నగర శివారు శామీర్పేట సమీపంలోని తుర్కపల్లిలో ఓ రిసార్ట్లో జరుగుతున్న రేవు పార్టీపై పోలీసులు గత అర్థరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతి యువకుల నుంచి 26 సెల్ఫోన్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతులు, విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
Published Sun, Jul 13 2014 8:30 AM | Last Updated on Thu, Mar 21 2024 5:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement