'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!' | battula-brahmananda-reddy-slams-on-chandrababu-naidu's govt | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 4 2015 7:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి10 నెలలు అయిందని, ఇప్పటివరకు ఆయన ఏ వాగ్దానాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉండి కూడా ఏ రోజూ కేంద్రంతో పోరాడలేదన్నారు. కేంద్రాన్ని నిలదీయలేనివారు ఆ ప్రభుత్వంతో ఎందుకు కొనసాగుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏనాడైనా వారిని హెచ్చరించారా అని మండిపడ్డారు. ఏపీ కి అన్యాయం జరుగుతుంటే అధికారాన్ని అనుభవించాలన్న స్వార్థంతోనే టీడీపీ అధినాయకులు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement