
ఎయిమ్స్లో ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాల ముగింపు
బీబీనగర్: బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో 5వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫార్మాకోవిజిలెన్స్లో భాగంగా డ్రగ్స్ మానిటరింగ్, మెడిసిన్ పనితీరు, ఉపయోగం, ట్రయల్స్ విధానం, మెడిసిన్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా, వైద్యులు రాధిక, చరణ్, మాధవి, దేబాసిస్, గెరార్డ్, రేఖ పాల్గొన్నారు.