ఓ వైపు మద్య నిషేధం కొనసాగుతుండగానే.. మరోవైపు 12 మంది వ్యక్తులు అక్రమ మద్యం సేవించి తమ జీవితాలను అర్థాంతరంగా కోల్పోయారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లాలో స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. మద్య నిషేధం కొనసాగుతున్న తమ ప్రాంతంలో స్థానిక ప్రజలు అక్రమ మద్యం సేవించారు. ఆ మద్యం తాగిన వెంటనే వారు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వారిని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొంతమంది పరిస్థితి విషమంగా మారడంతో గోరఖ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఐదుగురు చికిత్స జరుగుతుండగానే మద్యలోనే ప్రాణాలను వదిలారు. ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతిచెందినట్టు వెల్లడవుతోంది.