కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందో తెలియదు గానీ, ఎవరికి వారే, తామంటే తాము రాజ్యసభ బరిలో ఉన్నామంటూ ముందుకొస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం ఉందని, అయినా కూడా ముగ్గురిని మాత్రమే బరిలో నిలబెట్టారని ఆయన అన్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి ఉందని, దీన్ని నివారించేందుకు తాను కూడా బరిలోకి దిగానని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
Published Tue, Jan 28 2014 3:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement