచి కరణం ఆదినారాయణ, నెల్లిమర్ల నుంచి సముద్రపు రామారావు, విజయనగరం నుంచి కనకల రఘురామారావు, ఎస్.కోట నుంచి గొర్లె రవికుమార్లు నియమితులయ్యారు. -
జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
వీరఘట్టం: వీరఘట్టంలో కొంతమంది వ్యక్తులు నకిలీ స్టాంపుల విక్రయాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనుగోలు చేసిన రూ.10, రూ.50 స్టాంపు పేపర్లను పోలిన మాదిరిగానే కలర్ జిరాక్స్లు తీసి అడ్డుగోలు వ్యాపారానికి తెరతీశారు. భూముల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల కోసం ఈ స్టాంపు పేపర్లు అవసరమైన వారు అవి నకిలీ అని తెలియక కొనుగోలు చేస్తున్నారు.ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూరిల్లు దగ్ధందత్తిరాజేరు: మండలంలోని టి.బూర్జవలసలో చింతగడ ప్రసాద్కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు సర్పంచ్ మంత్రి క్రాంతికుమార్, ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారని చెప్పారు. నిరుపేద అయిన ప్రసాద్కు చెందిన ధాన్యం, బియ్యం, పప్పు దినుసులు టీవీ ఇతర ఇంటి సామగ్రి బట్టలు, ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో కటుంబసభ్యులు రోడ్డున పడ్డారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని దుప్పలపూడి గ్రామం సమీపంలో గురువారం బైక్పై వెళ్తున్న మాజీ ఎంపీటీసీని ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతరేగ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పెద్దింటి పైడిపునాయుడు తన అత్తయ్య ఆరోగ్యం బాగులేకపోవడంతో బొబ్బిలి తీసుకెళ్లాడు.అక్కడ వైద్యాధికారికి చూపించి తిరిగి సొంత గ్రామానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా దుప్పలపూడి జంక్షన్కు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టి తప్పించుకుని పరారయ్యాడు. వెంటనే స్థానికులు పైడిపునాయుడిని ప్రథమచికిత్స నిమిత్తం స్థానిక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు స్పందించిన ఎస్సై వి.ప్రసాదరావు ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరిచారు.ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరనం కొత్తరేగలో వివాహం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తుండగా ఢీ కొట్టింది తానేనని అదే గ్రామానికి చెందిన చొక్కాపు గౌరీశ్వరరావు ఎస్సై ముందు అంగీకరించాడు. దీంతో ఎస్సై కేసు నమోదు చేశారు. ఎన్డీఏ, ఐఎన్ఏకు సైనిక పాఠశాల విద్యార్థుల అర్హతవిజయనగరం రూరల్: యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), ఇండియా నేవల్ అకాడమీల్లో (ఐఎన్ఏ) ప్రవేశాలకు కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు 8 మంది అర్హత సాధించారని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయగా కోరుకొండ పాఠశాలకు చెందిన 8 మంది ఈ ఏడాది ఎన్డీఏ, ఐఎన్ఏకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఎన్డీఏ, ఐఎన్ఏల్లో ప్రవేశాలే లక్ష్యంగా అందిస్తున్న శిక్షణ, కార్యకలాపాలే ఈ విజయానికి కారణమన్నారు. ఇంతటి విజయానికి కారకులైన పాఠశాల అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. -
27న జీఎంఆర్ నైరెడ్లో ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు రిప్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ (13 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), మగ్గం వర్క్స్ (30 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డులతో పాల్గొనాలని సూచించారు. జెంట్స్ టైలరింగ్, లేడీస్ టైలరింగ్, మగ్గం వర్క్స్కు హాజరయ్యేవారికి 5వ తరగతి విద్యార్హత ఉంటే చాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు
విజయనగరం ఫోర్ట్: గులియన్ బర్రీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ, కట్టడిచేయడానికి అవసరమైన ల్యాబ్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాగునీటి పథకాలను షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయాలని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవన రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు బలహీన పడడం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి 80 శాతం మందికి సహజంగానే తగ్గిపోతుందన్నారు. 15 శాతం మందికి చికిత్స అవసరమని, కేవలం 5 శాతం మందికి మాత్రమే పరిస్థితి విషమంగా మారుతుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి సీఈఓ ఆర్.వెంకటరామన్, డీపీఓ టి.వెంకటేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ -
ఉద్యోగ భద్రత కల్పించండి
గజపతినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా అతిథి అధ్యా పకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్జరోతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయనగరంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. గెస్ట్ లెక్చరర్స్ సమస్యను క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని మంత్రిని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగభద్రత కల్పించి ఆదుకోవాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో అధ్యాపక సంఘ నాయకులు బూడి అచ్చుంనాయుడు, కర్రోతు పైడిరాజు పాల్గొన్నారు. -
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీఏపీ) బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ఐదోతరగతిలో ప్రవేశాలు కల్పించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్లో 140 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60, బైపీసీ–40, సీఈసీ–40 సీట్లు ఉన్నాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హతలు గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరంగా (202–24, 2024–25) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 01.09.2014 –31.08.2015 మధ్య జన్మించి, 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2013–31.08.2017 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు. జిల్లాలో మూడు బాలికలు, నాలుగు బాలుర ఎంజేపీఏపీ బీసీ గురుకులాలు 440 మంది విద్యార్థులకు ఐదోతరగతిలో ప్రవేశాలకు అవకాశం నెల్లిమర్లలో ఇంటర్లో ప్రవేశానికి 140 సీట్లు వచ్చేనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి/సంరక్షకుని మొబైల్ నంబర్ తదితర ప్రాథమిక వివరాలతో రూ.100 చెల్లిస్తే జర్నల్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా హెచ్టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపిన తరువాత వచ్చే రిఫరెన్స్ నంబరుతో దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకోవాలి. పాఠశాలలకు నేరుగా అందజేసే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోరు. అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్లో ప్రవేశానికి మార్చి 15వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – కేబీబీ రావు, గురుకులాల జిల్లా కన్వీనర్, విజయనగరం -
వై.ఎస్.జగన్తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వై.ఎస్.జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వై.ఎస్.జగన్ ఆదేశించారు. -
ఉత్సాహంగా శరీర సౌష్టవ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువతను ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో మొదటిసారిగా పోటీలు జరగడంతో వివిధ జిల్లాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహించినట్టు హనుమాన్ సేవాసమితి ప్రతినిధులు ముగడ అనిల్, పొట్టేలు రవి తెలిపారు. పోటీలను ఎమ్మెల్యే బేబీనాయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్వర్మ, పువ్వల శ్రీనివాసరావు, గెంబలి శ్రీనివాసరావు, వేణుగోపాలరావు తదితరులు తిలకించారు. -
వసతిగృహం సందర్శన
విజయనగరం లీగల్: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్ సుంకరవీధిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహాన్ని బుధవారం సందర్శించారు. మెనూ సరిగా అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి వార్డెన్ను ప్రశ్నించారు. బాలికలకు సరిపడా బెడ్స్ సమకూర్చాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్, ఎంఈఓలు కూర్మానందరావు, పి.సత్యవతి, టూ టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి ఉన్నారు. గంజాయి రవాణాపై నిఘా విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై నిఘావేసి నియంత్రించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్టి ఎస్పీలను ఆదేశించారు. విశాఖపట్నంలోని తన కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో బుధవారం మాట్లాడారు. వివిధ నేరాలపై సమీక్షించారు. గంజాయి వ్యాపారులపై పీడీ యాక్టులు నమోదు చేయాలని, వారి ఆస్తులు సీజ్చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు వేగవంతంగా పరిహారం అందేలా చూడాలన్నారు. మహిహిళలకు భద్రత కల్పించాలని, పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు. భార్యను చంపిన వ్యక్తి అరెస్టు దత్తిరాజేరు: గుచ్చిమి గ్రామ సమీపంలోని చౌదరి తోటలో యాకల గౌరమ్మను కొడవలితో నరికి చంపిన భర్త యాకల సత్యంను పెదమానాపురం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6వ తేదీన చుక్కపేట నుంచి గుచ్చిమి వద్ద ఉన్న పొలానికి పనికి వెళ్తుండగా వెనుక నుంచి వెళ్లి కొడవలితో దాడిచేయడంతో గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడి అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు పెదమానాపరం రైల్వే గేటు వద్ద పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. -
ఆశ్రమ పాఠశాలలకు కోడిగుడ్డు కట్
సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెనూలో భాగంగా పోషకాహరం అందివ్వడానికి పెట్టే కోడిగుడ్లు నిలుపుదల చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఆదేశించారు. పక్క ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఎగ్స్ పెడుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిలిపివేయడం గమనార్హం. అలాగే మిడ్డేమీల్, అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్నప్పటికీ ఆశ్రమపాఠశాలలకు మాత్రమే నిలుపుదల చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మిగతా ఐటీడీఏలలో ఎక్కడా కోడిగుడ్లు నిలుపుదల చేయలేదని స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రమే ఆపివేశారని వాపోతున్నారు. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలకు కలిపి మొత్తం 3,70,000 కోడిగుడ్లు అవసరం. ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు (శనివారం మినహాయించి )ఇచ్చేవారు. చికెన్, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినవచ్చని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేస్తోంది. చికెన్ ఎలాగూ బర్డ్ఫ్లూ భయంతో నిలుపుదల చేశారు. కనీసం ఎగ్ కూడా పెట్టకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏమన్నారంటే..ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర వద్ద సాక్షి ప్రస్తావించగా తుని నుంచి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, బర్డ్ఫ్లూ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా కొద్ది రోజులు నిలిపివేయాలని అన్ని వసతిగృహాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అంతకు ముందు చికెన్ నిలిపివేత బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిర్ణయం -
ఉపాధికల్పనలో అలసత్వం..!
విజయనగరం ఫోర్ట్: ఉత్తుత్తి హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... అన్నింటా వైఫల్యం చెందుతోందన్న మాట ప్రతిఒక్కరి నోటా వినిపిస్తోంది. ఓ వైపు ప్రజాసంక్షేమ పథకాలు ఎండమావిగా మారాయి. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పల్లెల్లోని చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు ‘ఉపాధి’ చూపడంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. పనికి ఆసక్తిచూపే వారందరికీ కాకుండా కొంతమందికే ఉపాధి పనులు కల్పించడంపై వేతనదారులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలోనూ వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనుల కల్పనలో వెనుకబడి ఉండడంపై ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కువ మంది వేతనదారులకు పనికల్పించారు. దీని వల్ల వేతనదారుల జీవోనపాధికి ఇబ్బంది ఉండేది కాదు. పని కోసం వలస వెళ్లాల్సిన అవసరం తప్పేది. పనుల కల్పనలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేదని గుర్తుచేస్తున్నారు. 2023–24లో ఫిబ్రవరి 19 నాటికి 1.78 కోట్ల పనిదినాల కల్పన 2024–25లో 1.53 కోట్ల పనిదినాలే.. గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనిదినాలు తక్కువ ఆవేదనలో వేతనదారులు పని కల్పనకు చర్యలు పని అడిగిన వేతనదారుడికి పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చి నెలఖారు నాటికి పని దినాల లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తాం. వ్యవసాయ పనులు ముగిసినందున పనుల్లో పాల్గొనే వేతనదారుల సంఖ్య పెరుగుతోంది. – ఎస్.శారదా దేవి, డ్వామా పీడీ జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6.05 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీనాటికి 1.78 కోట్ల పనిదినాలు కల్పించారు. 2024–25లో ఫిబ్రవరి 19వ తేదీ నాటికి 1.53 కోట్ల పని దినాలే కల్పించారు. గతేడాది కంటే ఇదే సమయానికి 25 లక్షల పనిదినాలు తక్కువగా కల్పించారు. ఉపాధిహామీ పథకం కింద నీటి వాగులు, కుంటలు, చెరువుల ఆధునికీకరణ, పొలాల చుట్టూ సరిహద్దు కందకాలు, పంట కుంటలు, ఊట కుంటలు వంటి పనులు గ్రామ సభల ఆమోదం మేరకు జరపాలి. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో వెండర్ విధానానికి తెరతీయడంతో వేతనదారులకు పనిలేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పథక నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులకే ఖర్చుచేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టుబొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు. -
పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు ● భారీగా పోలీసుల మోహరింపుబొబ్బిలి: పట్టణంలోని 29వ వార్డు పాకివీధి సమీపంలో 1.40ఎకరాల స్థలాన్ని పారిశుధ్య కార్మికులకు కేటాయించాలని గత పాలకులు ఇచ్చిన హామీ మేరకు అందులో తాత్కాలికంగా వారు వేసుకున్న పాకలను మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు పొక్లెయిన్లతో తొలగించారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం పారిశుధ్య కార్మికులు ఇళ్ల వద్ద లేని సమయంలో పాకలు తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులను మహిళలు అడ్డుకున్నా వెరవకుండా తొలగించారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కార్మికులు, సంఘం నాయకులు అంతా ఒక చోట చేరి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఆక్రమించి మోహరించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన స్థలం కోసం 1991లోనే మున్సిపల్ కార్యాలయానికి రుసుము చెల్లించామని ఆ రశీదులు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, సీఐలు కె. సతీష్ కుమార్, నారాయణరావు, ఎస్సై ఆర్.రమేష్ల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మీకు స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఆ పార్టీలోనే ఉండబోనని టీడీపీ నాయకుడు కాకల వెంకటరావు కార్మికులకు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కార్మికులు మెమొరాండం సమర్పించగా మున్సిపల్ ఉన్నతాధికారుల లేఖను కార్మికులకు వారు అప్పగించారు. అక్కడ నిర్మించిన పాకలను వెంటనే తొలగించాలని పోలీసులు, అధికారులు కోరారు. పాకలను తొలగించే వరకూ సరేనని, కానీ అక్కడున్న కర్రలను తొలగించేది లేదని చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ స్థలంలో కర్రలను తొలగించకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులుంటాయని హెచ్చరించడంతో కాసేపు తోపులాట జరిగింది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి. ఆరుగురి అరెస్ట్ కేసుల నమోదుఆ సమయంలో కోపోద్రిక్తులైన పోలీసులు ఆరుగురు కార్మిక సంఘం నాయకులు పొట్నూరు శంకరరావు, బంగారి యుగంధర్, ఏడుకొండలు, వడ్డాది శంకర రావు, జి.గౌరీశు, బంగారి వెంకట రమణలను పోలీసు వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్కు తీసుకువెళ్లిపోయారు. అక్కడ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్కడి నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ వారిపై బైండోవర్ చేశారు. ఇండ్ల స్థలాలను అడిగితే ఇలా అరెస్టులు, కేసులు ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. చర్చల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శ శరత్, కాకల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దార్ విజయభాస్కర్ సిబ్బంది బుధవారం చెరువు దగ్గరకు చేరుకుని చుట్టూ వేసిన ఇనుప కంచెను, చెరువు గట్టుపై వేసిన కంచెను తొలగించాలని ఆక్రమించిన ఎన్ఆర్ఐ బంధువులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వ భూమిలో వేసిన కంచెను తీస్తామని రైతులు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కోరడంతో..రెండు రోజుల్లో తొలగించని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు. 200 ఎకరాలకు వెళ్లే దారిని మూసి వేయడంతో రైతులు ఆందోళన చెంది సర్పంచ్ గర్భాపు విజయలక్షి, భర్త శ్రీనివాసరావు ద్వారా పత్రికలో కథనం రావడంతో పొలాలకు వెళ్లే మోక్షం కలింగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కంచె తొలగించాలని ఆదేశాలు -
నేటి నుంచి ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీలు
నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు, కందుకూరి వీరేశలింగం అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ ఆరిపాక బ్రహ్మానందం మాస్టారి పేరిట ఈ నాటక పోటీలను ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎంఎల్ఏ లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభ అనంతరం నాటిక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. తొలిరోజు హైదరాబాద్ కళాంజలి కళాకారులు’ రైతే రాజు’ నాటికను తర్వాత కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్న్స్ కళాకారులు ’ఎడారిలో వాన చినుకు’ నాటికను ప్రదర్శిస్తారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమానికి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, భీశెట్టి బాబ్జీ, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వేమలి త్రినాథరావు హాజరు కానున్నారు. రెండో రోజు రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం కళారారులు ’కొత్త పరిమళం’ నాటికను, తర్వాత విజయనగరానికి చెందిన సౌజన్య కళా స్రవంతి (ఉత్తరాంధ్ర) కళాకారులు దేవరాగం నాటిక ప్రదర్శించనున్నారు. మూడో రోజు శనివారం సాయంత్రం 6గంటలకు సభా కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ’చీకటి పువ్వు నాటికను, తర్వాత విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి కళాకారులు ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత ’నాటికను ప్రదర్శించమన్నారు. విజేతలకు బహుమతులు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అతిథుల చేతుల మీదుగా జరజాపు పేటకు చెందిన సీనియర్ కళాకారులను సత్కరించనున్నట్లు పోటీల నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాటక పోటీల విజేతలకు వరుసగా రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులతో పాటు శాశ్వత షీల్డ్ లను అందజేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ నటులకు వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నాటక పోటీలకు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మూడురోజుల పాటు జరగనున్న పోటీలు రెండు రాష్ట్రాల నుంచి ఆరు నాటిక బృందాల రాక -
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్ను ఆశ్రయించారు. ఉభయులూ కలిపి పెద్దల సమక్షంలో సీతానగరం పోలీస్టేషన్కు చేరుకున్నారు. గ్రామ పెద్దలతో పోలీస్టేషన్కు వచ్చిన ఉభయ వర్గాల వారుల స్టేషన్ ఆవరణలో పంచాయితీ నిర్వహించారు. మెడికల్షాపు నిర్వాహకుడు ఉభయుల శ్రేయస్సు దృష్ట్యా తనకున్న స్థిరాస్థులు విక్రయించి బాధితులకు రుణాన్ని తనకున్నంత మేరకు తీర్చుకుంటానని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు. దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌరహక్కుల రక్షణ చట్టం, అత్యాచార నిరోధకర చట్టం జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలో గౌరవ సభ్యులుగా నియమాకం చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎండి.గయాజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అధికార సభ్యులు ముగ్గురు, అనధికార సభ్యులు ఐదుగురు, స్వచ్ఛంద సేవా సభ్యులు ముగ్గురిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార సభ్యులు గ్రూపు ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్స్, అనధికార సభ్యులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు, స్వచ్ఛంద సభ్యులు ఇతర కేటగిరిలకు చెందినవారు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తుతో ఎస్సీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9492535085 నంబర్ను సంప్రదించాలని కోరారు. వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు● 10 కేసుల నమోదు విజయనగరం: విజయనగరం పట్టణంలో, బొండపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎం.దామోదర నాయుడు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడం గుర్తించి 3 కేసులు, తూనిక యంత్రాలలో లొసుగులు వినియోగించి తూకంలో మోసం చేసిన వారిపై 4 కేసులు, అదేవిధంగా ప్యాకేజీలపై ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించిన వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తూకంలో గానీ కొలతలో గానీ తేడా లేకుండా విక్రయించాలని, ముద్రించిన ధరకే ప్యాకేజీలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిభామిని: మండలంలోని లివిరికి చెందిన బౌరి రాజేంద్ర(32) బుధవారం ఉదయం మరణించాడు. మంగళవారం రాత్రి లివిరి–భామిని మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న బౌరి రాజేంద్ర(32), మరో యువకుడు బౌరి తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్థానికుల సహకారంతో బాధితులను భామిని పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం లివిరి స్వగ్రామానికి తీసుకువెళ్లి ఇద్దరు బాదితులకు ప్రైవేట్ వైద్యం అందించినప్పటికీ గాయపడిన బాధితుడు బౌరి రాజేంద్ర(32) మృత్యువాత పడి ఉండడాన్ని భార్య ఉషారాణి బుధవారం ఉదయం గుర్తించి భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించగా లివిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు
చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. -
గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l Isîæ-yîlH M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ yîlH& gôæiĶæÊH M>Æý‡Å-{MýSÐ]l$… {ç³VýS-†Oò³ ÑÑ«§ýl Ô>QÌS A«¨M>Æý‡$-ÌS-™ø çÜÒ$„ìS…^éÆý‡$. ˘ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరతి ఆబా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) కార్యక్రమం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించిందన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో ఆన్లైన్ సబ్కలెక్టర్ యశ్వంత్ కుమార్ పాల్గొనగా, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ బి.చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ దుర్గా చక్రవర్తి, ఎస్ఎస్ఏ పీఓ ఆర్.తేజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోమన్రావు, టీడబ్ల్యూ ఈఈ మణిరాజు, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ కంచిబాబు, జీసీసీ డీఎం మహేంద్రకుమార్, డీఎఫ్ఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
వ్యక్తిపై కత్తితో దాడి
దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం పాతరేగకు గూడాపు సింహాచలం, గాయాల పాలైన పైడిపునాయుడుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గ్రామ శివారుకు స్కూటీపై సింహాచలం వచ్చి పైడిపునాయుడిపై కత్తితో దాడిచేయగా గాయాలపాలవడంతో ముందుగా బాడంగి ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతున్నాడు. దాడిచేసిన సింహాచలాన్ని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్హమోహన్రెడ్డి సుమారు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్టోటింగ్ జెట్టీకి పరిపాలన, ఆర్థిక అనుమతులపై కనీసం పట్టించుకోకపోవడంతో టెండర్ ప్రక్రియ జరగలేదు. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవన విధానం మెరుగుపడేది. జెట్టీలేక పోవడంతో వేట సాగక తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం మత్స్యకారులు వలస పోయారు. జెట్టీ నిర్మాణం పూర్తయితే సుమారు 885 బోట్లకు వరకు జెట్టీలో నిలుపుకునే అవకాశం ఉంది. జెట్టీలేక పోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బోట్లు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో లక్షలాది రుపాయల విలువైన బోట్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 27 కిలోమీటర్ల తీరప్రాంతంలో పూసపాటిరేగ, భోగాపురం మండలాలను కలుపుతూ 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి సర్కారు మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించి ఎంతో కాలంగా మత్స్యకారులు కళగా ఉన్న ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తిచేసే విధంగా అడుగులు మందుకు పడాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలిఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. టెండర్ దశలో ఉన్న ఫ్లోటింగ్ జెట్టీకి అనుమతులు మంజూరు చేసి మత్స్యకారుల సంక్షేమంపై దృషి సారించాలి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లామత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు విజయనగరం మత్స్యకారుల చిరకాల వాంఛ ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం మత్స్యకారుల చిరకాల వాంఛ. జెట్టీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మాణంపై దృష్టిసారించాలి. బొ.కొర్లయ్య, చింతపల్లి ఆరునెలలుగా ముందుకు సాగని పనులు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం వేటసాగక ఇబ్బందులు పడుతున్న గంగపుత్రులు -
23న ఉత్తరాంధ్ర స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకా రులతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం–మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఓపెన్ విభాగంతో పాటు అండర్–7,9,11,13,15 వయస్సుల విభాగాల్లోని బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఓపెన్ విభాగంలో విజేతకు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనుండగా..చిన్నారుల విభాగంలో విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఫోన్ 9703344488 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వృత్తి పరమైన నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్ధులు ఆదిశగా కళాశాల స్థాయి నుంచి తయారు కావాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్ రిటైర్డ్ సైంటిస్టు బీవీఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్స్పై నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు అధికమన్నారు. భవిష్యత్లో అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సావనీర్ను ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీఎస్ఎన్మూర్తి, ప్రొఫెసర్ కె.బాబులు, కేసీబీరావు, డాక్టర్ గురునాథం, డాక్టర్ నీలిమ, డాక్టర్ బి.హేమ, డాక్టర్ జి.అప్పలనాయుడు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి హాజరైన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
–8లో
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు పెట్రోల్ బంకులో చిరిగిన పది రూపాయల నోటు గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదికొచ్చింది. వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు దివ్యాంగులకు రైల్వే పాస్లను ఆన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ను ప్రారంభించింది.20న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలకొండకు రాక సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు రానున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పాలకొండకు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మంగళవారం వెల్లడించారు. 20వ తేదీన జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ 1.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి 2.15 గంటలకు పాలకొండలోని పాలవలస రాజశేఖరం తనయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. దాదాపు గంట పాటు అక్కడ ఉండనున్నారు. తదుపరి సాయంత్రం 3.30 గంటలకు పాలకొండ నుంచి తిరిగి బయలుదేరుతారు. 4.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. -
గాదె గెలుపే లక్ష్యం: ఎస్టీయూ
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ముఖ్యనాయకులు తెలిపారు. స్థానిక పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టీయూ నాయకులు దాడిచిలుక శ్యామ్, వసంతుల గోవిందరావు తదితరులు మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్టీయూ రాష్ట్ర కమిటీ ఏ ఒక్క అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానిక పరిస్థితులు, ఉపాధ్యాయ వర్గాల శ్రేయస్సు దృష్ట్యా గాదె శ్రీనివాసులునాయుడి ప్రాతినిథ్యం ఉండాలని కోరుకుంటున్నామని ప్రకటించారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్టీయూ నాయకులు గాదె గెలుపునకు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శ్రీనివాస్దొర, లచ్చన్న, సత్యనారాయణ, మహేష్, శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్నాయుడు, ఎస్.త్రినాథ్, రెడ్డి గణపతి, రాజారావు, బి.అప్పారావు, ఆనంద్, జాకబ్, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తం
విజయనగరం అర్బన్: ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పీఓలు, ఏపీఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మొదటివిడత శిక్షణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులను ఎన్నిసార్లు నిర్వహించినా ఏ మాత్రం అలసత్వం చూపించకూడదన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని, కొత్త ఆదేశాలు వస్తుంటాయని, వాటన్నింటినీ చదవి అర్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాలు, ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయని, వీటిని ప్రతిఒక్కరూ గ్రహించాలని సూచించారు. డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఎన్నికల సిబ్బంది లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఆర్డీఓ డి.కీర్తి ఇతర అంశాలను వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
సదస్సు పేరుతో ప్రచారం
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రవివర్మకి మద్దతుగా టీడీపీ చీకటి ప్రచారానికి తెరతీసింది. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యాసదస్సు పేరుతో విందు భోజనాలు పెట్టడం, ఎన్నికల ప్రచారం జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల పేరులేకుండా ‘విద్యారంగం–వర్తమాన సవాళ్లు’ అనే అంశంతో పేరుతో మెసానిక్ టెంపుల్ సమావేశ మందిరంలో మంగళవారం విద్యాసదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులను మాత్రమే ఆ సదస్సుకు ఆహ్వానం పలుకుతూ టీచర్లను వాట్సప్ గ్రూపుల్లో ఆహ్వానించారు. తీరా అక్కడి వెళ్తే అది ఎన్నికల ప్రచార వేదికగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉపన్యాసాలు సాగాయి. అనంతరం సదస్సుకు వచ్చిన వారికి విందు పెట్టారు. సదస్సుకు వచ్చిన వారికి ఎమ్మెల్సీ బరిలో ఉన్న పాకలపాటి రవివర్మ ఆహ్వానం పలకడం గమనార్హం. విద్యాసదస్సు పేరుచెప్పి ఇదెక్కడి ఎన్నికల ప్రచారమంటూ పలువురు గురువులు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం. ఎన్నికల కోడ్ ఉల్లంఘన -
ఉద్యోగులను కొనసాగించండి
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ వై.వి.రమణకు మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ పరిధిలో ఉన్న సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈఎంఆర్ఐ ఏజెన్సీ పరిధిలో మూడేళ్లుగా పనిచేస్తున్నారన్నారు. ఈ నెల 15తో సంస్థ కాలపరిమితి ముగిసిందని, ఉద్యోగాల నుంచి తొలగించినట్టు లేఖలు పంపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఏజేన్సీలు మారినా, ప్రభుత్వం అప్పటి వరకు పనిచేసిన ఉద్యోగులను నూతన సర్వీస్ ప్రొవైడర్లతో కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కనీస వేతనాలతో కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్.నరేష్, సాయిసతీష్, సురేష్, జయలక్ష్మి, భద్రకాళి, యోగింధర్ దొర, నీరజ, కావ్య, యశ్వంత్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. జేసీ, పశు సంవర్థక శాఖ జేడీకి వినతిపత్రం అందజేసిన పశు సంచార వాహన ఉద్యోగులు -
ఆ ముగ్గురి మధ్యే పోటీ!
పాకలపాటి రఘువర్మ● కీలక దశకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ● ఈనెల 25 సాయంత్రం 4 గంటలతో ముగియనున్న ప్రచారం ● ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ● మొత్తం ఓటర్లు: 22,493 మంది ● పోలింగ్ కేంద్రాలు: 123 డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు అన్ని ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే ఈసారి ఓటర్లు పెరిగారు. పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లు రావాలి. లేకుంటే 2వ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ● పోటీ వారిమధ్యనే.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. విజయగౌరికి ఉత్తరాంధ్రాలో బలమైన యూటీఎఫ్ సంఘాలు మద్దతు ఇస్తుండగా, రఘువర్మకు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు బీజేపీ నాయకులు, మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీ మాధవ్ మద్దతు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వీరి ముగ్గురి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ● ప్రచారానికి కొద్దిరోజులే సమయం.. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభ్యర్థులు జోరుగా చేపడుతున్నారు. ఈ ప్రచారం ఈ నెల 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రచారంలో స్పీడు పెంచాయి. పాఠశాలల్లో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ● 123 కేంద్రాల్లో పోలింగ్.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్వతీపురం మన్యం, విజయగనరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఉన్న 22,493 మంది ఓటర్ల కోసం 123 పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. ఈ కేంద్రాల్లో 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 8,985 మంది, పురుషులు 13,508 మంది ఉన్నారు. శ్రీకాకుళం–5,035 మంది, విజయనగరం–5,223, పార్వతీపురం మన్యం–2,333, అల్లూరి సీతారామరాజు–1,488, విశాఖపట్నం–5,529, అనకాపల్లి జిల్లాలో 2,885 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఆ ఇద్దరు కూడా... ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగుతుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతుండంగా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బహుజన సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థి పోతల దుర్గారావు కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీ చేస్తున్న సుంకర శ్రీనివాసరావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుండడంతో మొదట ప్రాధాన్యత ఓటు శాతం ప్రధాన అభ్యర్థులకు తగ్గే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నారు. పోటీ అభ్యర్థులకు మద్దతు ఇలా... గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి పీఆర్టీయూ తరఫున బరిలో దిగిన డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడుకు ఏపీటీఎఫ్ (1938), ఆంధ్రపదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘం (ఆప్టా), బహుజన ఉపాధ్యాయ సంఘం, ఆర్యూపీపీ, ఆదివాసీ ఉపాధ్యాయ, ఎస్టీయూ సంఘాల (ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు) మద్దతు ఉంది. తొలిసారిగా బరిలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థిని కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్, ఏపీ మోడల్ స్కూల్ పీఎస్, కేజీబీవీ టీచర్లు, తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. రెండో సారి పోటీలో ఉన్న పాకలపాటి రఘువర్మకు ఏపీటీఎఫ్ (257), ఎస్ఎల్టీఏ, ప్రధానోపాధ్యాయుల సంఘం, పీఆర్టీయూడీ, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు అండగా ఉన్నాయి. -
శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరు వాహనాలతో సేవలు
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్నపలంగా తొలిగించారనే అంశంపై ‘సాక్షి’లో ఈ నెల 17వ తేదీన ‘సంచారం ఓ చదరంగం’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 17 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో మొదటి విడతలో జిల్లాకు వచ్చిన 7 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్వాధీనం చేసుకోమని పశు సంవర్థక శాఖ సంచాలకులు నుంచి ఆదేశాలు వచ్చాయని పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ తెలిపారు. ఆరు వాహనాల సేవలు మాత్రం యథావిధిగా అందుతాయన్నారు. -
మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ˘
విజయనగరం గంటస్తంభం: మహాశివరాత్రి పర్వదినాన వివిధ ఆలయాలు సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థానికి 45 బస్సులు నడుపుతామన్నారు. శ్రీకాకుళం–2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ, చీపురుపల్లి, గరివిడి మీదుగా పాలకొండ డిపో నుంచి 20 బస్సులు వేశామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సు లు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు వేసినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 99592 25620, 94943 31213, 94403 59596 నంబర్లను సంప్రదించాలని కోరారు. పీహెచ్సీల్లో ప్రసవ సేవలు అందించాలి ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) ప్రసవ సేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 10 పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణుల నమోదు, నెలనెలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా జరపాలన్నారు. మాతాశిశు మరణాలను నివారించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారిక మందులు అందజేయాలన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి ˘గుర్ల: అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డీఈఓ యు.మాణిక్యంనాయు డు సూచించారు. గుర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాటలు పాడించడం, ఆటల లో చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. శిక్షణ కార్యక్రమాలు ఆరు రోజులపాటు జరగనున్నాయన్నారు. పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు రాస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. మార్చి 8న జాతీయ లోక్అదాలత్ ● వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం లీగల్: వచ్చేనెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని న్యాయమూర్తులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రాంసిరీ నోట్, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎక్సైజ్, భూములు, కుటుంబ తగాదాలు, వాటర్, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిస్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, టీవీ రాజేష్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవీ రత్నకుమారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రమ్య, ఎకై ్సజ్ న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి పాల్గొన్నారు. -
కుంకి ఏనుగుల నివాస స్థలం పరిశీలన
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడానికి తీసుకురానున్న కుంకి ఏనుగుల నివాసానికి అసరమైన స్థల ఏర్పాట్లను రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట కొండ ప్రాంతంలో కుంకి ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన స్థావరాలను ఆమె తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడు ఏనుగుల గుంపు, పాలకొండ నియోజకవర్గంలో నాలుగు ఏనుగుల గుంపు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా కుంకి ఏనుగులను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
నూతన విధానంతో సులభతరం..
దివ్యాంగులు పాస్లు పొందేందుకు రైల్వేశాఖ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో జిల్లా వాసులు సంబంధిత రైల్వేస్టేషన్కు ఇతరుల సాయంతో వెళ్లి అక్కడ దరఖాస్తు అందజేసేవారు. రైల్వే అధికారులు జిల్లా నుంచి వచ్చిన మొత్తాన్ని సేకరించి సంబంధిత రైల్వే సబ్డివిజన్కు పంపేవారు. అక్కడ అధికారుల ఆమోద ముద్ర పడిన తరువాత తిరిగి జిల్లాకు వచ్చేది. ఇదంతా జరగడానికి దాదాపు మూడు నెలల వరకు సమయం పట్టేది. ఈ లోగా పాస్ల కోసం దివ్యాంగులు నాలుగుసార్లు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ఇబ్బందులను గుర్తించి నూతన విధానానికి రైల్వే శాఖ నాంది పలికింది. దివ్యాంగులు తాము ఉండే ప్రాంతం నుంచే నెట్ సెంటర్, ఈ–సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ తరువాత 20 రోజుల్లోపు వారు ఆన్లైన్లో పాస్ కూడా తీసుకోవచ్చు. సమయంతో పాటు శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కె.కుమార స్వామి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎ.డి, విజయనగరం -
కోట్లాది రూపాయలతో వ్యక్తి పరారీ
సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
సారాతో నలుగురి అరెస్టు
మెంటాడ: సారా తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సారా బాటిల్స్ మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్ర రిజార్వాయర్ వెనుక గల లోతుగెడ్డ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 20 బ్యాటిల్స్లో 40 లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకుని వారిని స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయండి● ట్రాన్స్కో ఎస్ఈ చలపతిరావు ● సాక్షి కథనానికి స్పందన వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా రైతులను మోసగిస్తోందని మంగళవారం సాక్షిలో ప్రచురితమైన ‘ఉచిత విద్యుత్ పధకానికి మంగళం’ అనే కధనంపై జిల్లా ట్రాన్స్కో ఈఓ చలపతిరావు స్పందించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే మండలాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈలను ఆదేశించారు. గూడ్స్ సైడింగ్ ప్రారంభందత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద గందర గోళం మధ్య గూడ్స్సైడింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైల్వే మూడో లైన్ పనులతో పాటు గూడ్స్ సైడింగ్ పనులు అప్పట్లో ప్రారంభమై పూర్తి కావడంతో బొబ్బిలి గూడ్స్షెడ్ స్థానంలో కోమటిపల్లి పల్లి వద్ద మంగళవారం ప్రారంభం కావడంతో ఇంతవరకు బొబ్బిలిలో పని చేసిన కార్మికులతో పాటు వి,కృష్ణాపురం, వింధ్యవాసి, వంగర, పెదమానాపురం, పాచలవలస మరడాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల మంది కార్మికులు రావడంతో మధ్యాహ్నం వరకు పనులు ప్రారంభం కాలేదు. రైల్వేస్టేషన్ నుంచి కోమటిపల్లి ఆటోస్టాండ్ వరకు బియ్యం లారీలు ఉండడం గమనించిన పెదమానాపురం ఎస్సై కాంట్రాక్టర్తో మాట్లాడగా ఆయన కార్మికులతో తొలి రోజు 50 లారీలలో వచ్చిన బియ్యాన్ని రైలులో వేయించారు. చెరకు లారీ బోల్తారాజాం సిటీ: మండల పరిధి రాజయ్యపేట జంక్షన్ వద్ద మంగళవారం చెరుకు లారీ బోల్తా పడింది. పరిమితికి మించి లోడుతో తెర్లాం నుంచి రేగిడి మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద లారీ బోల్తా పడడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికలోడుతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
రామభద్రపురం: పాస్ తీసుకోవడానికి దివ్యాంగులు పడే కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. దివ్యాంగులు ఇక నుంచి రైల్వే పాస్లను నేరుగా స్టేషన్కు వచ్చే తీసుకునే పనిలేకుండా అన్లైన్లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్సైట్ ప్రారంభించింది.అందులోనే ఈ–టికెట్ బుక్ చేసుకునే కొత్త విధానాన్ని ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఆర్థోపెడిక్, అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగత్వం తదితర అంగవైకల్యం కలిగిన అన్ని వయసుల వారు కలిపి మొత్తం 73 వేల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వారిలో దాదాపు 45 వేల మంది రైల్వేపాస్లు పొందేందుకు అర్హులున్నట్లు అధికార సమాచారం. రైల్వే పాస్ల కోసం దివ్యాంగులు నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అన్లైన్ విధానంతో ఆ కష్టాలు తప్పనున్నాయి. ఆన్లైన్లో పాస్ జారీ ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోనే కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో జ్ట్టి ఞ://ఛీజీఠి డ్చ ుఽజ్జ్చ ుఽజీఛీ.జీ ుఽఛీజ్చీ ుఽట్చజీ .జౌఠి.జీ ుఽ వెబ్సైట్లోకి వెళ్లి పాస్కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు(యూడీ ఐడీ)మంజూరు చేస్తారు. నూతన పాస్ కావాల్సిన వారు, పాత పాస్ రెన్యువల్కు కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్సైట్ అమల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి దరఖాస్తును పరిశీలించుకోవచ్చు. ఇకపై ఆన్లైన్లో రైల్వేపాస్ జిల్లాలో 45 వేల మంది అర్హులు ఇకపై ఆన్లైన్లో పాస్ తీసుకోవడానికి రైల్వేశాఖ చర్యలు ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు -
రహదారి భద్రతపై ర్యాలీ
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
అపరాలకు దక్కని మద్దతు..!
● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం ● ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● తుఫాన్ల కారణంగా వేల హెక్టార్లలో పంటకు నష్టం విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్లో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల వరి పంటతో పాటు అపరాల (పెసర, మినుము) పంటలు కూడా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉన్న పంటకు కూడా ప్రస్తుతం మద్దతు ధర రాని పరిస్థితి. మార్కెట్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర రానప్పడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేయాలి. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి సర్కార్ చెప్పింది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాసాన పోలేదు. తాజాగా అపరాలు సాగు చేసిన రైతులు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము పండించిన పెసర, మినుము చాలా వరకు పంట తీసి నూర్పులు చేసి పంట వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో పంటను తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21,931 హెక్టార్లలో అపరాలు సాగు జిల్లాలో అపరాలు 21 931 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పెసర పంట 5,909 హెక్టార్లలోను, మినుము పంట 16,011 హెక్టార్లలో సాగైంది. వీటి ద్వారా పెసర పంట 3,520 మెట్రిక్ టన్నులు, మినుము పంట 10,081 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పెసర ఎంఎస్పీ రూ.8682 పెసర పంట ఎంఎస్పీ క్వింటారూ. 8682, మినుములు ఎంఎస్పీ క్వింటాకు రూ.7400 అయితే ప్రభుత్వం అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అపరాలు విక్రయించాల్సిన పరిస్థితి. పెసలు క్వింటాకు రూ.7 వేలు, మినుములు క్వింటాకు రూ.6500 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జిల్లాలో సాగైన అపరాల్లో తుఫాన్ వల్ల చాలా వరకు పంట దెబ్బతింది. ఎకరాకి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకి క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితి. ఉన్న పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా వరకు రైతులు పంట తీసేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏకారణం చేతనో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాలి అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెఫెడ్ డీఎంకు లెటర్ రాశాం. కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.డి.కి ప్రతిపాదనలు పంపిస్తాంజిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాసిన లెటర్ అందింది. జేసీ ద్వారా మార్కెఫెడ్ ఎం.డి.కి అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఎన్.వెంకటేశ్వరావు, మార్కెఫెడ్ , జిల్లా మేనేజర్ -
సంతృప్తి చెందేలా వినతులకు పరిష్కారం
విజయనగరం అర్బన్: ఆర్థిక పరమైన అంశాలు, కోర్టుల నుంచి నిలిపివేయమని ఆదేశాలు వచ్చిన అంశాలు తప్ప మిగిలిన అన్ని రకాల వినతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతులకు పూర్తిస్థాయిలో కూలంకుషంగా చదివి, పిటిషనర్లతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్జీదారుల సంతృప్తే ముఖ్యమని భావించి సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, సీఎంఓ, వీఐపీ గ్రీవెన్స్సెల్లో నాలుగు రకాల వినతులు అందుతున్నాయని చెప్పారు. వాటిపై నిర్వహించిన విశ్లేషణలో సరాసరిగా ఒక్కో కుటుంబం నుంచి రెండు వినతులు వస్తున్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఏ ఒక్క వినతైనా గడువు దాటితే సంబంధిత అధికారికి చార్జ్ మోమో జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. నియోజకవర్గం వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, బుధవారం లోగా నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియపై ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, వచ్చిన వినతులకు సరైన పరిష్కారం చూపిస్తే, రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 శాతం సమస్యల పరిష్కారం జరుగుతోందని, ప్రతిరోజూ సమీక్షించడం వల్ల పెండింగ్ తగ్గిందన్నారు. రీఓపెన్ కేసులపై మండలాల వారీగా సమీక్షించి, కారణాలను తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, డిప్యుటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బూరెలతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.వ్యక్తి అరెస్ట్గజపతినగరం: చిట్ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం శ్రీరామ్ (ట్రాన్స్పోర్ట్)చిట్ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయ్రామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను పెట్టి కొంత నగదు వాడుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించక పోవడంతో విజయనగరం సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ పంపించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సాయిరామ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. -
బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మహారాణి పేటలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని, ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రూమ్లను పరిశీలించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారికి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్, కూర్మానంద రావు, తహసీల్దార్ పి.సత్యవతి ఎంఈఓ, జిల్లా బీసీ సంక్షేమాధికారి పెంటోజీరావు, టూ టౌన్ ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విజయనగరం గంటస్తంభం: ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేస్తూ క్యాబినెట్ చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అయితే మొత్తం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అంతేగానీ మళ్లీ థర్డ్ పార్టీ విధానంలో కార్మికుల్ని బందీలను చేసి వారి శ్రమను కొల్లగొట్టాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోందని, రిటైర్ అయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. చివరికి వాటర్ సప్లై, నైట్ శానిటేషన్, స్ట్రీట్లైట్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్ఐ కట్టకుండా, నచ్చినట్లు విధుల నుంచి తొలగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అతి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కుదింపు, పోలవరం అమరావతి సహా రైల్వే జోన్ తదితర ప్రాధాన్యతా అంశాలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ కూటమి పెద్దలు మౌనంగా ఉండడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, నాయకులు పాపారావు, భాస్కరరావు, గురుమూర్తి, రాఘవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ -
● ఎండన బడిన పిల్లలు
రథసప్తమి వెళ్లాక.. ఎండలు మండుతున్నాయి.. రెండు నిమిషాలు బయట ఉంటేనే.. నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్దవారే ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు.. విద్యార్థులు.. ఏకధాటిగా కూర్చొన్న చోట నిలువ నీడ లేక.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పందిర నీడన ఒకేచోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురుకావడం గమనార్హం. సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. రెండేళ్ల కిందట అది కూలిపోవడంతో దానిని ఎంపీపీ స్కూల్గా మార్చారు. తర్వాత కొన్నాళ్లపాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద, పందిరిలో బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు ఊరి చివరన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటుచేసిన పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అసలే ఎండలు. ఆపై ఆరుబయట చదువులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షి, పార్వతీపురం మన్యం -
నిర్వాసితులకు రెట్టింపు పరిహారం
వేపాడ: పెందుర్తి– బౌడారా– 516బి రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితులకు రెట్టింపు పరిహారం అందజేస్తున్నట్టు ఆర్డీఓ దాట్ల కీర్తి తెలిపారు. తహసీల్దార్ రాములమ్మ నేతృత్వంలో బొద్దాం, పాటూరులో నిర్వాసితులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్వాసితుల జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహారం అందజేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ భూములకు సెంటుకు రూ.26,500, వ్యవసాయేతర స్థలాలకు గజానికి రూ.6వేలు చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. బొద్దాంలో 130, పాటూరులో 30 మంది నిర్వాసితులను గుర్తించామని చెప్పారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్ సన్యాసినాయుడు, ఆర్ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్, వీఆర్వో, గ్రామ పెద్దలు కొట్యాడ రమణమూర్తి, ద్వారపూడి గంగునాయుడు పాల్గొన్నారు. -
–8లో
రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు కల్పిస్తు న్నట్టు ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. అధికార దర్పం తగదు ఉపాధిహామీ పనుల్లో కూటమి నాయకులు అధికార దర్పాన్ని ప్రదర్శించడం తగదు. స్థానికంగా పనికల్పించి వలసలను నివారించాలన్న లక్ష్యంతో చేపట్టే ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టు సైతం తప్పుబట్టింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల తీర్మానానికి, మాటకు విలువలేకుండా పంచాయతీల్లో అడ్డగోలుగా పనులు చేపడితే ఊరుకునేది లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదు. – పతివాడ అప్పలనాయుడు, ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, పూసపాటిరేగ వెండర్ విధానాన్ని రద్దు చేయాలి ఉపాధహామీ పనుల్లో వెండర్ విధానాన్ని రద్దు చేయాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్ల హక్కులకు భంగం కలగకుండా పనులు చేపట్టేవారు. సర్పంచ్ల తీర్మా నాలు లేకుండానే అధికార పార్టీ నాయకులు వారికి నచ్చిన వారికి పనులు అప్పగించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో, వారి తీర్మానాలతో పనులు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయాలి. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – చల్ల చెల్లంనాయుడు, ఎంపీపీ, బొండపల్లి