telugu people
-
బుద్ధ పూర్ణిమ సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్ జగన్ అభిలషించారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.#SriRamaNavami— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2025 -
భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్గేట్స్తో మాట్లాడి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్కు వెళ్లారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనదావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు. అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు. చంద్రబాబు, రేవంత్ భేటీజ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. -
ఆ్రస్టేలియాలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబురాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎల్లలు దాటి వచ్చినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాసులు కాపాడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, తెలుగు పారిశ్రామికవేత్తలు తమ తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారమందించాలని కోరారు. -
దుబాయ్లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు
చెన్నైలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా కస్తూరి చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పింది.కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ.. నటి కస్తూరి తెలుగువారిపై ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి
తమిళనాడులో తెలుగు ప్రజలనుద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు కూడా నమోదైయింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కస్తూరి మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకకరించారని చెబుతోంది.తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవం అని.. వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.‘తమిళనాడులో ఇప్పుడు డ్రవిడియన్ ఐడియాలజీ జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తాగుడు అలవాటే లేకున్నా.. తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు జరిపిస్తున్నారు. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. తెలుగు అనే పదం వాడింది నిజమే. కానీ నేను ఏ ఉద్దేశ్యం గురించి ఆ పదం వాడానో నా స్పీచ్ మొత్తం వింటే తెలుస్తుంది. తెలిసో తెలియకో ఓ మాట అన్నాను.దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కస్తూరి అన్నారు. -
తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్
-
గతమెంతో ఘనం.. వర్తమాన ‘రాజకీయం’ శూన్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారిని రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తమను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్పా నాయకులుగా ఎదగనివ్వడం లేదని తెలుగువారు ఆవేదన చెందుతున్నారు.సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రధాన పార్టీలలో ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. అయితే ముంబైతోపాటు థాణే, భివండీ, నవీముంబైలలో సుమారు 15 లక్షలకుపైగా తెలుగు ప్రజలున్నప్పటికీ ఏ పార్టీ కూడా తెలుగు అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కన్పించడంలేదు. దీంతో ఈ సారి కూడా అసెంబ్లీలో తెలుగువారి ప్రాతినిధ్యానికి మొండి చెయ్యి ఎదురైనట్లైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో అత్యధికంగా ముంబైలో 36 తర్వాత ఉమ్మడి థాణే జిల్లాలో 24 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నప్పటికీ ఒక్క రాజకీయపార్టీ కూడా తెలుగువారికి అభ్యర్థిత్వమివ్వలేదు. ఇకపై ప్రకటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.ప్రయత్నలోపమే అసలు కారణం అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ముంబై, థాణే, భివండీ, నవీముంబైలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రముఖులమని, నాయకులమని చెప్పుకునేవారెవరూ తమ తమ పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించడం లేదు. తమకు అనుకూలమైన నాయకులతో చేతులు కలిపి ఎదిగేందుకు ప్రయత్నించడం లేదా ఇతర పార్టీలతో లాభమనుకుంటే వాటిలో చేరడం తప్ప టికెట్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయడం లేదని స్థానిక తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తెలుగువారిని కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని ఇక్కడున్న తెలుగువారి ఓట్ల కోసం కూడా కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నవీముంబై జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముంబై, భివండీ, నవీముంబై, థాణే మొదలగు ప్రాంతాల్లో కొందరు కొందరు ప్రముఖ తెలుగు నాయకులున్నప్పటికీ టికెట్లు లభించే అవకాశాలు కన్పించడంలేదు. ఇలా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసించే ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో తెలుగువారెవరూ రాజకీయ చర్చల్లో చోటుకల్పించుకోలేక పోతున్నారు. అయితే కార్పొరేటర్లుగా మాత్రం ముంబై, థాణేల్లో ఒక్కొక్కరు, భివండీలో ఇద్దరు మాత్రం కార్పొరేటర్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడి, సంస్కృతీ, సంప్రదాయాల్లో మమేకమైన తెలుగువారికి ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. కలిసికట్టుగా సాగితే ఫలితం... తెలుగు వారంతా కలిసికట్టుగా ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్నైనా దక్కించుకుని వారిని గెలిపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై, థాణే, నవీ ముంబైల్లో అనేక మంది విద్యావేత్తలతోపాటు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నవారున్నారు. అనేక మందిలో సేవాభావం, సమాజసేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలనే తపన కూడా ఉంది. కానీ ఐకమత్యం లేకపోవడం, అందరినీ ఏకంచేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలం కావడంలేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలో కులమతాలు, ప్రాంతాల తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఫలితం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు కార్పొరేటరున్నప్పటికీ రాబోయే రోజులలో తెలుగు వారు ఏకమైతే ప్రధాన పార్టీలు అనేక ప్రాంతాల్లో తెలుగు వారికి కార్పొరేటర్ పదవులిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లభించలేదని నిరుత్సాహ పడకుండా ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలకు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు నాయకులందరూ సిద్ధమవ్వాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై థాణే జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకునేందుకు, తెలుగు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిఉంది.ఘనచరిత్రే..ముంబైలో తెలుగు వారిది ఘనమైన చరిత్ర. ముంబై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది క్రియాశీలపాత్ర. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి సుమారు 1950 వరకు తెలుగు వారంతా రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ తరువాత మాత్రం రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటాప్హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అదేవిదంగా థాణే, నవీముంబై, భివండీ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్గా ఎన్నికైన సయాజీ శీలం తెలుగువారే. ఆయనతోపాటు అనేక మంది తెలుగువారు మేయర్, కార్పొరేటర్ సహా అనేక పదవులను చేపట్టారు. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
అందరికీ మంచి జరగాలి..
-
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్లో బి.టెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్లో నేర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు. నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం. -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు. అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువఇచ్చే పెద్ద పండుగని ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పల్లెలన్నీ మళ్లీ కళకళ.. ఇక మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, ప్రభుత్వ బడి, ప్రభుత్వాసుపత్రిలో నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, బ్రాడ్బాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా ప్రజలకు రూ.2.46 లక్షల కోట్ల డీబీటీ.. ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి.. ఇలా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. అలాగే.. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వమిదని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంటు బడి, గవర్నమెంటు ఆసుపత్రిలో నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన రూ. 2.46 లక్షల కోట్ల డీబీటీ... ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి...ఇవన్నీ పల్లెలు మళ్ళీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ... నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా... రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్కు 'అరుదైన గౌరవం') -
కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు
కెనడా హాలిఫాక్స్లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి. తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ , దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది. కెనడా హెలి ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు. (చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్) -
యూఎస్లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
సూడాన్లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే.. వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు చేరుకునే వరుకు కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు. చదవండి: సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్రెడ్డి -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
తెలుగు ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
మన్కీబాత్లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్కీబాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని ఈ సందర్భంగా వినిపించారు. మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్కుమార్ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్ నాయక్ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు. -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023 -
బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. 12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు. ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్ టోల్ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ (చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2023 -
తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ’ అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మకర సంక్రాంతి మరింత ప్రగతితో కూడిన మార్పు తీసుకురావాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం అభిలషించారు. దీపావళి అంటే దీపాల వరస... దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక... మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు! — YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2022 -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హుతాత్మ చౌక్ ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు.. సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్గా నామకరణం చేశారు. అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు. పెరిగిన జిల్లాలు.. మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి... సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
Ugadi 2022: శుభకృత్లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీశుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 -
తెలుగు ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలందరికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పెద్ద పండుగకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానముందని పేర్కొన్నారు. సమృద్ధిగా ఇంటికి చేరిన ధాన్యం సిరులు, పంటల నడుమ వ్యవసాయదారులు, ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వంతో కూడిన ఉదాత్తమైన ఆలోచనలకు సంక్రాంతి పండుగ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. -
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్
తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ పిల్లల చదువు కోసం ప్రతి ఏడాది ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ చదువును కొనసాగించాలనే అభిరుచి ఉన్న తెలుగు విద్యార్థుల కోసం అండగా నిలబడుతుంది. గత ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో రూ. 2 కోట్ల డబ్బును పంచినట్లు తెలుగు పీపుల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఏడాది తెలుగు పీపుల్ ఫౌండేషన్ 13వ వార్షికోత్సవాన్ని డిసెంబర్ 11న జరపనున్నట్లు తెలిపింది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రచార కర్తగా ఆర్.పీ పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తెలుగు పీపుల్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల చదువు కోసం వియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. -
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాంకాంక్షలు. #HappyDussehra — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 -
డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు
చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు తెలుగు ప్రముఖులు బరిలో దిగుతున్నారు. గుమ్మిడిపూండీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్ తెలుగువారే. గుమ్మిడిపూండి సమీపంలోని దిగువముదలంబేడు గ్రామానికి చెందిన టీజేఎస్ విద్యాసంస్థల అధినేత టీజే గోవిందరాజన్. ప్రస్తుతం ఇతను డీఎంకే జిల్లా ఇన్చార్జ్గా కూడా పనిచేస్తున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ కూడా తెలుగు మూలాలు వున్న వ్యక్తి కావడం గమనించదగ్గ విషయం. ఇతని భార్య ఇందిరా రాజేంద్రన్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా వున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. -
‘యూజీపీఏటీ’ సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమం
బహుళజాతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉత్తర అమెరికా యూజీపీఏటీ సంస్థ నడుం బిగించింది. ఉత్తర అమెరికాలోని “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే. నారాయణస్వామి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్ రావు, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అశీర్వచనాలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి, తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలలో విస్తరింపజేయడానికి పూనుకున్న యూజీపీఏటీ నిర్వాహకుల ఆలోచనను సమిష్టిగా అభినందించారు. బలహీన వర్గాల కలల సహకారానికి దోహదపడే ఉద్దేశంతో ఈ సంస్థ ఆలోచనలను, ఆశయాలను రూపొందించడం గర్వకారణమని, భవిష్యత్తులో సామాజిక బలహీన వర్గానికి చెందిన ప్రతి పేదవారి ఆశను సంపూర్ణం చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడం ప్రపంచ తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. ప్రభుత్వాల ఆశయాలకు ఈ సంస్థ తమ తోడ్పాటును అందించి పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మార్గాదర్శకాలను, సూచనలను రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించాలానే సంకల్పం, తెలుగు జాతి భవిష్యత్తుకు ఒక పెద్ద పీట వేయడం అన్నారు. అణగారిన జాతి అభ్యున్నతి కోసం పాటుబడిన అంబేద్కర్, పెరియార్, ఫూలే వంటి ఎందరో మహానుభావులను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. విద్య, ఉద్యోగం, వ్యవస్థాపక అభివృద్ధి తమ ప్రామాణికాలు, కుల మతాలకు అతీతంగా, రాబోయే తరాలకు వారధిగా, చుక్కానిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఖండాంతరాలు దాటి విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయ తెలుగు వారు సమిష్టిగా కలసి భారదేశంలోని తమ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, తమ మేధస్సును వినియోగించ ఉద్దేశించిన కార్య-రూప ఆవిర్భావమే ఈ “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” యూజీపీఏటీ సంస్థ అని నిర్వాహకులు కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె, మెర్సీ ఏంజిలీన్ , కల్పనా దొప్పలపూడిలు అన్నారు. ప్రజా ప్రయోజన, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి ప్రజల అభినందలను అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజున ఈ సంస్థను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ అన్నివేళల బలహీన వర్గాల తెలుగు జాతి కోసం పాటుపడుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉత్తర అమెరిక తెలుగు ప్రజల వారధి రత్నాకర్ పండుగాయల కృషి మరువలేనిదని, వారి సహాయ సహకారాలతో ప్రభుత్వ పతినిధులను ఈ సంస్థ కార్యక్రమానికి ఆహ్వానించి జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరాలను సభ్యులందరితో చర్చించి సంస్థ వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికి సంస్థ కన్వీనర్ కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వాలకు, బడుగు జాతి వర్గానికి వారధిగా నిలుస్తూ, సంక్షేమ పధకాల రూపకల్పనలో జాతి అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ తమవంతు సహాయసహకారాలు అందించడం మంచి పరిణామం అని కొనియాడారు. ఇందుకు మత విభేదాలకు తావు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాల ఆశలను, ఆశయాలను సంపూర్ణం చేయడానికి తమవంతు కృషిని అందిస్తామని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తమ సంస్థ ఆవిర్భావ కార్యక్రమాన్ని, కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ వీడియో ప్రసారం ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులు సంస్థ వెబ్ సైట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ వీక్షించి, సంస్థ అభివృద్ధికి తమ సలహాలు సూచనలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సంస్థ గవర్నింగ్ కమిటీ సభ్యులు చార్లెస్ తోడేటి, బాబా సొంట్యాన, యువజన కన్వీనర్ తేజ యాదవ్, రీజినల్ కోఆర్డినేటర్స్ గాబ్రియేల్ కందుకూరి, ప్రవీణ్ మన్నం, సలీమ్ షేక్, కామేశ్వర రావు, వెంకట్ మట్ట, నరేంద్ర కడియం, సాంకేతిక నిపుణులు, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూఎస్లో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక విమానం
నెవార్క్ : కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. కాగా ఈ విమానం జూన్ 9(వచ్చే మంగళవారం)నెవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా యూఎస్- ఇండియా సాలిడారిటీ మిషన్ కింద ప్రైవేట్ ఛార్టర్ విమానానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. కాగా విమానంలోని ప్రయాణీకులు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హైదరాబాద్ చేరుకోగానే క్వారంటైన్ లో ఉంటామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్ రావాలనుకున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. రిజిస్ట్రేషన్ కోసం కింద లింక్ను క్లిక్ చేయండి. http://www.usism.org/register-private-charter-flight.html -
‘తెలుగువారు వచ్చేందుకు రంగం సిద్ధం’
సాక్షి, విజయవాడ: విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు మార్గం సుగమమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న సుమారు 30 వేల మందిని రాష్ట్రానికి తీసుకురావటానికి రంగం సిద్ధం చేశామని అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. రేపు మొదటి విమానం విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రానుందని ఆయన తెలిపారు. అందులో మొదటిగా 19మంది రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రానున్న రెండు వారాలలో జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వారికి రెండు ఆప్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. (సీఎం వైఎస్ జగన్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు) గవర్నమెంట్ క్వారంటైన్, పెయిడ్ క్వారంటైన్లను సిద్ధం చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ హోటల్స్లో వెయ్యి గదులను సిద్ధం చేశామని ఆయన అన్నారు. 14 రోజులు క్వారంటన్లో ఉండటం తప్పనిసరి ప్రోటోకాల్ అని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. వచ్చేవారిని ఎయిర్పోర్టు దగ్గర పర్యవేక్షించటం కోసం ఒక బృందాన్ని, ప్రత్యేక మైన స్క్రినింగ్, ఏ జిల్లా వారైతే ఆ జిల్లాకు పంపేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్కు కూడా ఒక అధికారుల బృందాన్ని పంపామని, అక్కడి ఎయిర్పోర్టు నుంచి వచ్చేవారిని సైతం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. (‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’) జిల్లాలో 32 క్వారంటైన్ సెంటర్లలో ఐదు వేల బెడ్లు ఉన్నాయని క్వారంటైన్ సెంటర్లలో నాణ్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఒక్క వ్యక్తికి రోజుకు రూ. ఐదు వందల నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నామని ఆయన తెలిపారు. క్వారంటైన్ సెంటర్లో ఆహారం తీసుకున్న వారి స్పందన బాగుందని ఆయన తెలిపారు అదే మెనూను హోటల్స్కు కూడా ఇవ్వనున్నాము కలెక్టర్ చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు జిల్లాలో ఎవరులేరని, యూఎస్, యూరప్ నుంచి ఎక్కువ మంది జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. (ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్) -
తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్
సాక్షి, విజయవడ: విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనుందన్నారు. ముంబాయి నుంచి హైరారబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్పోర్టుకే వస్తారని ఆయన చెప్పారు. 14 రోజులపాటు క్వారెంటైన్కు తరలిస్తామన్నారు. ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నారు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం, పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు. పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ని వినియోగిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు) -
ఐటీబీపీ క్యాంప్లో తెలుగువారికి ముగిసిన క్వారంటైన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీ నుంచి దేశ రాజధానికి వచ్చిన 36 మంది తెలుగు వారికి ఐటీబీపీ క్యాంప్లో బుధవారం క్వారంటైన్ ముగిసింది. ప్రస్తుతం వారిని తమ స్వస్థలాలకు పంపేందుకు ఏపీ భవన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనుమతి కోసం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భవన సక్సేనా ఎదురు చూస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. కేంద్రం అనుమతి వచ్చే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే apbhavancovid19@gmail.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. (పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్తో మహేష్ సినిమా? ) -
ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి సాయం అందించండి
సాక్షి, తాడేపల్లి : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి, తీర్థయాత్రల కోసం వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు ప్రజలకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తెలుగువారికి సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ► వారణాసిలోని 16 ఆశ్రమాల్లో ఏపీకి చెందిన 400 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో.. కోవిడ్-19 స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి సాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో యూపీ ఎక్సైజ్ కమిషనర్ గురుప్రసాద్ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు చేపట్టి.. ఏపీ యాత్రికులకు రేషన్, నిత్యావసర సరుకులు అందజేశారు. ► గోరఖ్పూర్లో గుంటూరు జిల్లాకు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు.. యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. ► రాజస్థాన్లోని ఆజ్మీర్లో చిక్కుకున్న 21 మంది కర్నూలు వాసులకు.. సీఎస్, నోడల్ ఆఫీసర్ జోక్యంతో రేషన్ సరకులు పంపిణీ జరిగింది. ► తమిళనాడు తీర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 500 మంది మత్య్సకారులు చిక్కుకుపోవడంతో.. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. ► గోవాలోని మద్గావ్ సమీపంలో చిక్కుకున్న 25 మంది వైఎస్సార్ జిల్లా యాత్రికులకు స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం సాయంతో ఆహారం అందజేశారు. ► గుజరాత్ వెరవాల్కు ఉపాధి నిమిత్తం వెళ్లిన 1200 మంది శ్రీకాకుళం వాసులకు తక్షణ సాయం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ గుజరాత్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం వారికి రోజు విడిచి రోజు 2 కిలోల బియ్యం, కిలో పప్పు అందజేస్తుంది. వారి సహాయక కార్యక్రమాలను స్పెషల్ సెక్రటరీ సతీష్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. ► తమిళనాడులోని కోయంబత్తూరులో ఉపాధి నిమిత్తం వెళ్లి లాక్డౌన్ అక్కడే చిక్కుకుపోయిన 300 మంది ఏపీ కార్మికులకు బియ్యం, గోధుమలు అందిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► ముంబైలో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 500 మంది కార్మికులకు.. ముంబై అదనపు మున్సిపల్ కమిషనర్ సహాయంతో 15 రోజులకు సరిపడ రేషన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
కరోనాపై విజయంతో నవయుగానికి నాంది
సాక్షి, అమరావతి: శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కరోనామీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు -
న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసించే న్యూజెర్సీ, దాని పక్కనే ఉన్న న్యూయార్క్ నగరం కుప్పలు తెప్పలుగా నమోదవుతున్న కోవిడ్ కేసులతో తల్లడిల్లుతోంది. న్యూజెర్సీతోపాటు కాలిఫోర్నియాలోనూ రికార్డు సంఖ్యలో కేసులు నమోదు కావడం భారతీయ కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి ఒక్క న్యూయార్క్ నగరంలో 29,875 కేసులు నమోదుకాగా దాన్ని ఆనుకొని ఉన్న న్యూజెర్సీలో 2,844 మంది కోవిడ్ బారినపడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు కనిపించిన మొదట్లో అత్యధిక కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఇప్పుడు మూడు, నాలుగు స్థానాలకు పడిపోగా మార్చి మొదటి వారంలో మొదటి 10 స్థానాల్లోనూ లేని న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు మొదటి రెండు స్థానాలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్లో ఈ వ్యాధి బారినపడ్డ వారిలో 157 మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 2,844 మందికి పాజిటివ్ రాగా చికిత్స పొందుతూ వారిలో 27 మంది మరణించారు. రెండేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లతో పోలిస్తే మన వాళ్లు 3.8 శాతం ఉండగా శాన్ఫ్రాన్సికో, అలమేద (కాలిఫోర్నియా) కౌంటీల్లో భారతీయులు 3.4 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ కరోన వ్యాధి బారిన పడ్డ వారు ఎక్కువ సంఖ్యలో ఉంటడం సహజంగానే ఇక్కడి వారి కుటుంబాలు ఆందోళనగా ఉన్నాయి. మనవారిలో గుబులు... న్యూయార్క్, న్యూజెర్సీలలో పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎవ్వరూ గడప దాటి బయటకు రావడం లేదు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి 12,305 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీలో వందల సంఖ్యలో కోవిడ్ కేసులు పాజిటివ్ రావడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ‘మేము నివాసం ఉండే కమ్యునిటీలో 123 కేసులు నమోదయ్యాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. నెల రోజులకు సరిపడా ఉన్న సరుకులు రెండు మాసాల దాకా వచ్చేలా పరిమితంగా వాడుకుంటున్నాం. భారత్లో కరోనా కేసులు ఉన్నా ఇప్పుడు విమానాలు నడిస్తే ఇక్కడి నుంచి రావాలని ఉంది’అని పుంజాల సుస్మిత వాపోయింది. న్యూజెర్సీలో ఉండే మల్లు శ్రీదేవి (29) 8 నెలల గర్భిణి. ‘నేను, నా భర్త మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా తల్లిదండ్రులు ఏప్రిల్ 11న రావడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ వారు రాకపోవచ్చు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 20–22 నా ప్రసవ తేదీ. ఇప్పుడు నా పరిస్థితిని తలచుకుంటే కన్నీరు ఉబికి వస్తోంది’అంటూ పెట్టిన వాట్సాప్ సందేశం మిగిలిన వారిని కదిలించింది. అయితే ప్రసవ సమయంలో తాము అండగా ఉంటామని, కోవిడ్ను లెక్కచేయబోమని గ్రూపులో ఉన్న అనేక మంది తెలుగు మహిళలు మద్దతు ప్రకటించారు. -
తెలుగువారి తొలి నివాసం 'రాయలసీమ'
తెలుగు ప్రజల తొలి నివాసం రాయలసీమేనని చెప్పేందుకు వైఎస్సార్ జిల్లాలోని మోపూరు కొండపై గల భైరవేశ్వరుడి ఆలయం తిరుగులేని నిదర్శనమని తెనాలికి చెందిన పురావస్తు పరిశోధకుడు, ‘పురాతన’ సంస్థ వ్యవస్థాపకుడు కడియాల వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాయల సీమ ప్రాశస్త్యంపై ప్రముఖ చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్ హెచ్డీ సంకాలియా భావనను బలపరిచేలా అతి పురాతనం అనదగ్గ ఆధారాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. పర్వతాలు అధికంగా కలిగిన రాయలసీమలో కొండ గుహల్లో ఆది మానవుల జీవనం, సంస్కృతి కొనసాగిందని అభిప్రాయపడ్డారు. కాలక్రమంలో అక్కడ్నుంచి తూర్పుగా మైదాన ప్రాంతానికి విస్తరించారనీ, అందుచేత రాయలసీమే తెలుగు ప్రజల తొలి ఆవాసమని భైరవేశ్వరుడి ఆలయం, పరిసరాల్లో కొన్నేళ్లుగా తాను జరిపిన పరిశోధనల్లో స్పష్టమైందని ‘సాక్షి’కి వెల్లడించారు. –తెనాలి ఆ విశేషాలివి.. ‘వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలం, నల్లచెరువుపల్లె గ్రామానికి సమీపంలోని మోపూరు కొండపై 18 అడుగుల ఎత్తు, 14 అడుగుల చుట్టుకొలత కలిగిన విగ్రహం శివలింగంగా భక్తుల భావన. ఈ తరహా ఎత్తయిన నిలువురాళ్లను పూజించే ఆచారం అనేక దేశాల్లో ఉంది. వీటిని సూర్యభగవానుడికి సంకేతంగా/ ప్రతిరూపంగా ఆదిమ మానవుల కాలం (కొత్త రాతి యుగం), పాత రాతియుగం కాలం (క్రీ.పూ 3,000–2,000), ఇంకా పూర్వం నుంచీ పూజిస్తున్నారు. ‘వర్షిపింగ్ ఆఫ్ స్టాండింగ్ స్టోన్స్’, ‘డ్రూయిడికల్ రాక్స్’ పేర్లతో పిలుస్తుంటారు. డ్రూయిడ్స్ అంటే విగ్రహారాధకులు అనే అర్థముంది. ఆర్యులు భారత ఉపఖండంలోకి ప్రవేశించే నాటికి ముందుగానే (క్రీ.పూ 1,500–1,000) భారతదేశంలో నిలువురాతి శిలలను పూజించే ఆచారం ఉంది. ఈ మోపూరు కొండను ఆనుకొని ఉన్న మొగమేరు వాగు వేముల, లింగాల ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. ఈ పరీవాహక ప్రాంతమంతా నాటి కాలాలకు చెందిన రాతి ఆయుధాలు, ఆదిమ మానవుల సమాధులు, చారిత్రక యుగంనాటి పరికరాలు గుర్తించారు. ఫలితంగా ఇది ఆదిమవాసుల పవిత్ర ప్రార్ధనాస్థలంగా విలసిల్లింది. భైరవేశ్వరుడిగా పూజలందుకుంటున్న నిలువురాయి 18 అడుగులు ఉండటంతో, దీనిని రెండు అంతస్తుల్లో నిర్మించారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామ, కుమార ఆరామంలో రెండు అంతస్తులుగా నిర్మించిన శివాలయాలకు, ఈ మోపూరు భైరవేశ్వర ఆలయమే మాతృకగా భావిస్తున్నాం. 8–9 శతాబ్ది నుంచి 15వ శతాబ్దం వరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, వినుకొండ వల్లభరాయుడు, గండికోట రాజవంశీకుల విశిష్ట సేవల గురించి ఈ ఆలయం వద్ద దాన శాసనాలు లభించాయి. ఈ ఆలయం వెలుపల 50కి పైగా వీరశిలలు, 20 వరకు నాగ ప్రతిష్టల శిలలుండటం మరో ప్రత్యేకత. వీరశైవ మతంలో దేవుడికి ఆత్మార్పణం చేసుకొనే ఆచారముంది. వారి బలిదానానికి గుర్తుగా వీరశిలలను ప్రతిష్టిస్తుంటారు. శాసనాలూ చెక్కుతారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశంలోనే ఇది వీరశైవకులకు అతిముఖ్యమైన దేవాలయంగా చెప్పొచ్చు’ అని వెంకటేశ్వరరావు వివరించారు. -
చైనాలో తెలుగు వారు ఆందోళన చెందొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని తెలుగు వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఢిల్లీ తెలుగు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఏపీ ఎమ్మెల్సీ మాధవ్, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు, బీజేపీ నేత పి. రఘురాం, ఢిల్లీ తెలుగు సంఘాల నేతలు హాజరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషిచేయాలని కిషన్రెడ్డి వారిని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్కు సంబంధించి కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మనవారిని చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నామన్నారు. శనివారం 324 మంది, ఆదివారం మరికొంత మందిని తరలించామని, వారిని 15 రోజులు పరిశీలనలో పెట్టినట్లు తెలిపారు. బడ్జెట్పై స్పందిస్తూ..‘కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది.. అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదు..’అని పేర్కొన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం అండతో ఓ వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వారిపై జరిపిన దాడుల్లో బాధితుల ఆవేదనను బయట ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు సిద్దూపై పోలీసులు కేసులు పెట్టడం అక్రమమని తెలిపారు. సిద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన వైఖరిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిద్దూకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై తాను తెలంగాణ డీజీపీతో మాట్లాడతానని కిషన్రెడ్డి తెలిపారు. -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
సాక్షి, అమరావతి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో...మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఇక మీదట కూడా ఇదే విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని, భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు. -
మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు
చీరాల/ వాషింగ్టన్: అమెరికాలో శనివారం ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన నలుగురు తెలుగు వ్యక్తుల (ఒకే కుటుంబం) మరణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. శవపరీక్ష పూర్తి అయిన తర్వాత వారి మరణానికి గల పూర్తి వివరాలు తెలియవచ్చే అవకాశం ఉందని సోమవారం అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్డెస్ మోయిన్స్లో యాష్వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు.. ప్రకాశం, గుంటూరు జిల్లావాసులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి తన పెద్ద కుమార్తె లావణ్యను గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన సుంకర చంద్రశేఖరరెడ్డికి ఇచ్చి 2003లో చీరాలలో వివాహం చేశారు. చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మే 29న వారు ఓ ఇంటిని కొనుగోలు చేయగా చంద్రశేఖరరెడ్డి అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతిలు గృహప్రవేశం నిమిత్తం అమెరికా వెళ్లారు. శనివారం ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో కింద పోర్షన్లో ఉంటున్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి చూశారు. రక్తపుమడుగుల్లో పడి ఉన్న నలుగురిని చూసి బయటకు వచ్చి స్థానికుల సహాయం కోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రక్తపుమడుగులో నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన ఇద్దరు పిల్లలు ప్రభాస్, సుహాన్ చదువులోగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారని చంద్రశేఖర్రెడ్డి కుటుంబంతో అమెరికాలో పదేళ్లుగా పరిచయం ఉన్న శ్రీకర్ సోమయాజులు తెలిపారు. -
అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం
వెస్ట్డెస్ మోయిన్స్: అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్డెస్ మోయిన్స్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల శరీరంపై తుపాకీ బుల్లెట్ల గాయాలున్నాయి. ఈ విషయమై నగర పోలీస్ సార్జంట్ డాన్ వేడ్ మాట్లాడుతూ..‘యాష్వర్త్ రోడ్డు–అస్పెన్ డ్రైవ్ల మధ్య ఉన్న 65 స్ట్రీట్లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్కాల్ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు 15, పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అటుగా వెళుతున్నవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు’అని తెలిపారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని వెల్లడించారు. పోస్మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్డెస్ మోయిన్స్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కాగా, ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
మంచి మనసు చాటుకున్న ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు
అనంతపురం: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు తమ మంచి మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు బోర్లు వేసి వేరుశనగ సాగు చేసేవారు. అయితే పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో అతను అప్పుల పాలయ్యారు. అప్పుల బాధ భరించలేక, దిక్కుతోచక నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు లక్ష రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వీరపాండియన్ చేతుల మీదుగా నారాయణరెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఎన్ఆర్ఐ బృందం, వారి స్నేహితులు పాల్గొన్నారు. అలాగే ఈ వార్తను ప్రచురించిన సాక్షి శింగనమల రిపోర్టర్ మునియప్పను కొనియాడారు. -
కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్పార్ట్లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్గా నిర్థారణకు వచ్చారు. -
అన్ని వర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ‘ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రచారానికి విరామం ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో నేడు(ఏప్రిల్ 6న) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు. -
తెలుగు మళ్లీ వెలగాలి
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ హవా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది. తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు. సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది. తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు. పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు. ఆధునిక యుగంలో తెలుగు తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి. సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి. ప్రాచీన హోదాకు వైఎస్ కృషి, బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
విడుదలైన ఆ ఇద్దరూ తెలుగువారే!
ముంబై: ఇథియోపియాలో నిర్బంధానికి గురై విడుదలైన ఇద్దరూ తెలుగువారేనని సమాచారం. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనుబంధ ఐటీఎన్ఎల్ కంపెనీ ఇథియోపియాలో చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొన్న స్థానికులు వేతనాలు అందకపోవడంతో గత నెల 25వ తేదీ నుంచి ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం, విదేశాంగ శాఖ అధికారుల జోక్యంతో భాస్కర్రెడ్డి, హరీష్ బండి అనే ఇద్దరిని స్థానికులు రెండు రోజుల క్రితం విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి రాజధాని ఆడిస్అబాబాకు తరలించినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది. మిగతా వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న భారత ఉద్యోగులకు జూలై నుంచి, స్థానికులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. -
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
కొచ్చిలో తెలుగువారి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడున్న తెలుగు వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొచ్చిలోని ఏలూరు కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వెయ్యి, పదిహేను వందల మంది ఇక్కడున్న ఫ్యాక్ట్ కంపెనీలో, షిప్యార్డుల్లో పని చేస్తున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.తెలుగువారికి చెందిన 20,25 ఇళ్లలో పదహారు ఇళ్లు వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ఆఇళ్లలో సామాన్లు ఏవీ పనికిరాకుండా పోయాయి.కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో ఉన్న వీరు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే, ఇళ్లలో రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేకపోవడంతో రోజు గడపడమే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొచ్చి తెలుగు అసోసియేషన్ వీరిని ఆదుకోవడానికి విరాళాల సేకరణ వంటి చర్యలు చేపడుతోంది.ఇక్కడి తెలుగు వారిలో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. వర్షాల వల్ల ఒక్కో తెలుగు కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత హనుమంతు నాయక్ చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ ఇక్కడి ఫ్యాక్ట్ కంపెనీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫ్లోరిడాలో ప్రజల రక్షణపై అవగాహన కల్పించిన నాట్స్
టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలోని ఫ్లోరిడాలో తెలుగువారి రక్షణపై ప్రత్యేక దృష్టిసారించింది. స్థానికంగా జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండటం ఎలా అనే దానిపై అవగాహన కల్పిచేందుకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే క్రైమ్ ప్రివెన్షన్అండ్ యాక్టివ్ షూటర్ ప్రిపేరేడ్నెస్ వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఆకస్మాత్తుగా చేసే దాడుల పట్ల ఎలా వ్యవహారించాలి. ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై ఇందులో ప్రధానంగా అవగాహన కల్పించారు. చైల్డ్ అండ్ యూత్ సేఫ్టీ, కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్, ట్రాఫిక్ స్టాప్, కాప్స్ ఎట్ యువర్ ఫ్రంట్ డోర్, అనే అంశాలపై స్థానిక రక్షణ అధికారులు డిప్యూటీ జాన్ ఫుట్ మ్యాన్ అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాపుకు వచ్చిన వారి ప్రశ్నలకు కూడా పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చి.. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో ప్రజలు అడిగిన ప్రశ్నలకు పోలీసులు అందించిన కొన్ని సమాధానాలు.. ప్రశ్న: మనం ఉన్న లొకేషన్ వివరాలు పోలీసులకు ఎలా చేరుతాయి? జవాబు: 911కి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు చివరి సిగ్నల్ పాయింట్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్ను కనిపెడతాము. అలాగే, చివరి కాంటాక్ట్ వివరాలు కూడా పోలీసుల వద్ద రికార్డ్ అవుతాయి. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వ్యక్తిని పోలీసులు రక్షిస్తారు. ప్రశ్న: డ్రైవింగ్ లైసెన్స్ ఇంటి వద్దే మరిచిపోయి వస్తే పరిస్థితి ఏంటి? జవాబు: లైసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి సమయంలో పోలీసులు జరిమానా విధిస్తారు. ఆ సమయంలో మంచి యాటిట్యూడ్తో ఉంటూ.. దురుసుగా ప్రవర్తించకుండా పద్దతిగా మాట్లాడితే ఒక్కోసారి పోలీసులు జరిమానా విధించకుండా వదిలేస్తారు. ప్రశ్న: రోడ్డు మీద నియంత్రణ లేకుండా.. దురుసుగా వాహనం నడిపే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? జవాబు: రోడ్డు మీద దురుసుగా వెళ్లే వారిని పట్టించుకోకపోవడం మంచిది. వారి దారిలో వారు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ పిల్లి ఎలుకలాగా ఎదుటి వ్యక్తి దూకుడుగా వెళ్తున్నాడు కదా అని మీరు కూడా అలాగే వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్న: స్కూళ్లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిస్తే పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి? జవాబు: కాల్పులు జరిగాయన్న వార్త వినగానే తల్లిదండ్రులు స్కూల్ వైపు రాకూడదు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల రోడ్లన్నీ పోలీసుల కోసం మూసివేస్తారు. పరిస్థితి అదుపులోకి వచ్చి, పోలీసులు ఓ ప్రకటన చేసే వరకు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండడమే ఉత్తమం. ప్రశ్న: పోలీసులు దర్యాప్తు లేదా తనిఖీలకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? జవాబు: పోలీసుల ముందు హఠాత్తుగా కదలడం లాంటివి చేయకూడదు. చేతులు కదల్చకూడదు. చేతులను స్టీరింగ్ మీద గాని, పైకి లేపి ఉంచాలి తప్ప జేబులో పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఉన్న పొజిషన్ మారకూడదు. ఎదుటి వ్యక్తి దాడికి దిగుతాడా, మంచి వాడా అనేది ఆ సమయంలోని ప్రవర్తనను బట్టి పోలీసులు అంచనాకు వస్తారు. ప్రశ్న: ఆభరణాలను ఎలా భద్రపరుచుకోవాలి? జవాబు: విలువైన నగలను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం అత్యుత్తమం. ఆభరణాలను డిపాజిట్ చేసేందుకు వెళ్లే సమయంలో ఒక్కరే వెళ్లడం కంటే ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్లడం మంచిది. అది కూడా రాత్రి వేళల్లో కంటే పగటి పూట అయితేనే మంచిది. లేదంటే దొంగలు నగలను దోచుకునే ప్రమాదం ఉంది. ప్రశ్న: స్కూల్లో కాల్పులు జరుగుతాయన్న బెదిరింపులు వచ్చినప్పుడు పిల్లలను పంపించడం మంచిదేనా? జవాబు: అలాంటి సమయంలో పిల్లల్ని స్కూలుకు పంపించడం సబబే. కాల్పులు జరిపే వ్యక్తి ఎక్కడున్నారనే విషయాలు పిల్లలు చెబుతారు. ఒకవేళ బెదిరింపు కాదు నిజమైన సంఘటన జరిగితే.. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిల్లలు దోహదపడతారు. ప్రశ్న: హైవే మీద వెళ్తున్నప్పుడు పోలీసులు వెంబడిస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి? జవాబు: అలాంటి సమయంలో సాధారణ వేగంతోనే వాహనాన్ని నడపాలి. ఆ సమయంలో ఏం చేస్తున్నా సరే చాలా క్యాజువల్గా ఉండాలి తప్ప పోలీసులను చూసి కంగారు పడకూడదు. ఆ సమయంలో కూడా వాహనాన్ని నడుపుతున్నప్పుడు రూల్స్ పాటించాలి. అప్పుడే ఎటువంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు. ప్రశ్న: వాహనాన్ని నెమ్మదిగా నడిపినా సరే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందా? జవాబు: కొన్ని సందర్భాల్లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం వల్ల కూడా జరిమానా కట్టాల్సి రావొచ్చు. నిర్దేశించిన వేగానికంటే స్లోగా నడిపినప్పుడు ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం అవుతారు. అలాంటప్పుడు జరిమానా విధిస్తారు. ప్రశ్న: 911కి ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది? జవాబు: ఎవరి మీదైనా దాడి జరుగుతున్నప్పుడు ఆ ఘటన వివరాలను చెప్పాలి. దాడి చేసే వ్యక్తి తాలూకు సమాచారం ఇవ్వాలి. అతని కళ్లు, జుట్టు రంగు, ముఖము, పర్సనాలిటీ వివరాలు తెలియజేయాలి. కాల్ చేసిన వ్యక్తి సురక్షిత ప్రదేశంలో ఉన్నాడో లేదో కూడా చెప్పాలి. -
వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాద్రిలోను, ఏపీలో ఒంటిమిట్టతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. -
వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-
‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. -
తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను హుషారైన వారిగా పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కొత్త శిఖరాలకు చేరాలని కోరుకున్నారు. దేశ ప్రగతిలో తన పాత్రను ఏపీ కొనసాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మోదీ.. రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ రోజు రాత్రి ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. ఇప్పటికే జర్మనీ, స్పెయిన్లో పర్యటించారు. Statehood Day wishes to the people of Telangana. I pray for the progress & prosperity of the state in the times to come. — Narendra Modi (@narendramodi) 2 June 2017 My good wishes to the dynamic people of Andhra Pradesh. May AP touch new heights of development & continue to contribute to India's growth. — Narendra Modi (@narendramodi) 2 June 2017 -
ప్రజలందరికీ శుభాలు కలగాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని వారు ఆకాంక్షించారు. లోక కల్యాణమే పరమావధిగా సాగిన శ్రీరాముడి పాలనే ఆదర్శమన్నారు. -
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేవళంబి సంవత్సరం అందరి ఇంటా సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందిరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మీకు మీ కుటుంబానికి శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) 29 March 2017 -
అమ్మో అమెరికా !
-
వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో ఇంటింటా వేడుకలతో సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పేరు చెప్పగానే రైతులు, పల్లెలు గుర్తుకు వస్తాయని, రైతన్న, పల్లెసీమ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని తాను ఎల్లప్పుడు కోరుకుంటానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ కార్యాలయం గురువారం ప్రకటన చేసింది. -
కడసారి చూపు కోసం...
-
అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి
అమెరికాలోని లూయిస్ విల్లీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల(35), రాజశేఖర్ రెడ్డి యారామాల(25), వెంకట ప్రశాంత్ కొమ్ము(27), అన్వేష్ కుమార్(24)లు లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్నారు. కారును నడుపుతున్న రామ ముందు ఉన్న భారీ టర్నింగ్ ను గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయినట్లు ఏజెన్సీ పేర్కొంది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ, రాజశేఖర్ లు, వెనుకభాగంలో కూర్చున్న అన్వేష్ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయినట్లు తెలిపింది. కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్(యూసీఎమ్ సీ) కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. ఈ ఏడాది జనవరిలో ఎంఎస్ చేయడానికి రాజశేఖర్ అమెరికా వెళ్లాడు. రాజశేఖర్ రెడ్డి మృతితో బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం అలుముకుంది. అలాగే యూసీఎమ్ సీ, సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్, రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం
సాక్షి, న్యూఢిల్లీ: ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు సురక్షితంగా ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఓరోమో వర్గీయులు తమ నిరసనలో భాగంగా బాలెరోబోకి వెళ్లే రహదారులను మూసివేయడంతో తెలుగు వారు బాలెరోబోలోని వర్సిటీలో చిక్కుకున్నారు. తమకు మరిన్ని హక్కులు కావాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని ఒరిమోలు నిరసనలు చేపట్టారు. ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాడవలబు వర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారని, తెలుగువారు సురక్షితమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు -
తెలుగు వారి అడుగుజాడ గురజాడ
పుంగనూరు టౌన్ : తెలుగువారి అడుగుజాడ గురజాడ అని వక్తలు కొనియాడారు. గురజాడ అప్పారావు జయంతిని పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేసి, చరిత్ర సృష్టించిన గురజాడ జయంతి తెలుగుజాతికి పండుగగా అభివర్ణించారు. సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘిక నాటకాన్ని రచించిన గురజాడ తెలుగు వాడవటం జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని దేశభక్తిని జాతి జనులలో రగిల్చిన యుగకర్తగా అభివర్ణించారు. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, అస్పృశ్యతను ఇతివృత్తాలుగా చేసుకొని కవితలు రచించి సాంఘిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ గ్రంథాలయాధికారిణి నసీబ్జాన్, తెలుగు భాషాభిమానులు వెంకటపతి, సీతాపతిరాజు, గండికోటరవీంద్ర, రామలింగప్ప, గురుమూర్తి, ఇట్టాభానుప్రకాష్, గిరిధర్, ఇంతియాజ్, హరి పాల్గొన్నారు. -
'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోందని భూమన అన్నారు. ప్రధానమంత్రే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. భూమన బీజేపీ ఎట్టి పరిస్థితిలో పోరాడకూడదన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం అవసరమా అని ప్రశ్నించారు. సీఎంగా ఉండటానికి చంద్రబాబు అనర్హుడని భూమన ధ్వజమెత్తారు. ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను పక్కన పెట్టిన టీడీపీ జీవచ్చవంలా మారిందన్నారు. -
'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది'
-
‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’
-
‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’
ప్రకాశం: అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా తిరిగి వస్తారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన 150మంది తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా వారి యాత్రకు ఆర్మీ విఘాతం కలిగించింది. దీంతో అన్నపానీయాలు సైతం లేకుండా వారు అక్కడే యాత్రలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారితో తాను ఫోన్లో మాట్లాడినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని తాను సెంట్రల్ హోం సెక్రటరీ గోపాల్ రెడ్డికి చెప్పానని ఆయన వారిని సురక్షితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. -
తెలుగు వాళ్లకు తిరగడం ఇష్టం ఉండదట..!
హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు తమ ప్రాంతాన్ని దాటి పర్యాటకానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది. 2014-15 సంవత్సరానికిగాను చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. సొంత రాష్ట్రాలను దాటి ట్రిప్, హాలీడేయింగ్లాంటి వాటికి వెళ్లడానికి తెలుగు ప్రజలు శ్రద్ధ చూపడం లేదని పేర్కొంది. ఏడాదికాలంలో కేవలం 8.1 శాతం మంది ప్రజలు మాత్రమే ఓవర్ నైట్ ట్రిప్స్, ఆటవిడుపు, హాలీడేయింగ్, షాపింగ్, మెడికల్ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారని సర్వే ఫలితాల్లో తెలిసింది. వీటిలో కూడా సామాజిక, బిజినెస్, మెడికల్, మతాలకు సంబంధించినవే ఎక్కువని తేలింది. ఆట విడుపు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడాది కాలంలో అత్యధికంగా 1,30,600 ట్రిప్స్ జరిగితే, తెలంగాణ నుంచి 2,02,700 ట్రిప్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 30 రోజుల వ్యవధిలో మత సంబంధిత కార్యక్రమాల కోసం 1,44,200 ట్రిప్స్, సామాజిక అవసరాల పరంగా 14,08,400 ట్రిప్స్ జరిగాయి. తెలంగాణ నుంచి సామాజిక అవసరాలకు 6,54,000, మత సంబంధిత కార్యక్రమాలకు 53,100 ట్రిప్ లు జరిగినట్లు రికార్డుల లెక్కల్లో తేలింది. దక్షిణ భారతదేశంలో ఆటవిడుపు కోసం ట్రిప్స్ కు వెళ్లినవారి సంఖ్యలో అతి తక్కువ తెలుగువారిదేనని సర్వే తేల్చింది. తెలుగురాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల నుంచి ట్రిప్స్ కు వెళ్తున్న వారు అక్కడ అతి తక్కువ ఖర్చు చేసిన వారు కూడా మనవాళ్లే. ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున రూ.5,396లు ట్రిప్స్ కు వెళ్లిన వారు ఖర్చు చేశారని, అదే తెలంగాణ నుంచి అయితే రూ.9,777లు ఖర్చు చేశారని తెలిపింది. ఒంటరిగా ట్రిప్స్ వెళ్తున్న మహిళల్లో మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 53శాతం మంది మహిళలు, తెలంగాణ నుంచి 60 శాతం మంది మహిళలు ఒంటరిగా ట్రిప్స్ కు వెళ్లారని సంస్థ వివరించింది. 30రోజుల పరిధిలో అత్యధికంగా యాత్రికులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలుగు రాష్ట్రాలు 8,68,100 మందితో రెండో స్థానంలో నిలిచాయి. కాగా, హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 38 శాతం మంది ట్రిప్స్, హలీడేయింగ్ కు వెళ్లగా.. అత్యల్పంగా ఒడిశా నుంచి కేవలం 7.5 శాతం మంది మాత్రమే వెళ్లారు. -
నన్ను గెలిపిస్తే.. తెలుగోడి శక్తిని తెలియజేస్తా!
తమిళనాడు: తమిళనాడులో జయలలిత పోటీచేస్తున్న ఆర్కె నగర్, హోసూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన జయలలితకు ప్రత్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉండగా, హోసూరులో ఒక లక్ష ఎనభై వేలమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభ్యర్థించారు. తమిళనాడు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. తమిళనాడులో ద్విభాషా విద్యావిధానం అమలులో ఉందని, దీనికి బదులుగా త్రిభాష విద్యా విధానం అమలు చేయాలని, ఉగాది పండుగను ప్రభుత్వ పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కేతిరెడ్డి చెప్పారు. తమిళనాడులో అన్నీ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 35 మంది శాసన సభ్యులు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అయితే తెలుగు వారి సమస్యలపై వారు ఏనాడు స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకుంటే తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తానని.. తెలుగు వాడి శక్తిని పాలకులకు తెలియజేస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
తెలుగోళ్లు.. దమ్ము చూపించారు!
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 92 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. 2015 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, అందులో సుమారు 92 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామానికి చెందిన రైతు భోజన్న కుమారుడు వడ్నం నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 794వ ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నవాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి.. చేకూరి కీర్తి (14) హెచ్ఎస్ శ్రీకాంత్ (56) వల్లూరు క్రాంతి (65) సీహెచ్ రామకృష్ణ (84) వసన విద్యాసాగర్ నాయుడు (101) జొన్నలగడ్డ స్నేహజ (103) ఏ దీప్తి (113) వేమూరి విఎల్ అంబరీష్ (150) పోతరాజు సాయి చైతన్య (158) నివేదిత నాయుడు (159) పి.కృష్ణకాంత్ (169) ఏ పవన్ కుమార్ రెడ్డి (179) వై. రిషాంత్ రెడ్డి (180) ఆర్ విశ్వనాథ్ (181) వరుణ్ గుంటుపల్లి (183) ఆర్ మహేష్ కుమార్ (189) పసుమర్తి వీజీ సతీష్ (191) సలిజామల వెంకటేశ్వర్ (216) బట్ర ప్రీత్ పాల్ కౌర్ (225) కింతాడ ప్రవల్లిక (232) పి ఉదయ్ కుమార్ (234) శశాంక్ రెడ్డి (240) బండ్ల దినేష్ ఆదిత్య (270) గున్ను సుధీర్ (318) సుధాకర్ (324) వై విష్ణువర్ధన్ రెడ్డి (325) ఉప్పలూరి మీనా (326) కొడాలి గోకుల్ (345) సీహెచ్ శ్రీధర్ (348) జీ ఎల్ నరిసింహం (350) కంది ప్రవీణ్ (363) కీర్తిశ్రీ (380) శ్రుతి విజయకుమార్ (381) మల్లెల శ్రీకాంత్ (388) హరికృష్ణ (408) పి దిలీప్ కుమార్ (415) మద్దికుంట సిద్దార్థ (419) ఎం కృష్ణ కౌండిన్య (422) డి గౌరీ శంకర్ (457) డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461) నాగిరెడ్డిగారి మధులత (496) హెచ్ విష్ణు ప్రసాద్ (506) ముమ్మక సుదర్శన్ (526) అల ప్రియాంక (529) ఆర్ కృష్ణ ప్రసాద్ (531) కట్టా సింహాచలం (538) నార్నవారి మనీష్ శంకర్ రావు (552) దేవరాజు శివ ప్రకాష్ (572) వై విజయసింహారెడ్డి (588) ఆర్ఎస్ విద్యావతి (600) జి. ప్రదీప్ (609) ఎం కార్తీక (610) కె కృష్ణమూర్తి (615) పి శ్రుతి (617) ఆర్ ఆనంద్ (621) ఆర్ శివ ప్రసాద్ (622) ఎం గాయత్రి (642) శ్రీధర వెంకటేశ్వర్లు (683) ఎస్ భారతి (684) బి రవితేజ (694) సిగిలిపల్లి కృష్ణారావు (704) దారం వెంకటేశ్వరరావు (708) ఏ సురేష్ (718) బండారు బాల మహేంద్ర (730) చింత కుమార్ (768) సాయి సందీప్ కుమార్ (780) పురుషోత్తమ్ కుమార్ (828) కామినేని సంజయ్ రావు (830) పుష్పలత (845) ఎస్ భారత్ (866) చిలక సుధారాణి (876) విజయ్ కుమార్ (880) హెచ్ హనుమంతరాజు (898) పిల్లి ప్రేమకుమార్ (900) బి ప్రవీణ్ కుమార్ (907) ఆర్ భరత్ (914) ఇంటి నిహారిక (930) కుర్రా శ్రీనివాస్ (953) కారెల ముఖేష్ కుమార్ (972) ఎల్లసిరి శివప్రసాద్ (973) బి బాలస్వామి (977) జె విజయకృష్ణ (988) సీహెచ్ ప్రదీప్ కుమార్ (998) దాసరి కార్తీక్ (1000) మేకల సంధ్యా సమీర (1001) సుర్వే స్వాతి (1003) సాలి గౌతమి (1004) పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012) కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021) కొలకలూరి అరవింద్ (1022) నేగి సుష్మ (1029) దొండపర్తి వెంకట హరీష్ (1035) కె ఎస్ రమేష్ భారతి (1046) -
'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు'
హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇంకా కేంద్రంలోనే ఉండటం సిగ్గు చేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీపడుతున్నారని అన్నారు. తెలుగువారి పౌరుషం చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10న వైఎస్ఆర్ సీపీ నిర్వహించే ధర్నాలకు అందరూ మద్దతివ్వాలని అంబటి కోరారు. ప్రత్యేక హోదా కోసం 10న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా ఉంటుందని చెప్పారు. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని, మరీ బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మొదటి ముద్దాయి చంద్రబాబునాయుడని అన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా మోదీ కేసీఆర్ వద్ద ఉందని అందుకే.. స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేయడం లేదని ఆరోపించారు. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలుగువాళ్లు
చెన్నై: తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగువారు పోటీ చేస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో బాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాషపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు పోటీచేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి, సంస్థ కార్యదర్శులు మండ్లు శ్రీనివాసరావు, డి. శివశంకరరెడ్డి, యు. పించలయ్య, బి. గోవర్థన్, కె. మోహన కృష్ణ, ఎస్. బాలాజీలతో పాటు తమిళనాడుకు చెందిన తెలుగు సంఘాల ప్రముఖులందరూ చిత్తూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులను కలిసి ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగువారికి, తెలుగు సంఘాలకు మద్దతు తెలపాలని కోరుతామని కేతిరెడ్డి తెలిపారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఏడాదంతా సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
'పనామా'లో తెలుగువాళ్లు
‘నల్ల’ జాబితా-3 మోటూరి శ్రీనివాస్, జయకుమార్, వోలం భాస్కర్రావు నీరా రాడియా, ఎస్కే మోదీ, బళ్లారి పారిశ్రామికవేత్త పేర్లూ తెరపైకి చార్టర్డ్ అకౌంటెంట్, వజ్రాల వ్యాపారులూ.. కొన్ని కంపెనీలు మూతపడ్డాయంటున్న యజమానులు న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్లో భాగంగా బుధవారం వెల్లడించిన తాజా జాబితాలో ముగ్గురు తెలుగువారి పేర్లు తెరపైకి వచ్చాయి. నందన్ క్లీన్టెక్ కంపెనీ ఎండీ మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, నందన్ టెక్నాలజీస్, గ్రాండ్బే కెనాల్ లిమిటెడ్ ఎండీ భావనాసి జయకుమార్, నందన్ టెక్నాలజీస్ మాజీ ఎండీ వోలం భాస్కర్ రావు పేర్లు వెల్లడయ్యాయి. వీరితోపాటు.. ఎనిమిదేళ్ల క్రితం (యూపీఏ హయాంలో) భారత కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన నీరా రాడియా పేరు కూడా బయటకొచ్చింది. చాలెంజ్ సాకర్ లిమిటెడ్లో ప్రధాన భాగస్వామి ఎస్కే మోదీ, వరల్డ్ వైడ్ గ్రూప్ హోల్డింగ్ భాగస్వాములు ప్రీతమ్ బోత్రా, శ్వేత గుప్తా, పలువురు వజ్రాల వ్యాపారులతోపాటు బళ్లారికి చెందిన ఇద్దరు ముడి ఇనుము ఎగుమతిదారులు, కోల్కతా, అహ్మదాబాద్, హిమాచల్ప్రదేశ్లకు చెందిన వ్యాపారవేత్తలు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ విదేశాల్లో కంపెనీలు: నాలుగు ప్రాంత: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్ పనామా పేపర్స్ లిస్టులో హైదరాబాద్కు చెందిన పారిశ్రామిక వేత్త మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ పేరుంది. ఈయన 2011 నుంచి బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్లోని నాలుగు కంపెనీల్లో డెరైక్టర్గా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ నందన్ క్లీన్టెక్ కంపెనీకి మేనేజింగ్ డెరైక్టర్గా, సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీకి సహ-యజమానిగా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయో ఇంధనం ప్రాసెసింగ్ కంపెనీతో పాటు.. పలు ఇతర కంపనీలను ఈయన స్థాపించారు. బయో ఇంధనం ఎగుమతిలో అవకతవకలున్నాయన్న కేసులో 2012 ఏప్రిల్ 2న శ్రీనివాస ప్రసాద్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. భావనాసి జయకుమార్ విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్, యస్ డి వెంచర్స్ ఎస్ఏ, గ్రాండ్బే కెనాల్ లిమిటెడ్ మొదలైనవి ప్రాంతం: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ) హైదరాబాద్కు చెందిన భావనాసి జయకుమార్ పలు విదేశీ కంపెనీల్లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, వోలం భాస్కర్ రావుతో కలిసి డెరైక్టర్గా ఉన్నారు. రికార్డుల ప్రకారం 2008లో బీవీఐలో నందన్ టెక్నాలజీస్ను, 2015లో గ్రాండ్బే కెనాల్ కంపెనీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. నందన్ టెక్నాలజీస్ కింద నడుస్తున్న ఆరు కంపెనీలకు జయకుమార్ డెరైక్టర్గా ఉన్నారు. అయితే.. ఈ కంపెనీలకు తనకూ సంబంధం లేదన్న జయకుమార్ తన భార్య పేరుతో ఈ కంపెనీలున్నట్లు ఒప్పుకున్నారు. వోలం భాస్కర్ రావు విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, సంబంధింత ఇతర కంపెనీలు ప్రాంతం: బీవీఐ ఈయన నందన్ టెక్నాలజీకి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు సికా సెక్యూరిటీస్ సహ వ్యవస్థాపకుడిగా, ప్రమోటర్గా కూడా ఉన్నారు. దీంతో పాటు నందన్ క్లీన్టెక్ లిమిటెడ్కు 2008 నుంచి ఎండీగా ఉన్నారు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసుకున్నానంటున్న ఈయన.. యూకేలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. నీరా రాడియా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వంలో సులభంగా పనిచేయించేలా మధ్యవర్తిత్వం నడిపినట్లు రేగిన వివాదంలో కేంద్ర బిందువైన నీరా రాడియా.. ఇప్పుడు విదేశాల్లో పెట్టుబడుల విషయంలో మళ్లీ తెరపైకి వచ్చారు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన ‘క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్’లో రాడియాకు వాటాలున్నట్లు 232 పేపరల్లో వెల్లడైనట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. అయితే.. దీన్ని రాడియా ఖండించారు. సతీశ్ కే మోదీ మోదీ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ చైర్మన్, కేకే మోదీ చిన్న సోదరుడు సతీశ్ కే మోదీ 2010లో చాలెంజ్ సాకర్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. 2013లో మోదీ టౌన్ ఫుట్బాల్ క్లబ్ లిమిటెడ్నూ ఈయన ప్రారంభించారు. గోల్డ్ఫించ్ హోల్డింగ్ గ్రూపులో షేర్హోల్డర్గా ఉన్నారు. ప్రసన్న వి ఘోటాగే, వామన్ కుమార్ ముడి ఇనుము ఎగుమతి దారైన ప్రసన్న, అతని భార్య నేహ, మిత్రుడు వామన్ కుమార్లకు నార్డ్బెల్ కమర్షియల్స్ లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఈ కంపెనీ బీవీఐలో 2007లో ప్రారంభమైంది.ప్రసన్నకు చెందిన పీవీజీ కంపెనీ కర్ణాటకలోని బళ్లారి నుంచి 3వేల ట్రక్కుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసింది. కాగా వామన్ కుమార్ అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు, ముడి ఇనుము వ్యాపారంలో సిద్ధహస్తుడు. చేతన్ మెహతా, హర్షద్ రామ్నిక్లాల్ వీరిద్దరూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్లోని లీచ్టెన్స్టిన్ బ్యాంకుతో పాటు హెచ్ఎస్బీసీ బ్యాంకులో వాటాలున్నందుకు గతంలోనే వీరిని భారత అధికారులు విచారించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారుడైన ‘రోసీ బ్లూ’ సంస్థకు హర్షద్ రామ్నిక్లాల్ యజమాని. కాగా, తన పేరుతో వచ్చిన కంపెనీలన్నీ గతంలోనే మూతబడ్డాయని చేతన్ మెహతా తెలిపారు. జార్జ్ మాథ్యూ తిరువనంతపురంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ జార్జ్ మాథ్యూ 12 ఏళ్ల క్రితం సింగపూర్లో సెటిలయ్యారు. ఫ్యూచర్బుక్స్ పేరుతో కంపెనీని తెరిచిన ఈయన.. ఇలాంటి కంపెనీల ఏర్పాటుకు సింగిల్ స్టాప్ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నారు. సోల్ రిథమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తోపాటు కంపెనీల్లో ఈయనకు షేర్లున్నాయి. -
పనామా ప్రకంపనలు: ఆ ముగ్గురు తెలుగోళ్లు!
పన్ను స్వర్గధామలైన విదేశాల్లో బోగస్ కంపెనీలు పెట్టి.. నల్లడబ్బు దాచుకున్న కుబేరుల బాగోతం ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. 'పనామా పత్రాల' లీకైన వ్యవహారానికి సంబంధించి తాజాగా మూడో జాబితా విడుదలైంది. ఈ మూడో జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లతోపాటు పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. తెలుగువాళ్లు ఎవరంటే..? మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ విదేశీ కంపెనీలు: నాలుగు స్థలం: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ) హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ ప్రసాద్ కనీసం నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్టు ఫొన్సెకా పత్రాల ద్వారా వెల్లడైంది. 2011లో బీవీఐలో ఈ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రసాద్ నందన్ క్లీన్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటంతోపాటు సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు కో ఓనర్ గా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయోచమురు ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పినట్టు ఘనత తెచ్చుకున్న ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 2012 ఏప్రిల్ 2న ఆయన అరెస్టయి.. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. ప్రసాద్ వివరణ: కేవలం ఒక డాలర్ తో ఈ కంపెనీలు స్థాపించాం, విదేశాల్లో వ్యాపారం చేద్దామనే ఆశతో వీటిని పెట్టినప్పటికీ అది కుదరకపోవడంతో ప్రస్తుతం ఆ కంపెనీలన్నీ పనిచేయడం లేదు. వీటిని ప్రస్తుతం మేం నడుపడం లేదు. భావనాసి జయకుమార్ విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజిస్ లిమిటెడ్, యెస్ డీ వెంచర్స్ ఎస్ఏ,గ్రాండ్ బే కేనాల్ లిమిటెడ్ తదితరాలు స్థలం: బీవీఐ హైదరాబాద్ కు చెందిన భావనాసి జయకుమార్ ఈ కంపెనీల్లో ప్రసాద్, వోలం భాస్కర్ రావులతో కలిసి డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇందులో నందన్ టెక్నాలజీస్ ను 2008లో స్థాపించగా, గ్రాండ్ బే కెనాల్ లిమిటెడ్ ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్ కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీల్లోనూ జయకుమార్ డైరెక్టర్ గా ఉన్నాడు. జయకుమార్ వివరణ: 'నందన్ టెక్నాలజీస్, ఎస్ డీ వెంచర్స్,గ్రాండ్ బే కెనాల తదితర విదేశీ కంపెనీలతో నాకెలాంటి సబంధం లేదు. వీటిని వోలం భాస్కర్ రావు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహిస్తున్నారు' వోలం భాస్కర్ రావు విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, అనుబంధం సంస్థలు నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధం సంస్థలు ఆరింటికి భాస్కర్ రావు ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కు సహ యజమానిగా, నందన్ క్లీన్ టెక్ లిమిటెడ్ కు ప్రమోటర్ గా, 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైరైన ఆయన ప్రస్తుతం ఎక్కువకాలం బ్రిటన్ లో గడుపుతున్నారు. ఆయన తరఫున ఆయన కొడుకు వోలం సందీప్ వివరణ ఇస్తూ.. తన తండ్రి రిటైరైన నేపథ్యంలో ఈ కంపెనీలన్నింటినీ మోతూరి శ్రీనివాస్ ప్రసాద్ టేకోవర్ చేసుకున్నారని, విదేశాల్లో వ్యాపార ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టినా.. ఇవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. ఇంకా 'పనామా పేపర్స్' మూడో జాబితాలో మోదీ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సతీష్ మోదీ, ప్రీతం బోథ్రా, శ్వేత గుప్తా, బండారి అశోక్ రాందయాల్ చంద్ తదితర వ్యాపారవేత్తల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. -
తెలుగువారి కోసం లె జిస్లేచర్ కమిటీ
మంత్రి పల్లె రఘునాథరెడ్డి - సీఎం చంద్రబాబుకు సూచిస్తానని వెల్లడి చెన్నై దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెన్నైలో పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా తెలుగువారు స్థిరపడి ఉన్నారని తెలిపారు. తమిళనాడులో తెలుగువారు నిర్బంధ తమిళం చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగానే స్థానికేతరులుగా ఇతర రాష్ట్రాల్లో సైతం పలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. తెలుగువారందరి సమస్యలను ఆకళింపు చేసుకునేందుకు ఒక లెజిస్లేచర్ కమిటీ డెలిగేషన్గాఏర్పడి దేశవ్యాప్తంగా పర్యటించడం, కమిటీ సేకరించిన తెలుగువారి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఐటీ రంగంలో విప్లవాన్ని సాధిస్తున్నామని, జూన్, జూలై నాటికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. చెన్నైలో ఈనెల 20వ తేదీన నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో 27 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొనగా 15 మంది రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. -
వేడుకలకు రెడీ అవుతున్న NATA
-
చెన్నైలో తెలుగువారిని రక్షించిన ఎయిర్ఫోర్స్
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు తీవ్ర అవస్తలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 250 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. గురువారం వరదల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారిని ఎయిర్ ఫోర్స్ రక్షించి బేగంపేట విమానాశ్రయానికి చేర్చారు. చెన్నైలోని తెలుగువారికి సహాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. -
వరదల్లో చిక్కుకున్న తెలుగువారిపై ఆందోళన
-
వైఎస్ జగన్తో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. తమిళనాడులో తెలుగు ప్రజల సమస్యల పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన వైఎస్ జగన్ను కోరారు. తమిళనాడులో పాఠశాలల్లో తెలుగుభాషను తొలగించడంపై గురువారం ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్ను కోరారు. తమిళనాడులో తెలుగువారి సమస్యల పోరాటానికి వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
'తెలుగు ప్రజలకు తలవంపులు తెచ్చారు'
ఫ్లోరిడా(అమెరికా): ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకంతో తెలుగు ప్రజలందరు తలవంపులు తెచ్చారని అమెరికా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ ప్రాంత ఇంచార్జ్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చర్యల వల్ల తెలుగువారు ఇతరుల ముందు చులకన అయ్యారని విమర్శించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రజలను అడ్డు పెట్టుకోవడం దారుణమని ఫ్లోరిడాలో వైఎస్ఆర్సీపీ దక్షిణ ప్రాంత నేతల సమావేశంలో వాసుదేవరెడ్డి అన్నారు. సెక్షన్-8 అమలు చేయాలనడం కొత్త సమస్యను సృష్టించినట్లవుతుందని తెలిపారు. అమెరికాలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి వచ్చే నెల 18న అట్లాంటాలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వాసుదేవరెడ్డి చెప్పారు. -
దుబాయిలో వేవ్ సంబరాలు
-
ఘనంగా వేవ్ సంబరాలు
దుబాయి: దుబాయిలో తెలుగువారి ఆత్మీయ వారథి వేవ్ ఎనిమిదో వార్షికోత్సవ సంబరాలు స్థానిక రషీద్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రముఖ నటీ మణులు జయసుధ, రజని, నటుడు నారా రోహిత్, రోహన్ సాయితోపాటు పలువురు పాల్గొన్నారు. తెలుగు యాంకర్ శ్రీవాణి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాధవపెద్ది మూర్తి గారి నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ జాలీ ఆధ్వర్యంలో పిల్లలతో చేయించిన చేపల నృత్యం కూడా బాగా ఆకర్షించింది. దాదాపు ఐదుగంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో లంబాడా నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రతియేటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేవ్ సంస్థ నిర్వాహకులు గీత, రావెళ్ల రమేశ్ బాబుకు జయసుధ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులుగా ఉమా పద్మనాభన్, సునీత, సుధ, త్రివేణి, విశాల, లావణ్య, ప్రశాంతి, మధు శ్రీనివాస్, ప్రసన్న, స్వాప్నిక, దివ్య, మోనిష వ్యవహరించారు. -
తెలుగోడి చెవిలో పువ్వు
విజయనగరం మున్సిపాలిటీ : అధికారంలోకి రాక ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట మార్చుతూ బీజేపీ సర్కారు తెలుగు వారిని మోసం చేస్తోందని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని విభ జించిన తరువాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హమీలు ఇచ్చి నేడు ఆ హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రధాన మంతి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాస్కులు ధరించి ఆ మార్గంలో వచ్చి పోయే వారందరికీ చెవిలో పువ్వులు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందుకు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులే నేడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పడం తెలుగువారి చెవులో పువ్వులు పెట్టడమేనన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ప్రత్యేక హోదాయే రాష్ట్ర భవిష్యత్కు శరణ్యమని అన్నారు. రాష్టానికి ప్రత్యేక హోదా కల్పించడంతోనే తెలుగువారి భవిష్యత్ ముడిపడి ఉందని ఇప్పటికైనా మోసపూరిత విధానాలను విడనాడి ప్రత్యేక హోదా కల్పిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మద్దిల సోంబాబు, సభ్యులు రాంబాబు, పైడినాయుడు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా క్షణాల్లోనే జరిగిపోయింది!
ఇప్పటికీ వణికిపోతున్న నేపాల్ భూకంప బాధితులు న్యూఢిల్లీ/చిత్తూరు/గాజువాక/: నేపాల్ భూకంపం నుంచి బయటపడి ఢిల్లీకి చేరుకుంటున్న తెలుగువారు ఆ భయంకర క్షణాలను తలచుకొని ఇప్పటికీ వణికిపోతున్నారు. కళ్ల ముందే తాము ప్రత్యక్ష ప్రళయాన్ని చూశామంటూ భయకంపితులవుతున్నారు. ‘‘అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. చూస్తుండగానే పెద్దపెద్ద భవనాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు నేలవాలాయి. మేం మా పిల్లలను తీసుకుని భయంతో పరుగులు తీశాం’’ అని చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన రమణ ‘సాక్షి’ కి తెలిపారు. కఠ్మాండులోని ఇండియన్ ఎంబసీ కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా పనిచేస్తున్న రమణ.. మూడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ‘‘భూకంపం వచ్చిన రోజు మొదట ఏమీ అర్థం కాలేదు. ఇళ్లంతా ఊగిపోయింది. దేవుడి దయవల్లే బయటపడ్డాం’’ అని ఆయన వివరించారు. కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 28 మందిని స్వస్థలాలకు చేర్చినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ సిబ్బంది తెలిపారు. ఏపీలోని కడప, తిరుపతి, అమలాపురం,విశాఖపట్నం, తిరుపతికి చెందిన 14 మందిని ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు పంపారు. మరో 200 మందిని గోరక్పుర్ నుంచి రైలు మార్గంలో నేరుగా పంపినట్టు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తెలిపారు. నేపాల్ నుంచి ఇప్పటి వరకు 200 మంది తెలుగువారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపినట్టు ఆయన చెప్పారు. ఇంకా 300 మందికి పైగా తెలుగువారు నేపాల్లో ఉన్నారని, వారిని సాధ్యమైన త్వరగా వెనక్కి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్కు చెందిన 8 మంది వైద్య విద్యార్థులను, హైదరాబాద్లో ఉప్పుగూడకు చెందిన ఐదుగురిని, చార్మినార్ ప్రాంతవాసి, సాయిబాబా ట్రావెల్స్కి చెందిన రాజ్కుమార్ అనే యువకుణ్ని విమానంలో హైదరాబాద్కి పంపినట్టు తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్కు చెందిన మరికొందరు యాత్రికులు కఠ్మాండు ఎయిర్పోర్టులో ఉన్నారని, ఈ రాత్రికి వారు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. తెలుగువారందరినీ సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భూకంప బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఆ విద్యార్థులు క్షేమం..: నేపాల్లోని భరత్పూర్లోని కాలే జీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సీఎంఎస్)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. కళాశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు చదువుతుండగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 72 మంది ఉన్నారు. కఠ్మాండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కళాశాల ఉంది. శనివారం నాటి భూకంపానికి కాలేజీ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విద్యార్థులు సమీపంలోని ఓ దేవాలయంలో తలదాచుకొన్నారు. కాలేజీ యాజమాన్యం బస్సు ద్వారా విద్యార్థులను గోరఖ్పూర్ వరకు పంపింది. అక్కడ్నుంచి యశ్వంత్పూర్ రైలు ద్వారా వీరు మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
నరక మేంటో తెలిసింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘నరకం ఎలా ఉంటుందో చూశాం. ప్రత్యక్షంగా అనుభవించాం. జీవితం లో ఇలాంటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు. పశుపతి నాథుడి దయవల్లే బతికి బయటపడ్డాం’ ఇది నేపాల్ లోని కఠ్మాండు భూకంపం నుంచి సురక్షితంగా బయపడి ఢిల్లీ చేరుకున్న తెలుగువారి ప్రతిస్పందన. స్థానిక ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బం దులు పడ్డామని, భారతీయ వాయుసేన చొరవతోనే ఢిల్లీకి చేరుకోగలిగామన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో మొత్తం 54 మంది తెలుగువారున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, హయత్నగర్కు చెందిన 35 మంది, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మార్టేరు, రావులపాలెం, వెలుగులేరుకి చెందిన 19 మంది ఉన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్, తెలంగాణ భవన్ సిబ్బంది బాధితులను ఆయా భవన్లకు తరలించి, వసతి ఏర్పాటు చేశారు. పశుపతినాథ్ దయతోనే.. భయంకరమైన భూకంపం బారి నుంచి ఆ పశుపతినాథుడి దయతోనే బయటపడగలిగినట్టు హైదరాబాద్, హయత్నగర్ మండలం శాంతినగర్ కాలనీ వాసులు తెలిపారు. 35 మంది పశుపతినాథ్ యాత్రకు వెళ్లినట్టు చెప్పారు. ‘మేం పశుపతినాథ్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే ఈ ప్రళయం చోటుచేసుకుంది. అప్పుడు మేమంతా బస్సులో ఉన్నాం. బస్సు ఒక్కసారిగా ఊగడం మొదలయ్యింది. మేమంతా భయంతో ఆ దేవుణ్ని తలచుకుంటూ కూర్చున్నాం. కొద్దిసేపటి తర్వాత ఒక ఓపెన్ప్లేస్కి మా బస్సును తీసుకెళ్లాక ఊపిరి పీల్చుకున్నాం’ అని శాంతినగర్కి చెందిన శశికళ కన్నీటి పర్యంతమయ్యారు. స్వస్థలాలకు బాధితులు: ఢిల్లీ ఏపీభవన్కి చేరుకున్న 54 మంది బాధితులను నాలుగు విమానాల్లో ఆదివారం సాయంత్రానికే వారి స్వస్థలాలకు పంపినట్టు సిబ్బంది తెలిపారు. మరికొందరు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని, భారత విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తెలుగు రాష్ట్రాల వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం 12-50 గంటల సమయం లో మరోమారు ఢిల్లీలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ భవన్లోని వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఆది వారం రాత్రి మరో తొమ్మిది మంది బాధితులు ఢిల్లీకి చేరుకున్నారని, వీరిలో ఐదుగురు హైదరాబాద్కి చెందిన వారు, నలుగురు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారని ఏపీ భవన్ సిబ్బం ది తెలిపారు. సోమవారం ఉదయం వీరిని స్వస్థలాలకు పంపనున్నట్టు తెలిపారు. భీతావహులై.. పరుగులు తీశాం ఏపీ భవన్కి చేరుకున్న కొందరు బాధితులు మీడియాతో మాట్లాడుతూ ‘భూకంపం వచ్చినప్పుడు మేం పశుపతినాథ్ ఆలయం దగ్గరున్నాం. ఒక్కసారిగా బిల్డింగ్లు కూలిపోవడం చూసి భయంతో పరుగులు తీశాం. మాతోపాటు వచ్చిన వాళ్లలో కొందరు ఆలయంలో, మరికొందరు ఆలయ గోశాలలో తలదాచుకున్నారు. జనమంతా రోడ్లమీదికి వచ్చేశారు. బిల్డింగ్లు కూలిపోయా యి. మేం బయటపడ్డాం. నెమ్మదిగా అక్కడి నుంచి కఠ్మాండు ఎయిర్పోర్టుకి వచ్చాం. అక్కడ మన ఎయిర్ఫోర్స్ విమానాల్లో ఢిల్లీకి వచ్చాం. ఇంకా నాలుగైదు వేల మంది తెలుగువాళ్లు కఠ్మాండులోనే ఉన్నారు. సరైన సమాచారం అందక అంతా ఇబ్బంది పడుతున్నారు’ అని తూర్పుగోదావరి జిల్లా మార్టేర్ ప్రాంతానికి చెందిన బాధితులు తెలిపారు. -
చనిపోతామని అనుకున్నాం: ఢిల్లీలో తెలుగు ప్రజలు
-
'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!'
-
ఆసుపత్రా.. వైద్యశాలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలంగా వెద్యశాల బదులు ఆసుపత్రి అనే అభాస పదాన్ని మీడియాలో, జనం వ్యవహారంలో కూడా విపరీతంగా వాడుతూ వస్తున్నారు. పైగా ఆసుపత్రిని అసలైన తెలుగు పదమైనట్లు చాలా మంది నేటికీ భావిస్తున్నారు. హాస్పిటల్ అనే ఇంగ్లిష్ పదానికి హిందీ వారు తమ భాషలో ‘ఆస్పతాల్’ అని పిలుచుకుంటే దానికి అనుకరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రచారంలోనికి తెచ్చిన పదమే ‘ఆసుపత్రి’. తెలుగు ప్రజలు సులువుగా పలుకగలిగిన ‘హాస్పిటల్’ను ఆసుపత్రి అని మార్చవలసిన అవసరం లేదు. స్వచ్ఛ మైన తెలుగు పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ప్రజల మీదరుద్దిన అవకర పదమైన ఆసుపత్రిని మీడియా పరిభాషలోంచి ఇప్పటికైనా పరిహ రించాలి. జనం వాడుకలో, మీడియాలో ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వైద్యశాల, దవాఖాన, హాస్పి టల్ అనేవే సరియైన వాడుక పదాలు. కావాలంటే తెలంగాణలో దవాఖాన, ఆంధ్రప్రదేశ్లో వైద్యశాల పేర్లను ఇకనైనా వాడుకలోకి తీసుకొస్తే బాగుంటుంది. రెండు రాష్ట్రాల పాలకులు ఈ విషయమై పునరాలోచించి పాలనాపరంగా దీనిపై తగు నిర్ణయం తీసుకుంటారని, కోరుకుంటున్నాం. డా॥రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి -
తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడే సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని పేర్కొన్నారు. శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు అనుసరణీయమని వైఎస్ జగన్ అన్నారు. -
తెలుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయం
ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్: తెలుగు ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్ అన్నా రు. తానా, ప్రియదర్శిని కళాశాల సంయుక్తాధ్వర్యంలో ‘యువ-2014’ ఉత్సవాలు ఆదివా రం ఖమ్మం నెహ్రూనగర్లోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో ఆదివారం ప్రారంభమయ్యూరుు. ఈ కార్యక్రమంలో జయశేఖర్ మాట్లాడుతూ.. తానా స్థాపించి 40 ఏళ్లయిందని అన్నారు. స్థాపించనప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి అమెరిలో తానా ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పలు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలో 175మంది పేద విద్యార్థులకు 15వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నామన్నారు. అమెరికాలో చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు తానా సహాయ సహకారా లు అందుతున్నాయన్నారు. హుదుద్ తుపాన్ బాధితుల కోసం తాము రెండుకోట్ల రూపాయలను విరాళంగా సేకరించామన్నారు. దీనిని ఈ నెల 23, 24 తేదీలలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇస్తామన్నారు. తెలంగాణ పభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలోని ఏదో ఒక ఊరును ‘తానా- మీ ఊరి కోసం’ పేరిట దత్తత తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా రు. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు వారై నా కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే సద్దుద్దేశ్యంతో నే తానా స్థాపించినట్టు చెప్పారు. జూలై2,3,4 తేదీల్లో అమెరికాలో జరిగే తానా చైతన్య స్రవంతికి జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వానం పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఫెమా’ కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ప్రియదర్శిని వి ద్యాసంస్థల అధినేత కాటేపల్లి నవీన్బాబు, జి ల్లా జూనియర్ కళాశాలల యూజమాన్యాల సం ఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలను కలిపే శక్తి భాషకే ఉంది : బుద్ధప్రసాద్
భవానీపురం : తెలుగు రాష్ర్టం రెండుగా విడిపోవడం బాధాకరమైనప్పటికీ తెలుగు ప్రజలను కలిపే శక్తి ఒక్క తెలుగు భాషకే ఉందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భాషా పండితుడు, బాలవ్యాకరణ రూపకర్త పరవస్తు చిన్నయసూరి 208వ జయంతి సందర్భంగా గవర్నర్పేటలోని డాక్టర్ కేఎల్ రావు భవన్లో చిన్నయసూరి సాహితీ పీఠం ఆధ్వర్యాన ‘తెలుగు భాషా వికాసం’ అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజయవాడ కేంద్రంగా సాహితీ వికాస కేంద్రం, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం తెలుగు శాఖాధిపతి ఆచార్య వెలమల సిమ్మన్నను సత్కరించారు. సాహితీ పీఠం అధ్యక్షుడు టి.శోభనాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆకాశవాణి కేంద్రం సంచాలకులు ఎం.కృష్ణకుమారి, తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జి.సుబ్బారావు, గుమ్మా సాంబశివరావు పాల్గొన్నారు. -
మొదట ఈ నరుడు వానరుడు!
అక్షర తూణీరం: విశ్వవిజేత అలెగ్జాండర్ ఏం కావాలని అడిగితే ‘తమరు పక్కకు తప్పుకుంటే సూర్యనమస్కారాలు చేసుకుంటాను’ అన్న నాటి రుషి లాగా నేడు తెలుగు ప్రజలు నగరాలు, నజరానాలు వద్దు, మమ్మల్నిలా వదిలేయమంటున్నారు. ఒకరు సింగపూర్ అంటారు. ఇంకొకరు ఇస్తాంబుల్ అంటారు. ఒకాయన వాటికన్ అన్నాడు. ఇంకొకాయన మక్కా, ఇది పక్కా అన్నాడు. ఒకరు రాష్ట్రానికి సంస్కృతం లో స్వర్ణ విశేషం తగిలిస్తే మరొకరు తెలుగులో బంగారు శబ్దం జోడించారు. ఆకాశహర్మ్యాలంటున్నాడొ కాయన. ఆ విధంగా అండర్గ్రౌండ్లో ముందుకు పోతాం. పాతాళలోకం తలుపులు తీస్తాం, తాళం నా దగ్గర ఉందటున్నాడొకాయన. ఇక పనిలేని వర్గం పవరున్న వారితో ఆడుకుంటూ ఉంది. ‘‘ఏది స్విస్ డబ్బు? ఎక్కడ రుణమాఫీ? మోదీ నిజంగా గాంధే యవాదే అయితే స్వచ్ఛ భారత్ కాదు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచెయ్యాలి. సవాల్ విసు రుతున్నాం’’ అంటూ జనాన్ని ఆకట్టే ప్రయత్నంలో ఉన్నారు. పవర్లో లేనివారు ఎప్పుడూ ఎక్స్గ్రేషి యాలు ఉదారంగానే ప్రకటిస్తారు. సీటు దిగిపో యాక ఆదర్శాలకు పదును పెడతారు. ప్రజల చేత నిర్ద్వంద్వంగా తిరస్కరింపబడిన నేతలు కనీసం ఒక ఏడాది పాటు వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేయరా దని రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది- అని ఓటర్లంటున్నారు. ఏమిటీ రాజ్యం ఇట్లా అఘోరించిందంటే, ముందటి పాలకుల అవినీతి అసమర్థ పాలన కార ణమంటారు. ముందటి పాలకులను నిలదీస్తే బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలనలో పీల్చి పిప్పి చేయబడ్డ రాజ్యాన్ని ఇంతకంటే ఉద్ధరించలేకపోయా మంటారు. సందర్భం దొరికి బ్రిటిష్ పాలకుల్ని అడిగితే, అసలు లోపం మహమ్మదీయ పాలనలోనే ఉందని గతం మీదకి తప్పుతోస్తారు. నడం నొప్పిగా ఉందని పేరు మోసిన డాక్టర్ దగ్గరకు వెళితే ‘‘ఉం టుందండీ! సహజం. మనిషి మొదట చతుష్పాది కదా! క్రమంగా రెండుకాళ్ల మీద నడవడం ఆరంభిం చాడు. అంచేత నడుంనొప్పి... నేచురల్లీ’’ అన్నాడు. ఆ మాటలు విన్నాక ఎవడికైనా అగ్గెత్తుకు రాదూ! జపాన్ టెక్నాలజీలో మన వాస్తుని మిళాయించి కేపిటల్ నిర్మాణమై వస్తుంది. అదొక అద్భుతం. ఇదిగో ఆ మూల ప్రపంచంలో ఎత్తై మహా శిఖరం వస్తోంది. అదసలు కేవలం వాస్తుకోసమే ఆవిర్భవి స్తోంది. మీరే చూస్తారు! ఇవన్నీ వింటుంటే నాకు ‘అలెగ్జాండర్-మహర్షి’ కథ గుర్తుకొస్తోంది. అలెగ్జాం డర్ మనదేశాన్ని జయించాక, ఇక్కడ తపస్సంపన్ను లైన రుషులుంటారని విని ఒక వేకువజామున బయ లుదేరి అడవిలోకి వెళ్లాడు. మర్యాదగా ఆశ్రమం బయటే గుర్రాన్ని వదలి, శిరస్త్రాణంతీసి లోనికి వెళ్లా డు. అప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని అంగో స్త్రంతో బయటకు వస్తున్న రుషి కనిపించాడు. నమ స్కరించి, ‘‘నన్ను అలెగ్జాండరంటారు. విశ్వ విజే తని. తమర్ని దర్శించవచ్చాను. చెప్పండి, మీకేం కావాలో! వజ్ర వైఢూర్యాలా, బంగారు గనులా, వెం డికొండలా, గోవులా... చెప్పండి! అన్నాడు. మహర్షి మాటా పలుకూ లేక మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. ‘‘సందేహించకండి! అన్నింటినీ ఇమ్మన్నా ఇస్తాడీ గ్రీకువీరుడు. మీకేం కావాలి?’’ అన్నాడు. నోరు విప్పాడు రుషి, ఎట్టకేలకు- ‘‘తమరు కాస్త పక్కకు తప్పుకుంటే నాకు ఎండపొడ తగుల్తుంది. నేను సూర్యనమస్కారాలు చేసుకుంటాను. తమరా మేలు చేస్తే చాలు’’ అన్నాడు రుషి. ప్రస్తుతం తెలుగు ప్రజ రుషిలా అల్ప సంతోషులుగా ఆలోచిస్తున్నారు. నగ రాలూ వద్దు, నజరానాలూ వద్దంటున్నారు. ఆడలేక మద్దెలని ఓడు చెయ్యద్దంటున్నారు. అవినీతిని అరి కట్టడానికి పెట్టుబడులు అక్కర్లేదు కదా అని అడుగు తున్నారు. రోజు వారీ పాలనలో పొదుపుకీ సమయ పాలనకీ క్రమశిక్షణకీ జవాబుదారీతనానికీ బడ్జెట్లో కేటాయింపులు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రజారుషులు. ఆధునిక వాహనాలను దింపితే సరి పోదు అందులో కూచునే పోలీసు అధికారుల నైజం మారాలంటున్నారు. దీన్ని న్యూయార్క్ సిటీని చేస్తే మన సిటీయే గొప్పదవుతుందన్నాడొక సిటిజనుడు. అదెట్లా అన్నాను, అర్థంకాక. ‘‘మూడు లక్షల ఇరవై వేల వీధికుక్కలు మన సిటీకి ఎగస్ట్రా..’’ అన్నాడు గర్వంగా. అవును, మొదట ఈ నరుడు వానరుడు. (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత) - శ్రీరమణ -
‘సేవ’ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భివండీ
భివండీ, న్యూస్లైన్: భివండీలో తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ‘సేవా’ సంస్థ నేతృత్వంలో ఆదివారం స్వచ్ఛ్ భివండీ నిర్వహించారు. ప్రధాన నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ను ప్రేరణగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవ) నేతృత్వంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘సేవ’తో పాటు పట్టణంలోని తెలుగు సేవా సంస్థలు నటరాజ్ మిత్ర మండల్, ఫ్రీడమ్ గైస్, ఓంకార్ మిత్ర మండల్, వినాయక్ మిత్ర మండల్, శ్రీ గజానన్ మిత్ర మండల్, మార్కండేయ మిత్ర మండల్, ఏక్తా మిత్ర మండల్, నవజావన్ చారిటబుల్ పాఠశాల, వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన 15 నుంచి 70 యేళ్ల మధ్య వయస్కులు పాల్గొనడం విశేషం. పద్మనగర్ ప్రాంతంలోని వార్డు నంబర్ 31,32 ల్లోని మార్కండేయ నగర్, గణేశ్ టాకీస్, రామ మందిరం, దత్తా మందిర్, బాలాజీ సొసైటీ, సోనార్ పాడ, మార్కండేయ మహాముని చౌక్, నీలకంఠేశ్వర మందిరం, గాయిత్రీ నగర్, మిలింద్ నగర్, జూనా పక్కుల్ చాల్, అలంకార్ టాకీస్, పక్కుల్ చాల్, రాజు చాల్, ధర్మచాల్, బోబుడే కంపౌండ్, యశ్వంత్ చాల్, జై భారత్ వ్యాయామశాల, వరాలదేవి రోడ్, గీతా మందిర్ రోడ్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. అంతేగాకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతపై స్థానిక తెలుగు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్పొరేషన్ గత ఐదు నెలల నుంచి గంటా గాడీలను నిలిపివేయడంతో రోడ్డు ఇరుపక్కల వీధివీధినా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఉన్నాయి. ఈ విషయంపై కార్పొరేషన్కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో శనివారం నుంచి తిరిగి గంటా గాడీలను ప్రారంభించారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ గంటా గాడిలోనే చెత్త వేయవలసిందిగా సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు రామ మందిరం ప్రాంగణంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. -
తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి పండగ కోసం చేసే ఖర్చులో కొంత భాగం హుదూద్ తుపాన్ బాధితులకు అందించాలని జగన్ కోరారు. తుపాన్ తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రకు సాయం చేయాలని వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
'30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసిమెలసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా మానసికంగా ఒక్కటిగానే ఉండాలని కోరుకున్నారు. భాష, ప్రాంతం, దేశం మన అనుబంధాన్ని పెంచుతాయని అన్నారు. 30 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, రేపటిరోజు కూడా ఉంటా అని చెప్పారు. ఒకరికొకరు సహరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, అంతిమ విజయం మాత్రం మంచిదేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత.. రాష్ట్ర ప్రజలకు కూడా సుఖశాంతులు అందించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయన అభిలషించారు. -
ద్వేషించిన దేవుణ్ణే ఆరాధిస్తున్నా!
ఆంధ్రులు ఎక్కువగా ఉండే మోల్మిన్... బర్మా ఆంధ్రప్రదేశ్గా ప్రసిద్ధి. అక్కడ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తెలుగువారు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్లలో మాంగ్తిన్ ఒకరు. తిరుమలేశునికీ ఆయనకూ ఉన్న అనుబంధం ఏమిటి? మీ పూర్వీకులు ఎక్కడివారు? మా తాత లండా సింహాచలం పూర్వం ఇక్కడి నుంచి బర్మాకు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో మా తండ్రి లండా గంగరాజు వైజాగ్లో పుట్టారు. ఆయన కూడా తాతతోనే బర్మాలో స్థిరపడ్డారు. ఆయన అక్కడే పెళ్లి చేసుకున్నారు. మేము రంగూన్లోనే పుట్టాము. ఐదుగురం సంతానం. నా పేరు సుబ్రహ్మణ్యం (మాంగ్తిన్), నా భార్య కళావతి. మాకు చో చో తిన్, ప్యూప్యూ తిన్ ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చో చో తిన్కు తెలుగు సంప్రదాయంలోనే రంగూన్లో పెళ్లి చేశాను. తిరుమల గురించి ఎలా తెలుసు? మా తమ్ముడు భూ కైలాష్కు స్వామి అంటే ఎనలేని భక్తి. వాడు చెప్పిన మీదట 1999లో మొదటిసారిగా నేను, నా భార్య కళావతి, చెన్నయ్ నుంచి మరో ముగ్గురం వచ్చాం. ఎక్కడ చూసినా జనమే. గది దొరక లేదు. దర్శనానికీ టికెట్లు దొరకలేదు. దాంతో తిరిగి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నా. ఇంతలోనే మాపై స్వామికి అనుగ్రహం కలిగినట్లుంది... అనుకోకుండానే కల్యాణం టికెట్టు దొరికింది. గది దొరికింది. ఒకేరోజు మూడు సార్లు దర్శనం లభించింది. అదంతా స్వామి లీలగానే అనుకున్నాం. సంతోషంగా తిరుగుప్రయాణం అయ్యాను. ఇక వీలుదొరికినపుడు కచ్చితంగా రావాలని నిశ్చయించుకున్నాం. ఆ ప్రకారం 15 ఏళ్లుగా వస్తున్నా. నా కుమార్తె పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన వారం రోజుల్లోపే తిరుమలకు వచ్చి స్వామికి కల్యాణం జరిపించాను. స్వామి మొక్కులు పెండింగ్ లేకుండా జాగ్రత్త పడుతుంటాను. అప్పుడే నా మనసు కూడా హాయిగా ఉంటుంది. శ్రీవారిని నమ్ముకున్న మీకు ఎలాంటి కష్టాలు తొలగాయి? స్వామిని నమ్ముకుని ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాను. పైకొచ్చాను. మళ్లీ దివాలా తీసాను. స్వామికి చెప్పుకునేందుకు ఫైల్స్తోనే కొండెక్కాను. నా వద్ద ప్రాణం తప్ప మరేమీ లేదని ఏడుస్తూ వేడుకున్నాను. తిరిగి బర్మా వెళ్లాను. తర్వాత వెనక్కు తిరిగి చూడలేదు. స్వామి దయతో చల్లగా ఉన్నాను. అందుకే స్వామిపేరుతో ఆసుపత్రి, గోశాల, కిడ్నీ ఫౌండేషన్ వంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పించాను. ఊపిరి ఉన్నంత వరకు ఆ స్వామిని దర్శించుకుంటూనే ఉంటాను. ఆ స్వామికి వినమ్రుడిగా ఉంటాను. -
అండగా ఉంటా..
సాక్షి, ముంబై: రాష్ర్టంలోని తెలుగువారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తానని రాష్ర్ట గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు హామీ ఇచ్చారు. రాజ్భవన్లో ఆయనను మంగళవారం వర్లీలోని తెలుగు సుధారక యువక సంఘం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు స్థానిక తెలుగు ప్రజల కష్టాలు, ఇబ్బందులు, సమస్యల గురించి సభ్యులు ఏకరువు పెట్టారు. ముంబై నగర నిర్మాణంలో తెలుగువారి పాత్ర కీలకమని మహారాష్ర్ట నాయకులు ఎప్పుడూ అనడమే తప్ప తమకు ప్రత్యేక గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో నివసిస్తున్న లక్షలాది తెలుగు ప్రజలకు మేలు చేస్తున్నట్లు చెబుతున్న కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఆ మేరకు చేతల్లో చూపిస్తోంది మాత్రం నామమాత్రమేనని వారు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ముంబైనుంచి కేవలం వీక్లీ రైళ్లను నడుపుతున్నారని చెప్పారు. అదీ కుర్లా నుంచి నడుపుతుండటంతో అధికశాతం తెలుగు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదని వారు గవర్నర్కు వివరించారు. ఆ రైలును రోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సదానంద గౌడ్తో మాట్లాడతానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే, మహారాష్ర్టలోని తెలుగు ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుంచో తాము పోరాటం చేస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ఫలితం కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక వర్లీ ప్రాంతంలో తెలుగుప్రజలను సమైక్యపరిచేందుకు తెలుగు భవనం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎప్పటినుంచో కోరుతున్నామని, అయితే ఇంతవరకు మంజూరు కాలేదని వారు వివరించారు. కాగా, ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు భాషతో రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ ప్రాంతీయ విభేదాలు లేకుండా కలసికట్టుగా ఉండాలని, సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ర్ట గవర్నర్గా ఉన్నంతకాలం స్థానిక తెలుగు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే త్వరలో జరుగనున్న తెలుగు సుదర్శన్ యువక సంఘం స్వర్ణోత్సవాలకు తప్పక హాజరవుతానని గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. సుమారు 30 నిముషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు గుద్దేటి నారాయణ, ప్రధాన కార్యదర్శి భోగ సహదేవ్, ఉపాధ్యక్షుడు ఆసం రాజన్న, కోశాధికారి గాజెంగి రమేష్, కమిటీ సభ్యులు గుద్దేటి గణేష్, గుడ్ల మహేందర్, భోగ సత్యపాల్, గాజెంగి వెంకటేష్, లోలం భోజరాజ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. -
తిండి లేదు.. గుక్కెడు నీళ్లూ లేవు
* శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారి గోడు ఎల్లారెడ్డిపేట/నర్మెట/భువనగిరి: ‘తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాం... తాగడానికి నీళ్లు లేక తల్లడిల్లుతున్నాం’ అంటూ జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారు తమ ఇళ్లకు ఫోన్లు చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ర్టంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు శ్రీనగర్లో ఏఐఈఈఈ, ఎన్ఐటీలలో చదువుతున్నారు. వీరిలో ఎక్కువమంది వరదల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరు నాలుగురోజులుగా తిండితిప్పలు లేకుండా పస్తులున్నట్టు తమ కుటుంబసభ్యులకు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన వంశీకృష్ణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మిత్రులతో కలసి జమ్మూకాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన అతడు అక్కడ వరదల్లో చిక్కుకుపోయాడు. అతడితోపాటు, మరో 50 మం ది తెలుగువారిని ఆర్మీ శ్రీనగర్లోని రాజ్భవన్కు తరలిం చింది. అయితే తామంతా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నా అధికారులు ఎలాంటి భోజన వసతులు ఏర్పాటు చేయలేదని వంశీకృష్ణ తన తల్లికి బుధవారం ఫోన్ చేసి గోడువెళ్లబోసుకున్నాడు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదని తెలిపాడు. కాశ్మీరుకు చెందిన వారిని అక్కడి అధికారులు వెంటవెంటనే హెలికాప్టర్లలో వారి స్వస్థలాలకు పంపిస్తుండగా తెలుగువారిని మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చాలని వంశీకృష్ణ తల్లిదండ్రులు వనజ-రామారావు కోరుతున్నారు. నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో... వరంగల్ జిల్లా నర్మెటకు చెందిన ప్రజ్ఞాపురం రజితకుమారి, అంజయ్య కుమారుడు మారుతి శ్రీనగర్లోని హజరత్బాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాడు. లడక్లోని హాస్టల్లోని మూడో అంతస్తులోని ఓ రూమంలో లగేజీని భద్రపరిచి... మిత్రులతో కలసి అతికష్టం మీద లఢక్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మారుతి మిత్రుడి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ‘హైదరాబాద్ రావడానికి విమానం ఖర్చులు రు.18 వేలు అవుతాయని, వెంటనే టికెట్కు కావాల్సిన డబ్బులు పంపించాల్సిందిగా చెబితే అకౌంట్లో వేశామని తల్లిదండ్రులు చెప్పారు. అరుుతే, అక్కడ సహాయక చర్యలు అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారని, రాజమండ్రికి చెందిన అతని స్నేహితుడు హరితో మాట్లాడేందుకు యత్నిస్తే ఫోన్ కలవడం లేదని, తమ కుమారుడు భోజనం చేయక నాలుగు రోజులు గడుస్తుందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇదిలాఉండగా, ఎన్ఐటీలో చదువుతున్న తెలుగువిద్యార్థులు 52 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. అకౌంట్లో పదివేలు వేయండి.. భువనగిరి: ‘జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విపరీతంగా వానలు పడుతున్నాయి. నేను ఉంటున్న క్యాంపస్లోకి వరద నీరు వచ్చి చేరింది. మమ్మల్ని వేరే చోటు మారుస్తారంటా.. నా అకౌంట్లో పదివేలు జమ చేయి అంటూ’ నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనాజీపురానికి చెందిన మధుసూదన్ తన అక్క శ్రీవాణికి మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫోన్ చేశాడు. మధుసూదన్ శ్రీనగర్లోని నిట్ బ్రాంచ్లో ఏఐ ఈఈఈ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీనగర్లోని నిట్ క్యాంపస్ కూడా వరదమయమైంది. దీంతో మధుసూదన్ ఇంటికి ఫోన్ చేసి తాను ఇంటికి చేరడానికి డబ్బులు అకౌంట్లో వేయాల్సిందిగా కోరాడు. -
జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
-
జెడ్డాలో తెలుగు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ తెలుగు కార్మికులు ఉండే కంటెయినర్లు మొత్తం తగలబడిపోయాయి. ప్రధానంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే.. ఆ సమయానికి ఎక్కువ మంది విధులకు వెళ్లడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలోనే ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి చాలామంది వెళ్లిపోయినా, కొంతమంది మాత్రం ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం వల్ల దాదాపు పది లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఈ ప్రమాదం గురించి అశోక్ అనే బాధితుడు 'సాక్షి'తో జెడ్డా నుంచి ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలివీ.. 'మూడు నాలుగు కంటెయినర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అవి ఇక ఏమాత్రం పనికిరావు. ఉదయం 6.30-7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కొంతమంది మాత్రం నిద్రిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలకు వెళ్లారు. అక్కడ సుమారు 200-250 మంది తెలుగువాళ్లు ఉన్నారు. ప్రాణనష్టం లేకపోయినా, గదులలో ఉన్న డబ్బులు, బియ్యం, వస్తువులు అన్నీ పూర్తిగా దగ్ధం అయిపోయాయి. అసలే కంపెనీ నుంచి జీతాలు కూడా సరిగా రాని ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో సర్వస్వం కోల్పోయాం'. -
ఒంగోలు వాసుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు
ఒంగోలు : తీర్థయాత్రలకు వెళ్లి కోల్కతాలో అస్వస్థతకు గురైన ఒంగోలు వాసుల కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువులు తమవారి సమాచారం కోసం 88866 16005 హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు. ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో వీరంతా గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి తీర్థయాత్రలకు వెళ్లారు. మరోవైపు తమవారి యోగక్షేమాల కోసం బంధువులు ఆత్రతగా ఎదురు చూస్తున్నారు. -
కోల్కతాలో తెలుగు యాత్రికులకు అస్వస్థత
కోల్కతాలో 48 మంది ఏపీ తీర్థ యాత్రీకులకు అస్వస్థత ఒంగోలు/నెల్లూరు/కావలి/హైదరాబాద్: పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు. ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి పొదిలి గురుస్వామి నాయకత్వంలో వీరంతా పాట్నా ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. వీరిలో చాలా మంది బంధువులే. వీరు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనంతరం కాళీమాత దర్శనం కోసం శుక్రవారం రైలులో కోల్కతా చేరారు. హౌరా రైల్వే స్టేషన్లో దిగగానే ఎదురుగా ఉన్న గణేశ్ భవన్ అనే హోటల్లో బస చేశారు. అక్కడి హోటల్లో అల్పాహారం, భోజనం తీసుకున్నారు. ఆ తర్వాత వారికి తీవ్రవాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీరిని అక్కడి గాంధీ సొసైటీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు బాలలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం సాయంత్రం వరకు 30 మందిని కోల్కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, కోల్కతాలో అస్వస్థతకు గురైన వారికి అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేరుస్తాం ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు. -
కాశీకి బయల్దేరిన 40 మందికి అస్వస్థత
కోల్ కతా: తీర్థయాత్రలో భాగంగా కాశీయాత్రకు బయల్దేరిని తెలుగువారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కోల్ కతా వద్ద కలుషితం ఆహారం తిని ఆదివారం 40 మంది తెలుగువాసులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వీరిని హౌరాలోని మార్వాడి స్టీట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి కాశీ యాత్ర బయల్దేరి అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం తమ తిరుగుప్రయాణానికి డబ్బుల్లేవని ఏకరవు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సుష్మాస్వరాజ్కు వైఎస్ జగన్ లేఖ
-
సుష్మాస్వరాజ్కు వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్: లిబియాలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన తెలుగువారిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బతుకుతెరువు కరవైనవారు లిబియాకు వెళ్ళారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు లిబియాలో చిక్కుకుపోయినట్లు సమాచారం ఉన్నట్లు తెలిపారు. వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖలో జగన్ కోరారు. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోసం అక్కడకు వెళ్లిన భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. హింస చెలరేగిన నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. -
లిబియాలో చిక్కుకున్న భారతీయులు
న్యూఢిల్లీ : ఉపాధి కోసం లిబియాకు వెళ్లిన భారతీయులు అక్కడ కష్టాలు పడుతున్నారు. గత రెండు రోజులుగా వారు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ కంపెనీలో పనిచేసేందుకు వీరంతా లిబియాకు వెళ్లారు. రెండేళ్ల కాంట్రాక్ట్ తో వెళ్లిన భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా బేతంచర్లకు చెందినవారే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
‘తెలుగు’ రైళ్లు కావాలి..
మహారాష్ట్ర నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు తగిన సేవలను అందించలేకపోతున్నాయి. పెరుగుతున్న తెలుగు జనాభాకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగకపోవడమే దీనికి కారణం.. ముంబై నుంచే కాక వివిధ నగరాలనుంచి తెలుగు ప్రజల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాలకు రైళ్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినబడుతోంది. ఈసారి బడ్జెట్లో తెలుగు ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.. సాక్షి, ముంబై: ఎన్డీఏ సర్కార్ ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఈ నెల 8వ తేదీన ప్రవేశపెట్టనున్న 2014-15 రైల్వే బడ్జెట్పై ముంబైలోని తెలుగు ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. తెలుగునేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి రైల్వేబడ్జెట్ కావడంతో ఈసారి బడ్జెట్లో తమకు ప్రాధాన్యం చేకూరుతుందన్న నమ్మకంతో రెండు ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు స్థిరపడిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల వాసులే కాక, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, కృష్ణా వంటి జిల్లాల ప్రజలు అధికంగా ఉన్నారు. నిజామాబాద్కు మరో రైలు వేయాలి... నిజామాబాద్కు ప్రత్యేక రైలు వేయాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ముంబై నుంచి నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది. దీంతోపాటు గత ఏడాది అక్టోబర్లో వారానికి ఒకసారి నడిచే లోకమాన్యతిలక్ టర్మినస్ (ఎల్టిటి-కుర్లా)-నిజామాబాద్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. అయితే ఈ రైలు ఎల్టిటి-కుర్లా నుంచి బయలుదేరడం, ఠాణేలో స్టాప్ లేకపోవడంతో తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని చెబుతున్నారు. అదేవిధంగా కేవలం వారానికి ఒకసారి నడపడంతో పెద్దగా సౌకర్యవంతంగా లేదన్న వాదన విన్పిస్తోంది. దీంతోపాటు నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పొడిగిస్తున్న కొత్త రైల్వే మార్గం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్-ఆర్మూర్ల మధ్య ట్రాక్ పనులు పూర్తి కావాల్సి ఉంది. అవి పూర్తయినట్టయితే ముంబై నుంచి నేరుగా నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ వరకు రైలు సేవలు ప్రారంభించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఠాణేలో స్టాప్ ఇవ్వాలి... హైదరాబాద్, విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఠాణేలో స్టాప్ ఇవ్వాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు నివసిస్తున్నారు. వీరందరూ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్ ఎక్స్ప్రెస్తోపాటు విశాఖపట్నం తదితర ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అయితే ఠాణేలో మాత్రం వీటికి స్టాప్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఠాణేలో ఈ రైళ్లను నిలుపడంతోపాటు మరో రైలును ప్రారంభించాలని వీరు కోరుకుంటున్నారు. పుణే-హైదరాబాద్ల మధ్య మరో రైలు నడపాలి... పుణేలో నివసించే తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకుని పుణే నుంచి హైదరాబాద్కు మరో రైలును నడపాలని స్థానిక తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పుణేలో తెలుగువారి సంఖ్య భారీగానే ఉంది. దీంతో పుణే నుంచి హైదరాబాద్కు ప్రతి రోజూ వేల సంఖ్యలో బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం పుణే నుంచి నేరుగా హైదరాబాద్కు ఉదయం ఒక రైలు ఉండగా వయా లాతూరు మరో రైలు ఉంది. వీటితోపాటు సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్ రైలును ఇటీవలే ప్రారంభించారు. అదే విధంగా ముంబైతోపాటు రాజ్కోట్ మొదలగు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లే రైళ్లు కూడా పుణే మీదుగా వెళ్తాయి. అయితే రాయిచూర్, గద్వాల్ల మీదుగా గుంటూర్, విజయవాడలకు వెళ్లేలా ఒక రైలు వేస్తే సౌక ర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. షోలాపూర్-హైదరాబాద్ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలి... షోలాపూర్-హైదరాబాద్ల మధ్య కొత్తగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నడపాలని స్థానిక తెలుగు ప్రజలు కోరుతున్నారు. షోలాపూర్లో సుమారు ఆరు లక్షల మందికిపైగా తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాలతో సంబంధాలున్నాయి. వీరంతా తరుచూ హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. బస్సు చార్జీలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రైలు సేవలు మరింత పెంచాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా భివండీలో స్థిరపడిన లక్షలాదిమంది తెలుగు ప్రజల సౌకర్యార్థం రాజ్కోట్-సికింద్రాబాద్ రైలులో అదనంగా ఓ బోగీని కేటాయించాలని స్థానిక తెలుగు ప్రజలు కోరుతున్నారు. -
తెలుగు జేఏసీ ఆవిర్భావం
సాక్షి, ముంబై: ముంబైలో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు తెలుగు ఐక్యకార్యాచరణ సమితి ఆవిర్భవించింది. సంకు సుధాకర్ చొరవతో గంజి గోవర్ధన్, మహేశ్వరం చంద్రశేఖర్, బండి గంగాధర్ తదితర తెలుగు ప్రముఖులు గురువారం సాయంత్రం వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలిలో ఈ విషయమై చర్చాగోష్ఠి నిర్వహించారు. సంకు సుధాకర్ సభాధ్యక్షుడిగా, వాసాల శ్రీహరి(వంశీ) గౌరవాధ్యక్షుడిగా వేదికనలంకరించారు. గంజి గోవర్ధన్ సభకు స్వాగతం పలికారు. తెలుగు ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తెలిపారు. తదనంతరం తెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర మాట్లాడుతూ... ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ముంబైలోని తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు ఓ సంస్థ ఉండాలన్నారు. సంకు సుధాకర్ మాట్లాడుతూ.. ముంబైలో ఎన్నో కులసంఘాలు, ఇతర సంఘాలు ఉన్నప్పటికీ వాటన్నింటికి పరిమితులు ఉన్నాయని, తెలుగువారందరికోసం పాటుపడే ఒక సంస్థ ఏదీ లేదని, అందుకే అన్నివర్గాల, అన్నికులాల, అన్నిప్రాంతాల ప్రతినిధులతో కూడిన ఐక్యకార్యాచరణ సమితి ఉండాలనే అభిప్రాయంతో ఈ తెలుగు జేఏసీ ఆలోచన పుట్టుకొచ్చిందన్నారు. ప్రసంగాల అనంతరం ‘తెలుగు జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటుకు ప్రముఖులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తాత్కాలిక అధ్యక్షుడిగా సంకు సుధాకర్ను ఎన్నుకున్నారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. కామాటీపుర, గోవండీ, భివండీ, వాషి, దాదర్ ప్రాంతాల్లో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి లక్ష్యాలను, ఉద్దేశాలను తెలుగు ప్రజలందరికీ తెలిపేందుకు ప్రయత్నిస్తామని సుధాకర్ తెలి పారు. భవన నిర్మాణ కూలీల సమస్యలతోపాటు ముంబైలోని తెలుగువారికి చెందిన విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, సాహితీరంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమిటీ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతామన్నారు. ఈ సమావేశంలో మాదిగ మహాసంఘం ప్రధాన కార్యదర్శి నల్లా మల్లికార్జునరావు, తెలుగు మిత్ర బృందం చైర్మన్ మర్రి జనార్ధన్, ఎంటీసేవా డాట్ కామ్ సంస్థాపకులు గాలి మురళీ, గీతా వికాస్ మండలి అధ్యక్షుడు వాసాల కిషన్, కట్టెకోల మల్లేశం, తెలుగు విద్యావంతుల వేదిక చైర్మన్ కంటే అశోక్, పద్మశాలి మిత్రమండలి అధ్యక్షుడు ఆడెపు శ్రీహరి, మున్నూరు కాపు సేవాసంఘం ట్రస్టీలు బోరిగం మల్లేశం, సిరిపురం రాజేశం, పద్మశాలి యువక సంఘం ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, పీఎస్ఎస్ఎం ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు. -
ఆపదలో 40 మంది విశాఖవాసులు
ఇరాక్లో ఓ కంటైనర్లోతిండీ, నీళ్లూ లేకుండా.. వారిని సురక్షితంగా తీసుకురావాలని స్నేహితుల వినతి ఏజెంట్ మోసంతో నెలలుగా ఢిల్లీలో మరికొందరి పడిగాపులు ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్న బాధితులు సాక్షి, న్యూఢిల్లీ: బతుకుతెరువు కోసం ఇరాక్ వెళ్లిన తెలుగువారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడుకున్న ఆ దేశంలోని నజాఫ్లో దాదాపు 40 మంది విశాఖపట్నం జిల్లా వాసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తమను పనిలోకి తీసుకున్న కంపెనీ తమను ఓ కంటైనర్ ఉంచిందని, తిండీ, నీళ్లూ లేకుండా భయం భయంగా గడుపుతున్నామని, తమను కాపాడాలని వేడుకుంటున్నారు. వీరు ఈ నెల 18నే ఇరాక్ వెళ్లారు. వీరి స్నేహితులు ఆదివారం ఢిల్లీలో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి ఈ వివరాలు వెల్లడించారు. బాధితులను సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ల మోసం వల్ల ఆగిపోయిన మరికొందరు విశాఖ వాసులు కూడా తమకు సాయం చేయాలని కోరారు. రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడిపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను ఇరాక్కు పంపుతానని మోసం చేశాడని ఆరోపించారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దండుకుని, పాస్పోర్టులు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. విశాఖ జిల్లాకు చెందిన పి. బాపినాయుడు(కసిమికోట), కృష్ణ(హరిపాలెం), ఎం ఉమామహేశ్వరావు, మల్ల అప్పారావు, శివకుమార్, శంకర్, సురేశ్(తిమ్మరాజిపేట) తదితర బాధితులు సాక్షితో గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఇరాక్లో మా జిల్లా వాళ్లు 40 మంది దాకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రెండు రోజుల కిందట మాతో ఫోన్లో మాట్లాడారు. ఓ కంటైనర్లో ఉన్నామని, భోజనం, నీళ్లు అందడం లేదని చెప్పారు. తమను ఎలాగైనా కాపాడాలని కోరారు’ అని ఉమామహేశ్వరరావు చెప్పాడు. రెండు నిమిషాలే మాట్లాడారని, వాళ్ల ఫోన్లు కలవడం లేదని తెలిపాడు. ఇరాక్ పరిస్థితులు తెలిసి కూడా ఏమీ జరగదని నమ్మించి వెంకటకృష్ణ వారిని ఈ నెల 18న అక్కడికి పంపారని మల్ల అప్పారావు ఆరోపించారు. ఢిల్లీలో నెలలుగా పడిగాపులు..: ఇరాక్ వెళ్లేందుకు లక్షల్లో సొమ్ము ఇచ్చి మోసపోయిన బాధితులు ఢిల్లీలో నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో కొందరు ఇరాక్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. హరిపాలెంకు చెందిన కృష్ణ అనే బాధితుడు మాట్లాడుతూ.. ‘ఫిట్టర్లు, వెల్డర్లకు ఇరాక్లో మంచి జీతాలు ఉంటాయని వెంకటకృష్ణ చెబితే ఆశపడ్డాం. ఒక్కొక్కరం రూ.1.5 లక్షల వరకు ఇచ్చాం. మా డబ్బులు, పాస్పోర్టులు తీసుకుని మమ్మల్ని మార్చిలో ఇరాక్ పంపారు. బాగ్దాద్ ఎయిర్పోర్టులో తనిఖీలో మావి నకిలీ వీసాలని తెలిసి పోలీసులు పట్టుకున్నారు. చాలా ఇబ్బందులు పడి తిరిగొచ్చాం. ఢిల్లీకి వచ్చిన ఏజెంట్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తిండి తిప్పలు లేవు. వెంకటకృష్ణ మా జిల్లా వాళ్ల నుంచి రూ.60 లక్షలు దండుకున్నాడు’ అని తెలిపాడు. వెంకటకృష్ణ నకిలీ వీసాలు చూపుతూ తమను మోసగిస్తున్నాడని మరో బాధితుడు చెప్పాడు. డబ్బులు, పాస్పోర్టుల కోసం ఆనంద్నికేతన్లోని ఏజెంట్ ఆఫీసు చుట్టూ తిరిగామని, ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాబినాయుడు అనే బాధితుడు చెప్పాడు. ఇరాక్లో చిక్కుకున్న తమ స్నేహితులనురప్పించి, ఏజెంట్ మోసాల బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితుల వివరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం బాధితుల గోడుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని ఏపీభవన్లో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కార్యాలయ వర్గాలు బాధితులు వివరాలతోపాటు, ఇరాక్లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించాయి. ఈ అంశాన్ని సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తామన్నాయి. మరో రెండు పట్టణాలు మిలిటెంట్ల చేతికి.. బాగ్దాద్: ఇరాక్లో సున్నీ మిలిటెంట్లు మరో రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక అల్ కాయిమ్ క్రాసింగ్పై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ జిహాదీలు ఆదివారం రవా, అనా పట్టణాలను చేజిక్కించుకున్నారు. వీరి ధాటికి ఈ పట్టణాలతో పాటు, అల్ క్వాయిమ్ నుంచి ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మకంగా తప్పుకున్నాయి. అక్కడి తిరిగి మోహరించేందుకే తప్పుకున్నామని ప్రభుత్వం తెలిపింది. మిలిటెంట్ల స్వాధీనంలోని తిక్రిత్లో వాయుసేన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. సున్నీ మిలిటెంట్లు తమ అధీనంలోని మోసుల్లో షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కాగా, ఇరాక్ మిలిటెంట్లు బలం పుంజుకుని, పొరుగు దేశాలనూ అస్థిరపరచే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్లో బందీలైన భారతీయుల విడుదల కోసం ఇరాక్లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. -
ప్రజల మనోభావాలను దెబ్బతీసింది
-
'విభజన తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నామని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జీవితంలో సంక్షోభాలను ఎదుర్కొవాలని, గత దశాబ్దాల కాలంలో రాష్ట్రం ఎన్నో అవకాశాలు కోల్పోయిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60కి పెంచామన్నారు. బీసీలకు ప్రత్యే బడ్జెట్ అమలు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. కాగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రసంగించారు. -
కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులపై చర్చించాం
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయిన అనంతరం ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమవేశ అనంతరం ఆంధ్రప్రదేశ్ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఈ ఫైల్ ను లా డిపార్ట్ మెంట్ కు పంపిచామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులకు సంబంధించి చర్చించామన్నారు. ఇరాక్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించే విషయాన్ని కూడా భేటీలో చర్చించామన్నారు. ప్రస్తుతం ఉన్న నామినేటెడ్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. బెల్టుషాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమంతిచబోమన్నారు.రుణమాఫీపై కేబినెట్ లో చర్చించామన్నారు.ఏపీలో మిగలు విద్యుత్ ఉంటే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.పీపీఏ, గవర్నర్ ప్రసంగాలపై చర్చ జరిగిన మాట వాస్తవమే కానీ, ఆ అంశాలను లీక్ చేయదల్చుకోలేదు -
ఇరాక్ లో చిక్కుకున్నవారిని ఆదుకుంటాం: పల్లె
హైదరాబాద్: ఇరాక్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకుంటామని ఏపీ సమాచార శాఖా మంత్రి పల్లెరఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఇరాక్ అల్లర్లలో చిక్కుకున్న ఎవరైనా వెనక్కి రావాలనుకుంటే ప్రభుత్వమే తీసుకువస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాక్ బాధితులకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 040-23454946, 9949054467 ఫోన్ నెంబర్ తో హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇరాక్ లో సున్ని, షియా తెగల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆక్కడ పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. రెండు తెగల మధ్య జరుగుతున్న పోరు ఇరాక్ అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. ఇరాక్ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించింది. -
'ఇరాక్ నుంచి తెలుగువారిని క్షేమంగా రప్పిస్తాం'
ఇరాక్లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి తెలుగువారిని కాపాడేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార,ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వెల్లడించారు. ఇరాక్ నుంచి వెనక్కి రావాలనుకుంటున్న తెలుగువారందరిని క్షేమంగా రప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వంతో చర్చించేందుకు రేపు తాను న్యూఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు కూడా లేఖ రాస్తామని పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు. -
సూరత్లో ఘనంగా తెలంగాణ సంబరాలు
సాక్షి, ముంబై: సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్యసమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూరత్లోని ప్రతాప్నగర్ ప్రాంతంలోగల శ్రీమార్కండేయ మందిరం ప్రాంగణంలో సోమవారం సాయంత్రం వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డుంబాల్ వార్డు తెలుగు కార్పొరేటర్ పి.వి.యస్. శర్మ, ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు, సూరత్ పద్మశాలి సమాజం కార్యదర్శి అంకం సోమయ్య, శ్రీ మార్కండేయ మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్తోపాటు తెలంగాణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి శర్మ, రాపోలు బుచ్చిరాములు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించడానికి ముఖ్య భూమిక పోషించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తదుపరి బాణసంచా కాల్చి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా ఎదురు చూసిన తెలంగాణ ప్రజల కల సాకారమైందని, తెలంగాణ అంటే నాలుగు అక్షరాలు కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. అటువంటి తె లంగాణను సాధించడానికి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది అమరవీరుల త్యాగ ఫలితంగా కళ సాకారమై ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరికీ ఎనలేని సంతోషాన్ని కలుగజేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటైతే సొంత రాష్ట్రానికి వెళ్తామనే ఆశ స్థానికుల్లో ఉందని, తమ పిల్లలకు సొంత రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని, అవన్నీ తెలంగాణలో నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి సూరత్లో ఉన్న వలస ప్రజలకు మధ్య స్నేహ వారధిగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో, సూరత్లోని అన్ని వర్గాల ప్రజల సహాయసహకారాలతో సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితిని ఏర్పాటు చేశామని, లక్ష్యం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తామని కార్యనిర్వాహకులు మచ్చ వీరన్న, శంకుపెల్లి బుగులాచారి, శ్రీనివాస్ తెలిపారు. వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో... ముంబైలోని వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుధీర్గ పోరాటంతో తెలంగాణ, అమరవీరుల త్యాగ ఫలితంగా కల సాకారమైందని వాషి తెలంగాణ సమితి అధ్యక్షుడు సైదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్, గిరి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చి అంధేరీలో.. పశ్చిమ అంధేరీలోని కపాస్వాడి ప్రాంతంలో నివసిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు సోమవారం సాయంత్రం తెలంగాణ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. గూడ నారాయణగౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, రం గులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కె. చంద్రశేఖర్గౌడ్, ఎస్. బందయ్య గౌడ్, ఎం. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సాకారమైన కల
‘‘ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి.’’ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన ఘట్టం చరిత్ర పుటలలో చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా నలుగు తూ వచ్చిన సమస్యకు ‘ముగింపు’ దొరికింది. పడింది ‘శుభం’ కార్డా, కొత్త సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే తేలుస్తుంది. ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడినప్పుడు ఇలాగే సందేహించినవారున్నారు. వారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి. ఇంత కాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల ప్రజల ఆకాంక్షకు వ్యక్తీకరణ. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేశారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం లేదు. ఇకనుంచయినా, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి. నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969 నాటి ఆందో ళనతో పోలిస్తే మొత్తం మీద శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్థం కోసం రగల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అందు చేత అలాంటి వారికి సాంత్వన కలిగించడం తెలంగాణ నాయకుల ప్రథమ కర్తవ్యం. ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పదివేలు. దాదాపు అరవై ఏళ్లు కలసి మెలసి ఉండి విడిపోయే తరుణంలో బాధప డని వారు ఉండరు. విడిపో వడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకొని వాటిని పదిలపరచుకోవడం, పెంచుకోవడం విజ్ఞుల లక్షణం. మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకో బోతోంది. తెలంగాణకు, వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధాని నగరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం అన్నీ మొదలు పెట్టి వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి హైదరాబాద్, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమైంది అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధిల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతం నూతన ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే. అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో ఉంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఉన్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేళ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి లేనిపోని గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించినంత సులభం కాదు, కొత్త రాష్ట్రాలను తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, నిష్టతో నిర్వహించ గలిగితేనే రెండు ప్రాంతాలకు ఫలితాలు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా
శ్రీకాళహస్తి : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. శుక్రవారం లక్ష్మీపార్వతి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె రాహు కేతు పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు జాతికి, పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమం పధకాలు అమలు చేశారన్నారు. -
రైళ్ల సంఖ్య అంతంతే
తెలుగు ప్రయాణికుల ఇక్కట్లు ఇన్నిన్ని కాదయా సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్లే రైళ్ల సంఖ్య అంతంతగానే ఉండడంతో నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీ కారణంగా టికెట్లు లభించలేదని వాపోతున్నారు. గంటలకొద్దీ తత్కాల్ టికెట్ కోసం క్యూ కట్టినా ఫలితం దక్కడం లేదని వారు చెబుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్కుమార్ బన్సల్ 2013-2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించినవిధంగానే ముంబై (లోకమాన్య తిలక్ టెర్మినస్) - నిజామాబాద్, ముంబై (లోకమాన్యతిలక్ టెర్మినస్) - కాకినాడ రైళ్లను ప్రారంభించినప్పటికీ ఆశించినమేర ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగిపోయిందని, ఈ కారణంగా టికెట్లు లభించడంలేదని చెబుతున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాలకు కూడా వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యం కాకపోతే కనీసం కనీసం అదనపు బోగీలైనా అమర్చాలని వారంతా కోరుతున్నారు. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని దాదాపు అన్ని జిల్లాలకు చెందినవారు నివసిస్తున్నారు. వీరిలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులతోపాటు ప్రైవేటు బస్సులు ఉన్నప్పటికీ రైళ్ల చార్జీల (స్లీపర్, జనరల్ క్లాస్)తో పోలిస్తే ఈ బస్సులకు దాదాపు రెండు నుంచి నాలుగింతలమేర అధికంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. దీంతో అనేక మంది రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్ తదితర చుట్టుపక్కల నివసించే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు అదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట, మంచిర్యాల తదితర ప్రాంతాల తెలుగు ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ముంబై నుంచి ప్రతిరోజూ నడిచే దేవగరి ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు కొత్తగా లోకమాన్యతిలక్ (కుర్లా)-నిజామాబాద్ల మధ్య రైలును ప్రారంభించినప్పటికీ ఇది వారానికి ఒకసారే నడుస్తోంది. దీంతో అనేకమంది దేవగిరి ఎక్స్ప్రెస్కే మొగ్గుచూపుతున్నారు. దీంతో వేసవి సెలవుల సమయంలో ఇదికూడా బాగా రద్దీగా ఉంటోంది. అత్యధిక శాతం మంది ప్రజలు దేవగిరి ఎక్స్ప్రెస్ రైలుపైనే ఆధారపడుతున్నారు. దేవగిరి ఎక్స్ప్రెస్లో టికెట్ లభించని సందర్భంలో మరో రైలు టికెట్కోసం యత్నిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. దేవగరి రైలులో నిజామాబాద్కు ప్రత్యేక కోటా లేకపోయినప్పటికీ నాందేడ్ ప్రజలకు మాత్రం ఈ రైలులో ప్రత్యేక కోటాను కల్పించారు. దీంతో ఏ కాలంలోనూ ఈ రైలు టికెట్లు దొరకడం లేదు. ఒకవేళ తత్కాల్ టికెట్ల కోసం యత్నించినా అది క్షణాల్లో వెయిటింగ్ జాబితాకి చేరుకుంటోంది. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన రైలులోకూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో మరో కొత్త రైలు కేటాయించపోయినప్పటికీ కనీసం దేవగరి రైలుకు మరిన్ని బోగీలను అమర్చడంతోపాటు లోకమాన్యతిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలును ప్రతి రోజూ నడపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ముంబై నుంచి ఈమార్గంలో వెళ్లే ఏదైనా ఓ రైలును నిజామాబాద్ వరకు పొడగించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి వాటిలో ప్రస్తుతం సికింద్రాబాద్-మన్మాడ్ల మధ్య నడుస్తున్న అజంతా ఎక్స్ప్రెస్, ముంబై-నాందేడ్ల మధ్య నడుస్తున్న తపోవన్ ఎక్స్ప్రెస్లున్నాయి. అదేవిధంగా వీలైతే నిజామాబాద్ మీదుగా మన్మాడ్, నాగర్సోల్ వరకు నడుస్తున్న రైళ్లను ముంబైదాకా పొడగించాలని కూడా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఠాణేలో ఆపాలి నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లను కొద్దిసేపు ఠాణేలో ఆపాలని తెలుగు ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తెలంగాణ ప్రాంత ప్రజలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు కూడా నివసిస్తున్నారు. వీరంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్, విశాఖపట్నం ఎక్స్ప్రెస్లతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన లోకమాన్యతిలక్-కాకినాడ ఎక్స్ప్రెస్లున్నాయి. అదేవిధంగా వారానికి ఒకసారి నడిచే భావ్నగర్-కాకినాడ రైలు కూడా కల్యాణ్ మీదుగానే వెళుతుంది. ఇక ఎల్టీటీ-కాకినాడ రైలును వారానికి రెండుసార్లు నడుపుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంతాల ప్రజలకు కోసం కొత్తగా ప్రారంభించిన లోకమాన్య తిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలుతోపాటు పైనపేర్కొన్న రెళ్లలో ప్రయాణించేందుకు ఠాణే చుట్టుపక్కల నివసించే ప్రజలకు లోకమాన్యతిలక్ టెర్మినస్ లేదా, కల్యాణ్ వరకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రైళ్లను ఠాణేలో నిలపకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుగు ప్రయాణికులు వాపోతున్నారు. -
ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు
మున్సిపల్ ఫలితాలపై బాబు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న ఆయన పేరుతో పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ పట్ల విశ్వాసం ఉంచి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ తీర్పును స్పష్టంగా, టీడీపీని బలోపేతం చేసే విధంగా ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. టీడీపీ విధానాల పట్ల ప్రజలకున్న అపార నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే సెంటిమెంట్తో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలను కొంత మేరకు ప్రభావితం చేయటం వల్ల తమకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో తమ వెన్నంటి ఉన్న ప్రజలకు భవిష్యత్లో అండగా ఉంటామని చెప్పారు. కాగా, పురపాలక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకొన్నారు. -
‘ఉత్తర ముంబై’ బరి పలుచోట్ల తెలుగు ఓటర్లే కీలకం
సాక్షి, ముంబై: ఉత్తర ముంబై లోక్సభ నియోజకవర్గంలో పెద్దఎత్తున తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దీని పరిధిలో బోరివలి, దహిసర్, మఘఠాణే, తూర్పు కాందివలి, చార్కోప్, పశ్చిమ మలాడ్ శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ నిరుపం మళ్లీ బరిలో ఉండగా, బీజేపీ అధిష్టానం ఈసారి బోరివలి ఎమ్మెల్యే గోపాల్ శెట్టిని బరిలోకి దింపింది. ఆప్ తరఫున సతీష్ జైన్, సమాజ్వాదీ పార్టీ తరఫున కమలేష్ యాదవ్లు పోటీ చేస్తున్నారు. ఈ స్థానం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మరాఠీ, మైనార్టీ ఓటర్లతోపాటు అనేక రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కీలకంగా ఉన్నారు. వీరిలో పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలుగు ప్రజల మనోభావాలు వారి మాటల్లోనే... మేలు చేసేవారే కావాలి సమాజానికి మేలు చేసే నాయకులు కావాలి. నిస్వార్థంగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకుపోగలగాలి. అటువంటి వారే ప్రస్తుతం అవసరం. ప్రతి నాయకుడు ధర్మానికి కట్టుబడి సమాజాన్ని నడిపించాలి. - తోకల రాములు మోడీయే మేలనిపిస్తోంది రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి అనేకమంది డబ్బు సంపాదన కోసం నామినేషన్లు వేస్తున్నారు. ప్రజాసేవ చేద్దామనే ఆలోచన కలిగినవారి సంఖ్య అంతంతమాత్రమే. డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో గెలుపొందిన వారే సమస్యలు పరిష్కరిస్తారని నా నమ్మకం. గుజరాత్లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి చూశాక దేశ ప్రధాని కూడా ఆయనే అయితే బాగుంటుందనిపిస్తోంది. మోడీ మేలు చేస్తాడనిపిస్తోంది. - సైదులు పోలెపాక హామీలు నెరవేర్చాలి ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే నాయకుడు కావాలి. స్థానిక సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తగల గాలి. భారీగా నిధులు తీసుకొచ్చి ఏ సమస్యనైనా పరిష్కరించగలగాలి. నిత్యం ప్రజలతో మమేకమవ్వాలి. వారి కష్టాలను తెలుసుకోవాలి. పది హామీలిస్తే కనీ సం ఏడింటినైనా నెరవేర్చాలి. - గాజుల మహేష్ ధరలు విపరీతంగా పెరిగాయి గత పదేళ్ల కాలంలో యూపీఏ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యుడి బతుకు భారంగా మారింది. పెట్రోల్ ధరలు సంవత్సరానికి ఐదు సార్లు పెంచారు. వాహనాలను ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. - వై.నరసింహులు -
శ్రీనివాసా... గోవిందా
పింప్రి, న్యూస్లైన్: చించ్వడ్లోని శ్రీవేంకటేశ్వర (బాలాజీ) దేవాలయంలో 12వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పరిసరాల్లో భక్తిమయ వాతావరణం నెలకొంది. ఏడు కొండల వాడా...వెంకటరమణా గోవిందా...గోవిందా నినాదాలతో మారుమోగింది. మొదటి రోజు ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం వేకువ జామునుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొదట విఘ్నేశ్వర పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం నుంచి వచ్చిన చంద్రశేఖర శర్మ గోపూజ చేశారు. గోపూజ మహాత్మ్యం గురించి భక్తులకు వివరించారు. గోవు సమస్త దేవతలకు ప్రతిరూపమని, గోపూజ చేసిన తర్వాతనే ఎలాంటి పూజా కార్యక్రమాన్నైన్నా ప్రారంభించాలని పేర్కొన్నారు. ఆవు పంచకంతో సర్వ పాపహరణం జరుగుతుందని ఉద్బోధించారు. తర్వాత శ్రీవారికి అభిషేకం తదితర ప్రత్యేక పూజలతోపాటు అర్చనలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్ఠాపన పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో తెలుగు వారితోపాటు మరాఠీయులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు మందిరం ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఎలాంటి తోపులాట జరగకుండా ఆలయ నిర్వాహకులు ప్రాంగణంలో క్యూపద్దతి కోసం రేలింగ్ ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ మహా ప్రసాదాన్ని నిర్వాహకులు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్ధం నీడనిచ్చేందుకు పచ్చటి పందిరి, మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. -
‘శివసేనను తెలుగువారు ఆదరించాలి’
సాక్షి, ముంబై: ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థుల విజయానికి తెలుగు ప్రజలు కృషి చేయాలని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ పిలుపునిచ్చారు. దాదర్లోని శివసేనభవన్లో ముంబై తెలుగు సేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తెలుగు శివసైనికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ దేశాయ్ మాట్లాడుతూ...తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక్క శివసేన పార్టీయేనన్నారు. తెలుగువారికి ఉగాది, మరాఠీయులకు గుడిపడ్వాతో కొత్త సంవత్సరం మొదలవుతుందని చెప్పారు. మన భాషలు వేరైనా సంప్రదాయం ఒక్కటేనని గుర్తు చేశారు. ఇలా ఒక్కటిగా ఉన్న మనలో విభేదాలు సృష్టించేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటిలాగే ముందుంటామని తెలిపారు. బాల్ఠాక్రేకు గతంలో రక్షాబంధన్ రోజు మొదట రాఖీ కట్టింది కూడా తెలుగు మహిళే అని గుర్తు చేశారు. ఇంత అవినాభావ సంబంధం ఉన్నందునే తెలుగువారికి కామాటిపుర ఎమ్మెల్యే టికెట్, వర్లీ, ధారావి నుంచి కార్పొరేట్ సీట్లు కేటాయించామని తెలిపారు. ఇది ఒక్క శివసేన వల్లే సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో అరవింద్ సావంత్, రాహుల్ శెవాలె, గజానన్ కీర్తికర్లను గెలిపించాలని కోరారు. గతంలో అభివృద్ధి పనులు చేసిన ఘనతఎన్డీఏకి మాత్రమే ఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రే రోడ్ షో ప్రచారంలో ఉన్నందున రాలేకపోయారని తెలిపారు. అనంతరం దక్షిణ ముంబై శివసేన పార్టీ అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శివసేన వెంట నడవాలని కోరారు. సభ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలందరికి ముంబై తెలుగు సేన అధ్యక్షుడు వాసాల శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. సభలో కార్యాధ్యక్షుడు టి. ప్రకాశ్స్వామి, ఉపాధ్యక్షుడు వినోద్చారి, మైస బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ బాల్రాజ్, ఉప కార్యదర్శకుడు సురేష్ దాస, జిందం భాస్కర్, గోసికొండ శ్రీహరి, కోశాధికారి అనుమల్ల సుభాష్, సభ్యులు మల్లేశ్ కల్లూరి, అంజయ్య చెరక, శ్రీనివాస్ గుల్పల్లె. మహిళలు..శారద పాపన్, పుష్ప వాసం, నాగరాజ్ శివసైనికులు, నాగేశ్ సింగా, వర్లీ నుండి బొరిగం మల్లేశం, చాప పరమేశ్వర్, క్యాతం ప్రకాశ్, గడాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భివండీ నుదుట తెలుగు ‘రాత’
భివండీ, న్యూస్లైన్: భివండీ పట్టణంలో నివాసముంటున్న వివిధ భాషల ఓటర్లలో తెలుగు ప్రజలే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల దృష్టి తెలుగు వారి ఓటర్లపైనే ఉంది. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుగువారిని ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. భివండీ లోక్సభ నియోజకవర్గంలో కుణబి సమాజ ఓటర్లు 3,15,315 మంది, ఆగ్రి, కోళి కులాల ఓట్లు 2,24,376, ఆదివాసుల ఓట్లు 2,41,302, ముస్లిం వర్గాల ఓట్లు 2,41,302, ఉత్తర భారతీయుల ఓట్లు 94,000, దక్షిణ భారతీయుల ఓట్లు 72,000, మరాఠా సమాజం ఓట్లు 1,69,416, ఇతరుల ఓట్లు 37,000 మొత్తం 13,94,711 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ కులాలకు సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంవల్ల అందులో కొంత శాతం ఓట్లు వారికే పోలయ్యి మిగతావి చీలిపోయే అవకాశముంది. కాని తెలుగు సమాజం నుంచి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల వీరంతా ఎవరికి ఓటువేసినా బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులందరూ వీరిని దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారి ఓట్లు కీలకం..... భివండీ తూర్పు, భివండీ పశ్చిమప్రాంతాల్లో సుమారు 70 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు అత్యంత కీలకం కావడంతో ప్రధా న పార్టీలైన బీజేపీ, ఎమ్మెన్నెస్ అభ్యర్థులు తెలుగు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శాయశక్తులా ‘ప్రయత్నాలు’ చేస్తున్నారు. ‘ఆదర్శ’ వ్యక్తి రావాలి భివండీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసే నాయకుడు కావాలి, అదేవిధంగా భివండీ నుంచి ముంబై వరకు లోకల్ రైలు, రోడ్డు రవాణా సదుపాయలకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమల అభివృద్ధి కోసం కృషిచేసే వ్యక్తి కావాలి. ఎన్డీయేతోనే అభివృద్ధి 1999లో వాజ్పాయ్ ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమ ఆధునికీకరణకు రూ.25 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. యూపీఏ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. - సిరిపురం తిరుపతి (పద్మనగర్) ధరలు తగ్గించాలి ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెంవేసే నాయకుడు కావాలి. ముఖ్యంగా భివండీలో విద్యుత్ వినియోగదారులను దోచుకుంటున్న టోరంట్ కంపెనీని తరిమికొట్టే సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలి. - పాము మనోహర్-డాక్టర్ (మానససరోవర్) పరిశ్రమలను అభివృద్ధి చేయాలి భివండీ అభివృద్ది చెందాలంటే రవాణా సదుపాయాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీలు, వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, ఉన్నత విద్యకు పోరాడే నాయకుడు కావాలి. - కొండాబత్తుల మహేశ్- న్యాయవాది (మార్కండేయ నగర్) తెలుగోళ్ల బాగు చూడాలి పట్టణంలో మరమగ్గాల పరిశ్రమలో అత్యధికంగా తెలుగు ప్రజలే పనిచేస్తున్నారు. వారి ప్రయోజనాలు, ఇళ్లు, ఇతర పథకాల కోసం పోరాడే వాడు కావాలి, మరమగ్గాల ఆధునీకరణ, ప్రత్యేక సంక్షేమ పథకాలు, మహిళలకు విద్య, వైద్య, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు కల్పించే నాయకుడు కావాలి. - భిమనాధిని శివప్రసాద్ (పద్మనగర్) -
‘తెనాలిరామన్’పై ఆగ్రహం
చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీకృష్ణదేవరాయలను కించపరుస్తూ తమిళ సినీ హాస్య నటుడు వడివేలు హీరోగా నిర్మించిన తెనాలిరామన్ చిత్రంపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిత్రాన్ని నిషేధించాల్సిందేని ముక్తకంఠంతో ఘోషించాయి. ఒకే తల్లిబిడ్డల్లా మెలగుతున్న తెలుగు, తమిళుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు తమిళ సినీ పెద్దలు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వల్లువర్కోట్లం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించాయి. పలు తమిళ సంఘాలకు చెందిన వారు సైతం ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం విశేషం. ఇండియన్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ, తెనాలి రామన్ చిత్రంపై తమ ఆందోళన కేవలం తెలుగుభాషా పరమైనది కాదని, ద్రవిడ సంస్కృతిని కాపాడుకునే యత్నమని అన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రే లేదని చిత్ర నిర్మాత, దర్శకులు ప్రకటించగా, సెన్సార్ అధికారి ఉందని చెప్పడం గమనార్హమని అన్నారు. సినిమా విడుదల సమయంలో తెలుగువారి ముసుగులో కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ అనుమానాన్ని ఎన్నికల కమిషన్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం కాపాడుకునేందుకు పదిరోజులుగా అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కృష్ణదేవరాయల పాత్ర చిత్రీకరణ తమ సంస్కృతికి విరుద్దంగా ఉందని అన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చేందుకు కొందరు రెచ్చగొట్టే చర్చలు చేపడుతున్నారని ఆరోపించారు. తెలుగువారంటే ప్రత్యేక అభిమానమని చెప్పే సీఎం జయలలిత ఈ విషయంలో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ మేము ఆమెకు అండగా ఉన్నాం, ఈరోజు ఆమె మాకు అండగా నిలవాలని జయకు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్రపంచ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి, పెరియార్ యూనివర్సిటీ సభ్యులు తంగటూరి రామకృష్ణ మాట్లాడుతూ, మొత్తం భారత దేశమే కీర్తించే శ్రీకృష్ణ దేవరాయల, తెనాలిరామకృష్ణల పాత్రలను సైతం అభ్యంతరకరంగా చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో ఈ చిత్రం విడుదలను నిలిపివేశారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఁఆహో అంధ్రభోజా శ్రీ కృష్ణదేవరాయ...రూ. అంటూ ప్రసిద్ద తెలుగుసినిమా గీతాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త ఆలపించారు. ద్రవిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ, తెలుగు, తమిళులు రాష్ట్రంలో పాలునీళ్లలా కలిసిపోయివుండగా, ఈ చిత్రం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేదిగా ఉందని అన్నారు. కొందరు బెదిరిస్తే తెలుగువారు భయపడిపోరని తమిళనాడు తెలుగమక్కల్ పేరవై అధ్యక్షుడు బాలగురుస్వామి వ్యాఖ్యానించారు. తమిళుడు అంటూ వడివేలును వెనకేసుకువచ్చే ఈ నేతలు మూడేళ్లుగా సినిమాలు లేని అతనికి ఏరకమైన అండగా నిలిచారని నిలదీశారు. ఐటీఎఫ్ కార్యదర్శి నందగోపాల్ తమిళంలో ప్రసంగించి నినాదాలు చేశారు. జార్ఖండ్ ముక్తిమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్ ప్రసంగించారు. ధర్నాలో టామ్స్ అధ్యక్షుడు గొల్లపల్లి ఇజ్రాయల్, శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శిగుంట శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్టవ్యాప్తంగా ఘనంగా ఉగాది
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుప్రజలు సోమవారం ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షల బోర్డులను ఏర్పాటుచేశాయి. ఖరాస్ బిల్డింగ్లో... ఖరాస్ బిల్డింగ్లో ‘ఓం పద్మశాలి సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ను సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ఉపాధ్యక్షుడు అంబల్ల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, సిద్ధివినాయక మందిరం ట్రస్టీ సభ్యుడు ఏక్నాథ్ సంగం తదితరులు సత్కరించారు. అనంతర ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కాగా ఓం పద్మశాలి విజయ సంఘం-(కమ్మర్పల్లి) ముంబై శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు గుడ్లనడిపి. లింబాద్రి, ప్రధాన కార్యదర్శి చింత రాంప్రసాద్, కోశాధికారి గుడ్ల రమేశ్, కార్యదర్శి చిలుక కిషన్, కమిటీ సభ్యులు వేముల నారాయణ, చిలివేరి నరేంద్ర, బొడ్డు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎస్ ఆధ్వర్యంలో... మోర్తాడ్ పద్మశాలి సంఘం (ఎంపీఎస్) ముంబై శాఖ ఆధ్వర్యంలో జయ నామ ఉగాది సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, కార్యదర్శి అరుట్ల మల్లేశ్వర్, సలహాదారులు కామని బాబూరావు, యెల్ది సుదర్శన్, యెల్ది గణేశ్ తదితరులు పాల్గొన్నారు. చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం సంఘ సభ్యులు తీర్థప్రసాదాలతోపాటు పచ్చడిని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బండి దామోదర్, ప్రధాన కార్యదర్శి కారంపూడి మనోహర్, కోశాధికారి అంబల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ పద్మశాలి సంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చాట్ల గజానంద్, ప్రధాన కార్యదర్శి కట్కం రవీంద్ర, కోశాధికారి చాట్ల అశోక్ పాల్గొన్నారు. వర్లిలో... పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజమల్లు పంతులు మార్కండేయ మహాముని విగ్రహానికి పూలమాల వేసి పూజ చేశారు. అనంతరం ప్రసాదం, పచ్చడిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ సుధారక మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి, సాంస్కృతిక సమితి ప్రతినిధి అల్లె శంకరయ్య, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు చింతకింది ఆనందం, జిందం భాస్కర్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీపీఎస్ ఆధ్వర్యంలో.... శ్రీ వేంపేట పద్మశాలి సంఘం (వీపీఎస్) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గాజంగి చక్రపాణి, కోశాధికారి జక్కని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా బీడీడీ చాల్ నంబరు 106లోని శ్రీరామ బాల సంఘం కార్యాలయంలోనూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షుడు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభాదేవిలో.. ప్రభాదేవిలోని ఏర్గట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన సభ్యులందరికీ పచ్చడిని పంపిణీ చేశామని అధ్యక్షుడు యెలిగేటి నడ్పి రాజారాం, ప్రధాన కార్యదర్శి దొంతుల హన్మాండ్లు, కోశాధికారి కంటం శ్రీధర్ లు చెప్పారు. ఉగాది పచ్చడి పంపిణీ ధారావిలోని మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ లోక్సభ నియోజక వర్గం ఎంపీ మధు యాష్కీ గౌడ్ను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మచ్చ ప్రభాకర్, వాళేశ్వరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడుగుంట్ల వేంకటేశ్ గౌడ్, కార్యాధ్యక్షుడు కారింగు అంజయ్య, ప్రధాన కార్యదర్శి గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, ఉపాధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి గొల్పుల లింగయ్య, కార్యదర్శి సాక శేఖర్, సహకోశాధికారి కన్నెబోయిన వెంకటేశ్, యూత్ అధ్యక్షుడు పురుగల కృష్ణ, యూత్ ఉపాధ్యక్షుడు ఎల్లంల సతీష్కుమార్, వేదిక నిర్వాహకులు పాక శంకర్, సరిగే సైదులు, నిర్వాహకులు బత్తుల శంకర్, బీసం వెంకన్న, బాసాని నర్సింహ, గుండబోయిన కృష్ణ ఎన్నుకున్నారు. ప్రతీక్షా నగర్లో... ప్రతీక్షానగర్ పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశామని సంస్థ అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్, కార్యదర్శి అంజనేయులు చెప్పారు. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో... గోరేగావ్లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జయనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరమల్ల మల్లేశ్, ఉపాధ్యక్షుడు వంటపాక శేఖ ర్, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, కోశాధికారి బక్క అంజయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో... ఘాట్కోపర్ కామ్రాజ్నగర్లోని తెలుగు రహివాసి సేవా సంఘం (టీఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులకు పచ్చడి పంపిణీ చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కుల తిరుపతి, గాలి మురళీధర్, చౌకి నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా పశ్చిమ గోరేగావ్లో తెలంగాణ ప్రజాసంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం అందరికీ షడ్రుచుల పచ్చడిని పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజాసంఘం కార్యాధ్యక్షుడు బక్క అంజయ్య ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘం అధ్యక్షుడు వీరమల్ల మల్లేష్, కోశాధికారి పరమేశ్ భీమగోని, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటపాక, నర్సిరెడ్డి మన్నె, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, నర్సింహ బీనా మోని, శంకర్ బద్దం, గణేశ్. మచ్చ, సుక్క. అంజయ్య, కురుపీటి. కృష్ణ, మల్లేశ్. గాదె, లక్ష్మణ్, ఎర్ర, జానీ, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ‘జయ’ ఉగాది
అన్నానగర్, న్యూస్లైన్: మెరీనా తీరంలో జయనామ ఉగాదిని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మద్రాసు వర్సిటీ తెలుగు విభాగం, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం సాహితీ విభాగం, నవసాహితీ కలిసి మెరీనా రజతోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయ ఉగాది వేడుకలకు ప్రముఖ వైద్యుడు సీఎంకే రెడ్డి విశిష్ట అతిథిగా విచ్చేసి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. రాబోయే జయ ఉగాది అందరికీ మంచి చేయాలని ఆయన అభిలషించారు. మరో విశిష్ట అతిథి పెరియార్ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, కొత్త ఆశలు, ఆశయాలతో జయ నామ ఉగాదిని ప్రారంభించాలన్నారు. ఆత్మీయ అతిథి హోదాలో వచ్చిన దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ ప్రస్తుతం మనమంతా జయ(అమ్మ) రాష్ట్రంలో ఉన్నాం గనుక జయానికి ఎదురులేదని చలోక్తి విసిరారు. ప్రసంగాల అనంతరం అంతర్జాతీయపురస్కారం పొందిన చిత్రం మిణుగురులు సంగీత దర్శకుడు జోస్యభట్ల రాజశేఖర శర్మ, చిత్ర దర్శకుడు కె.అయోధ్యకుమార్కు కాట్రగడ్డ, సీఎంకే రెడ్డి, అఖిల భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు రవికోటార్కర్ అభినందన చందనం పేరిట ఘనంగా సత్కరించారు. పురస్కారం అందుకున్న శర్మ, అయోధ్యకుమార్ మాట్లాడు తూ, మద్రాసులోని తెలుగు వారికి రుణపడి పోయామన్నారు. ఈ ఉగాదిని చెన్నైలో తెలుగు వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. డాక్టర్ వై బాలశౌరి రెడ్డి, గోటేటి శ్రీరామారావు, ఇ.ఎస్ రెడ్డి, ఆచార్య ఎల్.బి. శంకరరావు, కాకాని వీరయ్య, గంగరాజు మోహనరావు, ఇట్టా సాంబశివరావు, విద్వాన్ ఎస్ దశరథరామిరెడ్డి, ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆచార్య డి.చిన్ని కృష్ణయ్య, డాక్టర్ పుల్లూరి ఉమ, సరోజినీ ప్రేమ్చంద్, పుట్టా జయరామ్, సిహెచ్ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ తెలుగు ప్రముఖులకు మాడభూషి సంపత్ కుమార్, నవ సాహితి కార్యదర్శి ఎస్వి సూర్యప్రకాశరావు, అధ్యక్షుడు దోర్నాదుల సత్యనారాయణ నేతృత్వంలో వేదికపైనున్న విశిష్ట అతిథులు ఘనంగా సన్మానించారు. సాయంత్రం 5 గంటలకు 44 మంది ప్రముఖ కవులతో ఉగాది కవితా సమేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో దశరథరామిరెడ్డి, వీరయ్య, గంగరాజు మోహనరావు, ఎల్.బి.శంకరరావు, చిన్ని కృష్ణయ్య, జివిఎస్ఆర్ కృష్ణమూర్తి, కాసల నాగభూషణం, ఉప్పలధడియం వెంకటేశ్వర్లు, గుడిమెట్ల చెన్నయ్య, వంజరపు శివయ్య, ఎ.వి శివకుమారి, వెన్నెలకంటి, సరోజినీ ప్రేమ్చంద్, విస్తాల శంకరరావు, కె.లక్ష్మణ, ప్రణవి, తమిళ్సెల్వి, ఎస్వి. సూర్య ప్రకాశ రావు, పి.ఆర్. కేశవులు, ఎం.గంగాధర ప్రసాద్, జె.కె.రెడ్డి, మొదలి శ్రీరామప్రసాద్, ఎం. కళ్యాణి, వె.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, వై.వి రాజారావు, వారణాశి శివరామకృష్ణ, కోట శ్రీరామచంద్రమూర్తి, భువనచంద్ర, ఎస్.బషీర్, టి.మోహనశ్రీ, ఉప్పలూరి విజయలక్ష్మి, కె.ఎం వీరేశ్, పి.గోపాల్, జి.ఎన్.శ్యామల, అంబృణి, ఎలిజబెత్ జయకుమారి, ఎం.మునిరత్నం, డి.వేలాయుధం, అద్దేపల్లి సుచిత్రాదేవి, పి.ఎస్. మైథిలి, బాలసుబ్రమణ్యం, ఈశ్వర కంబార, కె. శశికుమార్, ఒ.బసవరాజ్ వంటి కవులు పాల్గొని ఉగాది ప్రాశస్త్యాన్ని తెలిపే పలు కవితలను చదివారు. ఈ కవితా సమ్మేళనానికి చెన్నై ఆకాశవాణి తెలుగు విభాగం అధికారి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కవితానుశీలన కర్తగా వ్యవహరించారు.దీనికి వై.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, మల్యాది, జేకేరెడ్డి, ఇ.ఎస్. రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రముఖ పురోహిత ద్వయం అశ్వినీ-రోహిణీ శాస్త్రీ తమ పంచాంగ శ్రవణంతో ప్రారంభించారు. మాడభూషి సంపత్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. -
ఎడారి బతుకులు
జన పథం: గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజల రక్షణ నా బాధ్యత. అధికారంలోకి రాగానే జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పిస్తా. వారికి ఆర్థిక ఆసరా కల్పిస్తా. గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తా. బోగస్ ఏజెంట్లను అరికడతా. భవిష్యత్తులో ఉపాధి కోసం ఎవరూ గల్ఫ్కు వెళ్లే అవసరం లేకుండా చూస్తా. - వైఎస్ జగన్మోహన్ రెడ్డి గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించినవారి శవాలు ప్రస్తు తం 180 వరకు ఉన్నాయి.వాటి కోసం నెలల తరబడి ఎదురు చూడ లేక వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. వలస దేశంలో కష్టాలకు తట్టుకోలేక, వెనక్కి వచ్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు కొందరైతే, ప్రమాదవశాత్తు మరణిస్తున్న వారు మరికొందరు. ఇలా మరణించిన వారి శవాలు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో 180 ఉన్నాయి. కనీసం ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక, నెలల తరబడి శవ జాగరణ చేయలేక వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీం. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఈ విషాద ఘటనలు కనిపిస్తాయి. పెద్ద దిక్కు దూర దేశంలో తల్లడిల్లుతుంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దిక్కుతోచక అలమటిస్తున్నారు. కరీంనగర్, నెట్వర్క: ఉన్న ఊళ్లో బతుకు కురువై పరాయి దేశాలకు వెళ్లిన ‘వలస’ ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిలక్షల మంది ఎడారి దేశాలకు వలస వెళ్లారు. వీరి కుటుంబ సభ్యులను కూడా కలుపుకొంటే దాదాపు 52లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చనున్నారు. ఎన్నికలప్పుడు తప్ప ఏనాడూ తమ సమస్యలు ప్రస్తావించని నేతల పనిపట్టేందుకు ఓటును ఆయుధంగా వాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం స్వగ్రామాలకు పయనమవుతున్నారు. వ్యవసాయంలో చితికిపోయి.. అంతవరకు తలెత్తుకు తిరిగిన ఊళ్లో కూలీలుగా బతకడం ఇష్టం లేక వలస పోతున్న బడుగు జీవుల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల వారే అధికం. దేశం విడిచి విమానమెక్కుతున్న వీరు పాస్పోర్టు మొదలు వీసా వరకు అన్నింటా మోసపోతున్నారు. బ్రోకర్లు, ఏజెంట్ల మోసాలు.. సరైన పత్రాలు లేక, వేతనం అందక.. వీధుల పాలై దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. 26 సెగ్మెంట్ల పరిధిలో.. తెలంగాణలోని ఆరు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 26 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ బాధితులున్నారు. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, వేవుులవాడ, ధర్మపురి, హుజూరాబాద్, చొప్పదండి, వూనకొండూరు, కరీంనగర్, పెద్దపల్లి, రావుగుండం నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులు కోకొల్లలు. మెదక్ జిల్లాలో మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మల్, ఖానాపూర్, భైంసా నియోజకవర్గాలు, నిజావూబాద్ జిల్లాలో జుక్కల్ మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితులున్నారు. ప్రవాస భారతీయుుల హక్కులు, సంక్షేవు వేదిక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 26 నియోజకవర్గాలను గల్ఫ్ కార్మిక ప్రభావిత సెగ్మెంట్లుగా గుర్తించి దీనికి గల్ఫ్ జోన్గా పేరు పెట్టింది. కోటిమంది వలస జీవులు యుూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వున దేశ కార్మికుల సంఖ్య దాదాపు కోటికి చేరింది. 2012 అక్టోబరు వరకు ఈ సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు లోక్సభలో విదేశీ వ్యవహారాలశాఖ వుంత్రి వయలార్ రవి ప్రకటించారు. వీరిలో తెలంగాణ జిల్లాల నుంచి 12 లక్షల మంది వరకు ఉండగా, అందులో దాదాపు 3.75 లక్షల వుంది కరీంనగర్ జిల్లా వారే. హామీలు.. నీటి మూటలు వలస జీవుల వెతలు పరిష్కరిస్తామన్న నేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర శాఖ ఉత్తుత్తిగానే మిగిలిపోయింది. యూఏఈ ప్రభుత్వం 2012 డిసెంబర్ 3వ తేదీ నుంచి 2013 ఫిబ్రవరి 3 వరకు అమ్నెస్టీ(క్షమాభిక్ష) విధించినా మన ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అప్పటి మంత్రి శ్రీధర్బాబును దుబాయ్ పంపి సర్కారు తరఫున 27 వుందికి మాత్రమే టికెట్లు అందజేసి చేతులు దులుపుకొంది. ఆశపడి వెళ్లి.. ఆగమయ్యాడు ఈ యువకుడి పేరు కొంకటి రాజు. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి.. మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. రాజుది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాళ్ల పేట. ఎడారి దేశం వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని ఆశపడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్ఫ్ ఏజెంట్ రమణను ఆశ్రయించాడు. అప్పుచేసి లక్షరూపాయలు సమర్పించాడు. నెలకు రూ.12వేలు జీతం వస్తుందన్న ఆశతో మస్కట్ విమానమెక్కితే అక్కడికెళ్లాక నెలకు రూ.ఐదువేలే చేతిలో పెట్టడంతో నిర్ఘాంతపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోకమునుపే తమ దేశంలో అక్రమంగా ఉంటున్నాడని పోలీసులు అరెస్టు చేసి మూడు నెలలు జైల్లో పెట్టారు. పది నెలల క్రితం విడుదలై తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్ పేరిట నెత్తిపై పడిన రూ.రెండు లక్షల అప్పు తీర్చేందుకు ఇప్పుడు కూలి పనులు చేస్తున్నాడు. - న్యూస్లైన్, సిరిసిల్ల వలసలకు ఆద్యుడు - చంద్రబాబు హయాంలో 1995 నుంచి 2004 మధ్య కరువు తాండవించింది. పనులు లేని గ్రామీణులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల వలసలు ఎక్కువయ్యాయి. - 1995లో జిల్లా కేంద్రం నుంచి రోజుకో బస్సు ముంబయికి వెళ్తే కరువు తీవ్రతతో పాటు బస్సుల సంఖ్యా పెరిగింది. సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ డిపోల నుంచి రోజూ ఎనిమిది బస్సుల్లో 400 మంది ముంబయికి పనుల కోసం వెళ్లేవారు. - ముంబయి కన్నా కొంత మెరుగైన వేతనాలుండడంవల్ల దుబాయి, మస్కట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. - యువకులంతా వలస వెళ్లగా అప్పట్లో గ్రామాల్లో శవాన్ని మోసేందుకు సైతం మగవారు లేని దుస్థితి కనిపించేది. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లిలో చాలాకాలం వృద్ధులు తప్ప యువకులు కనిపించలేదు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో ఇంటికొకరు గల్ఫ్కు వెళ్లారు. - గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అప్పుడే మొదలయ్యాయి. విజిటింగ్ వీసాలపై దుబాయి, మస్కట్ తీసుకెళ్లారు. ఆ వీసాల మీద వెళ్లి పోలీసులకు చిక్కి వేలాది మంది జైలుపాలయ్యారు. - వీసాలు ఇప్పిస్తామంటూ లెసైన్స్లు లేకుండానే బోర్డులు పెట్టి ట్రావెల్ ఏజెన్సీలు నడిపించారు. వీరిపై చర్యలు తీసుకోకపోవడంతో వేలాది మంది గ్రామీణులు ఆర్థికంగా నష్టపోయారు. ఛార్జీలు కూడా ఇవ్వలేదు - గల్ఫ్ బాధితుల విషయంలో కేరళ ప్రభుత్వం చొరవ చూపి గల్ఫ్లోని కేరళ వాసులందరి విమాన చార్జీలను చెల్లించింది. తెలుగు వారికీ డబ్బులు చెల్లించాలని కిరణ్కుమార్రెడ్డిని కోరినా పట్టించుకోలేదని కేంద్రమంత్రి వయలార్ రవి అప్పట్లో ప్రకటించారు. ‘ప్రత్యేక’ భరోసా - మహానేత వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధితులకు భరోసా ఇచ్చే కార్యాచరణ ప్రారంభించారు. కేరళ ప్రభుత్వం తరహాలో 2009లో ప్రవాసాంధ్ర శాఖను ఏర్పాటు చేశారు. - ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే ఎక్కువగా వలసలు ఉండటంవల్ల కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్బాబుకు ప్రవాసాంధ్ర వ్యవహారాల శాఖను అప్పగించారు. - తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గల్ఫ్ ఏజెంట్లు, బ్రోకర్లను గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేశారు. చంద్రబాబు హయూంలో వెలిసిన బోగస్ ఏజెన్సీలకు తాళం పడింది. - గల్ఫ్లో వురణించిన కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయుల పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2009 తర్వా త - గల్ఫ్లో వురణించిన కరీంనగర్ జిల్లాకు చెందిన 103 వుంది కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయుల పరిహారం అందింది. అలాగే అన్ని కలెక్టరేట్లలో ప్రవాసాంధ్ర సెల్ ఏర్పాటు చేశారు. -
సూరత్లో వైభవంగా హోలీ వేడుకలు
సాక్షి, ముంబై: ప్రముఖ వాణిజ్యపట్టణమైన సూరత్లో తెలుగు ప్రజలు హోలీ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రతాప్నగర్లోని శ్రీ మార్కండేయ మందిరం ఎదుట కాముని దహనాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు కార్పొరేటర్ రాపోలు లక్షి బుచ్చిరాములు నివాసంలో పలువురు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో సూరత్ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కూరపాటి ఐలయ్య,ప్రతాప్నగర్ సమాజం అధ్యక్షుడు జెల్ల రాంచందర్. కార్యదర్శి దాసరి సూర్యనారాయణ, మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మణ్, ఎలిగేటి నాగేష్, చిట్యాల శ్రీనివాస్, అడిగొప్పుల సత్యనారాయణ, సాదుల లక్ష్మీనారాయణ, గౌరి యతిరాజం, యెలుగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా సహజసిద్ధమైన రంగులతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టిబందోబస్తులను ఏర్పాటు చేశారు. పద్మశాలి సంఘ సభ్యుల విహారయాత్ర సాక్షి, ముంబై: హోలీ సందర్భంగా తూర్పు బాంద్రాలోని జ్ఞానేశ్వర్నగర్ తిరంగ వెల్ కమిటీ ఆదర్శ పద్మశాలి సేవా సంఘ సభ్యులు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. దీనిలో భాగంగా లోనావాలా, ఏకవీర మాతా మందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం సభ్యులందరూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సభ్యులు పలి వెంకటేశం, ఎనగందుల మల్లేశ్, కొంగారి వెంకట్స్వామి, దీకొండ ప్రభాకర్, వెంగల లక్ష్మణ్, బోగ సత్యనారాయణ, కొంగారి లక్ష్మీ, దీకొండ యశోద్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తో జతకట్టబోం: కిరణ్
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతినిధులు విశాఖపట్నం, న్యూస్లైన్: తెలుగు ప్రజలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో జత కట్టబోమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ముస్లింలు, న్యాయవాదులు, వైద్యులు, ఉత్తరాంధ్ర జర్నలిస్టులు, అర్చకుల జేఏసీ ప్రతినిధులతో తెలుగు జాతి ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పలు జేఏసీల ప్రతినిధులు, విద్యార్థులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్తో కలుస్తారా? అని ప్రశ్నించడంతో ఆ పార్టీతో కలిసేది లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోరుున తర్వాత సమైక్యాంధ్ర కోసం పోరాట ఫలితం ఉంటుందా..? అని అడిగితే విభజనకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులకు తీర్పులు అనుకూలంగా వస్తాయన్న ఆశాభావం ఉందన్నారు. -
కొత్త పార్టీ ప్రకటించిన కిరణ్
-
తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్త పార్టీ: కిరణ్
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్తపార్టీ పెట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాదాపూర్ ఇమేజ్ హాలులో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారి గుండెచప్పుడే తమ విధానంగా పార్టీ అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన, రాజీనామా చేసిన కొందరు నేతలతో కిరణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొత్త పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేది గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సభలో పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, ఇతర అంశాలు ప్రకటిస్తామన్నారు. పదవుల కోసం కాదని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన విధానం - ముసాయిదా బిల్లు - పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తీరు - ఆంధ్రప్రదేశ్ ఎంపిల బహిష్కరణ - తెలుగు జాతికి చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు సిగ్గుచేటు కలిగించే విధంగా విభజన జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికి కూడా స్పష్టతలేదన్నారు. రాష్ట్రాన్ని కలిసి ఉంచాలని ఆయన ఇప్పటికీ చెప్పడంలేదన్నారు. రాజకీయ లాభం కోసం వారు ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందన్నారు. శాసనసభలో కూడా చంద్రబాబు అభిప్రాయం చెప్పలేదని గుర్తు చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి కలిసి తెలుగు జాతికి అన్యాయం చేశాయన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పురుడుపోసి తల్లిని చంపారని అన్నారు. అధ్వానీ ఇటువంటి బిల్లు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ పెట్టలేదన్నారు. సుష్మాస్వరాజ్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టలేదన్నారు. ఉభయ సభలలో సభ్యులు ప్రవర్తనకు బాధ కలిగిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని విమర్శించారు. కలిసి ఉండాలన్న తెలుగు ప్రజల భావనను ఎవరూ వ్యక్తీకరించలేకపోయారని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడటానికి, వారి ఆలోచనల మేరకు నడిచేందుకు పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఉండే తెలుగువారందరి ఆత్మగౌరవాన్ని, వారి గుండెచప్పుడుని అర్ధం చేసుకునే విధంగా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై విచారణ విషయం విలేకరులు ప్రస్తావించగా, తాను భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. విచారణ చేసుకోవచ్చని తెలిపారు. గవర్నర్కు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. తన ముఖ్యమంత్రి పదవి తెరిచిన పుస్తకం అని చెప్పారు. విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, శాయిప్రతాప్ పాల్గొన్నారు. -
'తెలుగువాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నా అండగా నిలవాలి'
-
అయ్యో తమ్ముడా!
టీడీపీలో టిక్కెట్ల లొల్లి ఇప్పటికే నియోజకవర్గాల్లో పలువురి పర్యటనలు తాజాగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ల వలసలు తొమ్మిదేళ్లు జెండా మోసినా దక్కని ఫలితం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల రె‘బెల్స్’ సాక్షి ప్రతినిధి, కర్నూలు: విభజన పాపం మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ అధినేత రెండుకళ్ల సిద్ధాంతం నాయకులను ప్రజల్లోకి వెళ్లకుండా చేసింది. తెలుగు ప్రజలను చీల్చిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని భావించిన కాంగ్రెస్ నాయకులు కొందరు వైఎస్ఆర్సీపీలో చోటు దక్కకపోవడంతో టీడీపీ వైపు అడుగులేస్తున్నారు. ఈ విషయంలో తాజా మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్రెడ్డి ముందు వరుసలో ఉండగా.. పాణ్యం, ఆలూరు, నందికొట్కూరు శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి, నీరజారెడ్డి, లబ్బి వెంకటస్వామి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన వీరు ఆ పార్టీలో చేరడం ఖాయమనే చర్చ జరుగుతోంది. వీరి రాక తెలుగుతమ్ముళ్లను గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు వీరి చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. తొమ్మిదేళ్లుగా టీడీపీ అధికారంలో లేకపోయినా పలువురు నాయకులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నియోజకవర్గాల్లో పార్టీ పరువు కాపాడుకొస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన తమకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కుతుందనుకున్న నాయకుల ఆశలు కరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ను ఆశిస్తున్న మాజీ మంత్రి రాంభూపాల్చౌదరికి ఈ సారి భంగపాటు తప్పేట్లు లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ టీడీపీలో చేరుతున్నారనే ప్రచారంతో ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. అదేవిధంగా ప్రముఖ రియల్టర్ కేజే రెడ్డి ఎమ్మెల్యే కావాలనే ఆశతో టీడీపీ తీర్థం పుచ్చుకుని పాణ్యం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీలో చేరికకు.. కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఆయన భారీగా ఖర్చు చేశారు. అయితే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనుండటంతో కె.జె.రెడ్డి పరిస్థితి అగమ్యగోచరం కానుంది. నందికొట్కూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బిచ్చన్న పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు ఆయన ఆస్తులు అమ్ముకున్నట్లు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఆయనను కాదని.. లబ్బి వెంకటస్వామిని పార్టీలోకి ఆహ్వానించి బరిలో నిలపాలనే అధినేత నిర్ణయాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే నిరజారెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తెలుస్తోంది. అదే జరిగితే పార్టీనే నమ్ముకున్న వైకుంఠం ప్రసాద్ భవిష్యత్ ఏమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడుతున్న ఇలాంటి నాయకులంతా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు జగన్ నామస్మరణ!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు కళ్లు మూసినా, తెరిచినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కనిపిస్తున్నారన్నారు. ఆయన జగన్ నామ జపం చేస్తున్నారని చెప్పారు. జగన్కు ఉన్నంత దమ్ము, ధైర్యం నీకుందా చంద్రబాబు? జగన్ను విమర్శించడానికి నీకు సిగ్గులేదా? అని దాడి అడిగారు. తెలుగు జాతి రెండు మక్కులవడానికి కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బిజెపితో పాటు టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. పార్లమెంటులో ఒక్క సవరణ ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణకు కెసిఆర్ ఫాదర్ అయితే, బాబు గ్రాండ్ ఫాదర్ అని చెప్పారు. తెలుగు దేశం అధినేతగా ఉండడానికి ఆయన అర్హులు కారన్నారు. ఆ పార్టీ పేరును తెలంగాణ పేరుగా మర్చుకుని అధ్యక్షులుగా ఉండమని దాడి సలహా ఇచ్చారు. రాజధానికి లక్ష కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరే? అని ప్రశ్నించారు. సీమాంధ్ర తగలబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సృష్టించింది చంద్రబాబు కాదా? అని దాడి అడిగారు. -
నేడు బంద్
వరుస కరువు కాటకాలతో రతనాల సీమ రాళ్ల సీమగా మారిపోయింది. వలసలతో ఊళ్లు ఖాళీ అవుతుండగా.. బక్కచిక్కిన రైతన్నలు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రగిల్చిన విభజన చిచ్చు జిల్లావాసుల నోట్లో మట్టి కొట్టనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు తెలుగు ప్రజలు రెండుగా చీలిపోయారు. ఇప్పుటికే కర్ణాటక నుంచి వాటా నీటి కోసం సిగపట్లు తప్పడం లేదు.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నీటి ఇక్కట్లు ఏ స్థాయిలో ఉంటాయోననే బెంగ ప్రజలకు కంటి మీద కునుకును దూరం చేస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు పార్టీలు మద్దతివ్వకపోవడంతో ఏదైతే జరగకూడదనుకుని అందరూ భావించారో అది జరిగిపోయింది. నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు. -
60 ఏళ్లుగా కలిసున్నాం... : వైఎస్ జగన్
పొమ్మంటే ఆ బాధ మాకే తెలుస్తుంది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో జగన్ సాక్షి, హైదరాబాద్: 60 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న తెలుగు ప్రజలను ఇవాళ విడదీసి పొమ్మంటుంటే ఆ బాధ తమకు మాత్రమే తెలుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో దీక్ష సందర్భంగా ఎన్డీటీవీ గ్రూప్ ఎడిటర్ బర్ఖా దత్కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘రాజీవ్గాంధీని పెళ్లాడి 30 ఏళ్లుగా భారత్లో ఉంటున్న సోనియాను దేశం వదలి పొమ్మంటే ఎలా ఉంటుంది? భారత్లో నివసిస్తున్న విదేశీయులంతా ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని పార్లమెంటులో ఒక చట్టం చేస్తే, అప్పుడు సోనియా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తే ఆమెకెలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ిసీ) కాదని, అది ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్గా మారిందని ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు సబబేనా అని బర్ఖా ప్రశ్నించగా, ‘భారతీయులైతే ఇక్కడి సమాఖ్య వ్యవస్థను అర్థం చేసుకునే వారు, ఇక్కడి ప్రజల మనోభావాలేమిటో తెలుసుకునేవారు’ అని జగన్ బదులిచ్చారు. ‘రాహుల్గాంధీని ప్రధానిని చేయడానికి ఆంధ్రప్రదేశ్ను విభజించబూనారు. తెలంగాణలోని 17 లోక్సభ సీట్ల కోసం ఆ ప్రాంతంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది కాంగ్రెసే’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే ప్రధాని పదవికి మద్దతిస్తామన్న జగన్ ప్రకటనను బర్ఖా గుర్తు చేశారు. అది నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందా అని పదే పదే ప్రశ్నించారు. దానికి బదులుగా, ‘మా ఎజెండా ఒకే ఒకటి. అది మా రాష్ట్రం సమైక్యంగా ఉండటం. మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు కృషి చేస్తే వారికే ఎన్నికల తరవాత మా మద్దతుంటుంది. అందుకు మోడీ కి ఎలాంటి మినహాయింపు లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన సహకరిస్తే ఆయనకే మా మద్దతు’ అని జగన్ స్పష్టం చేశారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి కాంగ్రెస్ పథకం ప్రకారమే జరిగిందన్నారు. ‘‘సభ్యులను సస్పెండ్ చేయకుండా సభ సజావుగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ పదేపదే చెప్పింది. అందుకే సభలో గందరగోళం సృష్టించి, ఆ సాకుతో సీమాంధ్ర ఎంపీలందరినీ బయటకు పంపి బిల్లు ఆమోదించుకోవాలన్నది కాంగ్రెస్ కుట్ర’’ అన్నారు.