
మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’
కొండల మధ్యన విసిరేసినట్లు ఉన్న తాన్నవలస గ్రామం
సాలూరు/సాలూరు రూరల్ : ఏ ఆధారం లేని తనకు పింఛన్ సొమ్ము వస్తే జీవనం సాఫీగా సాగించవచ్చని భావించింది. తొమ్మిదినెలలు దాటినా ఆ ఎదురుచూపులు అలాగే మిగిలిపోయాయి. చివరకు పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తూ.. ఆకలితో అలమటించి ఓ గిరిజన వితంతువు తనువుచాలించిన హృదయ విదారక సంఘటన గిరిజన సంక్షేమ శాఖామంత్రి, సీ్త్రశిశుసంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో బుధవారం జరిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ(62) పింఛన్ కోసం తిరుగుతూ, ఆకలితో అలమటిస్తూ బుధవారం రాత్రి తనువు చాలించింది. ఆమె భర్త కన్నయ్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పింఛన్ వచ్చేది. అయితే 2023 డిసెంబరు 6న కన్నయ్య మరణించాడు. భర్త మరణించిన కారణంగా తనకు పింఛన్ మంజూరుచేయాలని ఆమె స్థానిక సచివాలయానికి వెళ్లింది. అయితే ఆమెకు ఫింఛన్ మంజూరయ్యేలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మంజూరు కాలేదు. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సుమారు 9నెలలు కావస్తున్నా నేటికీ ఆమెకు పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో ఆ ఒంటరి వృద్ధురాలికి స్థానికులు సాయం చేయగా పొట్ట పోషణ చేసుకునేది. ఈ క్రమంలో పింఛన్ సొమ్ము రాక, ఆకలితో అలమటిస్తూ బుధవారం తనువుచాలించింది. ఈ హృదయ విదారక సంఘటనతో స్దానికులు భావోద్వేగానికి లోనయ్యారు.
వితంతువులతో రాజకీయమా..?
ఇటువంటి సంఘటనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబర్ నుంచి పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్ మంజూరుచేయాల్సి ఉంది. కూటమి పాలనలో భర్త మరణించినా భార్యకు వితంతు పింఛన్ మంజూరు కాకపోవడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు గాలికొదిలేసిన పాలకులు వితంతువుల పట్ల కూడా ఇంత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తారా? అంటూ కూటమి ప్రభుత్వ వికృత చర్యలపై మండిపడుతున్నారు.
మరణించిన గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణ
ఇది దారుణం
కూర్మరాజుపేటలో గిరిజన వృద్ధురాలు వంజరపు అన్నపూర్ణమ్మ పింఛన్ మంజూరుకాక కుటుంబపోషణకు ఆధారం లేక ఆకలితో మరణించడం చాలా బాధాకరం. ఇది నన్ను బాగా కలిచివేసింది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇటువంటి వారు లక్షల్లో ఉండొచ్చు. వారు మనుషులు కాదా? వారి కష్టాలు నేటి పాలకులకు పట్టకపోవడం అత్యంత శోచనీయం. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే ఆలోచించి, అర్హులందరికీ పింఛన్లు అందించాలి.
–పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’

మృతిచెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’