ప్రముఖ మొబైల్ మేకర్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్స్ తో వస్తున్న వివో వి 5 ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 20 మెగా పిక్సెల్ కెమెరా దీంట్లోని ప్రధాన ఆకర్షణ. ముందస్తు బుకింగ్ కోసం బుధవారం నుంచి 22 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండనున్నట్టు, నవంబరు 26 నుంచి అమ్మకాలు మొదలు కానున్నట్టు కంపెనీ పక్రటించింది. రూ.17,980గా ధరని నిర్ణయించింది. దీంతో పాటుగా వి5 ప్లస్ ను కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. గ్రే, గోల్డ్, అండ్ స్పేస్ గ్రేస్ తీవ్ర వేరియంట్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 20 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని టెక్ పండితులు చెబుతున్నారు. కాగా ఈ డివైస్ లోఫేస్ బ్యూటీ, 6.0 యాప్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ, విత్ ఫన్ టచ్ 2.6 ఓఎస్ దీని అదనపు ప్రత్యేకతలు.
Nov 17 2016 6:43 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement