5 రోజుల పాటు 27 మంది ఎంపీల సస్పెన్షన్ | 27 congress mps suspended for 5 days from loksabha, house adjourned for the day | Sakshi
Sakshi News home page

Aug 3 2015 4:29 PM | Updated on Mar 21 2024 9:02 PM

మంత్రులు రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్ష సభ్యులు, కాదు వాళ్లు తప్పుకోవాల్సిన అవసరం లేదని అధికార పక్షం పట్టుబట్టడం, విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్ లోకి దూసుకురావడంతో.. 27 మంది కాంగ్రెస్ సభ్యులను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో తీవ్ర గందరగోళం చెలరేగుతుండగానే సభను రేపటికి వాయిదా వేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత కూడా సభ నడిచే తీరులో ఎలాంటి మార్పు కనపడలేదు. ఈ సమయంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లేచి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement