Workers
-
ఉపాధికి 'బర్డ్ ఫ్లూ' దెబ్బ
-
అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది. -
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
27 ఏళ్ల తర్వాత దక్కిన విజయం..ఢిల్లీలో బీజేపీ సంబరాలు (ఫొటోలు)
-
కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ
-
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్ చల్ చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం
-
ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్
-
ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్తో ఒరిగేదేమీ లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ఉక్కు పోరాట కమిటీ.. ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్రాలకు లేదని మండిపడుతోంది. లాభాల్లో ఉన్న సంస్థపై నష్టాల పేరుతో కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన సాయం పై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం అరకొరగా స్పందించిందని.. అరకొర చర్యలతో విశాఖ ఉక్కుకు ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 11,500 కోట్లు ప్యాకేజీ ప్రకటించి.. అందులోనే 10,300 కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తామనడం సరికాదు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటే సెయిల్లో విలీనం చేయాల్సిందే. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి ప్రోత్సహించడం సరికాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించడం విశాఖ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకమే’’ అని రామకృష్ణ స్పష్టం చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
నాలుగు నెలలుగా జీతాలు లేవని ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులు
-
విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికుల (vizag steel) అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు.మరో వైపు, కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పల్లె కన్నీరు పెడుతోందో -
స్టీల్ ప్లాంట్ కార్మికులను సాగనంపేందుకు బాబు కుట్రలు
-
మరో కుట్రకు తెరతీసిన విశాఖ ఉక్కు యాజమాన్యం
విశాఖ,సాక్షి: విశాఖ ఉక్కుపై (vizag steel) నీలినీడలు కమ్ముకున్నాయి. కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. ఇందులో భాగంగా కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ (vrs) పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.కాగా,వీఆర్ఎస్ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ తీవ్రంగా మండిపడుతుంది. వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకోవద్దని పోరాట కమిటీ పిలుపు నిచ్చింది. అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.👉ఇదీ చదవండి : బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
దీక్షా శిబిరం దాటొస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రెండో రోజు పోరాట కమిటీ నిరహార దీక్ష
-
వారు చరిత్ర హీనులే.. బాబు, పవన్ పై విశాఖ కార్మికుల ఆగ్రహం
-
తగ్గేదేలే అంటున్న విశాఖ ఉక్కు కార్మికులు
-
ఆంధ్రా పేపర్ మిల్స్ లాకౌట్
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో మిల్స్ యాజమాన్యం లాకౌట్ నోటీసుల్ని గేటుకు అతికించింది. కార్మికులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేశారు. వేతన సవరణ చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మెను కొనసాగించేందుకు సోమవారం ఉదయం మిల్స్కు వెళ్లిన కార్మికులు లాకౌట్ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆగ్రహంతో మిల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులతో పాటు 11 కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. యాజమాన్యం స్పందించకపోవడంతో మిల్స్ గేటు ఎదుట సుమారు 5 వేల మంది కార్మికులు బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు.మిల్స్ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలం కాలేదు. దీంతో సాయంత్రం వరకూ ఆందోళన కొనసాగింది. కార్మికులు రూ.10 వేల వేతనం పెంచాలని కోరగా.. మిల్స్ యాజమాన్యం రూ.3,250 మాత్రమే పెంచేందుకు అంగీకరించింది. ఆ ప్రతిపాదన నచ్చకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. రాజమహేంద్రవరంలో 70 ఏళ్ల క్రితం స్థాపించిన ఆంధ్రా పేపర్ మిల్స్ ఇప్పటివరకు నిరంతరాయంగా నడిచింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. కరోనా విపత్తు సమయంలో నష్టాల్లో ఉన్నా.. తిరిగి లాభాల బాట పట్టింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఒక్కసారే వేతన సవరణ ఆంధ్రా పేపర్ మిల్స్ చరిత్రలో 2018లో ఒక్కసారి మాత్రమే వేతన సవరణ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేతన సవరణపై ఆశలు రేకెత్తాయి. కూటమి నేతలు అండగా ఉంటారనే ఉద్దేశంతో కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. తీరా సమ్మె ప్రారంభించాక కూటమి నేతలు ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని సీఎం, కూటమి ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ.. యాజమాన్యం మాత్రం సీఎం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాకౌట్ ప్రకటన నేపథ్యంలో పేపర్ మిల్స్ ఎదుట శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.వైఎస్సార్సీపీ అండ వేతన సవరణ కోసం కార్మికులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆందోళన, సమ్మెకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీనియర్ నాయకులు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఆందోళనకు మద్దతు ప్రకటించారు. పేపర్ మిల్స్ చరిత్రలో ఎన్నడూ సీఎస్ఆర్ నిధులు ఇచి్చన దాఖలాలు లేవని, మిల్స్ ద్వారా వెలువడే కాలుష్యంతో జీవిస్తున్న ప్రజల అభివృద్ధికి పాటుపడిన సందర్భాలు లేవని వారన్నారు. మిల్స్ యాజమాన్యం కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తోందన్నారు. సంఘాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. యాజమాన్యం మొండి వైఖరి వీడాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాజమహేంద్రవరం బంద్ సైతం నిర్వహిస్తామన్నారు. -
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం
-
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్గా మారింది. సాక్షి మాలిక్ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్పాత్పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఆదోనిలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అర్ధనగ్న నిరసన
-
ఢిల్లీకి విశాఖ ఉక్కు పోరాటం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందని జీతాలు
-
ఆళ్లనానిపై భగ్గుమంటున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. -
సోషల్మీడియా కార్యకర్తల నిర్బంధం కేసు.. హైకోర్టుకు తిరుపతి లోకేష్
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తిరుపతి లోకేష్ హెబియస్ కార్పస్ పిటిషన్ను ఏపీ హైకోర్టులో సోమవారం(నవంబర్ 11) విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి నవంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకుఉన్నసీసీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఈనెల 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. కాగా, ఏపీలో కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు శుక్రవారం(నవంబర్ 8) విచారణ సందర్భంగా తీవ్రంగా స్పందించింన విషయం తెలిసిందే. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది.వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు తిరుపతి లోకేష్ను పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
కదిరిలో సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
-
Gun Shot: బాబు బలుపా?.. పవన్ పొగరా?
-
YSRCP కార్యకర్తపై కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి
-
పత్తి తీతకు పట్నం కూలీలు
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పత్తితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని జాతీయ రహదారి వెంటగల గ్రామాల్లో పత్తి తీయడానికి కూలీలు హైదరాబాద్లోని హయత్నగర్ నుంచి వస్తున్నారు. సోమవారం చద్దిమూటలు పట్టుకొని చౌటుప్పల్ బస్టాండ్లో బస్సు దిగిన కూలీలను ‘సాక్షి’పలకరించగా.. పత్తి తీయడానికి వచ్చామని చెప్పారు. కిలోకు రూ.16 చొప్పున రైతులు కూలీ చెల్లిస్తున్నారని, రోజుకు 50 నుంచి 80 కిలోల వరకు పత్తి తీయడం ద్వారా రూ.800 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటవుతుందని వారు తెలిపారు. బస్టాండ్ నుంచి పత్తి చేను వరకు రైతులే ఆటోలలో తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారని వారు తెలిపారు. -
పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే మృతి
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షోర్నూర్ సమీపంలో రైల్వేట్రాక్పై చెత్త శుభ్రం చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా వచ్చిన కేరళ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఘటనాస్థలంలో దొరికాయి. మరో మృతదేహం పక్కనే ఉన్న నదిలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ట్రాక్పై వస్తున్న రైలును కార్మికులు గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: వేడివేడి కిచిడీ పడి భక్తులకు తీవ్ర గాయాలు -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
ఉద్యమంపై ‘ఉక్కు’పాదం..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మెడపై కత్తి.. ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్గఢ్లోని నగర్నార్ స్టీల్ప్లాంట్కు డిప్యుటేషన్పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు. నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం.. అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సీఎం చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్న పచ్చ తాలిబన్లు
-
ఉక్కు ఉద్యమాలు..
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వని పవన్ కళ్యాణ్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు.. రాజశేఖర్ అదిరిపోయే కౌంటర్
-
ప్రభుత్వాన్ని జైలు నుంచే నడవపచ్చని నిరూపించాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. తనకు జైల్లో పుస్తకాలు చదవడానికి, ఆలోచించడానికి చాలా సమయం దొరికిందని కేజ్రీవాల్ అన్నారు. తాను గీతను చాలాసార్లు చదివానని, ఈ రోజు నేను మీ ముందుకు ‘భగత్ సింగ్ జైల్ డైరీ’తీసుకువచ్చానని అన్నారు. భగత్ సింగ్ జైలులో చాలా లేఖలు రాశారు. భగత్ సింగ్ బలిదానం జరిగిన 95 ఏళ్ల తర్వాత ఒక విప్లవ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాడు. నేను ఎల్జీకి జైలు నుంచి ఒక లేఖ రాశాను. జాతీయ జెండా ఎగురవేసేందుకు అతిషీకి అనుమతివ్వాలని ఆగస్టు 15వ తేదీకి ముందు లేఖ రాశాను. ఆ లేఖ ఎల్జీకి అందలేదు. మరోసారి లేఖ రాస్తే కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచాక తమకంటే క్రూరమైన పాలకుడు ఈ దేశానికి వస్తాడని బ్రిటీష్ వారు కూడా ఊహించి ఉండరు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.తాను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు సందీప్ పాఠక్ తనను కలవడానికి వచ్చాడు. అతను నాతో రాజకీయాల గురించి మాట్లాడాడు. దేశంలో ఏమి జరుగుతోంది, పార్టీలో ఏమి జరుగుతోంది అని నేను అడిగాను. ఇది జరిగాక సందీప్ పాఠక్ను బ్లాక్లిస్ట్లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడం, కేజ్రీవాల్ ధైర్యాన్ని దెబ్బతీయడం వారి లక్ష్యం. వారు ఒక ఫార్ములా తయారుచేశారు. కేజ్రీవాల్ను జైలుకు పంపితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఫీలింగ్లో ఉన్నారు. అయితే మా పార్టీ విచ్ఛిన్నం కాలేదు. మా ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం కాలేదు. వారి పెద్ద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంది.ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపవచ్చని నిరూపించామని కేజ్రీవాల్ అన్నారు.ప్రభుత్వాన్ని జైలు లోపల నుండి ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపగలమని నిరూపించాం. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే భయపడవద్దు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వారి కుట్రలన్నింటిని తిప్పికొట్టే శక్తి ఉంది ఎందుకంటే మనం నిజాయితీపరులం. వారు నిజాయితీ లేనివారు కాబట్టి మన నిజాయితీకి భయపడతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సెబీ చీఫ్పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు -
చంద్రబాబు, పవన్ మాట నిలబెట్టుకోవాలంటున్న కార్మికులు
-
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా
సాక్షి, విశాఖ : విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉదృతమవుతుంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మికులు. ఎన్నికల ముందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్లాంట్ను కాపాడుకునేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖలి పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రంవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇదీ చదవండి : వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న మోదీ -
చిరుద్యోగులపై సర్కార్ పగ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్ల్లో పనిచేసే చిరుద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం చూపిస్తున్నారు. 15–20 ఏళ్లగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్లో పనిచేస్తున్న తమను తొలగించడానికి వీలు లేదని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు మెమో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక కొంత మంది అధికారులు కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో 111 వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండగా.. వాటిలో ఔట్సోర్సింగ్ విధానంలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారికి ఉండే కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొదట్లో ఆయా ల్యాబొరేటరీస్లో పనిచేసే వారికి వర్తించేవి కావు. అయితే గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించారు. ఔట్ సోర్సింగ్లో పనిచేసే ఆయా ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి్పడి చేసే ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వంలో మొదలవగా, ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆరి్థక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15–20 ఏళ్లుగా ఉన్న తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడడంపై రాష్ట్రవ్యాప్తంగా వారు ఆందోళన బాట పట్టారు. పవన్ ఇంటి ముందు ప్రదర్శన.. ఉద్యోగుల తొలగింపునకు అధికార కూటమి పార్టీ ల ఎమ్మెల్యేల రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్కళ్యాణ్ నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వచి్చన ఉద్యోగులు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కలి్పంచాలి, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్కళ్యాణ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.. సమస్యను పవన్, అధికారుల దృష్టికి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడ నుంచి వెనుతిరిగారు. గత ఐదేళ్లూ నీటి శుద్ధి పరీక్షల్లో ఏపీనే టాప్..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో కలుíÙతాలు గుర్తిస్తే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మన రాష్ట్రం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే టాప్గా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ముందు, తర్వాత స్థానిక పంచాయతీ సిబ్బంది లేదంటే శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి వాటిని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాబొరేటరీల్లో పరీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలో ఉండే తాగునీటి వనరులకు సైతం 97 శాతం పైబడి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షల్లో గత ఆరి్థక ఏడాదిలో మన రాష్ట్రంలో 25,546 చోట్ల కలుíÙత నీటిని గుర్తించగా, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. -
చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు !
బీజింగ్: తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్దులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్న చైనా వచ్చే సంవత్సరం నుంచి అక్కడి కారి్మకుల రిటైర్మెంట్ వయసును 63 ఏళ్లకు పెంచనుంది. ప్రస్తుతం అక్కడి మగవాళ్లు 60 సంవత్సరాలకు రిటైర్ అవుతుండగా దానిని మరో మూడేళ్లు పెంచారు. ఇక కారి్మకులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసు ఇన్నాళ్లూ 50 ఏళ్లుకాగా దానిని 55 ఏళ్లు పెంచారు. వృత్తి నిపుణుల వంటి వైట్కాలర్ ఉద్యోగాలు చేసే మహిళల రిటైర్మెంట్ వయసును 55 నుంచి 58 సంవత్సరాలకు పొడిగించారు. రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఏళ్లకుపైగా అమల్లో ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని చైనా అధికార టీవీఛానల్ సీసీటీవీ ఒక కథనం ప్రసారం చేసింది. -
ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ
సాక్షి,విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎఫ్ 1ను మూసేసిన ప్లాంట్ అధికారులు.. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లాంట్లోని వరుస పరిణామలపై అటు ఉద్యోగులు.. ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు నిలిపివేసి.. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్లో కార్యకలాపాలు నిర్వహించడంపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.ఇప్పటి వరకు రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు నడిపితే అరకొరగా ఉత్పత్తి.. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ తోనే ఉత్పత్తితో కేవలం నెలకు రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాబడి వస్తుందని, ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యమని స్టీల్ ప్లాంట్ కమిటీ సంఘాలు నేతలు చెబుతున్నారు. -
ఆస్తులు, అంతస్తులు ఏం అడగలేదు..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన
ఎన్నికల ముందు..‘వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం.. సంపద సృష్టించి పంచుతాం’ అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు.గద్దెనెక్కాక..మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. చేస్తున్న చిన్న చిన్నఉద్యోగాలను సైతం అన్యాయంగా ఊడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్ట గొడుతూ ‘తమ్ముళ్ల’ జేబులు నింపుకోమంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్ర పరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి.. ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ‘ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు’ అని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కాకినాడ జిల్లా కోటనందూరు (అల్లిపూడి) కేజీబీవీలో 2017 ఫిబ్రవరిలో నియమితులైన ఆయా కాళ్ల సత్యవతి(బీసీ)ని టీడీపీ నేతలు తొలగించారు. భర్త లేని ఆమె ఈ వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇదే కేజీబీవీలో రెండేళ్ల నుంచి వంటమనిషిగా పని చేస్తున్న దారా ఆదిలక్ష్మి(ఎస్సీ)ని సైతం గురువారం టీడీపీ నేతలు తొలగించి, తమ మనిషిని నియమించున్నారు. ఇలా ఒక్క చోట కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్లో చూసినా దుర్మార్గపు తొలగింపులు పరిపాటిగా మారాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్ల వరకూ అందరినీ తొలగించాలంటూ టీడీపీ నేతలు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఆదేశిస్తున్నారు. ముడుపులు దండుకుంటున్న ‘పచ్చ’ నేతలుతొలగించిన వారి స్థానంలో నియమిస్తామంటూ ఆశావహుల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించకూడదంటూ అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. 10, 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు.. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగిస్తున్నారు. ఆ స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తాళలేక ఇప్పటికే 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు తొలగించారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులు.. తొలగింపులు..ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీల్లో పార్ట్టైమ్ ఉద్యోగులుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వంట కార్మీకులు, ఆయాలు, స్వీపర్లను బెదిరించి బలవంతంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో అన్ని విభాగాల్లోనూ పార్ట్టైమ్ సిబ్బంది సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది 14 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. వీరి నియామకం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు తొలగింపు మాత్రం స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట కొత్త వారి నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు డీఈవోలు, ఏపీడీలను ఆదేశించారు. ఇదే అదనుగా టీడీపీ వారు గతంలో నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, తమ వారిని నియమించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపి ఆమోదించుకుంటున్నారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.అన్ని జిల్లాల్లోనూ కన్నీటి గాథలే..⇒ విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాణి మల్లమ్మదేవి, యుద్ధ స్తంభం, డివైడర్ల మధ్య ఉన్న మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న 16 మంది చిరు ఉద్యోగులను తొలగించారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి కేజీబీవీలో 2019 నుండి పని చేస్తున్న వంట మనిషి రొంగలి శ్రీలక్ష్మి, వాచ్మెన్ ఆర్.దుర్గను తొలగించి, తమ వాళ్లను పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని చుక్కవలస, ఏనుగువలస, వెదుళ్లవలస, మెరకముడిదాం మండలంలో భైరిపురం, గర్భాం, కొత్తవీధి, శ్యామయావలస రేషన్ డీలర్లను తొలగించారు. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, మెరకముడిదాం మండలంలోని రామయవలస, గుర్ల, తెట్టంగి, పెనుబర్తి గ్రామాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. చీపురుపల్లి మండలం పేరిపిలో వేధింపులు భరించలేక ఓ ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేశారు. గుర్ల మండలం శేషపుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించారు. ⇒ పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 50 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మీకులను (ఆప్కాస్) టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తొలగించారు. వీరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును కలిసినా, వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు అంగీకరించలేదు. ⇒ వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె, బాలాయపల్లె, గంగనపల్లె, ఓబులాపురం, ఉప్పలూరులో రేషన్ డీలర్లను తొలగించారు. కలసపాడు మండలంలో పలువురు డీలర్లను తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పలువురు లబి్ధదారుల పింఛన్ తొలగించాలని ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ బుక్కీపర్ కె శివనాగేంద్రమ్మను తొలగించారు. పెనమలూరు నియోజకవర్గంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని తొలగించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో 10 మంది వీవోఏలను, కందుల భవాని, మరో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, జయంతిపురం గ్రామంలో 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీదారులను తొలగించారు. ⇒ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు, మధ్యాహ్న¿ోజన కార్మీకులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్, డీఆర్డీఏలో ఉండే విలేజ్ ఆర్గనైజేషన్ అడ్మిని్రస్టేటర్లు ఇలా 67 మంది మహిళల ఉద్యోగాలు తొలగించారు. ఏలూరు నగరంలో అధికార పార్టీ వేధింపులు తాళలేక డ్వాక్రా రిసోర్స్ పర్సన్ పిల్లి విజయలక్ష్మి, ఉంగుటూరు మండలంలో పి.కనకదుర్గలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్నారు. ⇒ ప్రకాశం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 300 మంది వీవోఏలు, 370 మంది మధ్యాహ్న భోజన కార్మీకులు, 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మంది మున్సిపల్ కార్మికులు, 50 మంది ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, 20 మంది పంచాయతీ కార్మీకులు, 15 మంది స్వచ్ఛభారత్ కార్మికులను తొలగించారు. 2.65 లక్షల వలంటీర్లకు ఉద్వాసనే..2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వారిని పక్కన పెట్టారు. దేవుడి సాక్షిగా తొలగింపు అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 80 మంది మధ్యాహ్న భోజనం కార్మీకులను తొలగించారు. పలువురు రేషన్ డీలర్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా తొలగించి, వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి జాబితాలు తయారు చేశారు. ప్రైవేటు కంపెనీలనూ వదలడం లేదు. స్థానికంగా కంపెనీలు నడపాలంటే తమకు కప్పం కట్టడంతో పాటు తాము చెప్పిన వారినే కార్మీకులుగా పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. రణస్థలంలోని యూబీ బీర్ల కంపెనీలో ఏం జరిగిందో అందరూ చూశారు. కూటమికి అనుకూలంగా లేని కార్మీకులను తొలగించారు. మూలపేట పోర్టులోనూ అదే జరిగింది. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేయడమే కాకుండా కార్యకలాపాలకు అడ్డు తగలడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఫోర్జరీ సంతకాలతో డీలర్ల తొలగింపుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం దాచూరులో పొదుపు గ్రూపులకు సంబంధించిన వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)గా పని చేస్తున్న మహిళను తొలగించి ఆ స్థానాన్ని రెండుగా విభజించి టీడీపీకి చెందిన కార్యకర్తలను నియమించాలని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సిఫార్సు లేఖ పంపారు. కోవూరు నియోజకవర్గం గంగవరంలో రేషన్ షాపు డీలర్ను తొలగించి ఆ పోస్టును స్థానిక టీడీపీ నాయకుడు లక్ష్మీనరసారెడ్డి (బాబురెడ్డి) బేరంపెట్టి రూ.2 లక్షలకు వేరొక వ్యక్తికి కట్టబెట్టాడు. కందుకూరులో 16 రేషన్షాపు డీలర్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్ధారుతో కుమ్మక్కై డీలర్లకు తెలియకుండానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి రాజీనామా చేసినట్లు లేఖలు పంపడం సంచలనంగా మారింది. తాము రాజీనామాలు చేయలేదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కందుకూరు, కావలిలలో వైన్షాపులలో పనిచేసే 70 మంది సేల్స్మెన్లు, సూపర్వైజర్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను పెట్టాలని స్థానిక టీడీపీ నేతలు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. కందుకూరులో 50 మందిని తొలగించి వారి స్థానంలో ఆ పోస్టులకు మామూళ్లు దండుకుని టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా జాబితా తయారైంది. మున్సిపాలీ్ట, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో దాదాపు 15 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు ఏకంగా స్థానిక టీడీపీ నేతలు ఉపాధి హామీ పనులను నిలిపివేశారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో పొదుపు గ్రూపులకు సంబంధించిన 10 మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామాలుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మీకులు, డీలర్లు, సంఘమిత్రలు, ఆర్పీలను తప్పుడు ఫిర్యాదుల ద్వారా టీడీపీ నేతలు తొలగిస్తున్నారు. పలుచోట్ల అధికారులు తలొగ్గి చిరుద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ఆయాలు, అంగన్వాడీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పాలు, సరుకులు ఇవ్వడం లేదని, కేంద్రాలు తెరవడం లేదని, పిల్లలు రావడం లేదని తప్పుడు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్పీలు, సంఘమిత్రల తొలగింపునకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో 192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేయించారు. రేషన్ డీలర్లు 190 మంది, సంఘమిత్రలు 65 మందిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో 86 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డగోలుగా తొలగించారు. 126 మందిని పని చేయనివ్వకుండా అడ్డుకున్నారు. 34 మందికి నోటీసులు ఇచ్చారు. 47 మంది సంఘమిత్రలను తొలగించాలని అధికారులకు సిఫార్సులు వెళ్లాయి. ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది 112 మందిపై వేటు వేయాలని చూస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీనే అడ్డుకున్న టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులకు కొరత లేకుండా ఉండేలా గత ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జిల్లా స్థాయి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెపె్టంబర్లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఈ ఏడాది జూన్లో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. అదే నెల 6న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తామని ప్రకటించారు. కాగా, అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని నోటిఫికేషన్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు పోస్టింగ్లు ఇవ్వొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఉద్యోగులపై కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారన్న ఏకైక కారణంతో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్ బోర్డు వంటి కీలక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తగా తమ వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న ఏపీఐఐసీలోని జీఎం స్థాయి అధికారి వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 జూన్ తర్వాత నియమించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలంటూ ఇటీవల కొంత మంది పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ ఆ ఉన్నతాధికారి జీఎంలకు లేఖలు రాసి, వివరాలు తెప్పించారు. ఇప్పటికే నెల జీతం రూ.40,000 పైన ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఏపీఐఐసీ, తాజాగా ఇప్పుడు అంతకంటే తక్కువ జీతం ఉన్న వారిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇలా సుమారు 170 నుంచి 180 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఏపీ మారిటైమ్ బోర్డు, దాని అనుబంధ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు కింద ఉన్న రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు లిమిటెడ్లో రూ.40 వేలకు పైగా జీతం ఉన్న ఉద్యోగులను తొలగించారు. త్వరలోనే అంతకంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా మొదలు కావచ్చని చెబుతున్నారు. డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారుప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా ప్రజలకు రేషన్ పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే డీలర్ షిప్లకు రాజీనామా చేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలలుగా కమీషన్ కూడా ఇవ్వలేదు. మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – పాటిల్ ప్రకాష్రెడ్డి, పెద్దకోట్ల, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా మా ఉసురు తప్పక తగులుతుందిమధ్యాహ్న భోజన పథకం కార్మీకురాలిగా పథకం పుట్టినప్పటి నుంచి పని చేస్తున్నా. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా మార్చేశారు. నాపై ఎలాంటి ఆరోపణలూ లేవు. అయినా నువ్వు వంట చేయొద్దంటూ నా వంట పాత్రలన్నీ బయట పడేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తప్పించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. లేదంటే మాలాంటి వారి ఉసురు తగులుతుంది. – ఎస్.సరస్వతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మీకురాలు, గంగవరం, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లాసంఘాల మద్దతున్నా తొలగించారునేను 18 మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యుల మద్దతుతో తుంగాన పుట్టుగ గ్రామైక్య సంఘానికి వీఓఏగా ఎన్నికయ్యాను. నా బాధ్యతల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చేసిన సేవల్ని గుర్తించిన అధికారులు మహిళా దినోత్సవం నాడు జ్ఞాపికతో సత్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను అకారణంగా తొలగించారు. 18 సంఘాల వారు నన్ను కొనసాగించాలని చెబుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నా జీతం బకాయి కూడా ఇవ్వలేదు. – తుంగాన అంజలి, తుంగానపుట్టుగ గ్రామైక్య సంఘం వీఓఏ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాబలవంతంగా రాజీనామా చేయించారుగతంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాధి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి సరైన ఆధారాలు దొరకడంతో తొలగించారు. ఆ స్థానంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్న నా అనుభవం, విద్యార్హత చూసి ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం కల్పించారు. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీలో నాపై ఎలాంటి రికవరీలు లేవు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఇలా చిరుద్యోగుల కడుపు కొట్టడం సరికాదు. – మునెయ్య, కందాడు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లానా జీవనం ప్రశ్నార్థకంగా మారిందిగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాచ్మెన్గా రెండేళ్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాననే నెపంతో నన్ను విధుల నుంచి తొలగించారు. నా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్యాయంగా పొట్ట కొట్టడం సరికాదు. – మాలాజీ ఏసుబాబు, జయంతి, వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుశ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మీకులు, ఏజెన్సీల నిర్వాహకులు, రేషన్ షాపుల డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పాఠశాలల వాచ్మెన్లు, వలంటీర్లను బలవంతంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 7,836 మంది వలంటీర్లను తీసేశారు. 346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,730 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మీకులను వీధిన పడేశారు. 97 మంది వాచ్మెన్లను తొలగించారు. 1,367 మంది రేషన్ డీలర్లను మార్చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,125 రేషన్ డీలర్లను మార్చేశారు. 420 మంది యానిమేటర్లను తప్పించారు. 677 స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,300 మందికి పైగా కార్మికులను తొలగించారు. 274 మంది వాచ్మెన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు 450 మందికి పైగా తొలగించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో రాజీనామా చేయించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్కూళ్లలో టాయ్లెట్స్ క్లీన్ చేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. చౌక డిపో డీలర్లు అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి పది షాపులకు ఒకరిని ఇన్చార్జ్గా నియమిస్తున్నారు. వారి ద్వారా మామూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలకు అవమానం
-
బంగారం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా గనిపై కొండచరియలు విరిగిపడి 11 మంది కార్మికులు మృతి చెందారు. గోరంటా ప్రావిన్స్లోని రిమోట్బోన్ బొలాంగో జిల్లాలో ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 33 మంది స్థానిక కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి కార్మికులపై పడ్డాయని రెస్క్యూ బృందం ప్రతినిధులు తెలిపారు. 33 మంది కార్మికుల్లో కేవలం ఒక్కరినే రక్షించారు. ఇప్పటివరకు గనిలో నుంచి 11 మంది మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన 21 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో బంగారం కోసం అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
టార్గెట్ ఫినిష్ చేస్తేనే వాష్రూమ్, వాటర్ బ్రేక్.. ప్రతిజ్ఞ చేయించారు
హర్యానాలోని మనేసర్లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు గిడ్డంగులలో వారానికి ఐదు రోజులు, రోజుకు 10 గంటలు పని చేసి నెలకు రూ.10088 సంపాదిస్తున్నట్లు ఓ యువకుడు వెల్లడించారు. షిఫ్ట్ సమయంలో సమయం వృధా చేయకూడదని, సీనియర్లు వాష్రూమ్లను కూడా చెక్ చేస్తుంటారని పేర్కొన్నారు.లంచ్ లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిముషాలు విరామం లేకుండా పనిచేయాలని. రోజుకు నాలుగు ట్రక్కులకంటే ఎక్కువ దించలేము. అయినా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారు. అనుకున్న టార్గెట్ (పని) పూర్తి చేసేవరకు నీరు తాగడానికి లేదా వాష్రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని మా చేత ప్రతిజ్ఞ చేయించారని చెప్పారు.పనిచేసే మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన రూమ్ లేదని, ఒకవేలా వాష్రూమ్ లేదా లాకర్ రూమ్లో ఉండాల్సి వస్తుంది. ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని వాపోయారు.దీనిపైన అమెజాన్ ఇండియా అధికారులు స్పందిస్తూ.. ఈ రకమైన రూల్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఒకవేలా మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆరాతీస్తామని చెప్పారు. కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి రూల్స్ పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. -
విజయవాడ: తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, విజయవాడ: కోర్టు సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్దెల పవన్, మద్దెల రాజేష్లపై దాడి చేసిన 9 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించారు. 9 మందిని అరెస్ట్ చేసిన సూర్యారావు పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిందితులు కొర్ర సత్యనారాయణ, అరసంకల అశోక్, చింతజల్లు రమేష్ బాబు, బాలబొమ్మ అయ్యప్ప, రాచూరు వెంకటేశ్వర్లు, రెడ్డిపల్లి కిరణ్ కుమార్, రెడ్డిపల్లి సతీష్ కుమార్, గుత్తి సత్యనారాయణ, ఇమ్మిడి శివకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, బీరు బాటిళ్లతో నిందితులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ పార్టీలో యాక్టివ్గా పని చేసినందుకే దాడి జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం బాధితులు మద్దెల పవన్, రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
Lok Sabha Election 2024: జవాన్లను కార్మికులుగా మార్చేశారు
బాలాసోర్(ఒడిశా): అగ్నివీర్ పథకం ద్వారా ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని భద్రక్ లోక్సభ నియోజకవర్గంలోని సిమూలియా పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ విపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీచేస్తాం. అగ్నివీర్ పథకం తెచ్చి ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారు. మేం అగ్నివీర్ను రద్దుచేసి ఆ కార్మికులను మళ్లీ జవాన్లుగా మారుస్తాం. వారికి పెన్షన్, క్యాంటీన్ సౌకర్యాలు కలి్పస్తాం. విధి నిర్వహణలో మరణిస్తే గౌరవప్రద ‘అమ రుడు’ హోదా దక్కేలా చేస్తాం . పంటకు కనీస మ ద్దతు ధరకు చట్టబద్దత కలి్పస్తాం’ అని అన్నారు. నవీన్ బాబుపై కేసులేవి?: ‘‘ఒడిశాలో బీజేడీ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తోంది. నాపై మోపిన 24 పరువునష్టం, క్రిమినల్ కేసులను న్యాయంగా ఎదుర్కొంటున్నా. ఈడీ నన్ను 50 గంటలు విచారించింది. బీజేపీ నా లోక్సభ సభ్యత్వాన్ని, నాకు కేటాయించిన అధికారిక ఎంపీ బంగ్లానూ లాగేసుకుంది. నవీన్ బాబు(పట్నాయక్) నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయన మీద కూడా ఇలాగే కేసులు ఉండాలికదా. మరి లేవెందుకు?’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు అంతకుమించి తెలీదు హాలీవుడ్ ‘గాంధీ’ సినిమా తర్వాతే గాం«దీజీ విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఆర్ఎస్ఎస్ వాళ్లకు గాం«దీజీ గురించి అంతకుమించి ఏం తెలీదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో శిక్షణపొందిన వాళ్లు గాడ్సేను ఆరాధిస్తారు. గాం«దీజీ గురించి వాళ్లకు తెలిసింది శూన్యం. హిందుస్తాన్, సత్యం, అహింసా మార్గం వంటి చరిత్ర వాళ్లకు బొత్తిగా తెలీదు. మోదీ అలా మాట్లాడతారని ఊహించిందే’ అని అన్నారు. -
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు. ‘జన్జన్కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్హౌస్ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్ ఉద్యోగులు పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్ తాజాగా చేసిన జాతీయ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తాము గడిచిన మూడు నెలల్లో తిండికి కూడా కష్టాలు పడినట్లు నివేదించారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.సియాటిల్కు చెందిన వాల్మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్. యూఎస్ వేర్హౌసింగ్ పరిశ్రమ వర్క్ఫోర్స్లో అమెజాన్ 29 శాతం వాటాను కలిగి ఉందని పరిశోధకుల అంచనా. అమెజాన్ వేర్హౌస్లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నుంచి స్పందనలను క్రోడీకరించి నివేదికను విడుదల చేసింది. -
240 కోట్ల కార్మికులు ఎండలకు విలవిల!
తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. -
గల్ఫ్ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల గల్ఫ్ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్లో సవరణలు, సూచనల కోసం లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవన్రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా.. ‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. సాయం చేసేందుకు కేసీఆర్కు మనసు రాలేదు: జీవన్రెడ్డి గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్కు మనసు రాలేదని విమర్శించారు. గల్ఫ్ గోస లేకుండా చూడండి సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్ను పటిష్టం చేయాలని, గల్ఫ్ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు. గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ అంతర్జాతీయ కన్వీనర్ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఔట్సో ర్సింగ్ ఉద్యోగాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ హామీ ఇచ్చారు. బాన్సువాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో లింగాయత్లను ఓబీసీ జాబితాలో చేర్చారన్నారు. ప్రస్తుతం అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
Bihar: కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు
పాట్నా: బిహార్లోని సౌపాల్లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం( మార్చ్ 22) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు. కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘి ఇదీ చదవండి.. కేజ్రీవాల్ కస్టడీ కోరనున్న ఈడీ -
భారతీయుల కోసం తైవాన్.. లక్షల్లో ఉద్యోగాలు!
భారత్, తైవాన్ మధ్య బంధం బలపడుతోంది. ఇందులో భాగంగానే తైవాన్ దేశంలో ఇండియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఇరు దేశాలు ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తైవాన్.. భారత్, అమెరికా దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోంది. ముఖ్యంగా ఇండియాతో తైవాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తూ.. ఇరు దేశాలకు ఉపయోగకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తైవాన్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉండటంతో 2025 నాటికి 20 శాతం వృద్ధ జనాభా ఉంటారని, కార్మికుల కొరత గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే తైవాన్ ప్రస్తుతం వలస కార్మికుల మీద ఆధారపడుతోంది. ఇప్పటికే థాయ్లాండ్, ఇండోనేసియా, ఫిలిప్ఫిన్స్, వియత్నాం దేశాలకు చెందిన సుమారు 7 లక్షలమంది తైవాన్లో పనిచేస్తున్నట్లు సమాచారం. తైవాన్ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్కు చెందిన వర్కర్లను నియమించుకోనున్నట్లు గతంలోనే వెల్లడించింది. అనుకున్న విధంగానే ఇప్పుడు రెండు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. అంటే భారతీయులకు రానున్న రోజుల్లో తైవాన్ భారీగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి #Taiwan🇹🇼-#India🇮🇳 relations reach a new high! The MOU on the Facilitation of Employment of Indian Workers, signed by @TWIndia2 Rep. Ger & @ita_taipei Rep. Yadav, promises mutual benefits for our people, igniting a powerful momentum for even deeper & more fruitful cooperation! pic.twitter.com/H9kNZvaI97 — 外交部 Ministry of Foreign Affairs, ROC (Taiwan) 🇹🇼 (@MOFA_Taiwan) February 16, 2024 -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్లోని హైదరాబాద్లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్గా కొనసాగుతోంది. -
స్థల వివాదంలో తన్నుకున్న జన సైనికులు
సాక్షి, కృష్ణా జిల్లా: హనుమాన్ జంక్షన్లో జన సైనికులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేట్ స్థలం సరిహద్దుపై గత కొన్ని నెలలుగా జనసేనకు చెందిన రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. స్థల వివాదం సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఇరు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి. కొట్టుకునేందుకు సమయం చెప్పి ఇరువర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఒక వర్గానికి నాయకత్వం వహించారు. ఆయన వర్గం ఓవైపు.. మరో వర్గం ఇంకోవైపు రోడ్డెక్కారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎందుకు ఘర్షణ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. -
AP: మున్సిపల్ కార్మికులతో చర్చలు
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చదవండి: టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ -
కెనడా వెళ్లే విద్యార్థులకు మరో షాక్! ఇకపై అలా కుదరకపోవచ్చు..
కెనడా వెళ్లే విద్యార్థులకు ఆ దేశం మరో షాక్ ఇవ్వబోతోంది. 2024 ఆ తర్వాత దేశంలోకి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై పరిమితులు విధించే అవకాశం ఉందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల భారీ ప్రవాహాన్ని పరిష్కరించడానికి వచ్చే ఏడాది ప్రారంభంలో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కెనడాలో తలెత్తిన హౌసింగ్ సంక్షోభానికి విదేశీ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడానికి మధ్య సంబంధం ఉందని మిల్లర్ అభిపాయపడ్డారు. తాత్కాలిక ప్రాతిపదికన కెనడాలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఆకాశాన్ని తాకిందన్నారు. అయితే తాను నిర్దిష్టంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పారు. విద్యార్థుల రూపంలో.. దేశంలో చాలా కాలంగా అస్థిరంగా ఉన్న తాత్కాలిక విదేశీ కార్మిక వ్యవస్థ వల్ల తలెత్తుతున్న పరిణామాలపై తాను దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మిల్లర్ పేర్కొన్నారు. తాత్కాలిక వ్యవసాయ కార్మికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లను పొందిన అంతర్జాతీయ విద్యార్థుల రూపంలో తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా కెనడాలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 మూడో త్రైమాసికంలో ఆ దేశ జనాభా 4.3 లక్షలకుపైగా పెరిగిందని స్టాటిస్టిక్స్ కెనడా తన ఇటీవలి డేటాలో పేర్కొంది. ఇది వెల్లడైన వారం రోజుల్లోనే మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో 1957 తర్వాత ఓ త్రైమాసికంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు ఇదే. ఈ నివేదిక ప్రకారం.. కెనడాలో ప్రస్తుతం 4 కోట్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3.13 లక్షల మంది వలసదారులు ఉండటం గమనార్హం. కాగా విదేశీ విద్యార్థుల పట్ల కెనడా ప్రభుత్వం ఇదివరకే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. 2024 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. -
బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు. బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు! -
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
‘జై శ్రీరాం’ నినాదాలతో కాంగ్రెస్ సంబరాలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లో 230 సీట్లు, రాజస్థాన్లో 199 సీట్లు, ఛత్తీస్గఢ్లో 90 సీట్లు, తెలంగాణలో 119 సీట్లలో ఎవరు విజయం సాధించనున్నారో నేడు తేలిపోనుంది. ఇదిలావుండగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్ పంథా మారిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు మొదలుపెట్టింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు ముందు, కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల హనుమంతుని వేషధారణలో కనిపించారు. వారంతా ‘జై శ్రీరామ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త ‘సత్యం మాత్రమే గెలుస్తుంది, జై శ్రీరామ్’ అంటూ నినదించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు డప్పులు వాయిస్తూ, పటాకులు పేలుస్తున్నారు. ఒక కార్యకర్త కృష్ణుని వేషధారణతో అక్కడికి వచ్చాడు. కొందరు కార్యకర్తలు రామరాజ్యం పోస్టర్లు అతికించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో లడ్డూలను సిద్ధం చేశారు. కార్యాలయం వెలుపల పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్లో బీజేపీకి ఆధిక్యం చూపాయి. రాజస్థాన్లో ఈసారి అధికారం మారవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్స్లో అంచనాలు వెలువడ్డాయి. ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: అది కింగ్మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం? #WATCH | Ahead of the counting of 4-state elections, a Congress worker - dressed as Lord Hanuman - stands outside the party HQ in Delhi. He says, "Truth will triumph. Jai Sri Ram!" pic.twitter.com/L61e28tBln — ANI (@ANI) December 3, 2023 -
Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం!
భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్నాథ్కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జిట్పోల్స్తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg — ANI (@ANI) December 2, 2023 -
చంద్రబాబుకు స్వాగత ర్యాలీ వెలవెల
పటమట(విజయవాడతూర్పు)/గన్నవరం(విమానాశ్రయం): తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరాదరణే ఎదురైంది. ఆ పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యకర్తలు, నాయకులు లేక వెలవెలబోయింది. జాతీయ రహదారి 16 వెంబడి రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరురోడ్డు వైపు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అత్యధిక ఓటింగ్కు కారణంగా నిలిచారు. మహిళల ఉత్సాహాన్ని చూసిన ఎన్నికల అధికారులు ఈసారి ఓట్ల లెక్కింపును కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. కంకేర్ జిల్లాలో జరిగే ఈ ఓట్ల లెక్కింపులో సూపర్వైజర్ నుంచి సర్వెంట్ వరకు అన్ని విధులను మహిళలే నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు. డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపునకు మొత్తం 196 మంది మహిళలను విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది. ఈవీఎం లెక్కింపునకు 48 మంది మహిళా గెజిటెడ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 12 మంది.. మొత్తం 60 మంది మహిళా గెజిటెడ్ అధికారులను డ్యూటీ సూపర్వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ అసిస్టెంట్లుగా 72 మంది మహిళా అసిస్టెంట్ టీచర్లు, క్లర్క్లను నియమించారు. దీంతో పాటు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు 62 మంది మహిళా సేవకులను విధుల్లోకి తీసుకున్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఇద్దరు మహిళా అధికారులకు అనౌన్సర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా మొత్తం 196 మంది మహిళా ఉద్యోగులు ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు. కాంకేర్ కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పలు ప్రయోగాలు చేశామన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రెయిన్ బో పోలింగ్ బూత్ నిర్మించామని, ఇక్కడ మోహరించిన భద్రతా బలగాలు కూడా థర్డ్ జెండర్ వారేనని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్రైన్ ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్! -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని తన నివాసంలో ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. డెహ్రాడూన్లోని సీఎం నివాసం వద్ద పటాకులు పేల్చారు. అనంతరం సీఎం ఆ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబాలవారు దీపావళి జరుపుకోలేదు. అందుకే డెహ్రాడూన్లోని సీఎం నివాసంలో వారంతా ఇప్పుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రెస్క్యూ తర్వాత చిన్యాలిసాన్ సీహెచ్సీలో చేరిన కార్మికులకు సీఎం ధామి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఇది కూడా చదవండి: థాయ్లాండ్లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం! #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami and family members of the 41 workers have dinner together at his residence in Dehradun during 'Igas Bagwal' celebrations. pic.twitter.com/MUzO60jlRG — ANI (@ANI) November 29, 2023 -
సిల్క్యారా చేస్తున్న హెచ్చరిక
మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు. వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్లాండ్లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు. భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వారిని రప్పించారు. అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది. హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది. ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది. -
రిషికేశ్లోని ఎయిమ్స్కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్లోని ఎయిమ్స్కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ