rave party
-
అనకాపల్లి జిల్లాలో మరోసారి రేవ్ పార్టీ కలకలం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో గత సోమవారం రాత్రి రేవ్ పార్టీ కలంకలం రేపిన సంగతి తెలిసిందే. గొలుగొండలోనే మరొక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం రాత్రి గొలుగుండ సమీపంలో బహిరంగంగా అర్ధ నగ్న డాన్స్లు నిర్వహించారు. గంజాయి, అమ్మాయిలతో విచ్చలవిడిగా రేవ్ పార్టీ జరిగిన కానీ, పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ రేవ్ పార్టీలో నలుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. గంజాయి మత్తులో పార్టీలో యువకుల మధ్య కొట్లాట జరిగింది. దీంతో పార్టీలో ఓ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులను మందలించి పంపించివేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. రేవ్ పార్టీలో మైనర్లు కూడా పాల్గొన్నారు. దీంతో తల్లి దండ్రుల ఆందోళన పడుతున్నారు. పోలీస్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
రచ్చ చేసి... రేవ్ లేదంటారా!
సాక్షి, కోనసీమ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండపేట రేవ్ పార్టీ కేసు మాఫీకి యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అశ్లీల నృత్యాల్లో పాల్గొన్న కూటమి నేతలను తప్పించేందుకు తెరవెనుక రాజకీయ కుట్ర జరుగుతోంది. కేసులో ఏ–1 నిందితుడిగా లే అవుట్ యజమాని కొమ్ము రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.పోలీసుల తీరును ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఖండించగా, టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సైతం సంఘటన స్థలంలో రాంబాబు లేరని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సర వేడుకల కోసం మండపేట, కపిలేశ్వరపురం మండలాలకు చెందిన కొంతమంది జనసేన నాయకులు భారీ లైటింగ్, సౌండ్ సిస్టమ్తో మండపేటలోని ఒక లేఅవుట్లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. డీజే సాంగ్స్, విద్యుత్ వెలుగుల్లో మద్యం తాగుతూ వారితో నృత్యాలు చేయించారు. మొదట అర్ధ నగ్నంగా, తర్వాత పూర్తి వివస్త్రలుగా హిజ్రాలు నృత్యం చేయడం వారితో కలసి కూటమి నాయకులు చిందులు వేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో రెండు రోజుల కిందట పట్టణ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోల్లో మరో 15 మంది వరకూ జనసేన, టీడీపీ నాయకులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని తప్పించేందుకు పోలీసులపై పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్టు చూపిస్తారో? లేక తప్పిస్తారో వేచి చూడాలి. చెడ్డపేరు వస్తుందన్న భయంతో.. ఈ అశ్లీల నృత్యాల్లో జనసేన, టీడీపీకి చెందిన 70 మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. ఇందులో పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలం పక్కనే నిర్మాణంలో ఉన్న స్లాబ్పైకి ఎక్కి వీరు వేడుకలు తిలకించినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రెండు పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని భావించిన ఆ పార్టీల నేతలు సంఘటనతో సంబంధం లేని లేఅవుట్ యజమాని పేరిట వైఎస్సార్ సీపీ నేతను కేసులో ఇరికించడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్ సీపీ నేత రాంబాబు ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో ఇప్పటికే చాలా వరకూ స్థలాలు అమ్ముడుపోయాయి. కొందరు తమ స్థలాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. మరికొందరు నిర్మాణ సామగ్రిని తరలించుకుంటున్నారు. స్థల యజమానులు నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు వీలుగా లే అవుట్ గేట్లు తెరిచి ఉంచుతున్నారు.ఎలా బాధ్యుడిని చేస్తారు: ఎమ్మెల్సీ తోట రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాంబాబు లేఅవుట్ వేసి స్థలాలు అమ్ముతుంటారని, ఆయనపై పోలీసులు ఏవిధంగా కేసు పెడతారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేత లేఅవుట్లో అశ్లీల నృత్యాలు జరిగాయంటూ మీడియా అడిగిన ప్రశ్నను ఆయన ఖండించారు. స్థలాలు అమ్మేసిన తర్వాత కొనుగోలు చేసుకున్న వారు తమకు నచ్చినట్టుగా వినియోగించుకుంటారని, అందుకు లేఅవుట్ యజమానిని ఏ విధంగా బాధ్యుడిని చేస్తారని ఎమ్మెల్సీ తోట మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతోనే మండపేట నడిబొడ్డున మునుపెన్నడూ లేని విధంగా ఈ అశ్లీల నృత్యాలు జరిగాయన్నారు. రాంబాబు అక్కడ లేరు: ఎమ్మెల్యే వేగుళ్ల సంఘటన స్థలంలో కొమ్ము రాంబాబు లేరు కాబట్టే పోలీసులు ఆయనపై ఏ–1గా కేసు నమోదు చేసినప్పటికీ, పోలీసులు ఆయన్ని ఇంకా అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడం కొసమెరుపు. తాము పోలీసులకు ఏమీ చెప్పలేదని, వారే సుమోటాగా కేసు నమోదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. -
AP: జనసేన నేత రేవ్ పార్టీ.. యువతులతో అసభ్యకర డ్యాన్స్!
సాక్షి, కోనసీమ: న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన నేతలు రెచ్చిపోయారు. వేడుకల కోసం జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ అర్థరాత్రి హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన రేవ్ పార్టీ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. గొల్లపుంత రోడ్లో ఉన్న బుద్ధా స్టాచ్యూ ఓం సిటీ లేఅవుట్లో రేవ్ పార్టీ జరిపారు. సమాజం తలదించుకునేలా అసభ్యకర నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ రేవ్ పార్టీకి జనసేన నాయకులు సహా మరికొందరు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీలో జనసేన నాయకుడు సహా అక్కడున్న వారంతా హంగామా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై ఆరాతీసిన పోలీసులు.. జనసేన నాయకుడితో సహా నలుగురిపై మండపేట పీఎస్లో కేసు నమోదు చేశారు. అయితే, జనసేన నేతలపై కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులకు హెచ్చరికలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు రిలీఫ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత బెయిల్పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.మా సస్పెన్షన్ ఎత్తివేత..బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
-
AP: కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ.. ఐదుగురు మహిళలు అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్ సందర్భంగా కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుడుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతోంది. దీనిపై సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
హైదరాబాద్ మోకిల పీఎస్ కు రాజ్ పాకాల
-
నేడు మోకిలా పీఎస్కు రాజ్ పాకాల..
-
జన్వాడ కేసులో కొత్త కీలక మలుపు
-
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జన్వాడలోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో, స్పందించిన రాజ్ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజ్ పాకాల..అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు. -
రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
-
రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తే వెళ్లాను: మద్దూరి విజయ్
-
హీటెక్కిన జన్వాడ రగడ... రాజ్ పాకాల ఎక్కడ ?
-
రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తనను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా తాము ఉద్యమ బాటలో నడుస్తామని.. చావుకు తెగించి ఉద్యమం చేశామని, ఈ కేసులకు, చిల్లర ప్రయత్నాలకు భయపడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు, ఆరు గ్యారంటీలు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు, సివిల్ సప్లైస్ స్కామ్పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీరోదాత్తంగా పోరాటం చేస్తున్నారు. వాటిపై మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభు త్వానికి లేదు. చేతనైతే రాజకీయంగా తలబడండి. శాసనసభ పెట్టండి. రుణమాఫీ కావచ్చు.. మూసీ సుందరీకరణ కావచ్చు.. ఆరు గ్యారంటీల అమలు కావచ్చు.. ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి.. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. నా బావమరిదికి నెగెటివ్ వచ్చిందిగా.. దీపావళికి ఒక ఇంట్లో దావత్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంట. మా బావమరిది రాజ్ పాకాల జన్వాడ రిజర్వ్ కాలనీలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది ఫామ్హౌస్ కాదు.. నా బావమరిది నివాసం ఉండే ఇల్లు. రాజ్ పాకాల ఏం తప్పు చేశాడు. తన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరుపెట్టి.. దాన్నో సినిమా చేశారు. ఆ పార్టీలో మా బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పార్టీలో ఉన్నది ఎవరో పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు. పొద్దున నాలుగు మందు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెట్టారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది.ఎన్డీపీఎస్లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏమిటి? సప్లయర్, కన్సంప్షన్, కోహోస్ట్ అని పెట్టారు. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి. లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెబుతున్నారు. ఇంకా కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే 13 మందికి నెగెటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఒక్కరు కూడా.. ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు? మత్తుపదార్థం దొరికిందా? ఏ రకంగా బద్నాం చేస్తారు? నేను కూడా ఉన్నానని తప్పుడు ప్రచారం కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాజీవితంలో ఉంటే మాపై ఎలాంటి మాటలైనా అడ్డగోలు ప్రచారం చేయవచ్చా? అది రాజ్ పాకాల ఇల్లు, ఫాంహౌజ్ కాదు. కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏమిటి? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే చెప్పారు, అయినా ఎందుకీ దు్రష్పచారం. రాజ్ పాకాలకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకు, ఎఫ్ఐఆర్కు తేడా ఎలా వచ్చింది? బాంబులు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాటం ఆపం.. అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా.. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపబోం. రేవంత్రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీరిచ్చిన హమీలు నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం. కేసీఆర్ నేరి్పన ఉద్యమ బాటలో నడుస్తాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
TG: ‘విందు’పై రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు. -
ఇందులో డ్రగ్స్ ఎక్కడున్నాయో చెప్పాలి.. ఇంట్లో దావత్ చేసుకోవద్దా..
-
ఫామ్ హౌస్ పార్టీలో సంచలన విషయాలు
-
జన్వాడ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
-
జన్వాడలో రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్
-
జన్వాడ రేవ్ పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు?
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో కేటీఆర్ బావ మరిది ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ తతంగంపై ఎక్సైజ్ పోలీసులు కూడా రంగం దిగారు. తాజాగా ఫామ్ హౌస్ మేనేజర్లు కార్తిక్, రాజేంద్ర ప్రసాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈవెంట్కి అనుమతి లేదని చెప్పారు. అలాగే, రేవ్ పార్టీ కోసం మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అనుమతి లేని మద్యం తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఫామ్ హౌస్లో డ్యూటీ ఫ్రీ మద్యం లభ్యమైనట్టు చెప్పారు. దీంతో, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేశారు. అలాగే, ఈ పార్టీలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక, మహిళలకు టెస్టులు చేసే సమయంలో పోలీసులకు వారికి సహాకరించలేదని సమాచారం. పోలీసులకు చుక్కలు చూపించినట్టు తెలిసింది. విజయ్ మద్దూరి కూడా పోలీసులను బెదిరించినట్టు సమాచారం. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్హౌస్ విస్తరించి ఉంది. రేవ్ పార్టీ, అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
జన్వాడ రేవ్ పార్టీ.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.జన్వాడ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్ హౌస్లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్ చేశారు. -
రంగారెడ్డి జిల్లా జన్వాడలో వీఐపీల రేవ్ పార్టీ భగ్నం
-
HYD: కేటీఆర్ బావ మరిది ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ భగ్నం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీఆర్ఎస్ నేత బావమరది ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్ను ఫామ్ హౌస్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్లో వీఐపీల రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కొకైన్ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్టు సమాచారం. పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, రైడ్ సందర్భంగా భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీంతో, సెక్షన్-34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్హౌస్కు పేరు లేకపోవడం గమనార్హం. -
మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో
నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.హేమ కొత్త వీడియోకొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)హేమ ఏం చెప్పింది?'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి''ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్
-
HYD: టెకీల ‘రేవ్’ పార్టీ భగ్నం..!
సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్హౌజ్లో రేవ్పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు -
వాట్సాప్లో రేవ్ పార్టీ ప్లాన్.. గేటెడ్ కమ్యూనిటీలో 35 మంది మైనర్లు..
లక్నో: గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లో అక్రమంగా జరుగుతున్న రేవ్ పార్టీని నోయిడా పోలీసులు భగ్నం చేశారు. ఇక, రేవ్ పార్టీలో డ్రగ్స్, మద్యం సేవిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్(మైనర్ల)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి వీరంతా రేవ్ పార్టీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. నోయిడాలోని సూపర్నోవా రెసిడేన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కొందరు మైనర్లు గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ ప్లాన్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ప్లాట్ నుంచి కేకలు, మద్యం బాటిళ్లు బయటకు విసిరేయడంతో రేవ్ పార్టీ విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు రేవ్ పార్టీపై సమాచారం ఇచ్చారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు నిర్వాహకులతో సహా 35 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. #WATCH : Exclusive photos and video of rave party organised by college students at a flat of a Supernova society in Noida.Students threw empty liquor bottles from the balcony, shattering them on the ground floor.Police have detained 39 individuals, including the main… pic.twitter.com/RXlu8lgRUr— upuknews (@upuknews1) August 10, 2024అనంతరం, విచారణ సందర్భంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీ కోసం కాలేజ్ స్టూడెంట్స్ ఎంట్రీ ఫీజ్ వసూలు చేసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఫీమేల్ సింగిల్స్ రూ. 500లు, జంటలకు రూ.800, పురుషులకు రూ.1000 వసూలు చేసినట్టు చెప్పారు. రేవ్ పార్టీ కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు తెలిపారు. ఇక, ఈ పార్టీలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలం నుంచి హుక్కా, ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవి హర్యానాకు చెందిన మద్యం బాటిళ్లుగా పోలీసుల నిర్ధారించారు. ఇక, అరెస్ట్ అయిన వారిపై మైనర్లు, బాలికలు ఉన్నట్టు సమాచారం. -
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు
-
మరో రేవ్ పార్టీ భగ్నం
-
మాదాపూర్లో రేవ్ పార్టీ.. ఐదుగురు అరెస్ట్
హఫీజ్పేట్: మాదాపూర్లో రేవ్ పారీ్టపై స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు దాడి చేశారు. ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కె.వై.ఖురేషి, ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్రావు గురువారం శేరిలింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ (31) ఆధ్వర్యంలో మాదాపూర్ సైబర్ టవర్స్ వెనక ఉన్న క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్స్లో జన్మదిన వేడుకల్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ నెల 12న నాగరాజు గోవా నుంచి 3 గ్రాముల కొకైన్ను తెప్పించి మోకిలకు చెందిన నితిన్ (24)కు అందించాడు. బేగంపేటకు చెందిన సాయికుమార్ యాదవ్ (27) విదేశాల నుంచి మద్యం తీసుకురాగా, బంజారాహిల్స్కు చెందిన సీహెచ్ కిషోర్ (28) రేవ్పార్టీకి కోసం సరీ్వస్ అపార్ట్మెంట్ బుక్ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి ఎస్ఐలు బాల్రాజ్, సంధ్యల బృందం రేవ్పార్టీపై దాడి చేసి 14 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులోకి తీసుకుంది.వారి నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే కొకైన్ (1 గ్రాము), ఎండీఎంఏ (2 గ్రాములు), ఓజీ కుష్(1 గ్రాము)తోపాటు 12 విదేశీ మద్యం సీసాలు, 36 బీర్ సీసాలు, ఒక ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహించిన నాగరాజుతోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేసిన సాయికుమార్ యాదవ్, ఇమాన్యుల్, సీహెచ్ కిషోర్, నితిన్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మిగతా 15 మందిని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. రేవ్పారీ్టలో పట్టుబడ్డ ఐదుగురు యువకులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎబాన్ యూరిన్ టెస్ట్ అనే నూతన పరికరంతో పరీక్షలు చేశారు. ఈ పరీక్షతో కేవలం 5 నిమిషాల్లోనే సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకోవచ్చు. -
Hyderabad: మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.నిర్వాకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్పై నటి రోహిణి ఫైర్
బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్న నటి రోహణి తాజాగా ఓ జర్నలిస్ట్పై ఫైర్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది.అసలేం జరిగింది?రోహిణి తాజాగా ‘బర్త్డే బాయ్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రేవ్ పార్టీ థీమ్తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. అది కాస్త నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఇది కేవలం ప్రమోషన్స్ కోసమే చేసినట్లు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కానీ కొంతమంది రోహిణి నిజంగానే రేవ్ పార్టీలో దొరికిపోయిందని ట్రోల్ చేశారు. ఇక ఇదే వీడియోపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ చానల్లో మాట్లాడుతూ..రోహిణి లాంటి వాళ్లు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్పై కూడా కామెంట్ చేయడం పట్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను బర్త్ డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకొని మీడియా కూడా దానిని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ, సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. నేను మందు కూడా తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా?. ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావు గా ఉంటే పెళ్లి కాదా.? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’అని రోహిణి సీరియస్ అయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
హేమ బుకాయింపు..
-
బెంగళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి హేమ విడుదల
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా.. బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్ వేయగా స్థానిక కోర్టు మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
-
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024 -
నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్ -
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
జబర్దస్త్ షోతో జనాలకు దగ్గరైంది రీతూ చౌదరి. ఈ మధ్య యాంకర్గా బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లింది. అక్కడ తనకు రేవ్ పార్టీకి వెళ్లాలని ఉండేదన్న ఆకాంక్షను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నాకు నిజంగా రేవ్ పార్టీ అంటే తెలియదు. అసలు అదేంటో తెలియక రేవ్ పార్టీకి నాకెప్పుడు ఆహ్వానం పంపుతారా? నన్నెప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూశాను. రేవ్ పార్టీ అంటే ఏంటో తెలీదుకానీ తెలిశాక వద్దనుకుంటున్నాను. ఇప్పటికీ దానిపై నాకు పూర్తి అవగాహన లేదు. ఛానల్స్ చూసి అంతో ఇంతో తెలుసుకున్నాను. డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు తీసుకుంటారని తెలిశాక రేవ్ పార్టీకి వెళ్లడం అవసరం లేదనుకున్నాను. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు డ్రగ్స్ తెలిసి తీసుకుంటున్నారో, తెలియక తీసుకుంటున్నారో వాళ్లకే తెలియాలి. పోలీసులకు దొరికిపోయాక మనమేం చెప్తాం అంది. రీతూ చౌదరి ప్రస్తుతం దావత్ షో చేస్తోంది. అలాగే త్వరలోనే సరికొత్త షోతో ముందుకు రానున్నట్లు వెల్లడించింది. తన చేతిలో ఒక సినిమా కూడా ఉన్నట్లు తెలిపింది.అడ్డంగా దొరికిన హేమఇకపోతే ఇటీవల బెంగళూరులోని ఓ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. అర్ధరాత్రి దాటినా పార్టీ జరుగుతుండటంతో పోలీసులు ఫామ్హౌస్పై రైడ్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురినీ అరెస్ట్ చేశారు. అందుటో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట్లో తాను ఇంట్లో ఉన్నట్లు వీడియోలు రిలీజ్ చేస్తూ బుకాయించిన హేమ తర్వాత మాత్రం అడ్డంగా దొరికిపోయింది. తన ఒరిజినల్ పేరు కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైందని, తన రక్తనమూనాల్లోనూ డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా? -
రేవ్ పార్టీ.. నోటీసులను లెక్కచేయని హేమ
-
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. -
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?
-
రేవ్ పార్టీ కేసులో కీలక అరెస్టులు
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే ఈ కథనం. నైట్ క్లబ్లు, పబ్లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్ పార్టీలు రెడీగా ఉంటాయి. రేవ్ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. అన్ని రకాల హడావుడిముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు. సాధారణమైనా, రేవ్ అయినా పార్టీలపై పోలీసులు రైడ్చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. టికెట్ చాలా రేటు సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది. ఇంత డబ్బు పోసి టికెట్ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్ హౌస్లలో నిర్వహిస్తారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు. ఆహారం, ఆల్కహాల్ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.ఉద్యానగరిలో దందా గత కొన్నేళ్లుగా సిలికాన్ సిటీలో రేవ్పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది. -
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో హేమకు పాజిటివ్ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్ మౌళి ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు కదా సార్ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్ అని అడగడంతో నవదీప్ స్పందించారు.ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్కుమార్, నాగబాబు, రణధీర్బాబు, మహ్మద్ అబూబక్కర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్ను పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు.ఇక, బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలాఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ.. -
బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలే కీలక సూత్రదారులు
-
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. -
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు సస్పెండ్
బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. -
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
-
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు
-
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
-
రేవ్ పార్టీ.. హేమకు మెసేజ్ చేశా.. తన గొయ్యి తనే తీసుకుంది: కరాటే కల్యాణి
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన హేమ.. తూచ్, అంతా అబద్ధం, నేను హైదరాబాద్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది. ఎవరినీ క్షమించేది లేదని..నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్ టెస్ట్లో హేమ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గొడవలు..ఇంతలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.తన గోతి తనే తీసుకుందిఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల -
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్ ఫలితాలు ఇవాళేడ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు. -
రేవ్ పార్టీలో టీడీపీ నేతలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
-
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోపై యాంకర్ శ్యామల రియాక్షన్
-
కవర్ చేద్దాం అని వీడియో చేసి దొరికిపోయిన హేమ
-
రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ అని ఈ రేవ్పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్లోని హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్పూల్, టాయ్లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్సిద్దికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
నెల్లూరు: బెంగళూరు రేవ్ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్ను జిరాక్స్ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?’‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా. ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు. -
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
-
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
-
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
బెంగళూరు రేవ్ పార్టీ..బయటపడ్డ సంచలన నిజాలు..
-
బెంగళూరు రేవ్ పార్టీ: ఆ ఇద్దరు నటులు ఎవరు?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించాము. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము. బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు. -
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
-
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
రేవ్ పార్టీ అంటే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్క్లబ్లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్,ఎలక్ట్రానిక్ సంగీత కారుల హోరు, అర్థనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ రావడం గమనార్హం.సాధారణంగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), టెక్నో మ్యూజిక్ ,ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇలా అనేక రకాల మ్యూజిక్స్తో హోరెత్తించే భారీ ఆల్-నైట్ డ్యాన్స్ పార్టీలు. మిరుమిట్లు గొలిపే లైట్ షోలు, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మిళితంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగానో, లైసెన్స్ ఉన్న క్లబ్స్లో జరుగుతాయి. రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. వాటి వివరాలు చూద్దాం.రేవ్ పార్టీలు, రకాలుఫెస్టివల్ రేవ్స్: ఫెస్టివల్ రేవ్లు చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు. ఇందులో టెక్నో, హౌస్ ,డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టయిల్స్ ఉంటాయి.అండర్గ్రౌండ్ రేవ్లు: అండర్గ్రౌండ్ రేవ్లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాలుచ అండర్ గ్రౌండ్ క్లబ్లలో నిర్వహిస్తారు. క్లబ్ రేవ్స్: క్లబ్ రేవ్లు సాంప్రదాయ నైట్క్లబ్ వేదికలలుగా ఏర్పాటు చేస్తారు. టెక్నో, హౌస్ , ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ సంగీత కళా ప్రక్రియల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్గానే జరుగుతాయిథీమ్ బేస్డ్ రేవ్లు: హాలిడే లేదా నిర్దిష్ట సంగీత శైలి వంటి నిర్దిష్ట థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉండే పార్టీలను థీమ్డ్ రేవ్లు అంటారు. ఈ పార్టీల్లో ధరించే దుస్తులు, డెకరేషన్, యాక్టవిటీస్ అన్నీ థీమ్కు అనుగుణంగా ఉంటాయి.డే రేవ్స్: డే రేవ్లు అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతంతో ఆరు బయట జరుగుతాయి.సైలెంట్ డిస్కో: పేరుకు తగ్గట్టుగానే ఇవి చుట్టుపక్కలవారికి ఎలాంటి అంతరాయంగా లేకుండా సెలెంట్గా ఉంటాయి. ఈ పార్టీలో సంగీతాన్ని వినడానికి హాజరైనవారు సైలెంట్ డిస్కోల సంప్రదాయ స్పీకర్లకు బదులుగా వైర్లెస్ హెడ్ఫోన్లను ధరిస్తారు.సైట్రాన్స్ రేవ్స్: సైట్రాన్స్ రేవ్లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డ్యాన్స్, కాస్ట్యూమ్స్ విజువల్స్ తోపాటు తమదైన సొంత సబ్కల్చర్ మ్యూజిక్ ఉంటుంది. హార్డ్స్టైల్ రేవ్లు: హార్డ్స్టైల్ రేవ్లు హార్డ్స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్తో హై ఎనర్జీతో ఉంటాయి. ఇలా ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
బెంగళూరు రేవ్ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్సెట్ టూ సన్రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వాసు బర్త్డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్హాస్లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్హౌస్లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్హౌస్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్స్కా్వడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్హౌస్లో పార్టీ హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్హౌస్లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్హౌస్ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్లో తీసింది కాదని, ఆ ఫార్మ్హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఓ ఫామ్హౌస్లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
-
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
-
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్
నెల్లూరు, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారాయన. ‘‘ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమే. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా వారికి అర్ధమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు. .. రేపవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. రేవ్ పార్టీ వ్యవహారంపై బెంగుళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంత్రి కాకాణి మీడియాతో అన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధంలేదు: సినీ నటి హేమ
-
బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరలవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేసింది.చదవండి: Payal Rajput: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారుబెంగళూరులో రేవ్పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు! -
రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు..
-
రేవ్పార్టీ కేసులో ట్విస్ట్
బెంగళూరు, సాక్షి: నగరంలో వెలుగు చూసిన రేవ్ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి బెంగళూరు నార్కొటిక్స్ విభాగం శాంపిల్స్ సేకరించగా.. అసలు ఈ రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు.ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.సదరు జీఆర్ ఫామ్హౌస్ హైదరాబాద్ కాన్కార్డ్ సంస్థకు గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్ రేవ్ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్ ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు. అయితే హేమ ప్రకటన చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పార్టీలో పాల్గొందంటూ బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రముఖులు సైతంబెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్ విభాగం. -
అసలేంటి ఈ స్నేక్ వెనమ్: సెలబ్రిటీలకు అంత మోజు ఎందుకు?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం! ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది? కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
Madhapur: డ్రగ్స్తో పాటు వ్యభిచారం కూడా!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో కోణం బయటపడింది. డ్రగ్స్ పార్టీలతో పాటు వ్యభిచారం దందా కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులో లోతుకు పోయే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాదాపూర్లోని విఠల్ రావు నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులకు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలోనూ వెంకట్, బాలాజీలపై వ్యభిచార నిర్వహణ కేసులు ఉన్నట్లు తేలింది. తాజాగా మాదాపూర్లోని అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టుబడగా.. ఫ్లాట్లో ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు ఉండడంతో వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది. పలు చిత్రాలకు ఫైనాన్షియర్గా వ్యవహరించిన వెంకట్ ఈ డ్రగ్స్ సప్లై ప్రధాన సూత్రధారిగా తేలింది. సినిమా వెంకట్తో పాటు బాలాజీలు ఆ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట ఆ ఇద్దరినీ రెండు రోజులుగా అదే అపార్ట్మెంట్లో ఉంచినట్లు సమాచారం. ఈ అసాంఘిక కార్యకలాపాల కోసం రూమ్ నెంబర్ 804ను ఉపయోగించుకుంటున్నారు. వారానికి చొప్పున సర్వీస్ అపార్ట్మెంట్ను రెంటుకు తీసుకొని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ దందాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే.. గతంలోనూ వ్యభిచారం నిర్వహిస్తుండగా రెండుసార్లు ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సోదాల్లో అధికారులు వెంకట్ దగ్గర నుంచి 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్ టి పిల్స్ తొ పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వెంకట్.. తాను ఉపయోగించడంతో పాటు మరికొందరికి అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంకట్, బాలాజీ డ్రగ్ కస్టమర్లు ఎవరు? సినీ పరిశ్రమలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై నార్కోటిక్ టీమ్ ఆరాలు తీస్తోంది. -
మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. మాదాపూర్ విఠల్రావు నగర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పలు చిత్రాలకు ఫైనాన్షియర్ వ్యవహరించిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో వెంకట్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే.. నార్కోటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య చిత్రాలకు ఫైనాన్షియర్గా వ్యవహరించాడు వెంకట్. వెంకట్తో పాటు పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్ర్రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్ల నుంచి కోకైన్, ఎల్ఎస్డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు సైతం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు.. ఇక వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతుండగా.. విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టింటి నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే.. వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణను నిర్ధారించుకున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇక.. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. వెంకట్ వాట్సాప్లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వెంకట్ ఫ్లాట్లో ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్ -
ప్లాన్ రెడీ.. ఆగస్టులో రేవ్ పార్టీ
క్రిష్ సిద్దిపల్లి, రితికా చక్రవర్తి, ఐశ్వర్యా గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవ్ పార్టీ’. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజు బొనగాని మాట్లాడుతూ– ‘‘రేవ్ పార్టీల వల్ల యువతకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సహ–నిర్మాతలు: లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, జీఎస్ సీతారామరాజు, ఎస్. నారాయణస్వామి. -
Hyderabad: రేవ్పార్టీ భగ్నం.. పట్టుబడిన 33 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పసుమాములలోని ఓ ఫాంహౌస్లో రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు శనివారం రాత్రి తమ స్నేహితుడు సుభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. గంజాయి లభ్యం కావడంతో 29 మంది విద్యార్థులను, నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు. 11 కార్లు, ఒక బైక్, 28 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేసే విషయంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే వీరికి గంజాయి సరఫరా చేసిన వారిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పట్టుబడిన విద్యార్థుల తల్లితండ్రులని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మరలా బుధవారం రోజున అధికారులు ఇచ్చే కౌన్సిలింగ్కి హాజరు కావాలని పోలీసులు తెలిపారు. చదవండి: (విజృంభిస్తున్న జంటభూతాలు.. అప్రమత్తం కాకుంటే ప్రమాదమే) -
హయత్ నగర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు
-
HYD: నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం..
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడలో యువత రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా 10 మందికి పైగా యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా మద్యం సహా హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: చదువు పేరుతో హైదరాబాద్లో సహజీవనం.. ఇంటికి వచ్చాక .. -
షాపింగ్ మాల్లో నైట్ పార్టీ.. 900 మంది యువతీ యువకుల హల్చల్
సాక్షి, చెన్నై: కోయంబేడు సమీపంలోని ఓ మాల్లో నైట్ పార్టీలో మద్యం ఏరులై పారింది. అతిగా విదేశీ మద్యం తాగిన యువకుడు మృతి చెందడంతో పార్టీ గుట్టు రట్టయ్యింది. దీంతో ఈ ఘటన తమిళనాడుతో చర్చనీయాంశంగా మారింది. కాగా, చెన్నై శివారు ప్రాంతాలు, నగరంలో ఇటీవల కాలంగా వీకెండ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా, తగ్గేదే లేదన్నట్లుగా నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగరం నడి బొడ్డున ఉన్న కోయంబేడు సమీపంలోని ఓ మాల్లో నైట్ పార్టీ (అనుమతి లేకుండా) సాగడం వెలుగులోకి వచ్చింది. ఈ మాల్లోని పై అంతస్తును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఈ నైట్ పార్టీ నిర్వహించారు. బ్రిజిల్ నుంచి ప్రముఖ డీజే మన్డ్రో గ్రోవా బృందం ఈ పార్టీలో రాక్ మ్యూజిక్ను హోరెత్తించింది. విదేశీ మద్యం ఈ పార్టీలో ఏరులై పారింది. ముందుగా రూ.1500 చెల్లించి రిజర్వు చేసుకున్న 900 మంది యువతీ యువకులను ఈ పార్టీకి నిర్వాహకులు అనుమతించారు. రాక్ మ్యూజిక్ , ఏరులై పారిన మద్యంతో యువత చిత్తయ్యారు. అతిగా మద్యం సేవించిన ఓ యువకుడు స్పృహ తప్పిన సమాచారంతో ఈ పార్టీ గుట్టు రట్టు అయింది. సమాచారం అందుకున్న అన్నానగర్ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీని అడ్డుకున్నారు. అక్కడున్న యువతను బయటకు పంపించేశారు. నిర్వాహకులు విఘ్నేష్, చిన్న దురై, భరత్, మార్క్ను అదుపులోకి తీసుకున్నారు. స్పృహ తప్పిన యువకుడు ఆస్పత్రిలో మరణించడంతో వివాదం పెద్దదైంది. దీంతో నిర్వాహుకులపై కేసులు నమోదయ్యాయి. మృతి చెందిన యువకుడు మరిపాక్కంకు చెందిన ప్రవీణ్(23)గా గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వందలాది విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ పార్టీలో మత్తు పదార్థాల వాడకంపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. వెలుగులోకి అసలు నిజాలు -
డ్రగ్స్ కేసు: ఐదుగురి చుట్టూ సాగుతున్న దర్యాప్తు
సాక్షి, హైదరబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆ రోజు కొకైన్ డ్రగ్ను ఐదుగురే వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీన్ని నిర్థారించడానికి అవసరమైన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ రోజు పట్టుబడిన 128 మందిలో 45 మందికి ‘డ్రగ్ చరిత్ర’ ఉన్నట్లు గుర్తించారు. గతంలో మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టు అయిన వారితో వీరికి సంబంధాలు ఉండటంతో వీరందరికీ నోటీసులు జారీ చేసి విచారించారు. ఈ విచారణతో పాటు ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా రేవ్ పార్టీకి ఐదుగురే బాధ్యులని గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటి కోసం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. చదవండి: సరూర్నగర్ పరువు హత్యపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. నోటీసులు -
నమూనాలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని ఓ పబ్లో డ్రగ్స్ వినియోగం విషయంలో ముద్దాయిలుగా చూపించిన 142 మంది నమూనాలను తీసుకోకుండా, వారిని ఎందుకు విడిచిపెట్టారో బహిర్గత పరచాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పోలీసుల్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, ఇప్పటికైనా నమూనాలను సేకరించి నిగ్గు తేల్చాలని కోరారు. అంతేగాక డ్రగ్స్ వ్యవహారంలో అధికారులకు అనుమానం ఉన్న వారి జాబితాను ఇస్తే తమ పిల్లల్ని కూడా తీసుకొస్తానని చెప్పారు. అలాగే నీ కొడుకుని కూడా శాం పిల్స్ తీసుకొనేందుకు పంపిస్తావా అంటూ సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. డ్రగ్స్ అంశం లో సీఎం కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కొడుకుపై ఏమాత్రం అనుమానం లేకపోతే విచా రణ చేపట్టాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగా ణ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ హబ్గా మార్చే ప్రయత్నం జరుగుతోంది తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని, రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్గా, మరో పంజాబ్లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం డ్రగ్స్ అంశానికి కారణమైన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు 24 గంటల పాటు మద్యం సరఫరా చేసేందుకు లైసెన్స్ ఇచ్చింది మీరు కాదా? అంటూ సీఎం కేసీఆర్ను నిలదీశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి నమూనాలు సేకరించకుండా వదిలి వేయడం వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. పిల్లల్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సినిమా వాళ్లను లొంగదీసుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు డ్రగ్స్ కేసు కంటే ముందు ఏ సినిమా వాళ్ళు కేటీఆర్ కు పరిచయం లేరని, సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న తర్వాతే కేటీఆర్కు సినిమా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళను లొంగదీసుకొని, వాళ్ల అన్ని అవసరాలను తీర్చుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కు రాష్ట్రంలోని మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కయ్యిందని, రైతులు ఎంఎస్పీ కంటే రూ.500 తక్కువకు మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పించారని రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.2,500 కోట్ల రైతాంగం శ్రమను దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారని, ఇందులో కేసీఆర్ కుటుంబం వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు. బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
పబ్ రైడ్స్: ‘ఆ మూడు టేబుళ్ల’పైనే పోలీసుల ఫోకస్!
-
పబ్ రైడ్స్: ఆ మూడు టేబుళ్లే కీలకం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో జరిగిన రేవ్ పార్టీ కేసు విచారణలో ‘మూడు టేబుళ్లు’ కీలకంగా మారాయి. శనివారం రాత్రి వీటిని బుక్ చేసుకున్న వాళ్లే మాదకద్రవ్యాలు వినియోగించారని బంజారాహిల్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న పబ్ భాగస్వామి అర్జున్ వీరమాచినేని చిక్కడంతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మేనేజర్ అనిల్కుమార్ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తును బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు మంగళవారం అధికారికంగా స్వీకరించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఆ పబ్పై దాడి చేసి నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా సిద్ధార్థ్ తో పాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా అనేకమందిని అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన విషయం విదితమే. ఆ మూడు టేబుళ్లలో 20 మంది! టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 148 మందిలో 18 మంది పబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ పబ్లో ఓ పక్కగా ఉన్న మూడు టేబుళ్లపై జరిగిన వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మంగళవారం పబ్లో పనిచేసే కొందరు ఉద్యోగులను ప్రశ్నించారు. ఆ మూడు టేబుళ్లను అర్జున్ ఆదేశాల మేరకు అభిషేక్ కోరిన మీదట మేనేజర్ అనిల్కుమార్ చాలాసేపటి వరకు రిజర్వ్ చేసి ఉంచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో 15 నుంచి 20 మంది వచ్చారని, వారిని లోపలకు తీసుకురావడానికి అనిల్ స్వయంగా పబ్ ప్రధాన ద్వారం వరకు వెళ్లారని ఓ ఉద్యోగి వెల్లడించాడు. పబ్లో ఉన్న ఉద్యోగుల్లో ఇద్దరు మాత్రమే ఆ మూడు టేబుళ్లకు సర్వ్ చేశారని, మిగిలిన వాళ్లను అనిల్ ఆ దరిదాపులకు కూడా రానీయలేదని చెప్పాడు. కౌంటర్ నుంచే కొకైన్ అందించాడా? పబ్లో సోదాలు చేసిన సందర్భంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అనిల్కుమార్ అధీనంలోని లిక్కర్ కౌంటర్ పైన ఉన్న స్ట్రాల డబ్బా నుంచి ఐదు కొకైన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందే దాదాపు 10 నుంచి 15 ప్యాకెట్లు ఆ మూడు టేబుళ్లలో కూర్చున్న వారికి అనిల్ అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్, అభిషేక్ల పోలీసు కస్టడీపై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనిల్ కస్టడీకి వచ్చిన తర్వాత ఈ కోణంలోనే ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు ఆ మూడు టేబుళ్లపై కూర్చున్న వారిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
రేవ్ పార్టీలో పట్టుబడ్డ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
-
ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి!
సాక్షి, హైదరాబాద్: రేవ్ పార్టీ జరిగిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ అంశంలో బిగ్బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, బంజారాహిల్స్ తాజా మాజీ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర ఇద్దరూ వార్తల్లో నిలిచారు. వీరిలో ఒకరు ఆ పార్టీలో పాల్గొని పట్టుబడగా... మరొకరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలు ఆదివారం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిటీ పోలీసులు ‘డ్రగ్ ఫ్రీ హైదరాబాద్’పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బోరబండ ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్ అతిథిగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని, మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇదే అంశాన్ని తన అధికారిక సోషల్మీడియాలోనూ పొందుపరిచారు. ఇక ఇన్స్పెక్టర్ శివచంద్ర తన ఇంట్లో ‘హాయే మేరా దిల్’అనే హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. షార్ట్స్, టీషర్టులో ఉన్న శివచంద్ర డ్యాన్స్ చేసిన వీడియో యూట్యూబ్లో ఉంది. అది కూడా ఆదివారం వైరల్గా మారింది. (చదవండి: పట్టుబడగానే... మావాడు మంచోడే!) -
కూకట్పల్లిలో రేవ్ పార్టీ.. సడన్గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ కూకట్పల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాల ప్రకారం.. వివేక్ నగర్లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్లను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్పల్లి పోలీస్స్టేషన్కి తరలించారు. ఆ యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. -
ఆర్యన్ ఖాన్తో సెల్ఫీపై విమర్శలు.. ‘బీజేపీ హస్తం ఉంది’
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్కు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరలవ్వడంతో పాటు వివాదాస్పదంగా కూడా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్తో ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. సదరు వ్యక్తిని ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా గుర్తించారు. ఇక ఈ ఫోటోపై మహారాష్ట్ర మినిస్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. (చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం, ఎవరీ మున్మున్ ధమేచ) ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందరన్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం ఆర్యన్ ఖాన్ చేయి పట్టుకుని.. ఎన్సీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చి వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి. అలానే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనీశ్ భానుశాలి రెయిడ్ జరిగిన విజువల్స్లో కనిపించారు. ఎన్సీబీ అధికారులతో పాటు ఉన్న వీరిద్దరని చూస్తే.. దీనిలో బీజేపీ హస్తం ఉందని అర్థం అవుతుంది. నకిలీ డ్రగ్స్ రాకెట్ను పట్టుకుని.. మహారాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యలను ఎన్సీబీ కొట్టిపారేసింది. ఈ ఇద్దరినీ "స్వతంత్ర సాక్షులు" అని పేర్కొంది. ‘‘నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ కేసుకు సంబంధించిన విచారణ చట్టపరంగా, వృత్తిపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోంది" అని ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్తో పాటు మరో ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. (చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) భానుశాలి పాత్రపై బీజేపీ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలి. "రాజకీయాలు చేయడానికి అనేక సమస్యలు ఉంటాయి, కానీ మన దేశ భవిష్యత్తు తరాలకు సంబంధించిన డ్రగ్స్ విషయంలో మేము రాజకీయాలు చేయలేం’’ అని బీజేపీ ప్రతినిధి రామ్ కదం స్పష్టం చేశారు క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై గత శనివారం రాత్రి దాడులు చేసిన తరువాత, డ్రగ్స్ నిరోధక అధికారులు 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరాస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 33 1.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదు. అయితే, అతని వాట్సాప్ చాట్లో నేరపూరితమైన విషయాలు ఉన్నట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. చదవండి: మీ టీనేజర్ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! -
ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీబీ
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్యన్తో మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఎన్సీబీ ఆఫీస్లో విచారణ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆర్యన్తో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే వైరల్ పిక్లో ఉన్నది ఓ ఎన్సీబీ అధికారి అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎన్సీబీ ఆ సెల్ఫీలో ఉన్నది తమ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ -
Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?
ముంబై: పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్కర్ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. చదవండి: (Shah Rukh Khan: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ?) జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. చదవండి: (నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!) -
నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్తో పాటు మొత్తం 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లతో ఆర్యన్ చాటింగ్పై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో షారుక్ తన కుమారుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భార్య గౌరీ ఖాన్తో కలిసి సిమి గేర్వాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్.. 'నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సిగరెట్ తాగొచ్చు. సెక్స్, డ్రగ్స్ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్ చేయవచ్చు' అంటూ షారుక్ సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తను యవ్వనంలో చేయని పనులు తన కొడుకు చేయాలంటూ షారుక్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజం అయ్యాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేసిన రైడ్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. చదవండి: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ Seriously Shahrukh Khan!! @narcoticsbureau Today he has been arrested pic.twitter.com/1WfZkNkvSC — Priya Kulkarni (@priyaakulkarni2) October 3, 2021 -
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్
Shah Rukh Khan's Son Aryan Khan Arrest: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్ను వైద్య పరిక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్టాపిక్గా మారింది. డ్రగ్స్ పెడ్లర్స్తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ను అధికారులు సీజ్ చేశారు. -
షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ?
SRK's son Aryan Khan Being Questioned In Drug Case: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం రాత్రి దాడి చేసింది. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్టాపిక్గా మారింది. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ఫోన్, మరికొందరి ఫోన్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విచారిస్తే కేసులో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది. దాంతోపాటు ఆర్యన్ ఖాన్తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. క్రూయిజ్ పార్టీలో చేరడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్రూయిజ్ పార్టీ ఆర్గనైజర్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఎఫ్టీవీ డైరెక్టర్ ఖాసిఫ్ ఖాన్ పర్యవేక్షణలోనే ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోందని ఎఫ్టీవీ అధికారులు పేర్కొన్నారు. చదవండి: దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ -
ముంబై తీరంలో రేవ్ పార్టీ.. ఎన్సీబీ అదుపులో షారుఖ్ కొడుకు?
డ్రగ్స్కు సంబంధించిన కేసుల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులపై కేసులు నమోదు అవ్వడం తెలిసిందే. తాజాగా అటువంటిదే ముంబై తీరంలో జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు ఓ షిప్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన బృందంతో కలిసి సముద్రం మధ్య క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో హర్యానా, ఢిల్లీకి చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 7 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత స్టార్ హీరో కొడుకుతో పాటు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇంతకుమందు కూడా ఇలాగే సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియాడ్స్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా అనేక ఇతర బాలీవుడ్ ప్రముఖులను ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ విచారించింది. చదవండి: కొడుకుతో పార్క్కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి -
Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్ పార్టీలు
సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు. మోడల్స్, డీజే హంగామా నగరానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు. చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
పుట్టినరోజు పార్టీనే.. రేవ్ పార్టీ కాదు: సీఐ రాజశేఖర్రెడ్డి
గుంటూరు: పట్టాభిపురంలో రేవ్పార్టీ జరిగిందన్నది అవాస్తవమని సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. అక్కడ హోటల్లో జరిగింది పుట్టినరోజు పార్టీనే.. రేవ్ పార్టీ కాదని వెల్లడించారు. కొన్ని ఛానల్స్లో అసత్య కథనాలు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసు అధికారితోపాటు కొంతమందిని పోలీసులు తప్పించారంటూ.. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. -
రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్
సాక్షి, ముంబై: నాసిక్లోని ఇగాత్పురిలోని విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు జరిపారు. వీరిలో బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు...నాసిక్లోని స్కై తాజ్, స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్ల్లాల్లో రేవ్ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రైడ్లో 22మందిని అరెస్ట్ చేశారు. అప్పటికే యువతీ యువకులంతా మద్యం మత్తులో, ఒళ్లు మరిచిన అసభ్యకరమైన స్థితిలో ఉన్నారు. వారిలో 10మంది పురుషులు కాగా, 12 మంది ఆడవాళ్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారి పక్కనే పెద్దమొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ అరెస్టు చేశారు. అయితే ఓ మహిళ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నలుగురు యువతులు దక్షిణాది పరిశ్రమతో సంబంధం ఉన్నవారిగా గుర్తించారు. వీరిలో మోడల్స్, నటులు సహా కొరియోగ్రాఫర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రేవ్ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. చదవండి : హీరో కార్తి కోసం ఆ పాత్ర చేయడానికి సిద్ధమైన సిమ్రాన్ 7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది -
హైదరాబాద్ శివార్లలో నిత్యం రేవ్ పార్టీలు
-
బాప్రే.. రేవ్ పార్టీలో మహిళా పోలీసు
యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు. కర్ణాటకలో హాసన్ జిల్లాలో జరిగిన రేవ్ పార్టీలో కొందరు పోలీసులు కూడా మజా చేసినట్లు సమాచారం. ఇటీవల ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్ చేశారు. ఇందులో శ్రీలత అనే మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఆమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి సెలవు పెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలతను సస్పెండ్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశముంది. ‘తన కుమారుడితో కలిసి ఆమె రేవ్ పార్టీకి వెళ్లారు. పోలీసులు సోదాలు జరిపినప్పుడు ఆమె తన అధికారాలను దుర్వినియోగం చేశారు. నగర క్రైం విభాగంలో పనిచేస్తున్నానని కూడా స్వయంగా చెప్పార’ని మీడియాకు కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. కాగా, కరోనా భయంతో రాష్ట్రం అల్లాడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా జల్సాలు చేయడం పట్ల జనం మండిపడుతున్నారు. ఈనెల 10న ఆలూరు తాలూకా పరిధిలోని రిసార్ట్లో ఈ రేవ్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికిలో బెంగళూరు, మంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మద్యం, నిషేధిత మత్తు పదారార్థాలతో పాటు 50 టూవీలర్లు, 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వాహనాలపై అత్యవసర సర్వీసుల సిక్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా యువకులను రేవ్ పార్టీకి ఆహ్వానించారని, లోకేషన్ను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారని వెల్లడించారు. రిస్టార్ యజమాని గగన్ను అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించామని, ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక్కడ చదవండి: కరోనా ఉగ్రరూపం; లాక్డౌన్ ఉండదన్నా సొంతూళ్లకు.. విజృంభిస్తున్న కరోనా: కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు -
చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ
-
అమ్మాయిలను రప్పించి.. చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ
సాక్షి, చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో మజ్లిస్ పార్టీ నాయకులు రేవ్ పార్టీ నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బార్కాస్కు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడు పర్వేజ్కు గౌస్నగర్ ఉందాహిల్స్లో ఇంపీరియల్ ఫాం హౌజ్ ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పర్వేజ్ తన స్నేహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీ నిర్వహించాడు. వీరు విచ్చలవిడిగా నృత్యాలు చేస్తున్న వీడియో రెండు నెలల అనంతరం తాజాగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ కావడంతో ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్, అదనపు ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మలు ఫాంహౌజ్ను పరిశీలించారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకొని పర్వేజ్తో పాటు వీడియోలో ముఖాలు గుర్తు పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి -
నారాయణపూర్ రేవ్ పార్టీ: వెలుగులోకి కొత్త విషయాలు
-
రేవ్ పార్టీ: వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, నల్గొండ: సంస్థాన్ నారాయణ్పూర్ ఫాంహౌజ్లో రేవ్ పార్టీ వ్యవహారం నేపథ్యంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ పబ్బుల నుంచి శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ గెస్ట్హౌజ్లు, రిసార్ట్లకు మకాం మార్చిన డ్రగ్స్ స్మగ్లర్లు సరికొత్త దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కోసం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తూ, విద్యార్థులను డ్రగ్స్ గ్యాంగ్స్ ఆకర్షిస్తున్నాయి. అంతేగాక ఇన్స్టాగ్రామ్లో ఏకంగా రేవ్ పార్టీ వివరాలు షేర్ చేస్తూ బరితెగిస్తున్నాయి. ఈ క్రమంలో పబ్స్ నుంచి ఆర్డర్ చేయించుకుని పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సంస్థాన్ నారాయణ్పూర్ రేవ్ పార్టీ వివరాలను కూడా గిరీష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా డ్రగ్స్ వాడినట్లు సమాచారం. గంజాయితో పాటు ఇతర డ్రగ్స్, మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రియల్టర్ ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి సంస్థాన్ నారాయణ్పూర్లో శుక్రవారం రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని సుమారు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున బైకులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. -
పోలీసుల ఎంట్రీ: ఫామ్హౌజ్లో భారీ రేవ్ పార్టీ భగ్నం
సంస్థాన్ నారాయణపురం/ చౌటుప్పల్: ఓ వ్యవసాయ క్షేత్రంలో యువత రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గాంధీనగర్ తండా పరిధిలో ఉన్న జక్కిడి ధన్వంత్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీపై ఎస్ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. 97 మందిని (88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నారు. భారీగా మద్యం, డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్, ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి శ్రీకర్రెడ్డి (ఫౌంహౌజ్ యజమాని ధన్వంత్రెడ్డి కుమారుడు), వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్ ఉమర్ ఫారూఖ్ కలసి రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీధర్రెడ్డి తండ్రి ధన్వంత్రెడ్డికి నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలో ఫామ్హౌజ్ ఉండటంతో అక్కడే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీజే సౌండ్ సిస్టమ్ నిర్వహణతో పాటు డ్రమ్ వాయిద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన సయ్యద్ అమ్రాన్ అలీరెజాను సంప్రదించారు. సూర్యాపేట జిల్లా బాలాజీనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బాలెంల ప్రవీణ్ నిషేధిత మత్తు పదార్థాలను సమకూర్చాడు. సోషల్మీడియా (ఇన్స్టాగ్రామ్) వేదికగా ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి రూ.499 తీసుకొని 90 మందిని ఎంట్రీ చేసుకున్నారు. ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ పేరుతోనూ యువతను ఆకర్షించారు. పక్కా సమాచారంతో.. ఈ రేవ్పార్టీ విషయం పోలీసులకు సమాచారం అం దింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశం మేరకు ఎస్ఓటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలు గురువారం రాత్రి దాడి చేశారు. పార్టీలో యువత మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి వినియోగించారు. 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్ పోలీసులకు చిక్కింది. 120 మద్యం ఫుల్ బాటిళ్లు, మూడు ల్యాప్టాప్లు, 2 కెమెరాలు, 76 సెల్ఫోన్లు, 15 కార్లు, 30 బైక్లు, జెనరేటర్, డీజేసౌండ్ సిస్టం, రూ.27,030 నగదు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. పట్టుబడిన యువతులు, యువకులపై కూడా కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఈ కేసును లోతుగా విచారణ చేపడుతున్నామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 3 నెలల కింద లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాగే పార్టీ జరిగిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్రెడ్డి, ఏసీపీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీసుల అదు పులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఒకరి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. -
యాదాద్రిలో రేవ్ పార్టీ
-
ప్రముఖ రియల్టర్ ఫాంహౌజ్లో రేవ్ పార్టీ!
సాక్షి, యాదాద్రి: సంస్థాన్ నారాయణపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రముఖ రియల్టర్ జక్కిడి ధన్వంతరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్హౌస్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టారు. ఇరవై కార్లు, 60 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. గిరీష్ అనే వ్యక్తి రేవ్ పార్టీకి కో- ఆర్డినేట్గా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఫామ్హౌజ్కు చేరుకున్నట్లు సమాచారం. చదవండి: 250 కిలోల బంగారం స్మగ్లింగ్: ప్రీత్ అగర్వాల్ అరెస్ట్ -
రేవ్ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..
మేడ్చల్ : కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్కు చెందిన డీలర్లు ఇందులో పాల్గొన్నారు. విందులు, అమ్మాయిలతో చిందులతో వారు రచ్చరచ్చ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరుగురు యువతుల్ని, 10 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. బెస్ట్ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రేవ్ పార్టీ భగ్నం : ఏడుగురు యువతులు అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పశ్చిమ్ విహార్ ప్రాంతంలోని ఓ క్లబ్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ పార్టీకి హాజరైన ఏడుగురు యువతులు సహా 31 మందిని అరెస్ట్ చేశారు. క్లబ్ యజమాని ఆయన సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు, హుక్కాలను సీజ్ చేశారు. ప్లాగ్ క్లబ్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని దాడులు చేపట్టారు. మంగళవారం రాత్రి ఈ పార్టీ జరగ్గా, పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురు యువతీ యువకులు పీకల్లోతు మద్యం సేవించి ఉన్నారని, కరోనా లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని స్ధానికులు తెలిపారు. క్లబ్ యజమాని లావిష్ ఖురానా, ఆయన సోదరుడు కాశిష్ ఖురానాలను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : బంజారాహిల్స్లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు -
విదేశీ యువతులతో మంత్రి బంధువు రేవ్ పార్టీ..
జూబ్లీహిల్స్: కరోనా సమయంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి యువతీ, యువకులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పార్టీని బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఓ హోటల్లో శనివారం రాత్రి ఎనిమిది మంది యువకులు, ఆరుగురు యువతులతో పాటు ఓ విదేశీ యువతితో కలిసి రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులు శనివారం ఉదయం నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం తర్వాత కొందరు యువతులతో పాటు ఓ విదేశీ యువతి అక్కడికి వచ్చారు. (బంజారాహిల్స్లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు) అర్ధరాత్రి దాటిన తర్వాత రేవ్ పార్టీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసిన వీరు మద్యం మత్తులో చిందులేస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీల నిర్వహణలో ఆరితేరిన సంతోష్రెడ్డి అనే ఓ పబ్ నిర్వాహకుడు పార్టీకి కూడా సూత్రధారి కావడం గమనార్హం. అతనే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని టాట్ పబ్లో సంతోష్రెడ్డి సుమారు 30 మంది యువతులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఆరు నెలలు గడవకముందే మరోసారి పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో సంతోష్రెడ్డితో పాటు భానుకిరణ్, విజయ రామారావు, నగరానికి చెందిన ఓ మంత్రి బంధువు రఘువీర్రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ శనివారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి దాడి చేశాం. రూమ్ నంబర్ 721లో ముగ్గురు యువకులు, నలుగురు యువతులు సోషల్ డిస్టెన్స్ లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ చేసుకోవడం గమనించి వారిని అదుపులోకి తీసుకున్నాం. సంతోష్రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనట్లు వారు తెలిపారు. వీరందరిపై లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల చట్టం ప్రకారం ఏపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేశాం. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం.– కళింగరావు, ఇన్స్పెక్టర్ -
బంజారాహిల్స్లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు
-
బంజారాహిల్స్లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు
హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. రేవ్ పార్టీపై పక్కా సమాచారం అందడతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వేళ హోటల్లో హంగామా సృష్టించిన మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఉక్రెయిన్కు చెందిన ఒక విదేశీ యువతి కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, వీరు హోటల్లో ఓ రూమ్ బుక్ చేసుకుని హంగామా చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో జూబ్లీహిల్స్లో రేవ్పార్టీ నిర్వహించిన వ్యక్తే.. దీని వెనక కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకోవడంతో.. అందుకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. -
రేవ్ పార్టీ : ‘వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం’
సాక్షి, హైదరాబాద్ : తమ జోన్ పరిధిలో హుక్కాపై ఉక్కుపాదం మోపామని వెస్ట్ జోన్ డీసీపీ ఏర్ శ్రీనివాస్ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 2019లో హుక్కా పూర్తిగా అరికట్టామని చెప్పారు. ఇటీవల తాము తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఈ నెల 12 తేదీన ది సీక్రెట్ ఎఫైర్ పబ్లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు వెళ్లి దాడులు చేశారు. కొందరు పరారయ్యారు. 21 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారించి బాదితులుగా పేర్కొని కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాం. సిగ్నోవా కంపెనీకి చెందిన వారే రేవ్ పార్టీ నిర్వయించడానికి ప్లాన్ చేశారు. వ్యాపారాలు పెంచుకోవడం, సిగ్నోవా కస్టమర్లను ఆనందపరచడం కోసమే ఈ రేవ్ పార్టీ జరిగింది. (చదవండి : జూబ్లీహిల్స్ రేవ్పార్టీలో కొత్త ట్విస్ట్) ఈ రేవ్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ మొని, బుర్రి ప్రసాద్ గౌడ్ను అరెస్ట్ చేశాం. ఎఫైర్ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. బేగంపేట్లోని లిస్బన్ పబ్పై కూడా చర్యలు తీసుకుంటాం. ఎఫైర్ పబ్పై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు లేక రాశాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. పబ్లో ఏం జరిగినా యజమానులే బాధ్యత వహించాలి, పబ్లలో బౌనర్లు వ్యవహరించే తీరుపై కూడా నిఘా ఉంది. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు. (చదవండి : పబ్లో అశ్లీల నృత్యాలు) -
జూబ్లీహిల్స్ రేవ్పార్టీలో కొత్త ట్విస్ట్
-
జూబ్లీహిల్స్ రేవ్పార్టీలో కొత్త ట్విస్ట్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పబ్ను బుక్ చేసుకుంది ఓ ఫార్మా కంపెనీగా పోలీసులు గుర్తించారు. సేల్స్ను పెంచుకునేందుకే ఆ పార్మా కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. జూబ్లీహిల్స్లోని సీక్రెట్ ఎఫైర్ పబ్లో కొంతమంది యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు టాప్ పబ్పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లు, సేల్స్ ఉద్యోగుల కోసం ప్రతి ఏటా ఇలాంటి రేవ్ పార్టీని ఈవెంట్ ఆర్గనైజన్ ప్రసాద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడ్డ యువతులంతా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్ డాన్సుల కోసం హైదరాబాద్కు వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. -
పగలు రాత్రి రేవ్ పార్టీలు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : నందికొండ చుట్టుపక్కల పరిసరాల్లోన్న హుక్కాబార్లు, రిసార్ట్లు, ఫాంహౌస్లలో జరుగుతున్న రేవ్ పార్టీలు, మత్తు పార్టీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పగలు రాత్రి ప్రశాంతత కరువయిందని తాలూకా పంచాయతీ సభ్యుడు, జిల్లా జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్ సునీల్ ఆరోపించారు. శుక్రవారం దొడ్డ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశీయులు సైతం ఈ పార్టీలలో హాజరవుతున్నారన్నారు. రేవ్ పార్టీల పేరుతో మత్తు పదార్థాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారన్నారు. చీకటి పడిందంటే పెద్దపెద్ద శబ్దాలతో డీజే సౌండ్తో పార్టీలు ప్రారంభమవుతాయన్నారు. దేశ, విదేశాల యువతులు గుంపులుగా వస్తున్నారని, దీంతో లోపల ఏం జరుగుతోందో ఊహించవచ్చన్నారు. నందికొండ చుట్టుపక్కల, ఘాటిసుబ్రమణ్య పుణ్యక్షేత్రం పరిసరాల్లోనూ రిసార్ట్లలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పోలీసులు అన్నీ తెలిసీ మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మత్తు పదార్థాల వ్యర్థాలు, మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున చెరువుల్లో ప్రత్యక్షమవుతున్నాయని, దీంతో చెరువులు కూడా కలుషితమవుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలీసులు ఇప్పటికయినా మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. -
మామిడి తోటలో రేవ్ పార్టీ
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై దాడి చేసిన రామనగర పోలీసులు 10 మందిని అరెస్టు చేసిన సంఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. రామనగర తాలూకా విభూధికెరె గ్రామం శివారులో ఉన్న మామిడి తోటలో చట్ట వ్యతిరేకంగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన 32 ఎకరాల మామిడి తోటలో డీజే మ్యూజిక్తో శామియానాలు వేసి మరీ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి బెంగళూరు, తమిళనాడు, కేరళ నుండి 500 మందికి పైగా యువతీయువకులు తరలివచ్చారు. వీరంతా ఒక యాప్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకున్నారని తెలిసింది. అయితే రేవ్ పార్టీకి సంబంధించి నిర్వాహకులు ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్పీ అనూప్శెట్టి సిబ్బందితో కలిసి శనివారం అర్ధరాత్రి దాడి చేశారు.దాడిలో డీజే మ్యూసిక్ స్పీకర్లు,పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, మత్తు పదార్థాలు, కెమెరాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులయిన మధుమిత, పౌరాణిక్, పురోహిత్, నబిరా, రిచులతో కలిపి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. -
‘విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారు’
సాక్షి, అమరావతి : విశాఖలో జరిగిన రేవ్పార్టీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. దీని వెనుక మంత్రి ఘంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోమ్ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బీచ్లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ లైసెన్స్లు తీసుకున్నారని విమర్శించారు. విశాఖకు చెందిన మంత్రి పేషీ నుంచి 8సార్లు ఫోన్ చేశారని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ మంత్రే కాబట్టి సీఎం మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ నార్త్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం అనవసరంగా మోదీపై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎంకు అసహనం ఎక్కవైపోతోందన్నారు. -
మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ
-
రేవ్ పార్టీలో రాజకీయుల్లేరట!
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): రేవ్ పార్టీ నిర్వహణ వెనుక రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా ఉన్నారా..? అని మీడియా ప్రశ్నించగానే... ఎవరూ లేరు అని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తేల్చిచెప్పేశారు. ఒకవైపు రేవ్ పార్టీ వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెబుతూనే... ఇలా అసలు పెద్దలకు సంబంధం లేదని చెప్పడంపై అందరూ విస్మయానికి గురయ్యారు. వాస్తవానికి ఆ పార్టీ వెనుక టీడీపీ నాయకులు, వారి కుమారులు ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు విరుద్ధంగా డీజీపీ మాట్లాడుతుండడం గమనార్హం. నగర పర్యటనలో భాగంగా గురువారం మీడియా సమావేశంలో ఠాకూర్ మాట్లాడారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవ్ పార్టీలో ఇప్పటి వరకు ఆరుగురుని అరెస్ట్ చేశామని, ఆ ఘటన వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ ప్రశాంతమైన నగరమని, డ్రగ్స్తో కలుషితం చేస్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. రేవ్ పార్టీతో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్టార్ హోటల్స్, పబ్లలో డ్రగ్స్ విక్రయిస్తే స్టార్హోటల్ లైసెన్స్ రద్దు చేసి, విక్రయించే వారిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. రేవ్ పార్టీ, డ్రగ్స్పై అధికారులతో రివ్యూ చేసినట్లు తెలిపారు. నగరంలోని డ్రగ్స్ వ్యవహరంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై ప్రతి పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీట్ తెరుస్తామని చెప్పారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ నగరంలోకి వస్తున్నట్లు సమాచారం ఉందని, అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. నగరంలోని విద్యా సంస్థలలో అవగహన సదస్సులు పెడతామని తెలిపారు. విద్యా సంస్థలో డ్రగ్స్ వాడితే సమాచారం ఇవ్వాలని, దీని కోసం ఒక అధికారి నియమిస్తుండడంతోపాటు ఓ ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తామని తెలిపారు. రేవ్ పార్టీ రోజు మద్యం విక్రయాలకు అనుమతిచ్చిన ఎక్సైజ్ అధికారిపై ఇప్పటికే ఆ డిపార్టుమెంట్ చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో సీపీ మహేష్చంద్ర లడ్డా, డీసీపీలు రవీంద్రబాబు, నయిమ్ హస్మీ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే చర్యలు జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆర్పీ.ఠాకూర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు జరిగితే నేరుగా ఫోన్ చేయాలని సూచించారు. -
ఆ ఘటన విచారకరం: డీజీపీ ఆర్పీ ఠాకూర్
విశాఖపట్నం: రుషికొండ రేవ్ పార్టీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం స్పందించారు. ప్రశాంత విశాఖ నగరంలో రేవ్ పార్టీ, డ్రగ్స్ రావటం విచారకరమన్నారు. రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 50 మందిని గుర్తించి, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై రౌడీషీట్ తరహాలో హిస్టరీ షీట్ తెరుస్తామని వెల్లడించారు. డ్రగ్స్ మాఫియా అనుసరిస్తున్న పద్ధతిని బ్రేక్ చేసే యోచనలో పోలీస్ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ఏ సంస్థలో జరిగినా, స్టార్ హోటల్ అయినా కూడా వారిపై కేసులు నమోదు చేయడానికి వెనకాడమన్నారు. డ్రగ్స్ కంట్రోల్పై గెజిటెడ్ స్థాయి అధికారి బృందం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా డ్రగ్స్పై తగిన సమాచారాన్ని వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే డ్రగ్స్ కంట్రోల్పై ప్రత్యేకించి టెలీఫోన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో శక్తి బృందాలను డీజీపీ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం శక్తి బృందాలు పని చేస్తాయని తెలిపారు. ఇప్పటికే విజయవాడలో శక్తి బృందాలు ప్రారంభించామని, త్వరలోనే తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో శక్తి బృందాలు ఏర్పాటుల చేస్తామని చెప్పారు. చదవండి: ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు! -
రేవ్ పార్టీ కేసులో కదలిక.. అధికారిపై బదిలీ వేటు
సాక్షి, విశాఖపట్నం : సంచలనం సృష్టించిన విశాఖ రేవ్ పార్టీ కేసులో కదలిక మొదలైంది. పార్టీలో మద్యానికి అనుమతి ఇస్తూ లేఖ ఇచ్చిన ఎక్సైజ్ సూపరిండెంట్ సుబ్బారావుపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈవెంట్ల పేరిట అనుమతులు తీసుకుని, ప్రభుత్వ పెద్దల అండదండలతో కొందరు రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ కుమారుడు నరేంద్రకుమార్ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్ శాఖ అనుమతించకూడదు. లిక్కర్ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. -
వీడ్లు.. డోప్లు..!
మీకు తెలుసా? ‘వీడ్’ అంటే గంజాయి సిగరెట్.. డోప్ అంటే చాక్లెట్ అని..! మీకే కాదు.. నగరంలో చాలామందికి తెలియదు. కానీ మాదకద్రవ్యాలకు బానిసలై మత్తులో మునిగితేలే వారు మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఈ కోడ్ భాషలతోనే కథ నడిపిస్తారు. వీటి కోసం కాఫీడే సెంటర్లు, బార్లు, పార్కులు వంటి వాటిని అడ్డాలుగా చేసుకుంటున్నారు. సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు బానిసలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెగబడుతున్నారు. ఇందులో అత్యధికులు విద్యావంతులే కాక బడాబాబుల పిల్లలు ఉంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసీ విశాఖలో రేవ్ పార్టీలకు కూడా వీరే కారణమవుతున్నారు. ఇటీవల రుషికొండ బీచ్లో నిర్వహించిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి అదుపు తప్పిన యువత తీరు చూసి ప్రశాంత విశాఖ నివ్వెరపోయింది. సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్ సిటీ విశాఖ మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ఊహించని రీతిలో నగర శివార్లలోనే కాదు.. నడిబొడ్డున కూడా మత్తులో ముంచెత్తడానికి ఎన్నో అడ్డాలు అందుబాటులోకి వచ్చాయి. వీడ్లు (గంజాయి సిగరెట్లు, డోప్లు (మిల్క్ బార్లు మాదిరి) డ్రగ్స్ చాక్లెట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. విశాఖలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతోందని ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. కొంతమంది ధనికులు, స్థితిమంతుల పిల్లలు వీటికి అలవాటు పడ్డాక మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారి ద్వారా తమ వద్దకే (కాలేజీలు, పార్కులు, హోటళ్ల వద్దకు) రప్పించుకుంటున్నారు. తొలుత మత్తునిచ్చే గంజాయి సేవనం మరిగాక కొన్నాళ్లకు నిషేధిత మాదకద్రవ్యాల వైపు మళ్లుతున్నారు. చాలా కాస్టిలీ గురూ.. ఎవరికీ అనుమానం రాకుండా సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో వీటిని తయారు చేస్తున్నారు. మామూలు సిగరెట్లలో పొగాకును తొలగించి పొడిలా చేసిన గంజాయిని కూరుతారు. వీటినే కాఫీడేలు, బార్లు, పార్కులు, హోటళ్లు వద్ద ఎక్కువగా విక్రయిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్, పాడేరు, అరకులోయ కేంద్రంగా గంజాయి చాక్లెట్లు తయారవుతున్నాయి. గంజాయి నూనె, పొడి మిశ్రమంతో సిసలైన చాక్లెట్ల మాదిరిగా వీటిని తయారు చేస్తుంటారు. వీటిని కూడా కాఫీడేలు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఖరీదైన హోటళ్ల వద్ద రహస్యంగా విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్ ధర రూ.100 నుంచి 250 వరకు, చాక్లెట్ సైజును బట్టి రూ.500 నుంచి 1000 వరకు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మాదకద్రవ్యాలకు మారుపేర్లుకోడ్లు, డీకోడ్లతో విక్రయాలు.. గంటల తరబడి మత్తు.. గంజాయి సిగరెట్ తాగితే దాదాపు గంటకు పైగా మత్తుగా ఉంటుంది. గంజాయి చాక్లెట్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందంటారు. ఒక చాక్లెట్ను తింటే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ముంచెత్తుతుంది. అందుకే వీటికి అలవాటైన స్థితిమంతుల పిల్లలు ఎంత ఖరీదైనా వెనకడగు వేయరు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసలయ్యాక వాటి నుంచి బయట పడలేకపోతున్నారు. మానసిక ఒత్తిడి అధికమై అఘాయిత్యాలకు పాల్పడు తున్నారు. చేతిలో డబ్బుల్లేకపోతే చోరీల బాట పడుతున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాల్లో పట్టుబడుతున్న వారిలో పలువురు యువకులతో పాటు ఇంజినీరింగ్ చదివిన, చదువుతున్న వారే ఉండడం విస్తుగొలుపుతోంది. ఆన్లైన్.. వెబ్సైట్.. ఇటీవల రుషికొండలో నిర్వహించిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలను సేవించినట్టు తేలింది. అంతేకాదు వారి వద్ద ఎండీఎం, ఎల్ఎస్డీ వంటి నిషేధిత మాదకద్రవ్యాలు లభించాయి. వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు. ఏకంగా దీనికోసం ఒక వెబ్సైట్నే నడుపుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ స్థావరాలు? నగరంలో కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, కాఫీడే సెంటర్లు, సిరిపురం జంక్షన్, హెచ్Œ ఎస్బీసీ–వుడా పార్క్ మధ్య ప్రాంతం, ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ పరిసరాలు, పాతపోస్టాఫీసు, రైల్వేస్టేషన్, ఎంవీపీ కాలనీ, సాగరతీరంలోని గోకుల్పార్క్, లాసన్స్బే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ (సమీపంలోని సరుగుడు తోటలు) తదితర ప్రాంతాలు మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్లుగా ఉన్నాయి. అవగాహన కల్పిస్తాం.. డ్రగ్స్ వినియోగంతో వాటిల్లే దుష్ప్రభావాలపై యువత, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వీటి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ సరఫరాదార్లపై షీట్లు ఓపెన్ చేస్తాం. –మహేంద్ర మత్తే, ఏసీపీ, టాస్క్ఫోర్స్. నిఘా పెడుతున్నాం.. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై నిఘా పెడుతున్నాం. ఇంజినీరింగ్ కాలేజీలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిసరాలు, వన్టౌన్, పోర్టు ఏరియా, ఎయిర్పోర్టు, రుషికొండ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. పాడేరు, అరకు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్ తయారవుతున్నట్టు సమాచారం ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి మందుల షాపుల్లో మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తాం. కాలేజీల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు డ్రగ్స్పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం.–శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్శాఖ. -
విశాఖలో విషసంస్కృతికి టీడీపీ బీజం
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈవెంట్ల పేరుతో టీడీపీ నేతలు విష సంస్కృతికి బీజం వేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ అండదండలతోనే బీచ్రోడ్డులో ‘రేవ్ పార్టీ’నిర్వహించారని మండిపడ్డారు. యువతను తప్పుదారి పట్టించి వారికి డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ పట్టు బడినప్పుడే వైఎస్సార్సీపీ నేతలంతా వాటిపై విచారణ జరపాలని ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఎళ్లుగా సంపాదించిన విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పోగొట్టుడానికే అధికార పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖ నగరాన్ని డ్రగ్స్ మాఫియాతో అతలాకుతలం చేస్తున్నారన్నారు. బీచ్ రోడ్డులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా జరిగినట్టు వెలుగులోకి వచ్చి మూడు రోజులైనా ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించిన పాపానపోలేదని విచారం వ్యక్తంచేశారు. ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా తక్షణమే వారి అరెస్ట్ చేయాలన్నారు. ఎన్నికల్లో గెలవలేక డేటాచోరీతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. విష సంస్కృతికి తెరలేపిన, డ్రగ్స్ మాఫియాను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేదంటే మే 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, దీని వెనుక ఉన్నవారందరినీ జైల్లో ఊసలు లెక్కపెట్టిస్తామన్నారు. చంద్రబాబుకు చుక్కెదురు ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని రెండో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం చేయడానకి వెళ్లిన చంద్రబాబు వ్యాఖ్యలను వివిధ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. చంద్రబాబు ఆకృత్యాలకు మరో 33 రోజుల్లో తెరపడనుందని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, రవిరెడ్డి, కన్నబాబు, పార్టీ సీనియర్ నాయకులు పీలా ఉమారాణి, సతీష్వర్మ, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మీ, బోని శివరామకృష్ణ, కలిదిండి బద్రీనాథ్, యువశ్రీ, సత్యాల సాగరిక,బి. కాంతారావు, బాకీ శ్యాంకుమార్రెడ్డి, పి.రామారావు పాల్గొన్నారు. -
రేవ్ పార్టీకి పెద్దల అండ
ఆరిలోవ(విశాఖ తూర్పు): నగరంలో సంచలనం సృష్టిస్తున్న రేవ్ పార్టీ సంస్కృతికి ఎప్పటి నుంచో బీజం పడిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడానికి ముందుగానే ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించారనే వాదన వినిపిస్తోంది. రేవ్ పార్టీ నిర్వహించిన స్థలానికి రూ.2 కోట్లుతో రోడ్డు నిర్మించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రుషికొండ దరి గీతం వర్సిటీ ముందు గాయత్రి కాలేజీ ఎదురుగా బీచ్లో సీఆర్జెడ్లో నాలుగు ఎకరాల స్థలాన్ని ఏపీ టూరిజం శాఖ అధికారులు మంత్రి గంటా శ్రీనవాసరావు సన్నిహితుడి కుమారుడు డి.నరేంద్రకుమార్కు 15 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చేశారు. సీఆర్జెడ్ పరిధిలో ఉన్న స్థలాలు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైనా మంత్రి ఒత్తిడితో అధికారుల తలొగ్గారు. అంతటితో ఆగకుండా ఆ స్థలానికి రోడ్డు నిర్మించేశారు. ఇప్పుడు అక్కడ యువతను మత్తులో ముంచేస్తున్న రేవ్ పార్టీలు జరిగిపోతున్నాయి. ఈ నెల 13న రాత్రి జరిగిన రేవ్పార్టీ నగరంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులకు సవాల్ విసురుతోంది. అవసరం లేకపోయినా రోడ్డు నిర్మాణం సాధారణంగా గాయత్రి కాలేజీ ఎదురుగా బీచ్లోకి రోడ్డు అవసరం లేదు. రుషికొండ బీచ్లోకి సందర్శకులు వెళ్లడానికి గీతం గేటు దాటిన తర్వాత ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. ఇరుకుగా ఉన్న ఈ రోడ్డును రెండేళ్ల క్రితం విస్తరించి సందర్శకులు బీచ్లోకి వాహనాలతో చేరడానికి అనుకూలంగా నిర్మించారు. ఈ రోడ్డు ఉంటుండగా రేవ్ పార్టీ కోసం లీజుకు తీసుకొన్న నిర్వాహకుడి స్థలానికి ప్రత్యేకంగా ఏపీ టూరిజం శాఖ రోడ్డు నిర్మించేసింది. దీనికి కోసం రూ.2 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఫిబ్రవరి 4న ఈ రోడ్డు నిర్మాణం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కొండను తవ్వేసి ఈ స్థలం వరకు రోడ్డు నిర్మించారు. వాస్తవానికి లీజుకు తీసుకొన్న స్థలానికి ఎటువైపు నుంచి చూసినా రహదారి లేకపోవడం విశేషం. ఓ పక్క ‘బే పార్కుకు చెందిన స్థలం’ అడ్డంగా ఉండగా మరో పక్క రుషికొండ బీచ్, అక్కడి పురాతన శివాలయం అడ్డంగా ఉన్నాయి. దీంతో ఈ స్థలానికి రహదారి నిర్మించాలనే ఆలోచనతో గాయత్రి కాలేజీ ఎదురుగా కొండ అంచును తవ్వేసి అవసరం లేకపోయినా రోడ్డు నిర్మించేసి అప్పగించేశారు. శివాలయం స్థలంలో రోడ్డు బీచ్ రోడ్డులో గాయత్రి కాలేజీ ఎదురు కొండ అంచు నుంచి రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు లీజుకు తీసుకొన్న స్థలం వరకు నిర్మించి ఆపేస్తే ప్రజలకు అనుమానం వస్తుందనే ఆలోచనలతో అధికారులు ఆ రోడ్డును మరింత ముందుకు పొడిగించి అటువైపు రుషికొండ బీచ్ వరకు ఉన్న రోడ్డుకు కలిపారు. ఈ మధ్యలో పురాతనమైన సప్తరుషులు నిర్మించారని చెప్పుకొనే శివాలయానికి చెందిన స్థలం మధ్యగా దీన్ని నిర్మించేశారు. ఈ స్థలం మధ్య నుంచి రోడ్డు నిర్మించ వద్దంటూ శివాలయం నిర్వాహకులు అడ్డుకొన్నా అధికారులు పట్టించుకోలేదు. రేవ్ పార్టీ నిర్వాహకుడు స్థలం వరకు తారు రోడ్డు నిర్మించి అక్కడి నుంచి మట్టిపోసి వదిలేయడం మరో విశేషం. ప్రజలను నమ్మించడానికని శివాలయం స్థలం మధ్య నుంచి ఆగమేఘాలపై రోడ్డు పనులు చేపట్టి మట్టిపోసి వదిలేశారు. ఇలాంటి ఇన్ని చర్యలు కారణంగా రేవ్పార్టీ నిర్వాహకులకు పెద్దల అండ పుష్కలంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం సాగిన వ్యవహారమేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దిబ్బలను కప్పేస్తూ... బీచ్లో సీఆర్జెడ్ పరిధిలో ఉన్న స్థలాన్ని ఏపీ టూరిజం లీజుకు ఇచ్చేసింది. ఇక్కడ అంతా ఇసుకు దిబ్బలే ఉన్నాయి. షెడ్లు వేయడానికి ఇసుకపై వీలు పడకపోవడంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయం ఆలోచించారు. నేరుగా ఇక్కడి ఇసుక దిబ్బలను మట్టితో కప్పేస్తున్నారు. బీచ్లో ఇసుక కనిపించకుండా మట్టిపోసి షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఐదు షెడ్లు నిర్మించేశారు. ఈ షెడ్లలోనే ఈ నెల 13న అర్ధరాత్రి సమయంలో పెద్ద స్పీకర్లు పెట్టి రేవ్ పార్టీ నిర్వహించారు. -
రేవ్ పార్టీలో మజా చేసిన మంత్రుల కొడుకులు
విశాఖ నగరంలో రంకెలేసిన రేవ్ పార్టీ సూత్రధారులను వదిలేసిన పోలీసులు.. ప్రస్తుతానికి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులను మాత్రమే అరెస్టు చేసే పనిలో ఉన్నారు.విశాఖ నగర ప్రతిష్టను మంటగలిపే విధంగా జరిగిన డ్రగ్స్ పార్టీకి.. మందు పార్టీ పేరిట అనుమతులు తీసుకున్న టీడీపీ నేత బొడ్డేటి కాశీవిశ్వనాథ్ కొడుకు నరేంద్రకుమార్ జోలికి పోని ఖాకీలు.. డ్రగ్స్ పంపిణీ చేసిన బ్యాచ్ను మాత్రం జల్లెడపడుతున్నారు. సదరు రేవ్ పార్టీకి ఇద్దరు మంత్రుల కుమారులు, ఓ మాజీ మంత్రి కుమారుడు, నగరానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కొడుకు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. అసలు వీరి కోసమే అట్టహాసంగా ఆ పార్టీ పెట్టారనేది అందరికీ తెలిసిన వాస్తవం.కానీ ఈ కోణం వైపు కన్నెత్తి చూడని పోలీసులు డ్రగ్స్ మాఫియా పని పడతామంటూ బీరాలు పోతున్నారు.మరోవైపు వెనుకా ముందూ ఆలోచించకుండా రేవ్ పార్టీకి అడ్డగోలు అనుమతిలిచ్చేసిన ఎక్సైజ్ అధికారులు ఒక్కొక్కరుగా బలవుతున్నారు. సెలవు రోజైన ఈనెల 13న అర్ధంతరంగా మందు పార్టీకి అనుమతిలిచ్చిన గాజువాక ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.సుబ్బారావు బుధవారం నుంచి దీర్ఘకాల సెలవులోకి వెళ్లిపోగా ఆ బాధ్యతను మరో అధికారి దాస్కు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇంకా ఎవరిపై వేటు పడనుందనే భయం ఆ వర్గాలను వెంటాడుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నాయకుడు బొడ్డేటి కాశీవిశ్వనాథ్ కొడుకు బొడ్డేటి నరేంద్రకుమార్ ఈనెల 13న శనివారం పెందుర్తి ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు వెళ్లి అదే రోజు రాత్రి రిషికొండలోని విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ పేరుతో తాను నిర్వహిస్తున్న క్లబ్లో మందు పార్టీకి అనుమతి కావాలని అడిగారట. వెంటనే పెందుర్తి ఎక్సైజ్ పోలీసులు గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.సుబ్బారావుకు సిఫార్సు చేయగా.. ఆయన క్షణాల్లో అనుమతులిచ్చేశారట. ఇక్కడే ఎక్సైజ్ అధికారుల తప్పిదం, నిర్లక్ష్యం, ఒత్తిళ్లకు తలొగ్గిన బలహీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ రోజు రెండో శనివారం. సెలవురోజు. ఎంత ఆన్లైన్లో చలానా కట్టేసి దరఖాస్తు చేసుకున్నా.. అసలు అది పుట్టినరోజు పార్టీనా.. ఉత్సవమా... పండుగా..లేక మరేదైనా సందర్భంగా చేసుకుంటున్న పార్టీనా అనేది ఆరా తీసిన తర్వాతే అనుమతులివ్వాలి. పార్టీ కూడా నిబంధనల మేరకు రాత్రి 11గంటల్లోగా పూర్తి చేయాలని నిర్దేశించాలి. కానీ సదరు ఎక్సైజ్ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ నేత కుమారుడు కాబట్టి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి పారేశారు. ఇంకేముంది.. ఆ రోజు రాత్రి తెల్లవార్తూ రేవ్ పార్టీ జడలు విప్పింది. మందు పార్టీ పేరిట తీసుకున్న అనుమతులను కాలరాసి కొకైన్, ఎండీఎం ఫౌడర్, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా వినియోగించారు. ఈ బాగోతం మీడియా ద్వారా బయటపడటంతో పోలీసులు తమదైన శైలిలో హడావుడి మొదలుపెట్టారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారి పని పట్టారు. కానీ అసలు సూత్రధారుల జోలికి మాత్రం వెళ్ళలేదు. వెళ్ళే సాహసం కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నిర్వాహకుడు నరేంద్ర జోలికి పోని ఖాకీలు బొడ్డేడ కాశీవిశ్వనాథ్ పేరు చెబితేనే ఓ మంత్రి గుర్తుకు వస్తారు. అలాంటి విశ్వనాథ్ కొడుకు నరేంద్రకుమార్ స్వయంగా పార్టీకి అనుమతులు తీసుకొని నిర్వహించిన పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ముందుగా అతన్నే ప్రశ్నించాల్సి ఉంది. కానీ నగర పోలీసులు మాత్రం ఇప్పటివరకు అతనిపై కేసు కాదు కదా.. కనీసం విచారించనూ లేదు. ఇందుకు పోలీసులు చెబుతున్న వాదన ఏమిటంటే.. పార్టీకి అతను అనుమతులు తీసుకున్న మాట నిజమే కానీ.. మాదకద్రవ్యాలతో అతనికి ఏమాత్రం సంబంధం లేదట! ఇక్కడే పోలీసుల విచారణ ఎంత సవ్యంగా సాగుతుందో స్పష్టమవుతుంది. పార్టీ నిర్వహించిన నరేంద్రకు తెలియకుండానే మాదకద్రవ్యాలు ఆ పార్టీకి ఎలా వస్తాయి.. అక్కడికి వచ్చిన వారు ఎలా వినియోగిస్తారన్న ప్రశ్నలకు పోలీసుల వద్ద సరైన సమాధానమే లేదు. ఈ వ్యవహారంలో ముందుగా అతనే బాధ్యుడు.. అనే కనీస స్పృహ కూడా పోలీసులు పక్కనపెట్టి విచారణ చేస్తున్నారంటే కేసులో ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. ఇకపోతే ఆ పార్టీకి ఇద్దరు మంత్రుల కుమారులు, ఓ మాజీ మంత్రి కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు హాజరైన విషయమై సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఏమీ తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆధారాలు దొరికితే నరేంద్రనూ వదలం: సీపీ లడ్హా కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్నాం. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. టీడీపీ నేత కాశీవిశ్వనాథ్ కుమారుడు నరేంద్ర పాత్రపై కూడా విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్టు చేశాం. మరికొందరు మా అదుపులో ఉన్నారు. నరేంద్రకు తెలిసే డ్రగ్స్ సరఫరా జరిగిందని తెలిస్తే అతనిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఇందులో అనుమానం లేదు. పోలీసు అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో విష సంస్కృతికి బీజం వేసిన రేవ్ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రిషికొండలో జరిగిన పార్టీలో పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్టు చేయాలన్నారు. ముందుగా నిర్వాహకుల లైసెన్స్లు రద్దు చేయాలని కోరారు. పోలీసులు ఒత్తిళ్ళకు తలొగ్గకుండా నిష్పపక్షపాతంగా విచారణ చేపట్టాలని, దోషులు ఎంతటి వారైనా వదలొద్దని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మావద్దకు వచ్చి అడిగారు పెందుర్తి ఎక్సైజ్ ఎస్ఐ లక్ష్మణ్నాయుడుఈ నెల 13న బి.నరేంద్రకుమార్ అనే వ్యక్తి పెందుర్తి పోలీస్స్టేషన్కు వచ్చి ఈవెంట్ నిర్వహించుకుంటామని అంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. గెస్ట్లకు లిక్కర్ సరఫరా చేస్తామని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా చలానా కట్టారు. ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం చలానా చెల్లిస్తే సెలవు రోజుల్లో కూడా పార్టీలకు అనుమతి ఇవ్వవచ్చు. ఆ ప్రకారమే శనివారం అయినా కూడా మా శాఖ ద్వారా అనుమతి ఇచ్చామని పెందుర్తి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్నాయుడు చెప్పుకొచ్చారు. పోలీసుల అదుపులో సోను? ఆ పార్టీకి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన మల్లిపెద్ది సాయిరాఘవ చౌదరి అలియాస్ సోను ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సోను ద్వారానే నగరంలోని చాలామందికి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మేరకు అతన్ని రహస్య వ్రదేశంలో విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. సుబ్బారావు సెలవులో ఉన్నారు నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాస్ కారణాలు నాకు తెలియదు.. గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావు సెలవుపై వెళ్ళారు.. అతని సెల్ ఫోన్ కూడా నావద్దనే ఉంది.. అని విశాఖ నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాస్ సాక్షి ప్రతినిధికి చెప్పుకొచ్చారు. లీవులో వెళ్లిన ఎక్సైజ్ ఈఎస్ కాగా, రేవ్ పార్టీకి వెనుకా ముందు ఆలోచించకుండా అడ్డగోలుగా అనుమతిలిచ్చేసిన ఎక్సైజ్ పోలీసులు బలవుతున్నారు. గాజువాక ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావును బుధవారం అమరావతి పిలిపించుకున్న ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు పెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన తన సెల్ఫోన్ కూడా మరో అధికారికి అప్పగించేసి లీవు పెట్టేశారు. -
రుషికొండ రేవ్ పార్టీ : నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : రుషికొండ రేవ్ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణతో పాటు మరో నలుగురి అరెస్ట్ చేశామని ఏసీపీ వైవీ నాయుడు పేర్కొన్నారు. బర్త్డే పార్టీ పేరుతో రుషికొండ సాగరతీరం సర్వే నంబర్ 61లో విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ సంస్థ రేవ్ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడి చేసి కొంత మందిని పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీపీ వైవీ నాయుడు మాట్లాడుతూ.. నిందితులను నుంచి 9.7 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేనుకున్నామని తెలిపారు. చదవండి : ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు! రేవ్ పార్టీలో కొకైన్ వినియోగించినట్లు గుర్తించామన్నారు. పార్టీ నిర్వాహకులు ఈ కొకైన్ను గోవా నుంచి దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ రేవ్ పార్టీలో రాజకీయ నాయకుల పిల్లలు లేరని స్పష్టం చేశారు. రుషి కొండ పరిసర ప్రాంతాల్లోని డాబాలు, విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేవ్ పార్టీపై సీరియస్గా ఉన్నామని, మరింత లోతుగా విచారణ జరిపుతామని మీడియాకు వివరించారు. -
విశాఖ బీచ్లో రేవ్ పార్టీ కలకలం