సాక్షి వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగాయి. ఈపరీక్షల్లో జనరల్ కోర్సుకు 5,568 మందికిగాను 5,342 మంది విద్యార్థులు హాజరయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 939 మంది కాగా.. 856 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా.. 83 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
కష్టపడి చదివి..
కొలువు సాధించి..
నల్లబెల్లి: తల్లి అంగన్వాడీ టీచర్. తండ్రి పసిప్రాయంలోనే దూరమయ్యాడు. తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఆమె ఇష్టపడి చదివింది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేరై గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమాధికారిగా ఉద్యోగం సాధించింది.. నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జకినపల్లి అనూష. భద్రాద్రి జోన్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 2వ ర్యాంకు సాధించింది. నల్లబెల్లి మండలం మేడపల్లిలో ఆమె తల్లి ఊర్మిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. తల్లి ప్రోత్సాహంతో నెల రోజులు ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఉద్యోగం సాధించింది. రాంపూర్ సర్పంచ్ చింతపట్ల సురేశ్, స్థానికులు ఆమెను అభినందించారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
కుష్ఠు వ్యాధిపై అవగాహన
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ఽకీర్తినగర్లో యూపీహెచ్సీలో కుష్ఠు వ్యాధి నిర్ధారణ సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆచార్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కుష్ఠు నిర్ధారణ సర్వే కోసం 665 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈకార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చేపట్టే సర్వేలో ప్రజలు సహకరించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నర్సింహారెడ్డి, స్థానిక వైద్యాధికారి అఖిల్, డీపీఎంఓ అనుపమ, సీఈఓ వైకుంఠం, ఆశ, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు.
క్రైమ్ డీసీపీగా జనార్దన్ బాధ్యతలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్లో ఎస్సైగా, ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా పనిచేశారు. క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 309 మంది గైర్హాజరు