ప్రధాన వార్తలు

వైఎస్ జగన్ ప్రెస్మీట్ పూర్తి హైలైట్స్
సాక్షి, గుంటూరు: ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొడుతున్న తీరును.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల పర్వం, అక్రమ కేసులు.. అరెస్టులపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు కుట్రల నేపథ్యం. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వైఖరి. పొలిటికల్ గవర్నెన్స్ నడిపిస్తున్న తీరు.. ఇవన్నీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, పలుకుతోంది వైయస్సార్సీపీ మాత్రమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. రైతులు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. చివరకు ఉద్యోగులకు కష్టం వచ్చినా కూడా వైయస్సార్సీపీనే ప్రశ్నిస్తోంది. ఇంకా అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన అడ్డగోలు హామీలు. మోసం చేసిన విధానం. వాటిని ఆ మోసాలు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న పార్టీ కూడా ఒక్క వైయస్సార్సీపీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం, వారికి తోడుగా నిలబడడం ధర్మం కూడా ప్రతిపక్షానిదే.అందుకే వరసగా కార్యక్రమాలు:ఏడాది నుంచి చంద్రబాబుగారు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కోసం, వారికి పెట్టుబడి సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరస్థితి, లేని ఇన్పుట్ సబ్సిడీ అన్నింటిపై 2024, డిసెంబరు 13న వైయస్సార్సీపీ రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేశాం.కరెంటు ఛార్జీల బాదుడుపై గత డిసెంబరు 24న రాష్ట్రంలో నిరసన కార్యక్రమం. ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా బాదుడుపై నిరసన కార్యక్రమం. పోరుబాట నిర్వహించాం. పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం. విద్యాదీవెన, వసతిదీవెన ఎగ్గొట్టిన వైనం. వాటన్నింటిపై మార్చి 12, యువతపోరు నిర్వహించాం. నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రశ్నించాం.జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మోసాలు వివరిస్తూ, వెన్నుపోటు దినం నిర్వహించాం. చంద్రబాబుగారు ఎగ్గొట్టిన బాకీలు అడిగాం. ఆరోజు రాష్ట్రమంతా కార్యక్రమం.ఇప్పుడు కూడా బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్న నినాదంతో, ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ పేరుతో చంద్రబాబు మోసాలు ఎత్తి చూపుతూ, ప్రజలను చైతన్యులను చేస్తూ.. నాడు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు టీడీపీ నాయకులకు చూపిస్తూ, ప్రభుత్వం పడిన బకాయిలు అడుగుతూ రాష్ట్రమంతా కార్యక్రమం కొనసాగుతోంది.జూలై (ఈనెల) 21 నుంచి గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అందరినీ చైతన్యులను చేసే దిశగా కార్యక్రమం నిర్వహిస్తాం.తట్టుకోలేక వేధింపుల పర్వం:చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన ఏదీ చేయడని చెప్పి, వైయస్సార్సీపీ తలుపు తడుతున్నారు. ఎందుకంటే, వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా, పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండే వారు. స్పందన కార్యక్రమంలో మా పార్టీ వారి కంటే ఎక్కువగా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించేవారు. అదే ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటంటే.. చంద్రబాబుగారి మాట ఏ పోలీసు అధికారి అయినా వినకపోతే.. డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంకా మరో డీజీపీ స్థాయ అధికారి సునీల్కుమార్, మరో అధికారులు సంజయ్, కాంతిలాల్రాణ టాటా, విశాల్గున్నీ.. అందరిపై తప్పుడు కేసులు వేధింపులు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషినల్ కమాండెంట్లు, రెండు అసిస్టెంట్ కమాండెంట్లను కూడా హెడ్ క్వార్టర్స్లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్లో ఉన్నారు. చంద్రబాబు మాట వినని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్కొందరు అధికారుల అధికార దుర్వినియోగం:ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే డీఐజీలు కేంద్రంగా కొందరు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కొందరు ఆ జోన్కి మాఫియా డాన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయన ఆర్మీ. నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే పర్మిషన్, పేకాట క్లబ్బులు, నడిచే పరిశ్రమల నుంచి డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కప్పం వసూలు చేసి రివర్స్లో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. సగం వీళ్లు తీసుకుని మరోసగం చినబాబు, పెదబాబుకి పంపుతారు. ఇవన్నీ తట్టుకోలేక సిద్దార్థ కౌశల్ వంటి యంగస్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్లడానికి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో పడలేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. – ఏ ప్రభుత్వంలో అయినా పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంటే, నేరస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. యథేచ్ఛగా దాడుల పర్వం:కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ ఛైర్మన్. బీసీ. నా సోదరి హారిక. టీడీపీ సైకోలు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసలు ఆమె చేసిన తప్పేమిటి? ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు?. చంద్రబాబు చేసిన మోసాలు నిలదీయడం తప్పా? రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ కార్యక్రమానికి ఆమె వెళ్తుంటే దాడి చేశారు. సా.5 గం.కు దాడి మొదలై, 6.30 వరకు కొనసాగింది. ఆమెను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ, కొడుతూ, కారు అద్దాలు ««ధ్వంసం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా, వారు ప్రేక్షకపాత్ర పోషించారు.చంద్రబాబుగారిని అడుగుతున్నా.. ఆమె బీసీ మహిళ. ఆమెను తిడుతూ, అనరాని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? దారి కాచి దాడి చేయడం సబబేనా? ఇది శాడిజమ్ కాకపోతే మరేమిటి?. ఇంత హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళ, నా చెల్లి హారికను టీడీపీ వారు మహానటి అంటున్నారు. కనీసం సిగ్గుందా? అన్నీ చేసిన మీరు ఆమెను మహానటి అంటారా? (అంటూ.. ఆ వీడియో ప్రదర్శించి చూపారు. హారికపై టీడీపీ మూకల దాడి దృశ్యాలు).పోలీసులు దగ్గరుండి, వారి సమక్షంలో జడ్పీ ఛైర్మన్పై దాడి. మహిళ. ఆమెను మహానటి అని రివర్స్ విమర్శ చేస్తున్నారు. అసలు ఎవరు మహానటులు. దాన వీర శూర కర్ణ కన్నా గొప్ప నటన ఆయన చేస్తున్నాడు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు. ఇంత స్పష్టంగా ఘటన జరిగితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కారణం ఆ దాడి చేయించింది వారే కాబట్టి. పై నుంచి ఫోన్లు చేసి మరీ ఈ దాడి చేయించారు.ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. కళ్ల ముందు కనిపిస్తున్న వీడియో పక్కనపెట్టి, హారిక భర్త రాముపై కేసు పెట్టారు. ఆయన తన కారుతో ఢీ కొట్టాడని. అది గవర్నమెంట్ కారు. నడిపేది గవర్నమెంట్ డ్రైవర్. ఆ కారులో రాము వెనక సీట్లో కూర్చున్నాడు. ఆయన ఢీ కొట్టాడని కేసు పెట్టారు. వారు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.ఆ మర్నాడు పెడనలో సమావేశం నిర్వహిస్తే.. పేర్ని నాని, జోగి రమేష్ తదితరులపై కేసు పెట్టారు. పార్టీ ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకోకూడదా?. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. పోలీసులు రక్షణ కల్పించడం లేదు సరికదా? వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నా, బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?జగన్ ప్రెస్మీట్ హైలైట్స్చంద్రబాబు ప్రతి పనిలోనూ టాపిక్ డైవర్షన్:నా ప్రతి పర్యటనలో ఆయన చేస్తోంది అదే. దాడులు చేసే ప్రయత్నం. తప్పుడు కేసులు పెట్టించడం. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గత ఏడాది మిర్చి క్వింటా ధర రూ.27 వేలు పలికితే, చంద్రబాబు ప్రభుత్వంలో అది రూ.8 వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, వారికి మద్దతు ఇస్తూ, మిర్చియార్డుకు పోయింది జగన్ మాత్రమే. అది తప్పేనా?. ఆరోజు నా పర్యటనకు నా సెక్యూరిటీ తగ్గించాడు. ఆయనకు మూడ్ వస్తే ఇస్తాడు. లేకపోతే జడ్ ప్లస్ కేటగిరీ తీసేస్తాడు. మళ్లీ మాపైనే కేసు పెట్టారు.ఆ తర్వాత ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటన. మా పార్టీ బీసీ నాయకుడు కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేస్తే పరామర్శకు వెళ్లాను. సెక్యూరిటీ ఇవ్వలేదు. దీంతో జనం పోటెత్తి, హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. అక్కడా పైలట్లను వేధించారు. మాపైనా కేసులు పెట్టారు. జూన్ 12. పొదిలిలో పర్యటన. పొగాకు ధర దారుణంగా పడిపోయింది. మరోవైపు కొనేవారు లేరు. రైతులు తల్లడిల్లుతుంటే, వారికి సంఘీభావంగా నేను పర్యటించాను. 40 వేలకుపైగా తరలి వచ్చారు. అప్పుడు ఒక 40 మందిని సిద్ధం చేసి దాడులకు వ్యూహరచన చేశారు. వారికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. అయినా రైతులు సంయమనం పాటించారు. వారు ఎదురుదాడి చేయలేదు. అయినా 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైలుకు పంపారు. మేము రైతులకు అండగా నిలబడితే, నీకొచ్చిన కష్టం ఏమిటి?చంద్రబాబు చేయాల్సింది చేయడు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు. కేసులు. అరెస్టులు. జూన్ 18న, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన. మా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్తే అడ్డుకోవాలని ప్రయత్నం. నా కోసం ప్రజలు వస్తే, చంద్రబాబుకు ఏం ఇబ్బంది? ఆయన కార్యక్రమానికి జనం రాకపోతే, మాకేం సంబంధం? నా కార్యక్రమానికి రావొద్దని, మా పారీ నాయకులకు నోటీసులు. హౌజ్ అరెస్టులు. అలా నా కార్యక్రమానికి జనం రాకుండా కుట్ర. ఇంకా 5 కేసులు నమోదు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?:సినిమా డైలాగ్లో పోస్టర్లుగా ప్రదర్శిస్తే.. ఇద్దరిని అరెస్టు చేశారు. నీకు ఆ డైలాగ్లు నచ్చకపోతే, సెన్సార్బోర్డుకు చెప్పి, వాటిని తీసేయించొచ్చు కదా?. నిజానికి బాలకృష్ణ, పవన్కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్లు ఇంకా దారుణం. సినిమా డైలాగ్లు ప్రదర్శిస్తే, కేసులు పెట్టడం ఏమిటి? సినిమాలు ఆపేయండి. ఎవరో ఒకరు సినిమా డైలాగ్లు ప్రదర్శిస్తే, వారికొచ్చిన నష్టం ఏమిటి?. ఈ వ్యవహారంలో 131 మందికి నోటీసులు. ఇద్దరిని రిమాండ్కు పంపారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే, వారిని పిలిపించడం రోజంతా కూర్చోబెట్టడం.. కేసులు పెట్టడం. ప్రతి ఛార్జ్షీట్లో ఓ ముగ్గురు, నలుగురి పేర్లు రాసి. అండ్ అదర్స్ అని రాస్తున్నారు. ఆ తర్వాత తమ టార్గెట్లో ఉన్న వారిని అందులో జోడిస్తున్నారు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్మామిడి రైతుల కష్టాలు. అక్కడా మాకు వేధింపులు:మామిడి రైతుల సమస్యలపై జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మామిడి ధర దారుణంగా పతనం. మే రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా, జూన్ చివరి వరకు పట్టించుకోలేదు. నెల రోజులకు పైగా ఆలస్యం చేశారు. టీడీపీకి సంబంధించిన వారి కంపెనీలు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేశాయి. ఇక్కడ కిలో మామిడి రూ.12 అంటున్నారు. కానీ, ఎంత మందికి ఆ ధర ఇచ్చారు. 6.5 లక్షల టన్నుల పంట. 2.5 లక్షల ఎకరాల్లో సాగు. 76 వేల మంది రైతులకు ఇక్కట్లు. వారికి సంఘీభావంగా నేను అక్కడికి పోవడం తప్పా? ఆ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం తప్పా?. 2 వేల మందికి నోటీసులు. వందల మంది అరెస్టు, ముగ్గురు ఎస్పీలు. వందల మంది పోలీసులు. వారంతా నా సెక్యూరిటీ కోసం. ప్రజలు నా కార్యక్రమానికి రాకుండా చూడడం కోసం.చివరకు బైక్లకు పెట్రోల్ కూడా పోయొద్దని నోటీసులు ఇచ్చారు. ఇన్ని చేసినా వేలాది రైతులు తరలి వచ్చారు. మామిడిని రోడ్ల మీద వేసి, నిరసన వ్యక్తం చేసి, నన్ను కలిశారు. ఆ కార్యక్రమంపై 5 కేసులు పెట్టారు. రైతులు, ప్రతిపక్షాన్ని పట్టుకుని అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం.అందుకు వారు సిగ్గుపడాలి:ఈనాడు చూస్తే దారుణ రాతలు. అది టాయిలెట్ పేపర్కు ఎక్కువ. టిష్యూ పేపర్కు తక్కువ. నాపై రైతులు నిరసన వ్యక్తం చేశారని ఈనాడులో రాశారు. అది ఒక పేపరేనా? మామిడి రోడ్ల మీద వేసిన రైతులపైనా కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సమస్యలు ప్రస్తావించొద్దని, వారు రొడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండొద్దని, ఎన్నికలప్పుడు ఇచ్చిన 143 హామీలు అన్నీ నెరవేర్చామని ప్రజలంతా భావించాలంట. లేదని ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పుడు కేసులు. వేధింపులు. పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు.. పాత్రికేయం లని చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.ఇది పైశాచికత్వం కాదా?:అనంత జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్మే పెద్దారెడ్డి.. తన సొంత ఇంటికి పోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు పోవాలని చూసినా, పోలీసులే అడ్డుకుంటున్నారు. ఏకంగా గన్ చూపిస్తున్నారు. (అంటూ ఆ ఫోటో చూపారు).నెల్లూరు జిల్లాలో 6సార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం, వీరి పచ్చ సైకోలు, పచ్చ శాడిస్టులు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, అప్పుడు ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే, చంపేసి ఉండేవాళ్లు. (అంటూ పోలీసుల సమక్షంలోనే దాడి దృశ్యాల ప్రదర్శన). అదృష్టవశాత్తూ ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే.. దాడి చేసిన వారిపైన కానీ, చేయించిన ఎమ్మెల్యేపై కానీ ఏ చర్య లేదు. కేసు లేదు. కానీ, ప్రసన్నపైనే కేసులు నమోదు. అంటే ఇక్కడ బాధితుడే బాధ్యుడన్నట్లు చిత్రీకరణ. ఇది పైశాచికత్వం కాదా? ఒక దుష్ట సంప్రదాయం తీసుకొచ్చాడు చంద్రబాబు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి:ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు.. కాకాణి గోవర్ధన్రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్ అధికారులు వీరు. వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్ని కేసులకు ఒకటే మోడస్ ఆపరాండి. తప్పుడు వాంగ్మూలంతో తమ టార్గెట్లో ఉన్న వారిపై కేసులు. అరెస్టులు.అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?:ఇదే సంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు ఇలాగే వ్యవహరిస్తే, మీ పరిస్థితి ఏమిటి?. చంద్రబాబుగారు వేసిన విత్తనం రేపు వృక్షమై పోతుంది. రేపు ఇదే కొనసాగితే.. చంద్రబాబు, టీడీపీ వారి పరిస్థితి ఏమిటి? ఈరోజు దెబ్బ తిన్న వారు ఊర్కోరు కదా?. ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది. ఈరోజు దెబ్బ తిన్నవారు, మేము చెప్పినా వినకపోవచ్చు. కాబట్టి చంద్రబాబుగారు ఇకనైనా పద్ధతి మార్చుకో. తప్పుడు సంప్రదాయం వదిలెయ్.ఏదీ లేదు. అయినా ఎవరూ మాట్లాడొద్దు:ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో అందరికీ తెలుసు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. మ్యానిఫెస్టో హామీల అమలు లేదు. రైతు భరోసా లేదు. తల్లికి వందనం లేదు. వాటి గురించి ఎవరూ మాట్లాడొద్దు. గత ఏడాది ఒక సిలిండర్ కొందరికే ఇచ్చారు. ఈ ఏడాది కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం లేదు. నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.36 వేలు. దీన్ని మొత్తం ఎగ్గొట్టారు.దీన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. అడగొద్దు. 50 ఏళ్లకే పెన్షన్ అని దాన్ని ఎగ్గొట్టారు. ఫ్రీ బస్ లేదు. ఏడాది గడిచిపోయింది. పండగల మీద పండగల డేట్లు చెబుతున్నాడు. కానీ, అమలు మాత్రం లేదు.పిల్లలు చదువులు మాని, పనులకు పోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్. అలా రూ.4,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఏటా ఏప్రిల్లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లు గడిచాయి కాబట్టి, రూ.2200 కోట్లు. రెండూ కలిపి రూ.6,600 కోట్లు కావాలి కానీ, ఇచ్చింది మాత్రం రూ.770 కోట్లు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3600 కోట్లు చొప్పున బకాయి. ఆరోగశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.4500 కోట్లు బకాయి.చంద్రబాబు తొలగించిన ఉద్యోగాలు 3 లక్షలకు పైగా. 2.6 లక్షల మంది వలంటీర్లు. ఎండీయూ వాహనాల ద్వారా 20 మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్. అధికారంలోకి వస్తే జీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తెస్తామన్నారు. అదీ మోసం. ఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. అక్రమ కేసులు. చివరకు గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏప్రిల్ నుంచి దాదాపు రూ.1000 కోట్లు బకాయి.అప్పుల కుప్ప. దా ‘రుణ’ స్థితి:చంద్రబాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. కానీ, ఒక్క పథకం అమలు లేదు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. అప్పుడు రెండేళ్లు కరోనా ఉంది. అయినా అన్ని పథకాలు ఇచ్చాం. అంటే మా 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 52.34 శాతం 14 నెలల్లోనే చేశాడు. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఎవరికి మంచి చేయలేదు. పథకాల అమలు లేదు. అయినా ఎవరూ అడగొద్దు. రూ.18,272 కోట్ల బాదుడు విద్యుత్ ఛార్జీల రూపంలో భారం వేశారు. ఫ్యుయెల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్పీపీసీఏ) పేరుతో దోపిడి. చంద్రబాబు పుణ్యమా అని అమూల్ నష్టపోతోంది. మరోవైపు హెరిటేజ్ లాభాల్లో ఉంది. పాల ధరలు పెరిగాయి. పిల్లల ఫీజులు పెరిగాయి. నాడు–నేడు పనులు నిల్చిపోయాయి. అయినా ఎవరూ మాట్లాడొద్దు.ఎవ్వరూ ప్రశ్నించొద్దు:కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అమ్మకం, మట్టి మాఫియా, ఇసుక స్కామ్.. దేని గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇక్కడ నిర్మాణ వ్యయం పెంచారు. ప్రతి అడుగుకు దాదాపు రూ.10 వేలు చెల్లింపు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు. ఎక్కువ ధరకు పీపీఏ చేసుకున్నా అడగొద్దు. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి. అయినా ఎవరూ ప్రశ్నించొద్దు.జగన్ ప్రెస్మీట్ హైలైట్స్వడ్డీతో సహా చెల్లిస్తాం:ఒకటే చెబుతున్నా. ప్రజలతో ఉంటాం. వారి కోసం పోరాడుతాం. కేసులకు భయపడం. చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారికి ఒకే హెచ్చరిక. ఎవరినీ వదలం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మరో మూడేళ్లు గడిస్తే, మా ప్రభుత్వం వస్తుంది.కరేడు రైతుల సమస్యపై మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ఇండోసోల్ను తరిమేసే కుట్ర:ప్రకాశం జిల్లాలో ఇండోసోల్కు భూమి ఇచ్చాం. వారు రైతులకు డబ్బులిచ్చారు. 8 వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ, వారిని వెళ్లిపొమ్మంటున్నారు. ఆ భూములు వేరే వారికి ఇచ్చేలా, ఇండోసోల్ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు. అక్కడ రైతులు రెండు పంటలు పండే భూములు ఇవ్వబోమంటున్నారు. ఆ కంపెనీ రూ.42 వేల కోట్లు పెట్టుబడి. మరి మీరు కంపెనీలు రావాలనుకుంటున్నారా?. అదే బీపీసీఎల్కు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే, ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఇవ్వొచ్చు కదా? వారికి ఇండోసోల్ కంపెనీ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?అదే చంద్రబాబు లక్ష్యం:పరిశ్రమల ఏర్పాటు కాదు చంద్రబాబు లక్ష్యం. వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం. జిందాల్ వాళ్లు వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు దండం పెడుతున్నారు అని జగన్ మీడియా సమావేశం ముగించారు.

దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు.

రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సౌతాంప్టన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్(1)ను బారత పేసర్ క్రాంతి గౌడ్ పెవిలియన్ పంపింది. ఈ క్రమంలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(41), లాంబ్(39) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జట్టు స్కోర్ బోర్డును నడిపించారు.వీరిద్దరూ ఐదో వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. చరణి, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తుది జట్లుఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

ఉద్దవ్ ఠాక్రేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బంపరాఫర్!
ముంబై: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ఇది భవిష్యత్ మహా రాజకీయాల్లో నిరూపితం కానుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రతిపక్షనేత ఉద్ధవ ఠాక్రేకు బంపరాఫ్ ఇచ్చారు. మళ్లీ తమతో కలిసిపోవచ్చంటూ ఆహ్వానించారు. దీంతో పాత మిత్రులు మళ్లీ ఒక్కటి కానున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది. బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో జరిగిన అంబదాస్ డాన్వే (ఉద్ధవ్ ఠాక్రే శివసేన విభాగానికి చెందిన ప్రతిపక్ష నేత) వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్ధవ్ జీ 2029 వరకు మాది అధికార పక్షమే. కానీ మీరు మా వైపు రావాలనుకుంటే ఆలోచించుకోండి. అది మీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఫడ్నవీస్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలోని సభ్యుల మొహాల్లో నవ్వులు పూయించేలా చేశాయి. కానీ రాజకీయంగా దీని వెనుక ఉన్న వేరే ఉద్దేశ్యం ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఫడ్నవ్ ఆహ్వానంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఫడ్నవీస్ ఆహ్వానం సరదాగా చెప్పిన మాట. అంతే’ అని అన్నారుకాగా, గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, 2022లో విభజన తర్వాత ఆయన శివసేన (UBT) నేతగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలో సీఎం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఫడ్నవీస్ చేసిన ఈ రాజకీయ పరమైన కామెంట్లు భవిష్యత్తులో పాత మిత్రులు మళ్లీ కలవవచ్చన్న సంకేతాలు పంపినట్లైంది. పాత మిత్రుల మధ్య మళ్లీ పొత్తు పొడిస్తే మహా రాజకీయాలు మలుపులు తిరగనున్నాయి. అయితే… ఇదంతా ఊహలు మాత్రమే. నిజంగా పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. देवेंद्र फडणवीस ने कहा - उद्धव जी, 2029 तक कोई स्कोप नहीं है! #MaharashtraCM #DevendraFadnavis #mansoonsession2025 #AssemblySession #UddhavThackeray #SSUBT pic.twitter.com/62dLFKNXiQ— Aaj Ke Devendra Kal Ke Narendra (@AajKDKalN) July 16, 2025

ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ను క్యాన్సర్ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది.

రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025

ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?
అన్నాబెల్లె.. ది కంజూరింగ్ సిరీస్ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్లు చేయబోయి ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.అమెరికాలో కనెక్టికట్ స్టేట్లోని న్యూఇంగ్లండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్(NESPR) వాళ్లు.. డెవిల్స్ ఆన్ ది రన్ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్ బొమ్మతో డాన్ రివెరా(54) అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.పెన్సిల్వేనియా గెట్టిస్బర్గ్ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది. ఎన్ఈఎస్పీఆర్ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లారాయిన్ వారెన్లు స్థాపించారు. డాన్ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్ఈఎస్పీఆర్తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్ వారెన్కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్లో మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్ఫ్లిక్స్ ‘28 డేస్ హాంటెడ్’ అనే సిరీస్లోనూ కనిపించారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్టాక్లో ఆ బొమ్మ షార్ట్ వీడియోస్ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్ఈఎస్పీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్ ఆన్ ది రన్ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.కొన్నాళ్ల కిందట లూసియానా టూర్లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్మెంట్లోని కలెక్షన్లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది. మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్ స్టేట్లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్ హాంటెడ్ డాల్గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్ సినిమాలు తెరకెక్కాయి.Annabelle Handler Dan Rivera Dies Suddenly During Haunted Tour, RIP #annabelle #annabelledoll #edwarren #lorrainewarren #paranormal #riristea #rivetsoro pic.twitter.com/6Ya3WM6K03— Rivet Soro (@Rivet_Soro) July 15, 2025

‘నువ్వు చిన్న పిల్లవి కాదు.. నన్ను అర్థం చేసుకో’.. బీఈడీ విద్యార్థినితో లెక్చరర్
భువనేశ్వర్: లెక్చరర్ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్ మోహన్ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్ సమీర్ రంజన్ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్ సాహూకు సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు. ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.దుర్ఘటనకు ముందు లెక్చరర్ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు. జులై 12న ఒడిశాలోని బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది.

బాబైనా.. ట్రెండ్ సెట్టర్లను అనుసరించాల్సిందే!
ఫాలో ద లీడర్ అంటూ ఉంటారు చూడండి అదిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది కాదు.. ఉన్నది కొద్దికాలమైనా ఆ పదవిలోకి వచ్చే ఇతరులకు ఎంత ఆదర్శంగా నిలిచామన్నది ముఖ్యమంటారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ రాజకీయాలిప్పుడు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేకించి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, మార్పులు, స్కీములు, ప్రాజెక్టులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు.విభజిత ఏపీలో 2019-2024 టర్మ్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థలు, తెచ్చిన పథకాలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను కూడా జగన్ తెచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తానని, స్కీములను అమలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. ఇది ఒక రకంగా నాయకుడిని అనుసరించడమే!కూటమి సర్కారు కూడా కొన్నింటిని మినహాయించి మిగిలిన వాటి విషయంలో జగన్ విధానాలనే అనుసరిస్తోంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కడప నగరంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడం వల్ల! అది అత్యంత ఆసక్తికరంగా ఉంది. జగన్కు ప్రజలలో వస్తున్న ఆదరణను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడిని ఎలా అనుసరిస్తున్నాడో వివరించారీ ఫ్లెక్సీలో! ఫ్లెక్సీలోని కొన్నింటి గురించి చూద్దాం..‘‘సంక్షేమం అంటే అంత ఇష్టం ఉండని ఆయనకు సంక్షేమం అంటే నేర్పించావు" అని ఒక కామెంట్ ఉంది దాంట్లో. నిజంగానే సంక్షేమ రంగంపై చంద్రబాబుది భిన్నాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో మాత్రం జగన్ ఇచ్చేదానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చినా, జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి మేనిఫెస్టోల్లో ఊదరగొట్టినా... గెలిచిన తరువాత మాత్రం సంపద సృష్టించే సంక్షేమం అమలు చేయాలని, సంక్షేమంతోనే అన్నీ జరిగిపోవని మాట్లాడిన విషయం ప్రజల దృష్టిలోనే ఉంది.పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం మినహా ఏడాది పాటు మిగిలిన అన్ని పథకాలనూ కూటమి సర్కారు ఎగవేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ఎన్నికల హామీ గెలుపు తరువాత ఒక్క సిలిండర్కే పరిమితమైంది. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ఏడాది తరువాత తల్లికి వందనం స్కీమును కొంత అమలు చేయక తప్పలేదు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ కారణంగా చంద్రబాబు సంక్షేమ రంగం వైపు చూడక తప్పలేదని చెప్పాలి.'ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దు, పొద్దునే బ్యాగు తగిలించుకుని అవ్వ,తాతలకు ఫించన్ డబ్బులు ఇచ్చేటట్లు చేశావు" అన్నది కడపలో వెలిసిన ఫ్లెక్సీలోని మరో వ్యాఖ్య. ఇది కూడా వాస్తవమే. 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఏ రోజూ చంద్రబాబు ప్రతి నెల ఉదయాన్నే వెళ్లి ఫించన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వృద్ధులే నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. జగన్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే చేర్చేశారు. అధికారంలోకి వస్తే తానూ వలంటీర్లను కొనసాగిస్తానని ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత దానికి మంగళం పాడారు. కాని జగన్ పెట్టిన పద్దతి మాత్రం పాటించక తప్పలేదు. ఆయన స్వయంగా కొందరు వృద్ధుల వద్దకు వెళ్లి ఫించన్ అందచేస్తున్నారు. ఇందుకు అనవసరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగు చేసిన బడులకు వెళ్లి, ప్రభుత్వ స్కూళ్ల గురించి చంద్రబాబు మాట్లాడేలా చేశారన్నది మరో కామెంట్. నిజమే. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఎంతో ఘనంగా చెప్పిన ఘనత చంద్రబాబుది మరి. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను స్వయంగా గమనించారు. ఆ క్రమంలో అక్కడ ఒక చోట రాసి ఉన్న నాడు-నేడు పదాలను చెరపడానికి స్కూల్ సిబ్బంది నానా పాట్లు పడాల్సి రావడం విశేషం. ఇష్టం ఉన్నా, లేకపోయినా, తండ్రి, కొడుకులు కుటుంబంలోని పిల్లలందరికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వక తప్పలేదని అది కూడా జగన్ ఎఫెక్టే అన్నది ఆ ఫ్లెక్సీలోని మరో అంశం.కూటమి సర్కార్ జగన్ హయాంలో చేపట్టి ఓడరేవులు, వైద్య కళాశాలలు మొదలైన వాటిని ప్రామాణికంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నది కడపలో వెలసిన ఫ్లెక్సీలోని మరో కామెంట్. పెట్టుబడిదారుల సదస్సులలో ఏపీలో కొత్తగా వస్తున్న పోర్టుల గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. అవన్ని జగన్ శ్రీకారం చుట్టినవే. గతంలో జగన్ ‘‘గడప గడపకు...’’ పేరుతో పార్టీ నేతలందరిని ప్రజల ఇంటింటికి పంపిస్తే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే తరహాలో కూటమి ఎమ్మెల్యేలు, కేడర్ను ‘‘తొలి అడుగు’’ పేరుతో ప్రజల వద్దకు పంపుతున్నారు.'నీ పర్యటనలు ఆపడానికి అష్టకష్టాలు పడి ఏమి చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రులపై తిట్ల దండకం అయ్యేలా చేశావ్’’ అన్నది ఇంకో కామెంట్. జగన్ టూర్లు, ఆయనకు ప్రజలలో వస్తున్న మద్దతు మొదలైనవాటిని గమనించిన చంద్రబాబు గత మంత్రివర్గ సమావేశంలో మంత్రులు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు గట్టిగా జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. జగన్ పర్యటనల ఫలితంగా కూటమి సర్కార్ ఆయా సమస్యలపై స్పందించక తప్పడం లేదు. మిర్చి ,పొగాకు, మామిడి రైతుల వద్దకు జగన్ వెళ్లి పరామర్శ చేయడంతో ప్రభుత్వం హడావుడి పడి కొంత నిధులు ఇవ్వడం, కేంద్రానికి లేఖలు రాయడం వంటివి చేసింది. 'నీకు 11 సీట్లే వచ్చినా పాలన అంతా నీ కనుసన్నలలోనే జరుగుతా ఉన్నట్లు ఉంది జగనూ" అన్న వ్యాఖ్య ఈ ఫ్లెక్సీలో కొసమెరుపు. ఈ ఫ్లెక్సీపై ఎవరి పేరైనా ఉంటే ఈపాటికి రెడ్ బుక్ ప్రయోగం జరిగేదేమో! గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాని వైఎస్సార్ ముఖ్యమంత్రై రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తాను ఇంకా ఎక్కువ సమయం ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.గత టరమ్లో కాని, ఇప్పుడు కాని అది కొనసాగుతూనే ఉంది. వైఎస్ తీసుకు వచ్చిన ఆరోగ్యశ్రీని తొలుత టీడీపీ వ్యతిరేకించింది. కాని తదుపరి అది కూడా అమలు చేయక తప్పలేదు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీముల విషయం కూడా అంతే. వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాని, హైదరాబాద్ చుట్టూరా జరిగిన అభివృద్ది కాని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసే ప్రసంగాలు కూడా వైఎస్ పాలనను గుర్తు చేస్తాయి. అలాగే గత టరమ్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, భూముల రీసర్వే తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.ఎన్టీఆర్ కాలంలో పరిపాలనను మండల స్థాయికి తీసుకు వెళితే, జగన్ ప్రజల వద్దకు పాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో సదుపాయం కలిగించారు. కాకపోతే జగన్ తెచ్చిన స్కీములను కాదనలేక కొన్నిటిని నీరు కార్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేలా తేగలిగారన్నది చర్చనీయాంశం. ఆయన గతంలో ఇంకుడు గుంతలు, జన్మభూమి వంటివాటిని ప్రవేశపెట్టారు. కాని వాటిని ఆయనే కొనసాగించలేకపోయారు.ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల వ్యయం చేయాలని చంద్రబాబు తలపెట్టారు. దాని ప్రభావం ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లతో పోల్చితే చంద్రబాబుకు విశేషమైన అవకాశాలు వచ్చినా వాటిని సామాన్య ప్రజల కోసం కాకుండా ధనవంతుల ప్రయోజనాల కోసం చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ ప్రభుత్వంలో అమలు అయినవాటిని చంద్రబాబు అనుసరించవలసి రావడం చారిత్రక సత్యం అని ఒప్పుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కెమియో రోల్.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే 3బీహెచ్కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్ చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీలో మీరెందుకు ఆ రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్ అడగడంతోనే ఆ రోల్ చేశానని సిద్దార్థ్ తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగితే ఐదు నిమిషాల రోల్ చేశా.. ఆ రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్లో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు.
హైదరాబాద్–అమరావతి కొత్త రైలు మార్గం
అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు?
తాళాలే తియ్యరు.. ఫీజులు మెక్కేస్తారు
‘స్థానిక’ స్థానాలు ఖరారు
ఆ ముచ్చటే లేదు!
డూప్ లేని యాక్షన్
కౌంట్ డౌన్ స్టార్ట్
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాల లేమి.. ఏపీ హైకోర్టు సీరియస్
ఉద్దవ్ ఠాక్రేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బంపరాఫర్!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
సాక్షి కార్టూన్ 16-07-2025
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
హైదరాబాద్–అమరావతి కొత్త రైలు మార్గం
అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు?
తాళాలే తియ్యరు.. ఫీజులు మెక్కేస్తారు
‘స్థానిక’ స్థానాలు ఖరారు
ఆ ముచ్చటే లేదు!
డూప్ లేని యాక్షన్
కౌంట్ డౌన్ స్టార్ట్
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాల లేమి.. ఏపీ హైకోర్టు సీరియస్
ఉద్దవ్ ఠాక్రేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బంపరాఫర్!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
సాక్షి కార్టూన్ 16-07-2025
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
సినిమా

ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
అనసూయ తొలుత 'జబర్దస్త్' షోతో యాంకర్గా పరిచయమైంది. మధ్యలో ఓసారి కొన్నాళ్ల పాటు షోలో కనిపించలేదు. తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అలా 2022 వరకు షోలో కొనసాగింది. ఏమైందో ఏమో గానీ సడన్గా షో నుంచి తప్పుకొంది. అప్పటినుంచి ఒకటి రెండు షోలు, ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'జబర్దస్త్' 12 ఏళ్ల సెలబ్రేషన్స్ కోసం వచ్చింది. హైపర్ ఆదిపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)'బాబుగారు, ఇంద్రజగారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది, నాకు కొన్ని.. మైక్లోనే చెప్పేస్తా నేను అన్నీ.. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్క్లూజివిటీ యాడ్ అవలేదు. అది నా ఏడుపు' అని అనసూయ చెప్పింది.మరోవైపు ఆది మాట్లాడుతూ.. 'ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లినా సరే నీకు లింకులు పంపించా. అది రా మన లింక్. ఏమనుకుంటున్నావ్ రా నువ్వు' అని అన్నాడు. బదులిచ్చిన అనసూయ.. 'ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్లిపోయింది' అని ఆవేశంగా చెప్పుకొచ్చింది.'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో బట్టి చూస్తే హైపర్ ఆదితో అనసూయ కాస్త గట్టిగానే మాట్లాడింది. చూస్తుంటే చాలావరకు నిజాలే చెప్పినట్లు ఉంది గానీ చివరలో ఇదంతా స్కిట్ అని కామెడీ చేసేస్తారేమో! ఎందుకంటే షోలో ఉన్నప్పుడు ఆది.. అనసూయని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలానే వేసేవాడు. కానీ అనసూయ పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదు. ఇప్పుడు కూడా స్కిట్లో భాగంగా తన మనసులో ఉన్నదంతా బయటపెట్టేసిందేమో అనిపిస్తోంది. ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే అసలు విషయం ఏంటో తేలుతుంది.(ఇదీ చదవండి: ఇది గమనించారా? స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు)

చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య
నటుడు బాలా (Actor Bala) పర్సనల్ విషయాలతో ఎప్పుడూ వివాదాల్లో నానుతూనే ఉంటాడు. చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. తర్వాత నటి అమృతా సురేశ్ను వివాహం చేసుకోగా కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. అయితే డివోర్స్ తర్వాత తనతోపాటు, తన కూతుర్ని కూడా వేధించారని అమృత పోలీసులను ఆశ్రయించడం, వారు బాలను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే డాక్టర్ ఎలిజబెత్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. నాకేదైనా జరిగితే తనదే బాధ్యతఆమెను కూడా వదిలేసి గతేడాది కోకిలను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇలా నాలుగు పెళ్లిళ్లతో బాలా సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అయ్యాడు. తాజాగా డాక్టర్ ఎలిజబెత్ (Elizabeth Udayan) షేర్ చేసిన వీడియోతో మరోసారి బాలా పేరు తెరపైకి వచ్చింది. అందులో ఆమె ఆస్పత్రి బెడ్పై ఉంది. ఎలిజబెత్ ఏమందంటే.. నాకేదైనా జరిగితే నా మాజీ భర్త, అతడి కుటుంబానిదే పూర్తి బాధ్యత. అతడి గురించి ఏళ్లతరబడి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చనిపోయేలోపు న్యాయం?సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకున్నా, సీఎంను కలిసినా, కోర్టు మెట్లెక్కినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైగా నన్నే బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. అదే చాలా బాధగా ఉంది. నాకేదైనా జరిగితే అతడి(బాలా)తోపాటు అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొంది. ఈ వీడియోకు 'నేను చనిపోయేలోపు నాకు న్యాయం జరుగుతుందా?' అని క్యాప్షన్ జోడించింది.నీ ఉసురు ఊరికే పోదుఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడదాని కన్నీళ్ల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. వీలైతే జరిగినదాన్ని మర్చిపో, కౌన్సెలింగ్ తీసుకో.. అతడి చెర నుంచి తప్పించుకోవడమే ఒక వరంలా భావించు, నువ్వు అతడిని చాలా ప్రేమించావు. కానీ, ఈరోజు కాకపోయినా రేపయినా అతడికి తగిన శాస్తి జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.డాక్టర్వి అయ్యుండి ఇలా..మరికొందరేమో.. నువ్వు ఒక డాక్టర్వి.. గతాన్ని మర్చిపోయి నీ వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించు, వైద్యురాలివయ్యుండి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించు. అది వీలుకాకపోతే మీ జీవితంలోనే పెద్ద సమస్య అయిన వ్యక్తి మీకు దూరంగా వెళ్లిపోయాడని మీకు మీరు భరోసా ఇచ్చుకోండి అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు తీసుకుంటున్నా

రాష్ట్రపతి భవన్లో కన్నప్ప.. మంచు విష్ణుపై ప్రముఖుల ప్రశంసలు!
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప. శివభక్తుడైన కన్నప్ప కథగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలంతా నటించారు. ముఖ్యంగా మన పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని మంచు విష్ణు రిలీజ్కు ముందే చెప్పారు. మన ఆధ్యాత్మిక చరిత్ర వారికి తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ షోకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు. ఈ సినిమా అనంతరం అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు.కన్నప్ప చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. ‘కన్నప్ప’లోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్లో మంచు విష్ణు నటన అందరికీ గుర్తుండిపోతుంది. అతని నటన, స్క్రీన్ ప్రజెన్స్ మీద దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విష్ణు నటన గురించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ విష్ణు నటనను కొనియాడారు.

తిరుమలలో హీరోయిన్ ప్రణీత.. మొదటిసారి అంటూ పోస్ట్!
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది. Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రాణించిన జెమీమా, దీప్తి
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మహిళలతో టి20 సిరీస్ను గెలుచుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్లో శుభారంభంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కడపటి వార్తలందేసరికి 45 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 86బంతుల్లో 90 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ‘బర్త్డే గర్ల్’ సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83; 9 ఫోర్లు), అలైస్ డేవిడ్సన్ (73 బంతుల్లో 53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శతక భాగస్వామ్యం... భారత పేసర్, మధ్యప్రదేశ్కు చెందిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను కట్టడి చేసింది. తన తొలి ఓవర్లోనే ఎమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేసిన ఆమె, తన తర్వాతి ఓవర్లో బీమాంట్ (5)ను ఎల్బీగా పంపడంతో ఇంగ్లండ్ స్కోరు 20/2 వద్ద నిలిచింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమా ల్యాంబ్ (50 బంతుల్లో 39; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 87 బంతుల్లో 71 జత చేశారు. అయితే ఆఫ్స్పిన్నర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్ను దెబ్బ కొట్టింది. తన వరుస ఓవర్లలో ఆమె ల్యాంబ్, నాట్ సివర్లను పెవిలియన్కు పంపించడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే డంక్లీ, అలైస్ చక్కటి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్కు 23.4 ఓవర్లలో 106 పరుగులు జోడించారు. ఎట్టకేలకు అలైస్ను అవుట్ చేసి ఆంధ్ర బౌలర్ శ్రీచరణి ఈ జోడీని విడగొట్టింది. చివర్లో సోఫీ ఎకెల్స్టోన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 49 పరుగులు సాధించింది. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్లు వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. కెప్టెన్ విఫలం... ఛేదనను భారత ఓపెనర్లు ధాటిగా మొదలు పెట్టారు. తొలి వికెట్కు ప్రతీక రావల్ (51 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి 8 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరిగింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో ప్రతీక, హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 27; 4 ఫోర్లు) పెవిలియన్ చేరారు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన హర్లీన్ అనూహ్యంగా రనౌటైంది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) విఫలమైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బీమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 5; ఎమీ జోన్స్ (బి) క్రాంతి 1; ఎమా ల్యాంబ్ (సి) హర్మన్ప్రీత్ (బి) రాణా 39; నాట్ సివర్ (సి) జెమీమా (బి) రాణా 41; డంక్లీ (బి) అమన్జోత్ 83; అలైస్ డేవిడ్సన్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శ్రీచరణి 53; ఎకెల్స్టోన్ (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–8, 2–20, 3–91, 4–97, 5–203, 6–258. బౌలింగ్: అమన్జోత్ 10–0–58–1, క్రాంతి గౌడ్ 9–0–55–2, దీప్తి శర్మ 10–0–58–0, శ్రీచరణి 10–0–46–1, స్నేహ్ రాణా 10–0–31–2, ప్రతీక 1–0–7–0.

రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సౌతాంప్టన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్(1)ను బారత పేసర్ క్రాంతి గౌడ్ పెవిలియన్ పంపింది. ఈ క్రమంలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(41), లాంబ్(39) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జట్టు స్కోర్ బోర్డును నడిపించారు.వీరిద్దరూ ఐదో వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. చరణి, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తుది జట్లుఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి'
బిజినెస్

గగనతల రారాజులు
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జాతీయ భద్రతకు మూలస్తంభంగా నిలుస్తోంది. నిత్యం గగనతలాన్ని కాపాడుతూ, దేశ రక్షణకు దోహదం చేస్తోంది. ముష్కర మూకలను ముద్దాడుతోన్న పాకిస్థాన్కు ఆపరేషన్ సింధూర్ సమయంలో చుక్కలు చూపించిన భారత వీరుల్లో ఐఏఎఫ్ ఆఫీసర్లు కీలకపాత్ర పోషించారు. యుద్ధంలోనే కాకుండా ఐఏఎఫ్ అధికారులు ఇతర సమయాల్లోనూ చాలానే విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో చేరి ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నవారిపై మరింత బాధ్యతలుంటాయి. అయితే ఐఏఎఫ్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా ఉన్న ఫ్లయింగ్ ఆఫీసర్ ఎలాంటి విధులు నిర్వర్తిస్తారు..ఎలాంటి అధికారులున్నాయి.. ఏయే సవాళ్లున్నాయో వివరంగా తెలుసుకుందాం.ఫ్లయింగ్ ఆఫీసర్ఫ్లయింగ్ ఆఫీసర్ అనేది ఐఏఎఫ్లో ఎంట్రీ లెవల్ కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంక్. ఇది ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ లేదా ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్కు సమానం. దేశవ్యాప్తంగా రిక్రూట్ అయిన ఫ్లయింగ్ ఆఫీసర్లకు సాధారణంగా హైదరాబాద్లోని దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) లేదా ఇతర సంస్థల్లో కఠినమైన శిక్షణ అందిస్తారు. రిక్రూట్ అయిన తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లేదా గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ వంటి ఐఏఎఫ్ శాఖల్లో వారి ప్రతిభ ఆధారంగా పని చేయాలి. ఫ్లయింగ్ బ్రాంచ్లోని ఫ్లయింగ్ ఆఫీసర్లు ఆపరేషనల్ రోల్స్లో కీలకంగా వ్యవహరిస్తారు.భారత వైమానిక దళంలో ఫ్లయింగ్ ఆఫీసర్ విధులు1. ఆపరేషనల్ ఫ్లయింగ్ డ్యూటీలుఫ్లయింగ్ బ్రాంచ్లోని ఫ్లయింగ్ ఆఫీసర్లకు వారి స్పెషలైజేషన్ను బట్టి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు లేదా హెలికాప్టర్లతో సహా అధునాతన విమానాలను ఆపరేట్ చేయడం, వాటిని నిర్వహించాల్సి ఉంటుంది.యుద్ధ కార్యకలాపాలు: సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐ, రాఫెల్ లేదా తేజస్ వంటి ఫైటర్ స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ యుద్ధ మిషన్లలో పాల్గొంటారు. వ్యూహాత్మక విన్యాసాలను అమలు చేయడం, కచ్చితమైన దాడులను నిర్ధారించడం, సంఘర్షణలు లేదా విన్యాసాల సమయంలో వైమానిక ఆధిపత్యాన్ని నిర్వహించడానికి వారు బాధ్యత వహిస్తారు.రవాణా, లాజిస్టిక్స్: రవాణా స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు సీ-130జే సూపర్ హెర్క్యులస్ లేదా ఐఎల్ -76 వంటి విమానాలను నడుపుతారు. దళాల రవాణా, విపత్తు సమయంలో, ఎయిర్ డ్రాప్స్, మారుమూల ప్రాంతాలకు సరఫరా మిషన్లను నిర్వహిస్తారు. తరచుగా సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సిబ్బంది, సామగ్రిని సకాలంలో సురక్షితంగా డెలివరీ చేయాల్సి ఉంటుంది.హెలికాఫ్టర్ ఆపరేషన్స్: హెలికాప్టర్ యూనిట్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎంఐ-17, చినూక్ లేదా ధృవ్ వంటి విమానాలను నడుపుతారు. సెర్చ్ అండ్ రెస్క్యూ, క్యాజువాలిటీ తరలింపు, దళాల ప్రవేశం, విపత్తు సమయంలో వెంటనే ప్రతిస్పందించాలి.మిషన్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్: ఫ్లయింగ్ ఆఫీసర్లు మిషన్ లక్ష్యాలు, వాతావరణ పరిస్థితులు, ఇంటెలిజెన్స్ నివేదికలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రీ-ఫ్లైట్ ప్లానింగ్లో పాల్గొంటారు. వారు గ్రౌండ్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర యూనిట్లతో సమన్వయం చేసుకుని మిషన్లను నిరాటంకంగా అమలు చేయాలి.శిక్షణ, వ్యాయామాలు: ఫ్లయింగ్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా శిక్షణ, వ్యాయామాల్లో పాల్గొనాలి. (ఉదా. వ్యాయామం గగన్ శక్తి లేదా రెడ్ ఫ్లాగ్ వంటి మల్డిలెవల్ వ్యాయామాలు). వీటివల్ల వారి ఎగిరే నైపుణ్యాలు, సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం మెరుగు పడుతుంది.2. నాయకత్వ బాధ్యతలుకమిషన్డ్ ఆఫీసర్లుగా ఫ్లయింగ్ అధికారులు జూనియర్ స్థాయిలో కూడా కొన్నిసార్లు తమ బృందాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది.స్క్వాడ్రన్ విధులు: ఒక స్క్వాడ్రన్లో ఫ్లయింగ్ ఆఫీసర్లు స్క్వాడ్రన్ లీడర్లు లేదా వింగ్ కమాండర్లు వంటి సీనియర్ అధికారుల కింద పనిచేయాలి. ఈ సమయంలో ఎయిర్మెన్, టెక్నీషియన్లు లేదా గ్రౌండ్ క్రూ బృందాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. తమ యూనిట్లోని సభ్యులకు క్రమశిక్షణ, నైతిక స్థైర్యాన్ని నింపాలి.ఫ్లైట్ కమాండ్: మిషన్ల సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ సంక్లిష్టమైన విన్యాసాలు చేయాలి. ఇతర పైలట్లతో సమన్వయం చేస్తూ సెక్షన్ లీడర్ లేదా వింగ్ మ్యాన్గా నాయకత్వం వహించాలి. దీనికి క్షణాల్లో నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అవసరం.మెంటార్షిప్: ఫ్లయింగ్ ఆఫీసర్లు జూనియర్ ఎయిర్ మెన్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లకు మార్గనిర్దేశం చేస్తారు. ప్రొఫెషనలిజం, టీమ్ వర్క్ సంస్కృతిని పెంపొందిస్తారు.3. అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్ బాధ్యతలుఆపరేషనల్ పాత్రలకు మించి, ఫ్లయింగ్ ఆఫీసర్లు తమ యూనిట్లు సజావుగా పనిచేసేలా చూడాలి. అందుకు అడ్మినిస్ట్రేటివ్ విధులను నిర్వహిస్తారు.డాక్యుమెంటేషన్, రిపోర్టింగ్: మిషన్ లాగ్లు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ రిపోర్టులు, పనితీరు మదింపులతో సహా విమాన కార్యకలాపాల రికార్డులను నిర్వహిస్తారు. ఆపరేషనల్ అనాలిసిస్, సేఫ్టీ ఆడిట్లకు కచ్చితమైన డాక్యుమెంటేషన్ కీలకం.గ్రౌండ్ క్రూలతో సమన్వయం: ఫ్లయింగ్ ఆఫీసర్లు సాంకేతిక బృందాలతో సంప్రదింపులు జరిపి విమాన మిషన్ సిద్ధంగా ఉండేలా చూస్తారు. నిత్యం వాటి పరిస్థితిని తనిఖీ చేస్తారు. నిర్వహణ షెడ్యూళ్లను సమన్వయం చేస్తారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు.శిక్షణ పర్యవేక్షణ: శిక్షణ యూనిట్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు క్యాడెట్లు లేదా కొత్త పైలట్లకు సూచనలు ఇవ్వడంలో, సిమ్యులేటర్ సెషన్లను పర్యవేక్షించడంలో, ప్రాథమిక విమాన శిక్షణలో సహాయపడుతారు. ట్రైనీలు ఐఏఎఫ్ ప్రమాణాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించేలా చూస్తారు.4. టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీటెక్నికల్ బ్రాంచ్: టెక్నికల్ బ్రాంచ్ (ఏరోనాటికల్ ఇంజినీరింగ్ - ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్)లో ఫ్లయింగ్ ఆఫీసర్లు విమానాలు, వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషనల్ సంసిద్ధతను పర్యవేక్షిస్తారు. సమస్యలను పరిష్కరించడానికి, విడిభాగాలను నిర్వహించడానికి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి టెక్నీషియన్లతో కలిసి పనిచేస్తారు.గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్: అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి పాత్రల్లో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎయిర్బేస్ కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమం లేదా గగనతల సమన్వయాన్ని నిర్వహించాలి. ఉదాహరణకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోని ఫ్లయింగ్ ఆఫీసర్ సురక్షితమైన టేకాఫ్లు, ల్యాండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.5. అత్యవసర సేవలువిపత్తు నిర్వహణ: వరదలు, భూకంపాలు లేదా తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రవాణా లేదా హెలికాప్టర్ స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు సహాయక సామాగ్రిని అందిస్తారు. ప్రమాద స్థలాల నుంచి పౌరులను ఖాళీ చేయిస్తారు. గ్రౌండ్ ఆపరేషన్లకు మద్దతు ఇస్తారు.సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఆర్): హెలికాప్టర్ ఫ్లయింగ్ ఆఫీసర్లు హిమాలయాల్లో ఎత్తైన రెస్క్యూలు లేదా హిందూ మహాసముద్రంపై సముద్ర రెస్క్యూ వంటి సవాలుతో కూడిన వాతావరణంలో ఎస్ఏఆర్ మిషన్లను నిర్వహిస్తారు.వైద్య తరలింపు: ఎమర్జెన్సీ సమయాల్లో పౌరులను వైద్య సౌకర్యాలకు తరలించడానికి సహాయపడతారు.ఫ్లయింగ్ ఆఫీసర్ అధికారాలు1. కమాండ్ అథారిటీఫ్లయింగ్ ఆఫీసర్లు తమ అధీనంలోని ఎయిర్ మెన్, నాన్ కమిషన్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. గ్రౌండ్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం, మిషన్ పనులను సమన్వయం చేయడం, ఐఏఎఫ్ ప్రోటోకాల్స్ పాటించేలా చూడటం ఇందులో భాగం.ఆపరేషనల్ సందర్భాల్లో వారు తమ మిషన్ సంక్షిప్త పరిధిలో విమాన మార్గాలను మార్చడం లేదా బెదిరింపులకు ప్రతిస్పందించడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు.2. క్రమశిక్షణ అధికారాలుప్రవర్తనా ఉల్లంఘనలు లేదా ఆదేశాలను పాటించడంలో విఫలం కావడం వంటి వాటికి ప్రతిచర్యగా ఫ్లయింగ్ ఆఫీసర్లు సబార్డినేట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. తీవ్రమైన ఉల్లంఘనలను వైమానిక దళ చట్టం, 1950 ప్రకారం తదుపరి చర్యల కోసం సీనియర్ అధికారులకు నివేదిస్తారు.3. డెసిషన్ మేకింగ్మిషన్ల సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్లు లక్ష్యాలను చేధించడం, భద్రతా ఆందోళనల కారణంగా మిషన్లను నిలిపివేయడం లేదా ఇతర యూనిట్లతో సమన్వయం చేయడం వంటి రియల్ టైమ్ నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు. ఈ నిర్ణయాలు మిషన్ లక్ష్యాలు, ఐఏఎఫ్ ప్రోటోకాల్స్ ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి.4. సున్నిత సమాచారంమిషన్ ప్లాన్స్, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, టెక్నికల్ డేటాతో సహా సున్నితమైన సమాచారాన్ని ఫ్లయింగ్ ఆఫీసర్లకు అప్పగిస్తారు. అధికారిక రహస్యాల చట్టం, 1923, ఐఏఎఫ్ భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ఈ సమాచారాన్ని సంరక్షించే బాధ్యత వారిదే.ఇదీ చదవండి: దిగొస్తున్న బంగారం ధరలుఫ్లయింగ్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సవాళ్లుఫ్లయింగ్ ఆఫీసర్ పాత్రకు శారీరక దృఢత్వం, మానసిక స్థితి, సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం.ఒత్తిడి: యుద్ధం లేదా ప్రతికూల పరిస్థితుల్లో అధునాతన విమానాలను నడపడం వల్ల ఒత్తిడిలో కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవాలి.సుదీర్ఘ పని గంటలు: ఫ్లయింగ్ ఆఫీసర్లు అవసరమైనప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయాలి. రిమోట్ లేదా ఫార్వర్డ్ ప్రాంతాల్లో గడపాల్సి ఉంటుంది.నిరంతర అభ్యాసం: విమానయాన సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో నిత్యం ఫ్లయింగ్ ఆఫీసర్లు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వాని నైపుణ్యాలను అప్డేట్ చేస్తుండాలి.

దిగొస్తున్న బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు మంగళవారంతో పోలిస్తే బుధవారం మళ్లీ తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

మెసేజ్లకు టెల్కోల గుర్తింపు ‘కోడ్’
అసలైన మెసేజ్లు, స్పామ్ మెసేజ్లను మొబైల్ యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా టెలికం సంస్థలు ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం మెసేజ్ల వర్గీకరణ బట్టి వాటిని పంపించే వారి పేరు లేదా హెడర్కి ముందు నిర్దిష్ట ‘కోడ్’ వస్తుంది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్లకు ‘పి’ (ఆంగ్ల అక్షరం), సర్వీస్ సంబంధితమైనవాటికి ‘ఎస్’, లావాదేవీలకు సంబంధించిన వాటికి ‘టి’, ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజీలకు ‘జి’ అని కనిపిస్తుంది.ఇదీ చదవండి: ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!ఈ కోడ్లతో ఏ ఎస్ఎంఎస్ ఏ కోవకి చెందినదో సులువుగా తెలుసుకునేందుకు వీలవుతుందని, అవాంఛిత మెసేజ్లకు దూరంగా ఉండొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఓటీటీ యాప్లపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ యాప్లను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలవుతుందని కొచర్ పేర్కొన్నారు.

ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!
వస్తు ఎగుమతులు జూన్ నెలలో 35.14 బిలియన్ డాలర్లుగా (రూ.2.99 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2024 జూన్ నెలలోనూ ఎగుమతులు 35.16 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. దిగుమతులు 3.71 శాతం క్షీణించి 53.93 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 18.78 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పెట్రోలియం ఉత్పత్తులు, వ్రస్తాలు, రత్నాభరణాలు, లెదర్, ముడి ఇనుము, ఆయిల్ సీడ్స్, జీడి పప్పు, దినుసులు, పొగాకు, కాఫీ ఎగుమతులు క్రితం ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే క్షీణించాయి. ఇదే కాలంలో ఇంజినీరింగ్, టీ, బియ్యం, రెడీ మేడ్ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధి నమోదైంది. జూన్ త్రైమాసికంలో వస్తు, సేవల ఎగుమతులు 210 బిలియన్ డాలర్లుగా ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం కంటే 6 శాతం ఎక్కువని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు. ఎగుమతులు–దిగుమతులు జూన్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గి 4.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో 15 శాతానికి పైగా తగ్గి 17.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు జూన్లో 47 శాతం పెరిగి 4.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనూ ఎగుమతులు 47 శాతం వృద్ధితో 12.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగి 112 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 4 శాతానికి పైగా పెరిగి 179 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్–జూన్ కాలంలో వాణిజ్య లోటు 67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 62 బిలియన్ డాలర్లుగా ఉంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు ముడి చమురు దిగుమతులు 8 శాతం తగ్గి 25.73 బిలియన్ డాలర్లుగా, బంగారం దిగుతులు 26 శాతం తగ్గి 1.9 బిలియన్ డాలర్ల చొప్పున జూన్లో నమోదయ్యాయి. జూన్లో సేవల ఎగుమతుల విలువ 32.84 బిలియన్ డాలర్లుగా ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 28.67 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల దిగుమతుల విలువ 15 బిలియన్ డాలర్ల నుంచి 17.58 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఫ్యామిలీ

అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ!
ఏ పంట పండించినా రైతులకు నికరంగా ఎంత ఆదాయం వస్తోంది అన్నదాన్ని బట్టే ఆ పంట మేలైనదా కాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. రైతుకు నికరాదాయం పెరగాలంటే ఏ పంటలు పండించాలి? పొట్టపో΄సుకోవటానికి ఎంతోచ్చినా చాల్లే అని అందరూ పండించే సాధారణ పంటలు పండిస్తే లాభం లేదు. విదేశాలకు అవసరమైన పంటలేవో గ్రహించి పండించి, ఎగుమతి చెయ్యాలి. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్లు పండించి ఎగుమతి చేస్తున్నవి ఇవీ: 1. తెల్ల ఉల్లిపాయ ఒరుగులు 2. మునగ ఆకుల పొడి!తెల్ల ఉల్లిపాయల ఒరుగులు అనాదిగా ఎగుమతి అవుతున్న సరుకు కాదు. ఇటీవల కాలంలోనే దీనికి విదేశాల్లో గిరాకీ వచ్చింది. ఆ అవకాశాన్ని అందరికన్నా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది గుజరాత్ రైతులే. ఆ తర్వాత మహారాష్ట్ర. విదేశాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్ల ఉల్లిపాయల ఒరుగుల్ని వాడుతున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. తెల్ల ఉల్లి పాయలకు ఎర్ర ఉల్లి పాయల కన్నా 30% అధిక ధర ఇచ్చి వ్యాపారులు కొంటున్నారు. అందుకే ఇవి పండిస్తున్నా అంటున్నారు గుజరాత్ భావ్నగర్ జిల్లా రైతు రాహుల్. తెల్ల ఉల్లి ఒరుగులు మన దేశంలో కిలోకి రూ. 130 ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2.5–3 డాలర్లు (రూ. 215–255) పలుకుతోంది. సరుకు నాణ్యత, దేశాన్ని బట్టి ధరల్లో మార్పుంటుంది. కొనే వారుంటే పండించే వారూ ఆసక్తి చూపుతారు. అలాగే తెల్ల ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతూ వెళ్తోంది. మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణంలో 40% తెల్ల ఉల్లిదే. గత ఏడాది గుజరాత్లో 81,011 హెక్టార్లు సాగైన ఉల్లి ఈ ఏడాది 93,500 హెక్టార్లకు పెరిగింది.ఇక రెండోది మునగ ఆకుల పొడి సంగతి. ప్రపంచంలో 80% మునగ సాగుతో భారత్ ముందుంది. మునగ సాగు, ఎగుమతిలో తమిళనాడు రైతులు అగ్రగామిగా ఉన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ రైతు పంకజ్ కుమార్. తోటి రైతులంతా వరి, గోధుమ పండిస్తుంటే ఆయన మాత్రం పదేళ్ల క్రితమే 1.5 ఎకరాల్లో మునగాకు పండించటం మొదలు పెట్టి, ఇప్పుడు పదెకరాలకు విస్తరించారు. జర్మనీ తదితర దేశాల్లో మునగాకు పొడికి గిరాకీ ఉంది. అందుకే మూడేళ్ల నుంచి అధిక సాంద్రతలో మునగాకును సాగు చేస్తున్నా అంటున్నారాయన. మునగ కొద్దిపాటి నీటి వసతితోనే వేగంగా పెరిగే పంట. అయితే, 6–10 ఏళ్ల తర్వాత పంట మార్పిడి చేయటం తప్పనిసరి అంటున్నారు సీనియర్ రైతులు. ఇంతకీ, ఇతర రాష్ట్రాల్లో రైతులు ముందున్నారా? అక్కడి ప్రభుత్వాలే రైతులచేత ముందడుగు వేయిస్తున్నాయా?? అని మనం ఆలోచించుకోవాలి. మనం ముందంజలో ఉండే పంటలు చాలా ఉన్నా.. ఈ రెండు పంటల విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి మనమూ నేర్చుకుంటే మేలు!

పుట్టగొడుగులకు డిమాండ్, కిలో రూ. 1400
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలుమష్రూమ్స్ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలంరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.మష్రూమ్స్లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి. పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు

తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులుబెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు.

అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు
భువనేశ్వర్: ఒడిశారాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ (Soumyashree) ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు. దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్ పట్నాయక్ ‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ను కోరారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: బాలేశ్వర్లో ఫకీర్ మోహన్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్ షేక్ డిమాండ్ చేశారు. సాయంత్రం ప్యాలెస్ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు. రాయగడ: బాలేశ్వర్లోని ఫకీర్ మోహన్ సేనాపతి కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపారీ్టలైన బీజేడీ, కాంగ్రెస్లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్ లొ మంగళవారం నాడు కాంగ్రేస్ నాయకులు ఆందోళన చేపట్టారు. భగ్గుమన్న బీజేడీ శ్రేణులుజయపురం: బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. నేడు, రేపు బంద్ భువనేశ్వర్: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై నిరసనలతో రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికి పోతుంది. ప్రధానంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాలు బలిగొందని నిందిస్తున్నాయి. విషాదకర సంఘటనని రాజకీయం చేయొద్దని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, రాష్ట్ర కాంగ్రెస్ వరుసగా రెండు రోజులు బంద్కు పిలుపునిచ్చాయి. తొలుత బిజూ జనతా దళ్ బుధవారం బాలాసోర్ బంద్ నిర్వహిస్తుందని ప్రకటించింది. విద్యార్థిని మృతిపై ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బిజూ జనతా దళ్ బాలసోర్లో ఆరు గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. బంద్ సమయంలో దుకాణాలు, మార్కెటు సముదాయాలు, మోటారు వాహనాల రవాణా, బస్సులు, రైళ్లు రాకపోకలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని అభ్యర్థించారు. రేపు రాష్ట్ర బంద్ రాష్ట్ర కాంగ్రెస్ ఈ నెల 17 గురువారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, 8 ఇతర రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా ఒడిశా బంద్ నిర్వహిస్తున్నట్లు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విలేకర్లకు వివరించారు. బాలాసోర్ సంఘటనకు నిరసనగా ఒడిశా బంద్కు పిలుపునిచ్చిన కాంగ్రెస్తో భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎం సహా 8 ఇతర రాజకీయ పార్టీలు మంగళ వారం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒడిశా బంద్ ప్రకటన చేశాయి. ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన,ఉద్రిక్తతసౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఫొటోలు
అంతర్జాతీయం

ట్రంప్ సర్కార్కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్ క్లియర్
తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్ మహోన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్ లీవ్లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్తో పాటు మసాచుసెట్స్ పబ్లిక స్కూల్ సిస్టమ్స్ & యూనియన్స్ పిటిషన్లు వేశాయి.అయితే మే 22వ తేదీన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్ జోన్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ యూఎస్ సర్క్యూట్ కోర్టు(బోస్టన్)ను ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.లిండా.. ఫస్ట్ అండ్ లాస్ట్ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఎందుకీ నిర్ణయమంటే..అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడుతున్నారు.

Donald Trump: ‘అణు యుద్ధాన్ని ఆపాను’: భారత్- పాక్లపై అదే మధ్యవర్తిత్వ వాదన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్- పాక్ల మధ్య మధ్యవర్తిత్వం వహించానని వాదించారు. తన చొరవతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన ఘర్షణను ఆపానని పేర్కొన్నారు. ‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము విజయవంతం అయ్యాం. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ ఉన్నాయి. ఇవి నాడు మరో వారంలోనే అణు యుద్ధనికి దిగేవి, అది చాలా ఘోరంగా జరిగివుండేది. దానిని మేము ఆపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. #WATCH | US President Donald Trump says, "We have been very successful in settling wars. You have India, Pakistan...India and Pakistan would have been a nuclear war within another week, the way that was going. That was going very badly. We did that through trade. I said, we're… pic.twitter.com/GPDA6ObK0B— ANI (@ANI) July 15, 2025వాణిజ్యాన్ని పరపతిగా ఉపయోగించుకుని, తన వ్యూహాన్ని అమలు చేశానని.. సంఘర్షణను పరిష్కరించే వరకు మీతో వాణిజ్యం గురించి మాట్లాడబోమని చెప్పడంతో భారత్- పాక్ మధ్య యుద్ధం ముగిసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా ట్రంప్ గత జూన్లో విలేకరులతో మాట్లాడుతూ భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తబోయే అణు యుద్ధాన్ని పరిష్కరించానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్, భారత్లతో మాట్లాడానని, అక్కడి నేతలు అణ్వాయుధాలతో దాడి చేసుకోగలిగే సమర్థత కలిగినవారని ట్రంప్ పేర్కొన్నారు.అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను భారతదేశం ఇంతకుముందే తోసిపుచ్చింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి కాల్పుల విరమణ, సైనిక చర్యపై అవగాహన కుదిరే వరకు భారత్- అమెరికా నేతల మధ్య సంభాషణలు జరిగాయని, దేనిలోనూ ఇటువంటి మధ్యవర్తిత్వ ప్రస్తావన లేదని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.

రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
మాస్కో: ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. దేశంలో కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు భారత్ వైపు దృష్టి సారించింది. ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాకటెరిన్బర్గ్లో కొత్తగా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తోందని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ప్రకటించారు. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు కేంద్రస్థానం.అక్కడ సైనిక పరిశ్రమలూ భారీగానే ఉన్నాయి. రష్యా ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో కారి్మక శక్తి కొరత 31 లక్షలకు పెరగనుంది. అందుకే, ఉత్తర కొరియా, శ్రీలంకల నుంచీ కారి్మకులను రప్పించాలని ప్రణాళికలు వేసింది.

ఆర్కిటిక్పై నియంత్రణకు పోటీ
భూమి ఎగువ భాగమైన ఉత్తర ధ్రువంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అర్కిటిక్పై నియంత్రణ కోసం గ్రీన్లాండ్ను స్వా«దీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. మరోవైపు రష్యా ఆర్కిటిక్లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇంకోవైపు చైనా ఐస్ బ్రేకర్లు అక్కడ సరికొత్త మార్గాలు తెరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతమైన అర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈపోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది. ఆర్కిటిక్పై పట్టు కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ పోటీ ఎందుకో అర్థం కావాలంటే ఆ ప్రాంతాన్ని భూగోళం పై నుంచి చూసి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభంలో గ్రీన్ల్యాండ్æకు ఉత్తరాన ఉన్న మారుమూల ప్రాంతంలో థూలే అనే ప్రదేశంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా ఆ ప్రదేశ ప్రాముఖ్యత తగ్గలేదు. గ్రీన్లాండ్ ఇప్పటికీ డెన్మార్క్లో భాగంగా అ«దీనంలోనే ఉంది. దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా ఎప్పటినుంచో యోచిస్తోంది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేశారు. అమెరికా రక్షణకోసం గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇలాంటి వ్యవస్థకు ముందస్తు హెచ్చరిక సైట్లు చాలా ముఖ్యమైనవి. అలా రక్షణ, దాడి రెండింటికీ పనిచేసే స్థావరంగా గ్రీన్లాండ్ను అమెరికా చూస్తోంది. ఇది చాలాకాలంగా రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఏదైనా ముందడుగు వేస్తే అత్యంత ప్రభావితమయ్యేది రష్యానే. రష్యా భూభాగంలో ఐదో వంతు ఆర్కిటిక్లో ఉంది. ఇక ఆ దేశ తీరప్రాంతంలో సగానికి పైగా ఆర్కిటిక్ వెంబడే ఉంది. అందుకే అర్కిటిక్లో రష్యా కొన్నేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది. నాగూర్స్కోయ్ వంటి ౖతన వైమానిక స్థావరాలను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచే నిర్వహిస్తున్న ఆ స్థావరాలను భారీ విమానాలను కూడా ఆపరేట్ చేయగలిగేలా తీర్చిదిద్దుతోంది. రష్యా అణు జలాంతర్గామి దళంలో ఎక్కువ భాగం కోలా ద్వీపకల్పంలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యరి్థపై దాడికి వీలుగా వాటిని ఆర్కిటిక్లో మంచు కింద నిలిపి ఉంచుతుంది. ఇటు అమెరికా, అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను భయపెడుతున్నాయి. దాంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించడంపై నార్వే దృష్టి పెటింది. ఆర్కిటిక్లో మరో కీలక ప్రాంతం స్వాల్బార్డ్ దీవులు. వాటిని నార్వే నియంత్రిస్తుంది. అయినా రష్యాతో సహా అనేక దేశాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్య ఖాళీ ప్రదేశం కూడా కీలకమే. అట్లాంటిక్ను చేరుకోవడానికి రష్యన్ ఉత్తరాది నౌకాదళం ఈ జలాలను దాటాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ యు–బోట్లను ఎదుర్కోవడానికి గ్రీన్లాండ్లో అమెరికా సైనిక స్థావరాన్ని స్థాపించడానికి ఈ జల సంధే కారణం. రేసులోకి బ్రిటన్ ఇటీవలి కాలంలో బ్రిటన్ కూడా ఆర్కిటిక్పై దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ మే చివరలో ఆర్కిటిక్ను సందర్శించారు. అక్కడ శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఐస్లాండ్తో కలిసి ఉమ్మడి పథకాన్ని ప్రకటించారు. రష్యన్ జలాంతర్గాములు, పడవలను ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. కానీ జలాంతర్గాములు, సముద్ర గస్తీ, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానాలు బ్రిటన్ లేని నేపథ్యంలో ఈ యత్నాలేవీ ఫలించేలా లేవు. ఇక ఆర్కిటిక్కు చాలా దూరంలో ఉన్న చైనా, తనను తాను ఆ ప్రాంతానికి అతి సమీప దేశంగా చెప్పుకుంటోంది. ఇటీవలి కాలంలో అక్కడ దూకుడు పెంచింది. అక్కడ మంచు విపరీతంగా కరగడం వల్ల ఉత్తరాది అంతటా కొత్త వాణిజ్య మార్గం ఏర్పడుతుండటం చైనాకు బాగా కలిసొస్తోంది. సూయజ్ కాల్వతో పోలిస్తే ఈ మార్గం దానికి బాగా అనుకూలం. అక్కడ విద్యుత్తు ప్రొజెక్ట్ ఏర్పాటుకూ చైనా ప్రయతి్నస్తోంది. అక్కడ ఐస్బ్రేకర్ల సముదాయాన్ని వేగంగా విస్తరిస్తోంది. మైనింగ్ సంస్థలు, విద్యా పరిశోధనల మాటున ఆర్కిటిక్లో చైనా గూఢచారులు బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ అమెరికా, రష్యాల్లో ఆందోళన పెంచుతున్నాయి. డేంజర్ బెల్స్ ఇలా ఆర్కిటిక్పై పట్టు కోసం ఏ దేశానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. ఇలా మంచు కరగడం వల్ల్ల ఖనిజాలు, చేపలు, ఇతర సముద్ర సంపద కోసం పోటీ పెరుగుతుంది. మరోవైపు షిప్పింగ్కు దారులు పెరుగుతాయి. ఈ ఆర్థిక పోటీ పెద్ద దేశాల మధ్య మరిన్ని తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. రష్యా ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు పదోవంతు ఆర్కిటిక్ సహజ వనరుల నుంచే వస్తుంది. అక్కడ మంచు విపరీతంగా కరుగుతుండటం రష్యా భద్రతను డోలాయమానంలో పడేస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

రాహుల్.. ప్రధాని అవుతారని మీకు తెలుసా?: బాంబే హైకోర్టు
ముంబై: హిందూత్వ నాయకుడు వీర్ సావర్కర్ గురించి చదివి అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. సావర్కర్ గురించి రాహుల్గాంధీ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పిటిషనర్, అభినవ్ భారత్ కాంగ్రెస్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్ కుముద్చంద్ర ఫడ్నిస్ ఆరోపించారు. ఆయన ప్రధానమంత్రి అయితే, అప్పుడు విధ్వంసం సృష్టిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ‘మీ పిటిషన్లో అధ్యయనం చేయమని ఆదేశించాలంటూ మీరు కోరారు. కోర్టు చదవమని అతన్ని ఎలా బలవంతం చేస్తుంది?’ అని ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి సందీప్ మార్నేలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు.. ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు.. మీకు తెలుసా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసుకునే చట్టపరమైన మార్గం పిటిషనర్కు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వీర్ సావర్కర్ మవనడు పుణే కోర్టును ఆశ్రయించారని, విచారణ జరుగుతోందని ధర్మాసనం వెల్లడించింది.

ఐదు నెలలు.. 7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది.ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్లాండ్లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేలి్చంది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది.డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు.మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు.. మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్లాండ్లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం.

గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం కంపెనీలు, ఆయా సంస్థల్లోని వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులుచేర్పులతో ఆర్థిక ఒత్తిళ్లు, సాంకేతికతలో పెరుగుతున్న వినియోగం, విధుల నిర్వహణలో సమర్థత సాధనకు కృషి అనే ఈ మూడు ప్రధాన అంశాల ప్రభావంతో సంస్థల నిర్మాణ విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు, సంస్థల్లో మధ్యస్థ మేనేజర్ల (మిడిల్ మేనేజ్మెంట్) పాత్ర కొత్తగా నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా మారుతోంది. ఆ మార్పు ఉత్పత్తుల స్థాయిలోనే కాకుండా, సంస్థల అంతర్గత నిర్మాణంలోనూ జరుగుతోంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ‘గ్రేట్ ఫ్లాటెనింగ్‘అన్న పదం సిలికాన్ వ్యాలీలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో మారుతున్న ట్రెండ్కు సంకేతంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా మధ్యస్థ మేనేజ్మెంట్ స్థాయిని తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకునే మార్గాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో టెక్ దిగ్గజాలు ముందుకు సాగుతున్నాయి. టెక్ కంపెనీలు సైతం తాము స్టార్టప్ల సెటప్ మాదిరిగా పనిచేయాలనే మానసిక స్థితిలో చిన్న బృందాలుగా, తక్కువ సంఖ్యలో మేనేజర్లతో ఎక్కువ ఉత్పాదకతను సాధించే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. చాట్బాట్లు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వంటి వినియోగంతో మానవ వనరుల నిపుణుల అవసరం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదే బాటలో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, ఇంటెల్ వంటి కంపెనీలు సైతం సంస్థాగత వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ మార్పులు తీసుకొస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఇప్పటికే ఈ మార్పులకు అనుగుణంగా మధ్యస్థ మేనేజర్ల పాత్రను కొత్తగా రూపుదిద్దేలా చర్యలు చేపట్టాయి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి వాటిని ప్రవేశపెట్టి, మధ్యస్థ స్థాయి మేనేజ్మెంట్ పాత్రను తగ్గించేశాయి. దీని వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడడంతో పాటు మేనేజర్లను వ్యూహాత్మక విధానాల్లోకి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. అనుకూల అంశాలుసమర్థత, వేగవంతమైన నిర్ణయాలు: బ్యూరోక్రసీని తగ్గించి, చిన్న బృందాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయాలన్నదే లక్ష్యం. దీంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. మార్కెట్కు అనుగుణంగా వేగంగా స్పందించొచ్చువ్యయాల తగ్గింపు : ఉద్యోగుల జీతాలు, ముఖ్యంగా మేనేజ్మెంట్ స్థాయిలో అధికంగా ఉండటంతో వాటిని తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రయోజనాలు చేకూరుతాయి. తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఇది కీలకంగా మారింది.ఇన్నోవేషన్కు మద్దతు: మధ్యస్థ మేనేజ్మెంట్ లేకపోతే, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నేరుగా పనిచేసే ఉద్యోగులకు ఇవ్వొచ్చు.దీనివల్ల సృజనాత్మకత పెరిగే అవకాశముందిప్రతికూల అంశాలు మిగిలిన మేనేజర్లపై పనిభారం : తగ్గిన మేనేజ్మెంట్ వ్యవస్థకు ప్రత్యా మ్నాయం లేకపోవడం వల్ల మిగిలిన వారిపై అధిక పనిఒత్తిడి పెరుగుతోంది. ఇది ‘బర్నౌట్’కు దారితీయొచ్చునాయకత్వలోపం : తొలగించిన మేనేజ్మెంట్ల స్థాయిల కారణంగా లీడర్ షిప్ గ్యాప్ ఏర్పడి, టీమ్ల పనితీరు దెబ్బతినే అవకాశముందిసీనియర్ స్థాయిలో మైక్రో మేనేజ్మెంట్ : మధ్యస్థ స్థాయి లేకపోతే, టాప్ లెవల్ లీడర్íÙప్ చిన్న విషయాల దాకా జోక్యం చేసుకోవడం వల్ల ఇది వ్యతిరేక ఫలితాన్నే కలిగించొచ్చు.ప్రమోషన్ అవకాశాల తగ్గుదల : మంచి ప్రతిభ కనబరిచే వారికి మధ్యస్థ మేనేజర్ స్థాయికి చేరే అవకాశాలు తగ్గి.. కెరీర్ ఎదుగుదలకు బ్రేకులు పడే ప్రమాదం. సవాళ్లు ఎదురవుతున్నా.. అనేక కొత్త అవకాశాలు అందుబాటులోకి కంపెనీలు, సంస్థలు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తూ, కార్యకలాపాల్లో సమర్థత పెంపుదల కోసం మార్గాలు వెతుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు ఫ్లాట్ (అంటే తక్కువ మేనేజ్మెంట్ లేయర్లతో కూడిన) సంస్థలుగా మారుతున్నాయి. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో మధ్యస్థ మేనేజర్లు అధికంగా ›ప్రభావితం అవుతున్నారు. వారికి సవాళ్లు ఎదురవుతున్నా, అనేక అవకాశాలు కూడా అందుబాటులో వస్తున్నాయి. – వెంకారెడ్డి, చీఫ్ పీపుల్ ఆఫీసర్, క్వాలీ జీల్ ఐఎన్సీ

నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్వర్క్లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్వర్క్లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.బాధితులే ఉద్యోగులు..విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్లో ఐదు, మయన్మార్లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి. బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.ఘోస్ట్ సిమ్ కార్డులతో..ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది. నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.బాధితులే ఉద్యోగులు..సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. దేశాలను దాటి..సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది. ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండితక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది.
ఎన్ఆర్ఐ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్ఎస్టేట్కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!

లండన్లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు.

భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు.

గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.