న్యాయం గెలిచింది | - | Sakshi
Sakshi News home page

న్యాయం గెలిచింది

Sep 30 2025 7:45 AM | Updated on Sep 30 2025 7:45 AM

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది

ఎంపీ మిథున్‌కు బెయిల్‌పై సంబరాలు

కూటమి అక్రమ అరెస్ట్‌లకు

భయపడమంటూ నినాదాలు

మదనపల్లె : రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిని జూలై 19న కూటమి ప్రభుత్వం మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసింది. 72 రోజులపాటు నిర్బంధించింది. బెయిల్‌ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేసింది. బెయిల్‌ కోసం న్యాయస్థానం ముందు పిటిషన్‌ వేస్తే.. అడ్డుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ పిటిషన్‌ వేసింది. అరెస్ట్‌ అయిన రెండు నెలల తర్వాత సిట్‌ కస్టడి కోరడం, దాని వెనక ఉద్దేశం ఇట్టే అర్థమవుతుంది. అక్రమ అరెస్ట్‌ నుంచి.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యా యమే గెలిచింది. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ నేతను అక్రమ కేసులో నిర్బంధించి, వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ మంజూరు వార్త బయటకు రాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు, అనుచరులు, వైఎస్సార్‌సీపీప నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మిథున్‌ రెడ్డి బ్యానర్లు చేతబట్టి.. జై జగన్‌, జై మిథున్‌ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి, కక్షగట్టి వేధిస్తున్న చంద్రబాబుకు అధికార పతనం తప్పదు అంటూ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement