ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల్లోని ఓ గడ్డపై శనివారం ఉదయం 23 మంది భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఏడుపాయలు దాటుతుండగా.. ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు. మంజీరా ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో వారిని వీలైనంత త్వరగా రక్షించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Published Sat, Sep 24 2016 2:26 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement