Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Entire Telugu community shocked by CM Chandrababu Comments1
‘అమ్మఒడి’ దొంగలు!

మొన్నటి నిజం..‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ – ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్‌ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటనేటి అబద్ధం..‘తల్లికి వందనం’ పథకం లోకేశ్‌ ఆలోచనే..!! – కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబుసాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృ­హలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్‌ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్‌ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్‌నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్‌ కూర్చున్న టేబుల్‌ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను కూడా తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్‌ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్‌ జగన్‌ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్‌ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్‌ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్‌ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పి­దాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్‌ అంబాసిడర్‌ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్‌ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్‌ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. సదుపాయాలన్నీ జగన్‌ సర్కారు సమకూర్చినవే..వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్‌ డెస్క్‌ బెంచీలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్‌లు, లైట్లు, అధునాతన ఐఎఫ్‌పీలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్‌పీ స్క్రీన్‌ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్‌ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్‌ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్‌ అయ్యాయి. హైదరాబాద్‌ను తానే నిరి్మంచానని.. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్‌ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్‌ బోధనను చేరువ చేశారు. బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్‌ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. ఈ విద్యా ప్రగతి మీది కాదు..కూటమి పాలనలో ఈవెంట్‌ ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులుమెగా పీటీఎంపై సోషల్‌ మీడియాలో విమర్శలు కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్‌ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపో­తున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్‌ గ్రూపుల్లో గురువారం మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలన­లో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేసిన పాఠశా­ల­లోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ కూర్చుని వేడుకలు చేసుకున్నా­రని సెటైర్లు వేశారు. ‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చి­నవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్‌పీ ప్యానల్‌ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాల­లకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భా­టపు పనికి­మా­లిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యా­యులను ఈవెంట్‌ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీ­శారు. మీ ‘పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్‌ షాప్‌లో, బుక్‌ షాప్‌లో, ఫ్లెక్సీ షాప్‌లో చూసినా అయ్య­వార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధి­కా­­రుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Jagan Fires On Chandrababu: Andhra pradesh2
రైతులు అసాంఘిక శక్తులా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రైతుల పక్షాన మేం నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు రాతలు రాయడం ఏమిటి? అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా... వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, సంబరాలు చేసుకుంటున్నట్టు రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ‘చంద్ర­బాబూ ..! రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు’ అని ప్రశ్నించారు. బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ గురువారం స్పందించారు. చంద్రబాబు సర్కారుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మామిడి రైతులపై పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలిసీఎం చంద్రబాబూ...! మీరు, మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సహా మీకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయాయి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వందల మందిని నోటీసులతో నిర్బంధించినా.. అణచివేతలకు దిగినా.. చివరకు లాఠీఛార్జీ చేసినా వెరవకుండా తమ గోడు చాటుతూ బుధవారం బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటనకు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వం తీరుపట్ల రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా, ఈ ప్రభుత్వం పట్టించుకోకపో­వడాన్ని దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికా­యలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్న­ట్లుగా.. తమ కష్టాలు చెబుతున్న రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడటం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజాన మోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న చులకన భావానికి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు! ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబూ..! పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి! పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి!సమాధానం చెప్పలేక తప్పుడు రాతలావైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏరోజూ ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25 – 29 మధ్య ధర లభించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయాయి? ఏటా మే 10 – 15 మధ్య తెరవాల్సిన పల్ప్‌ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఎందుకు తెరవలేదు? నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబూ? ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్లు కాదా?మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్‌.. ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అసలు మీరు ఇస్తానన్న కిలోకి రూ.4 ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? నిరుడు వైఎస్సార్‌సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29 రేటు? ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి రూ.2.5 – రూ.3 ఎక్కడ? ప్రతిపక్ష నేతగా, రైతుల పక్షాన బుధవారం బంగారుపాళ్యంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?రైతులు నష్టపోయినట్లు ఒప్పుకుంటూనే దౌర్భాగ్యపు మాటలు, రాతలా?నిజంగానే మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే.. రైతులు పంటను తెగనమ్ముకోకపోతే.. మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయాన్ని పక్కనపెడితే.. కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? పల్ప్‌ ఫ్యాక్టరీలు కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు? కర్ణాటకలో కిలో రూ.16 చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్‌ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్లు ఒకవైపు మీరు అంగీకరిస్తూనే ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎలుగెత్తితే మళ్లీ ఈ దౌర్భాగ్యపు మాటలు, రాతలు ఏమిటి? ఈ ఆంక్షలు ఎందుకు?గల్లా, శ్రీని ఫుడ్స్‌కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా..?రైతాంగానికి అండగా నిలిస్తే రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలా..మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే... రాష్ట్రంలో తమకు అన్యా­యం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగీ, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీ దృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు...!! అంతేకదా చంద్రబాబూ...? వీరికి ఏ సమస్యా లేదని, అన్ని హామీలను మీరు తీర్చేశారని, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అందుకుని వీరంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం! కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా వీళ్లంతా అసాంఘిక శక్తులు కాబట్టి రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం? ఇదేం పద్ధతి? ఇదేం విధానం చంద్రబాబూ..?ఒక్క కిలో అయినా కొన్నారాగిట్టుబాటు ధరలు రావడం లేదని మిర్చి రైతులు గగ్గోలు పెట్టినా ఒక్క కిలో అయినా కొన్నారా చంద్రబాబూ..? మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి... ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు. మిర్చి రైతులు ధరలు రావడం లేదని ఆక్రోశిస్తే కేంద్రం చేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? పొగాకు రైతులు ఆందోళన చేస్తే ఇంకో డ్రామా చేస్తూ ప్రకటనలు చేయిస్తున్నారు. రైతుల సంక్షేమంపై మీరు ఏనాడైనా చిత్తశుద్ధితో వ్యవహరించారా?మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేలు ఇవ్వలేదుమీరు ఇస్తానన్న రైతు భరోసా (అన్నదాతా సుఖీభవ) రూ.20 వేలు ఇంతవరకూఇవ్వలేదు. గతేడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదీ ఇప్పటివరకు దిక్కులేదు. ఈ ఏడాది జూన్‌ 21కి ఇస్తా­నని చెప్పి, జూలై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ దాని గురించి ప్రస్తావించడం లేదు. సీజన్‌ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్య గోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.రైతులు నష్టపోతున్నా ఆ పని ఎందుకు చేయడం లేదుమా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పని చేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే విషయంపై ఆర్బీకేల్లో రియల్‌ టైం మానిటరింగ్‌ చేసే సీఎం యాప్‌ ఏమైంది?ఇన్‌పుట్‌ సబ్సిడీ గాలికి వదిలేశారువరదలు వచ్చినా, కరువులు వచ్చినా సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని మీరు గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారు. ఆర్బీకేలు, ఈ–క్రాప్‌ విధానం, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎండగడితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.

Key Cabinet decisions taken in meeting chaired by CM Revanth Reddy3
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్‌ చట్టం–2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్‌.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీతో పాటు కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించడాన్ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి, గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. సీఎం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పలువురు కేంద్రమంత్రులు, సంబంధిత అధికారులతో దీనిపై అనేకసార్లు చర్చించినా కొర్రీలు వేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీకి అడ్వొకేట్‌ జనరల్‌ను కూడా ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకుని, న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలకు ఇబ్బందులు ఎదురవకుండా రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి ఇప్పటికే రాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌ నిబంధన దేశంలో ఎప్పుడో పోయిందని అన్నారు. కేబినెట్‌ నిర్ణయాలు 96% అమలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి ముందు వరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తాజాగా జరిగిన 19వ సమావేశంలో ఆ నిర్ణయాల అమలులో పురోగతిపై విస్తృతంగా చర్చించామని, 96 శాతం అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసి అమలు దశకు తీసుకెళ్లినట్టు తేలిందని చెప్పారు. కాగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు మళ్లీ ఈ నెల 25న మంత్రివర్గ భేటీ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఆ కాల వ్యవధిలో జరిగే ఆరు కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరవేసే వ్యవస్థ పనితీరును మళ్లీ కేబినెట్‌లోనే ఇలా సమీక్షించడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు రాష్ట్రంలోని అమిటీ, సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ విద్యా సంస్థలకు వర్సిటీలుగా గుర్తింపు కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 15 ఉత్తమ వర్సిటీల్లో అమిటీ 11/12వ స్థానంలో ఉందన్నారు. సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ సైతం అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌ చొరవతో ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడానికి ఆ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నం చెప్పారు. ఇక కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జాబ్‌ కేలెండర్‌ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించామన్నారు. ఎస్సీల వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ⇒ రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అనంతరం ఆ ప్రాజెక్టుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. ⇒ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 4 చోట్ల అత్యాధునిక గోశాలలు రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కమిటీ వచ్చే కేబినేట్‌ సమావేశంలోపు తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. కగా హైదరాబాద్‌లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజి్రస్టేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటల్లో 80–110 మి.మీ. సైజు గల 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు సంస్కరణలు ⇒ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ⇒ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమరి్పంచాలని కమిటీని ఆదేశించింది.

Rasi Phalalu: Daily Horoscope On 11-07-2025 In Telugu4
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.2.13 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.33 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.2.50 నుండి 4.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.12.51 నుండి 2.30 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.వృషభం.... కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆదాయం తగినంత లేక అప్పులు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిథునం... కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. కళాకారులకు ప్రయత్నాలు సఫలం.కర్కాటకం.... రాబడికి లోటు లేదు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో మీ ఊహలు నిజం కాగలవు. వస్తులాభాలు.సింహం... కార్యక్రమాలలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. కళాకారులకు చికాకులు.కన్య... కష్టానికి ఫలితం కనిపించదు. ముఖ్య కార్యాలలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దేవాలయ దర్శనాలు.తుల... సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. అదనపు రాబడితో అవసరాలు తీరతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దేవాలయ దర్శనాలు.వృశ్చికం... ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు.... కార్యక్రమాలు సకాలంలో చకచకా సాగుతాయి. అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మకరం..... కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆదాయం ఉన్నా ఖర్చులు సైతం పెరుగుతాయి. ప్రతి విషయానికి కలత చెందుతారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..కుంభం... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు కాస్త ఉపశమనం పొందుతారు.మీనం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి ముఖ్య సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అవాంతరాలు తొలగుతాయి.

Sakshi Guest Column On Overpopulation in India5
అధిక జనాభాకు ‘సుస్థిర’ విరుగుడు

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1990 జూలై 11 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌గా ‘న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకొనే కుటుంబాలను సృష్టించడానికి యువతను సాధికారం చేయడం’ను ఎంచు కొన్నారు. మనిషే మూలధనంప్రపంచ జనాభా 2011లో 700 కోట్ల నుండి 2022లో 800 కోట్లకు పెరిగింది. 2025లో 820 కోట్లకు చేరుకుంది. వనరుల కొరత, పర్యావరణ క్షీణత, వలసలు, పట్టణీకరణ, అధిక వృద్ధాప్య జనాభా, బాల కార్మికులు, సామాజిక అసమానతలు లాంటి సమస్యలకు జనాభా పెరుగుదల దారి తీసింది. సుస్థిరతపై జనాభా ప్రభావం ముఖ్యాంశంగా నిలుస్తున్నందువల్ల ప్రపంచ దేశాలు ఈ సమస్యను అధిగమించవలసి ఉంది. సీఎమ్‌ఐఈ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) 2023 నివేదిక ప్రకారం, భారత్‌లో యువతలో నిరుద్యోగిత 23 శాతం కాగా, గ్రామీణ యువత అల్ప ఉద్యోగిత, ఉపాధి లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. భారత్‌ జనాభా 2001లో 102.87 కోట్ల నుండి 2011లో 121.09 కోట్లకు, 2025లో 146.39 కోట్లకు పెరిగింది. అయితే, సంతానోత్పత్తి రేటు (1.9), రీప్లేస్‌మెంట్‌ స్థాయికన్నా (2.1) తక్కువగా నమోద యింది. ఈ స్థితిని ఐక్యరాజ్యసమితి జనాభా సంక్షోభంగా అభివర్ణించింది. కాకపోతే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌’ రిపోర్ట్‌– 2025 ప్రకారం, మొత్తం జనాభాలో 15–64 వయోవర్గ జనాభా 68 శాతంగా ఉండటాన్ని బట్టి భవిష్యత్తులో భారత్‌ ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ పొందుతుంది. ఈ డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ ద్వారా భారత్‌ సుస్థిరవృద్ధి సాధించాలంటే వ్యూహాత్మక పెట్టుబడులు, అభిలషణీయ విధానాల అమలుపై దృష్టి సారించాలి. మానవ మూల ధనంపై పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంపొందించి, సమ్మిళిత వృద్ధి, పర్యావరణ సుస్థిరతతోపాటు దీర్ఘకాల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక ప్రగతికి దారితీస్తాయి.సుస్థిర వృద్ధి సాధనకు సవాళ్ళుభారత్‌లో పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు చేరుతుందని అంచనా. భూగర్భ జలాలు 2030 నాటికి 21 నగరాలలో అడుగంటుతాయని అంచనా. దాంతో ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. భూమి, నీరు, శక్తి, జీవ వైవిధ్యంపై ఒత్తిడి అధికమవుతుంది. మితిమీరిన సాగు, అడవుల నరికివేత, పట్టణాలలో భూముల ఆక్ర మణ కారణంగా భారత్‌ మొత్తం భూవిస్తీర్ణంలో 29.7 శాతం డీగ్రేడెడ్‌ భూమిగా వర్గీకరింపబడింది. భారత్‌లో సాంవత్సరిక ఘన వ్యర్థాలు 6.2 కోట్ల టన్నులు కాగా, ఈ మొత్తంలో 70 శాతాన్ని సేకరిస్తున్నప్పటికీ, దీనిలో 20 శాతంకన్నా తక్కువే ప్రాసెస్‌ అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ప్రతి సంవత్సరం 16 లక్షల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్షణ పరిమితుల కన్నా ఢిల్లీ, ముంబై నగ రాల్లో పీఎం 2.5 స్థాయులు ఎక్కువున్నాయి.రాష్ట్రాల మధ్య జనాభా వైవిధ్యాలు భారత్‌ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవా భివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సామాజిక సేవలపై అధికంగా పెట్టు బడులు పెడుతున్న కారణంగా ఆ యా రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు తగ్గి వృద్ధాప్య వయోవర్గ జనాభా పెరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బల హీనంగా ఉండటంతోపాటు, అందరికీ విద్య అందుబాటు తక్కు వగా, లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం, పాఠశాల విద్యకు నోచుకోని మహిళలు సగటున 3.1 పిల్లలకు జన్మ నివ్వగా, 12వ తరగతి మరియు ఆ పైన విద్యాధికులైన మహిళలు సగటున 1.7 పిల్లలకు జన్మనిచ్చారు. విద్యకు సంబంధించి బిహార్, రాజస్థాన్‌లలో లింగ అసమానతలు అధికం.పర్యావరణ హితంగా సమాజ సంక్షేమంవనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణతో జనాభా వృద్ధిని సంతుల్యం (బ్యాలెన్స్‌) చేయడం సుస్థిరాభివృద్ధికి ప్రధానం. ఆర్థిక విధానాలలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానతను సంఘటిత పరచడం ద్వారా భవిష్యత్‌ తరాల అవసరాలతో రాజీ పడకుండా, ప్రస్తుత అవసరాలను తీర్చవచ్చు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న పరస్పర అనుసంధానాన్ని అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు కనుగొన్నట్లయితే అన్ని అంశాల్లోనూ ఒకేసారి ప్రయోజనం కలుగుతుంది.పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి బహుముఖ విధానం అవసరం. ఈ లక్ష్య సాధనకు సుస్థిర పద్ధతులు అవలంబించడం, పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెట్టడం అవ సరం. ఈ చర్యలు పర్యావరణ ప్రభావాన్ని కనిష్ఠం చేసి, ఆర్థిక వృద్ధి పెంపునకు దోహదపడతాయి. బాధ్యతాయుత పర్యాటక పద్ధతులు పాటించినప్పుడు పర్యావరణ వ్యవస్థ పరిరక్షించబడి, స్థానిక ప్రజలు ప్రయోజనం పొందుతారు.గత దశాబ్ద కాలంలో అనేక ప్రభుత్వాలు సంప్రదాయ ఆర్థిక నమూనాకు బదులుగా గ్రీన్‌ ఎకానమీని ప్రత్యామ్నాయంగా ఎంచు కోవడం జరిగింది. గ్రీన్‌ టెక్నాలజీని సమర్థవంతంగా ప్రోత్సహించాలంటే ఆర్థిక ప్రోత్సాహకాలు, నియంత్రణ సంస్థల మద్దతు, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అంతర్జాతీయ సహ కారం ద్వారా నవ కల్పనలను ప్రోత్సహించాలి. ఆర్థిక ప్రోత్సాహ కాలలో భాగంగా టాక్స్‌ క్రెడిట్, గ్రాంటు ఇస్తూ, సోలార్‌ ప్యానల్స్, విండ్‌ టర్బైన్స్‌ లాంటి పునరుత్పాదక శక్తి ఏర్పాట్లకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలి. పరిశోధన–అభివృద్ధికి (ఆర్‌ అండ్‌ డీ) ఆర్థిక మద్దతునందించాలి. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలను అందరికీ అందించటం ద్వారా సామాజిక సమ్మిళితం సాధించాలి. పర్యావరణ కార్యక్రమాలయిన రీఫారెస్టేషన్, వృథా యాజమాన్య కార్యక్రమా లలో వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా, సామాజిక, పర్యావరణ అంశాలను సంఘటితపరచవచ్చు. అసంఘటిత రంగంలోని సంస్థల యాజమాన్యానికి సుస్థిరాభివృద్ధి పద్ధ తులు అవలంబించే విషయంలో సరైన పరిజ్ఞానం లేకపోవచ్చు. సుస్థిరాభివృద్ధి విధానాల అమలు, వనరుల యాజమాన్యం, అంద రికీ సమాన అవకాశాల కల్పనకు పటిష్ఠమైన సంస్థలు, సమర్థవంత మైన గవర్నెన్స్‌ అవసరం. వినియోగదారులను కూడా సుస్థిర ఉత్పత్తుల వినియోగం వైపు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. వనరుల విని యోగం తగ్గుదలకు, తక్కువ వృథాకు సుస్థిర పద్ధతులు తోడ్పడు తాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. సామాజిక ప్రాధాన్య తలో భాగంగా న్యాయమైన వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, విద్య – ఆరోగ్య సంరక్షణ, సంస్కృతిని కాపాడుకోవడం అవసరం. పర్యావరణ సుస్థిరత, సామాజిక ప్రాధాన్యతలు దీర్ఘకాలంలో సమ్మి ళిత వృద్ధి సాధనకు దోహదపడతాయి. మానవ మూలధనంపై పెట్టు బడులు ఆర్థిక వృద్ధి పెంపునకు అత్యవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్‌ – డీన్, ఇక్ఫాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఐ.ఎఫ్‌.హెచ్‌.ఈ, హైదరాబాద్‌

Sakshi Editorial On Air Polution of Vehicles6
చిత్తశుద్ధి లేని నిషేధం!

రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల తాలూకు సమస్త యంత్రాంగం కొలువు తీరిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం మన విధాన నిర్ణేతల వైఫల్యాలకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిరగనివ్వబోమని కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) ఉత్తర్వులిచ్చింది. డీజిల్‌ వాహనాలు పదేళ్లకు మించి తిరుగుతున్నా, పెట్రోల్‌ వాహనాలు పదిహేనేళ్లకు మించి వినియోగిస్తున్నా వాటికి బంకుల్లో ఇంధన విక్ర యాన్ని కమిషన్‌ నిషేధించింది. మొదట దీన్ని ఢిల్లీలో అమలుచేసి, దశలవారీగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) అంతటికీ విస్తరిస్తామని తెలిపింది. అందుకనుగుణంగా ఈ నెల 1న చర్యలు మొదలయ్యాయి కూడా. తొలిరోజు కాలం చెల్లిన 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 450 వాహనాలకు పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలను నిరాకరించారు. అసలు ఆ బాపతు వాహనాలు బంకుల్లో ప్రవేశించిన క్షణాల్లోనే ‘మీది కాలం చెల్లిన వాహనం. ఇక్కడ ఇంధన విక్రయాలు జరపరు’ అంటూ మైకులు ఉరమటంతో జనం విస్తుపోయారు. కానీ రెండో రోజుకల్లా నిషేధం నీరుగారింది. కేవలం ఏడంటే ఏడే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మూడోరోజుకల్లా అదీ లేదు. మొదటి రెండు రోజులూ నిషేధం అమలు చేసినా ఇప్పటికీ చాలామంది వాహన యజమానులకు దానిపై అవగాహన లేదంటే ప్రభుత్వ ప్రచారం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నిబంధన అమలును నిలిపేయాలని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సీఏక్యూఎంను కోరటంతో అది అంగీకరించింది. వచ్చే నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమలవుతుందని తాజాగా ప్రకటించింది. ఎన్నేళ్ల నుంచి వాహనం వాడుతున్నారో తేల్చటానికి అనువైన డిజిటల్‌ ఆధారిత కెమెరాలు, సెన్సర్లు, స్పీకర్లు చాలాచోట్ల సరిగా లేవనీ, అందువల్లే ఈ వాయిదా అత్యవసరమనీ సీఏక్యూఎంకు రాసిన లేఖలో ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ కాలుష్యానికి కేవలం కాలం చెల్లిన వాహనాలే కారణమా... కాలుష్యంలో వాటి వాటాయే అధికమా అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఆ విచికిత్స మాట అటుంచి, ఏ చట్టమైనా మన దేశంలో ఎలా విఫలమవుతుందో చెప్పటానికి కేవలం ఈ రెండు రోజుల నిషేధమే రుజువు. నిషేధం మొదలయ్యాక పెద్దయెత్తున నిరసనలు పెల్లుబికాయి. ఇక చేసేది లేక ఆదరా బాదరాగా ఢిల్లీ ప్రభుత్వం సీఏక్యూఎంను ఆశ్రయించటం, అది వెంటనే అంగీకరించటం పూర్తయింది. కాలం చెల్లిన వాహనాలను నిలిపేయాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. 2018లో సుప్రీంకోర్టే ఒక తీర్పులో ఈ సూచన చేసింది. దాన్ని అమలు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారిక అంచనా ప్రకారం, ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 60 లక్షలు! ఢిల్లీలోని అయిదు ప్రాంతాలు– గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతంబుద్ధ నగర్, సోనిపట్‌లలో వాహనాల తాకిడి అధికమని ఆ అంచనా చెబుతోంది. రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంతవరకూ అమలు చేసిన ఏ విధా నమూ విజయవంతమైన దాఖలా కనబడలేదు సరిగదా... మొన్న మార్చిలో విడుదలైన గత ఏడాది ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీది రెండో స్థానమని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ఢిల్లీ వాతావరణంలో సాధారణ స్థాయికన్నా 21 రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలున్నాయని తేల్చింది. ఇంకా విషాదమేమంటే, అంతకు ముందు ఏడాది కన్నా 2024లో ఈ కాలుష్యం 6 శాతం పెరిగింది. ఢిల్లీలో సాధారణంగా ప్రతి యేటా నవంబర్‌ నెలకల్లా వాయు కాలుష్యం గురించిన చర్చ మొదలవుతుంది. అప్పటికల్లా శీతగాలుల తాకిడి మొదలై వాతావరణంలో కాలుష్యం నిలకడగా ఉండిపోతుంది. ఈసారి రెండు రోజుల నిషేధం ప్రహసనం వల్ల ముందే ఆ చర్చ ప్రారంభమైంది. ఏ విధానమైనా అమలు చేసేముందు దాని అమలుకు సంబంధించిన మౌలిక సదుపాయా లెలా ఉన్నాయో ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. ఒక్క మానెసర్‌ ప్రాంతంలోని ఒక కేంద్రం తప్ప ఢిల్లీ మొత్తంలో ఎక్కడా ప్రామాణికమైన కేంద్రాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రైవేటు కార్లకే నిబంధనలు వర్తిస్తాయన్నట్టు రవాణా విభాగం ప్రవర్తించింది. ప్రజారవాణా బస్సులు మొదలుకొని వాణిజ్య వాహనాల వరకూ అనేకం ఢిల్లీ కాలుష్యాన్ని అపారంగా పెంచు తున్నాయి. తాజా నిషేధం వాటి జోలికి పోలేదు. ఇక కాలుష్యంలో టూవీలర్‌ల వాటా దాదాపు 25 శాతం. అసలు వాహనం మోడల్‌ని బట్టి దాన్ని కాలం చెల్లిన వాహనంగా వర్గీకరించటం అశాస్త్రీయం. వాహనాన్ని అరుదుగా వాడేవారుండొచ్చు, అతి జాగ్రత్తలు తీసుకునే వారుండొచ్చు. అటువంటివి కాలం చెల్లినవి ఎలా అవుతాయి? వాహనం సాంకేతికంగా తగిన ఫిట్‌నెస్‌ కలిగివుందా లేదా అనేది చూస్తే వేరుగా వుండేది. అన్నిటికన్నా ముఖ్యం – ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చటం, నగరంలోని నలు మూలలకూ అన్ని సమయాల్లో విస్తృతంగా బస్సు సదుపాయం కల్పించటం. బస్సు కోసం రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోతే ఎవరైనా తడిసి మోపెడయ్యే సొంత వాహనం కోసం ఎందుకు ఎగబడతారు? వాహనాలు నానాటికీ పెరుగుతున్నాయంటే అది పాలకుల వైఫల్య పర్యవసానం. ఆ సంగతలా ఉంచి అసలు కాలం చెల్లిన వాహనాలను ఏం చేయదల్చుకున్నారు? వాటిని వదిలించుకోవటానికి ఏం ఆలోచించారు? సమస్యలు ఇన్నివున్నప్పుడు ఈ మొక్కుబడి నిషేధాల వల్ల ప్రయోజనం ఏమిటి?

Doubts over the conduct of National Medical Commission officials7
రోగులు, బోధకులు లేకున్నా అనుమతులా?

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీరు కంచె చేనును మేసిన చందంగా తయారైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీల దందాకు అడ్డుకట్ట వేసి, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించేలా చూడాల్సిన ఎన్‌ఎంసీ అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత, మాజీ వైద్యాధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.కోట్లలో లంచాలుగా తీసుకున్నట్లు గుర్తించిన సీబీఐ.. ఓవైపు దేశ వ్యాప్తంగా దర్యాప్తు సాగిస్తుండగా, మరోవైపు ఇదేమీ పట్టనట్లు వైద్య కమిషన్‌ అధికారులు తమ లాలూచీని కొనసాగిస్తూ అధ్వాన స్థితిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం వందశాతం మార్కులు వేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, ఏ మాత్రం వసతులు లేకున్నా.. కాలేజీలకు అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తోంది. వర్సిటీ అలా..ఎన్‌ఎంసీ ఇలా రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నాలుగు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరిపి వైద్య విద్యకు అనువైన కనీస మౌలిక వనరులు లేవని, రోగులు, బోధనా సిబ్బంది లేకుండా ఏదో ‘సాంఘిక శాస్త్రం’బోధించినట్లుగా వైద్య విద్య అందిస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. విచిత్రమేంటంటే హెల్త్‌ యూనివర్సిటీ తనిఖీలు చేసిన కళాశాలల్లో ఒకటైన పటాన్‌చెరులోని రాజ రాజేశ్వరి మెడికల్‌ కాలేజీని బుధవారం సాయంత్రం సందర్శించిన ఎన్‌ఎంసీ అధికారులు 100 శాతం మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆకస్మిక పర్యటన చేసినప్పుడు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోని వార్డుల్లోని బెడ్లన్నీ రోగులు, సిబ్బందితో పాటు కనీసం స్టూడెంట్లు కూడా లేక వెలవెలబోతున్నట్లు అధికారులు తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుండగా, ఎన్‌ఎంసీ అధికారుల తనిఖీల సమయంలో ఇంతలోనే ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు అనుగుణంగా రోగులు, ఫ్యాకల్టీ, మౌలిక వనరులు ఎలా సమకూరాయో ఎన్‌ఎంసీ అధికారులే చెప్పాలని అంటున్నారు. మరో 3 కాలేజీలకు కూడా.. రాజ రాజేశ్వరి మెడికల్‌ కాలేజీతో పాటు హైదరాబాద్‌ శివార్లలోని నోవా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలలో ఎన్‌ఎంసీ అధికారులు తనిఖీలు జరిపి, వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లుగా తేల్చినట్లు తెలిసింది. ఈ మేరకు కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓవైపు ప్రైవేటు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతూ, వసతులు లేని కళాశాలలను గుర్తించి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు ఎన్‌ఎంసీ అధికారులు మాత్రం ఆయా కళాశాలలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాక్ట్రికల్స్‌ కోసం శవాలు కూడా సమకూర్చుకోలేని దుస్థితిరాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో చాలావరకు కాలేజీల్లో విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అవసరమైన రోగులు లేరు. ప్రాక్టికల్స్‌ కోసం కనీసం శవాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. వార్డుల్లో పడకలు ఉన్నా, ఏ ఒక్క పడక మీద పేషెంట్‌ లేని పరిస్థితిని సాక్షాత్తూ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ నందకుమార్‌ రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ స్వయంగా చూశారు. మరోవైపు హౌస్‌ సర్జన్‌గా సేవలు అందించే విద్యార్థులకు స్టైపెండ్‌ ఇవ్వకపోగా, నాలుగున్నరేళ్ల కోర్సుకు గాను ఐదేళ్ల కాలానికి ఫీజు తీసుకోవడం, ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో డాక్టర్ల హాజరు, ప్రాక్టికల్స్‌ కోసం ఫీజులు వసూలు చేయడం వంటి నిర్వాకాలను గుర్తించారు. అయినా ఎన్‌ఎంసీ అధికారులు వీటిని పట్టించుకోకుండా అన్నింటికీ ఆమోదముద్ర వేసి రావడానికి రూ.కోట్లు లంచాలుగా ముట్టడమే కారణమని ప్రభుత్వ వైద్యాధికారులే ఆరోపిస్తున్నారు. ఎన్‌ఎంసీ సమావేశాలకు మాజీ అధికారులేంటి? నీట్‌ అడ్మిషన్లు, కాలేజీలకు అనుమతులు, రెన్యువల్, మెడికల్‌ కాలేజీలకు రేటింగ్‌ ఇవ్వడం వంటి అంశాలపై చర్చించేందుకు గాను ఎన్‌ఎంసీ నిర్వహించే సమావేశాలకు ఆయా రాష్ట్రాల హెల్త్‌ వర్సిటీల వీసీలను, వర్సిటీల్లో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన వారిని ఆహ్వానిస్తారు. అయితే కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ నందకుమార్‌ రెడ్డికి బదులుగా మాజీ వీసీ కరుణాకర్‌ రెడ్డిని ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఎన్‌ఎంసీలో జరిగిన సమావేశానికి కూడా నందకుమార్‌ రెడ్డికి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. గతంలో ఎంఏఆర్‌బీ (మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు)లో ఉన్న ఓ అధికారి కాలేజీలకు ర్యాంకుల కేటాయింపులో అవకతకవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ కాగా, సదరు అధికారిని కూడా ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం గమనార్హం. ఒడిశాకు చెందిన మరో రిటైర్డ్‌ వీసీ కూడా ఎన్‌ఎంసీలో జరిగే అవకతవకల్లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వసతుల్లేని ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న అధికారులు, వాటికి అనుమతులివ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

India Vs England 3rd Test Day 1 Match Highlights And Full Scorecard8
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌ ఆచితూచి...

ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్‌ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్‌ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్‌గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్‌ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్‌ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్‌ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్‌: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్‌ (191 బంతుల్లో 99 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్‌ (44; 4 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (39 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్‌ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్‌ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్‌ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్‌ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్‌ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్‌ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్‌’లో ఈ క్లిప్‌ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్‌లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్‌లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్‌ భారత బౌలర్లను రెండో సెషన్‌ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్‌ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్‌లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్‌ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్‌లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్‌ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్‌ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్‌ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్‌ విరామం తర్వాతే రూట్‌ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్‌ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్‌ 99 బ్యాటింగ్‌ మూడో సెషన్‌ మొదలైన బంతికే పోప్‌ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్‌ (11)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్‌ టర్నింగ్‌ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్‌ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్‌ 79 పరుగులు జోడించారు. రూట్‌ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్‌ కీపింగ్‌! భారత డాషింగ్‌ వికెట్‌కీపర్‌–బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్‌ నుంచి ధ్రువ్‌ జురేల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్‌ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) పంత్‌ (బి) నితీశ్‌ రెడ్డి 18; డకెట్‌ (సి) పంత్‌ (బి) నితీశ్‌ రెడ్డి 23; ఒలీ పోప్‌ (సి) (సబ్‌) జురేల్‌ (బి) జడేజా 44; జో రూట్‌ (బ్యాటింగ్‌) 99; బ్రూక్‌ (బి) బుమ్రా 11; స్టోక్స్‌ (బ్యాటింగ్‌) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్‌: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్‌ 17–2–75–0, సిరాజ్‌ 14–5–33–0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్‌ సుందర్‌ 10–1–21–0.

Tennis player Radhika Yadav Died by her father over Insta reel9
ఇన్‌ స్టాల్‌ రీల్స్‌ చేసిన టెన్నిస్‌ ప్లేయర్‌.. హత్య చేసిన తండ్రి!

గురుగ్రామ్‌: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌ స్టా రీల్స్‌ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్‌ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్‌ సుశాంక్‌ లోక్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్‌ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్‌ స్టా రీల్‌ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్‌ ఖేలో డాట్‌ కామ్‌ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్‌.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Jane Birkin original Hermes bag up for auction in Paris10
రూ.70 కోట్లు పలికిన హ్యాండ్‌ బ్యాగ్‌ 

పారిస్‌: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్‌ హ్యాండ్‌ బ్యాగ్‌. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్‌ కాదు. అలనాటి అందాల హాలీవుడ్‌ నటి వాడిన బ్యాగ్‌. ఆ క్రేజ్‌ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్‌ నటి దివంగత జేన్‌ బిర్కిన్‌ వాడిన హ్యాండ్‌ బ్యాగ్‌ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్‌ బ్యాగ్‌కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్‌లైన్‌లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్‌తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్‌ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్‌? తన అందం, అభినయంతో ఫ్రెంచ్‌ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్‌ నటి జేన్‌ బిర్కిన్‌. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్‌ ప్రపంచ ఐకాన్‌గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్‌ 14న లండన్‌లోని మేరీలీబాన్‌లో జన్మించారు. 76వ ఏట పారిస్‌లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్‌ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్‌ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానంలో బిర్కిన్‌ పక్క సీటులో హెర్మ్స్‌ సంస్థ చైర్మన్‌ జీన్‌ లూయిస్‌ డ్యూమస్‌ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్‌ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్‌ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్‌ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్‌ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్‌ బ్యాగు మాత్రం ఫ్యాషన్‌ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్‌ తయారీ బిర్కిన్‌ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్‌గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్‌కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్‌ లాక్‌ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్‌ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్‌ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్‌ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్‌బీ హ్యాండ్‌బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్‌ హెడ్‌ మోర్గాన్‌ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్‌ బ్యాగును ఎయిడ్స్‌ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్‌బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్‌ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement