భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. ఆ తర్వాత హతమైన ఘటనను మరిచిపోకముందే.. పంజాబ్లో పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు ఒక జైలుపై విరుచుకుపడ్డారు. పంజాబ్లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్స్టర్లే కావడం గమనార్హం. గుర్ప్రీత్ సింగ్, విక్కీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్జీత్ సింగ్ అలియాస్ విక్కీ జైలు నుంచి పరారయ్యారు.
Published Sun, Nov 27 2016 11:05 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement