58% సంపద 1% సంపన్నుల వద్దే | oxfam: India's rising income inequality: Richest 1% own 58% of total | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 17 2017 10:27 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

సంపద అసమానత్వం దేశంలో పెచ్చుమీరిపోతోంది. రోజులో రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంతో దేశంలో సుమారు 30 శాతం మంది ఒకవైపు అల్లాడుతుంటే... మరోవైపు దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే తిష్టవేసింది. ఈ అసమానత్వంలో ప్రపంచ సగటు రేటు 50 శాతాన్ని మన దేశం దాటేసింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు సందర్భంగా సంపన్నులు, ప్రముఖులు సమావేశం అవుతున్న తరుణంలో... ఈ వాస్తవాలను ఆక్స్‌ఫామ్‌ అనే హక్కుల గ్రూపు ‘యాన్‌ ఎకానమీ ఫర్‌ 99 పర్సెంట్‌’ పేరుతో సోమవారం విడుదల చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement