telugu people
-
భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్గేట్స్తో మాట్లాడి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్కు వెళ్లారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనదావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు. అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు. చంద్రబాబు, రేవంత్ భేటీజ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. -
ఆ్రస్టేలియాలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబురాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎల్లలు దాటి వచ్చినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాసులు కాపాడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, తెలుగు పారిశ్రామికవేత్తలు తమ తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారమందించాలని కోరారు. -
దుబాయ్లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు
చెన్నైలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా కస్తూరి చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పింది.కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ.. నటి కస్తూరి తెలుగువారిపై ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి
తమిళనాడులో తెలుగు ప్రజలనుద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు కూడా నమోదైయింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కస్తూరి మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకకరించారని చెబుతోంది.తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవం అని.. వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.‘తమిళనాడులో ఇప్పుడు డ్రవిడియన్ ఐడియాలజీ జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తాగుడు అలవాటే లేకున్నా.. తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు జరిపిస్తున్నారు. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. తెలుగు అనే పదం వాడింది నిజమే. కానీ నేను ఏ ఉద్దేశ్యం గురించి ఆ పదం వాడానో నా స్పీచ్ మొత్తం వింటే తెలుస్తుంది. తెలిసో తెలియకో ఓ మాట అన్నాను.దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కస్తూరి అన్నారు. -
తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్
-
గతమెంతో ఘనం.. వర్తమాన ‘రాజకీయం’ శూన్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగువారిని రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తమను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు తప్పా నాయకులుగా ఎదగనివ్వడం లేదని తెలుగువారు ఆవేదన చెందుతున్నారు.సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రధాన పార్టీలలో ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కాలేదు. అయితే ముంబైతోపాటు థాణే, భివండీ, నవీముంబైలలో సుమారు 15 లక్షలకుపైగా తెలుగు ప్రజలున్నప్పటికీ ఏ పార్టీ కూడా తెలుగు అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కన్పించడంలేదు. దీంతో ఈ సారి కూడా అసెంబ్లీలో తెలుగువారి ప్రాతినిధ్యానికి మొండి చెయ్యి ఎదురైనట్లైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో అత్యధికంగా ముంబైలో 36 తర్వాత ఉమ్మడి థాణే జిల్లాలో 24 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నప్పటికీ ఒక్క రాజకీయపార్టీ కూడా తెలుగువారికి అభ్యర్థిత్వమివ్వలేదు. ఇకపై ప్రకటించే అవకాశాలు కూడా కనిపించడం లేదు.ప్రయత్నలోపమే అసలు కారణం అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ముంబై, థాణే, భివండీ, నవీముంబైలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రముఖులమని, నాయకులమని చెప్పుకునేవారెవరూ తమ తమ పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించడం లేదు. తమకు అనుకూలమైన నాయకులతో చేతులు కలిపి ఎదిగేందుకు ప్రయత్నించడం లేదా ఇతర పార్టీలతో లాభమనుకుంటే వాటిలో చేరడం తప్ప టికెట్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయడం లేదని స్థానిక తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తెలుగువారిని కార్యకర్తల్లా తప్ప నాయకులుగా చూడటం లేదని ఇక్కడున్న తెలుగువారి ఓట్ల కోసం కూడా కనీసం ఒక్క అభ్యర్థిని కూడా బరిలో దింపే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నవీముంబై జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ముంబై, భివండీ, నవీముంబై, థాణే మొదలగు ప్రాంతాల్లో కొందరు కొందరు ప్రముఖ తెలుగు నాయకులున్నప్పటికీ టికెట్లు లభించే అవకాశాలు కన్పించడంలేదు. ఇలా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసించే ముంబై, థాణే, భివండీ, నవీముంబైలలో తెలుగువారెవరూ రాజకీయ చర్చల్లో చోటుకల్పించుకోలేక పోతున్నారు. అయితే కార్పొరేటర్లుగా మాత్రం ముంబై, థాణేల్లో ఒక్కొక్కరు, భివండీలో ఇద్దరు మాత్రం కార్పొరేటర్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడి, సంస్కృతీ, సంప్రదాయాల్లో మమేకమైన తెలుగువారికి ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. కలిసికట్టుగా సాగితే ఫలితం... తెలుగు వారంతా కలిసికట్టుగా ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్నైనా దక్కించుకుని వారిని గెలిపించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై, థాణే, నవీ ముంబైల్లో అనేక మంది విద్యావేత్తలతోపాటు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నవారున్నారు. అనేక మందిలో సేవాభావం, సమాజసేవ చేయాలని, రాజకీయంగా ఎదగాలనే తపన కూడా ఉంది. కానీ ఐకమత్యం లేకపోవడం, అందరినీ ఏకంచేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలం కావడంలేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలో కులమతాలు, ప్రాంతాల తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఫలితం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు కార్పొరేటరున్నప్పటికీ రాబోయే రోజులలో తెలుగు వారు ఏకమైతే ప్రధాన పార్టీలు అనేక ప్రాంతాల్లో తెలుగు వారికి కార్పొరేటర్ పదవులిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లభించలేదని నిరుత్సాహ పడకుండా ఇప్పటి నుంచే కార్పొరేషన్ ఎన్నికలకు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు నాయకులందరూ సిద్ధమవ్వాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై థాణే జిల్లాల్లో రాజకీయంగా బలం పెంచుకునేందుకు, తెలుగు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాల్సిఉంది.ఘనచరిత్రే..ముంబైలో తెలుగు వారిది ఘనమైన చరిత్ర. ముంబై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది క్రియాశీలపాత్ర. స్వాతంత్య్రానికి ముందు సుమారు 1877 నుంచి సుమారు 1950 వరకు తెలుగు వారంతా రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. కానీ తరువాత మాత్రం రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబైలో వర్లీ, పరెల్, కామాటిపురా, కొలాబా, బాంద్రా, గోరేగావ్, బోరివలి, ఘాట్కోపర్, అంటాప్హిల్, వడాలా తదితర అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. అదేవిదంగా థాణే, నవీముంబై, భివండీ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారున్నారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్గా ఎన్నికైన సయాజీ శీలం తెలుగువారే. ఆయనతోపాటు అనేక మంది తెలుగువారు మేయర్, కార్పొరేటర్ సహా అనేక పదవులను చేపట్టారు. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
అందరికీ మంచి జరగాలి..
-
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్లో బి.టెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్లో నేర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు. నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం. -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు. అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువఇచ్చే పెద్ద పండుగని ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పల్లెలన్నీ మళ్లీ కళకళ.. ఇక మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, ప్రభుత్వ బడి, ప్రభుత్వాసుపత్రిలో నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, బ్రాడ్బాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా ప్రజలకు రూ.2.46 లక్షల కోట్ల డీబీటీ.. ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి.. ఇలా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. అలాగే.. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వమిదని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంటు బడి, గవర్నమెంటు ఆసుపత్రిలో నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన రూ. 2.46 లక్షల కోట్ల డీబీటీ... ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి...ఇవన్నీ పల్లెలు మళ్ళీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ... నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా... రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మూడు వసంతాలు పూర్తి చేసుకున్న 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'
సింగపూర్ లో " శ్రీ సాంస్కృతిక కళాసారథి" తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 2020 జూలైలో అంకురార్పణ చేసుకున్నఈ " శ్రీ సాంస్కృతిక కళాసారథి" గత మూడు సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో 50కు పైగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి తృతీయ వార్షికోత్సవ వేడుకలు అద్వితీయంగా జరుపుకుంది. ముఖ్యఅతిథిగా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు డా. రామ్ మాధవ్, విశిష్ట అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అర్ధ శతాబ్ది సాంస్కృతికమూర్తి, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు భారతదేశం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన వాక్కులతో సందేశాలను అందించారు. భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంస్థను, నిర్వాహకులను అభినందిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర, పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ కూడా సంస్థ కార్యక్రమాలను కార్యదక్షతను అభినందిస్తూ సందేశాలు పంపించారు. ఈ సందర్భంగా సింగపూరు తెలుగు టీవీ వారి ఆధ్వర్యంలో చిన్నారులతో సింగపూరులో నిర్వహిస్తున్న తెలుగు నీతిపద్యాల ఫోటీ ధారావాహిక మొదటి భాగాన్ని జొన్నవిత్తుల గారు వారి అమృతహస్తాల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను నిలబెట్టాలని కంకణ ధారి అయ్యి ప్రపంచంలోని అందరు తెలుగు ప్రముఖులను కలుపుకుంటూ సింగపూరు వేదికగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి బృందం అందరికీ అభినందనలు తెలియచేసారు. వారు రచించిన 'ఆవకాయ శతకము', 'కోనసీమ శతకములలోని' పద్యాలలో కొన్ని ఆలపించి శ్రోతలను ఉర్రూతలూగించారు. "మైకాష్టకం" అంటూ వారు హాస్యభరితంగా చెప్పిన మైకు గురించిన విషయాలు ఆహ్వానితులందరినీ నవ్వులతో ముంచెత్తింది. అలాగే "తెలుగోళ్ళం తెలుగోళ్ళం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళం" అంటూ వారు స్వయంగా రచించి పాడిన పాటకు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్య అతిధి డా. రామ్ మాధవ్ ప్రసంగంలో ఒక మంచి దృఢ సంకల్పంతో సంస్థను స్థాపించి, సమాజానికి, భాషకు, సంస్కృతికి సేవచేయాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ మరో వందేళ్ళు పాటు ఇలా తెలుగులు విరజిల్లుతూ వృద్ధిచెందాలని ఆశీస్సులు అందించారు. భారతీయత తెలుగుదనము మేళవించిన ఒక మంచి సమాజాన్ని తెలుగు రాష్ట్రాలలో నిలబెట్టాలని అలా నిలబెట్టేలా కృషిచేస్తున్న ఈ శ్రీ సాంస్కృతిక కళాసారథి వంటి సంస్థలు అదే లక్ష్యంతో పనిచెయ్యడం చాలా సంతోషదాయకం అని అన్నారు. సమాజం తన కాళ్ళ మీద తాను నిలబడాలని, తనను తాను నడిపించుకోవడమే భారత ఆత్మనిర్భరత అని అదే సాహిత్యం, కళా రూపాల యొక్క లక్ష్యం కావాలని వివరించారు. కళలు, సాహిత్యం భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ప్రపంచం ముందు భారతదేశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది అని వ్యాఖ్యానించారు. "భగవంతుని అనుగ్రహంతో, పెద్దల దీవెనలతో, అందరి ప్రోత్సాహ సహకారాలతో, మూడు సంవత్సరాల మా ఈ ప్రయాణంలో మీ అందరి మన్ననలను పొందడం మా సంస్థ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మా ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు తెలిపిన అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో చక్కగా జరిగింది అని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. 400 మంది ప్రత్యక్షముగా మరియు 1200 మందికి పైగా ఆన్లైన్ వీక్షించడం జరిగిందని నిర్వాహుకులు తెలిపారు. రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించగా, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే కళాకారులచే కూచిపూడి కథక్ జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య సంకీర్తనాలాపన, తెలుగు పద్య పఠనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, వంశీ కృష్ణ శిష్ట్లా సాంకేతిక నిర్వహణా బాధ్యతలు అందించగా, కుమార్, మోహన్, మౌక్తిక, సునీత, రాధికా, రాజి, రేణుక మరియు ప్రసన్న తదితరులు వాలంటీర్ గా సహకారము అందించారు. జీఐఐఎస్, టింకర్ టాట్స్ మొంటోసిరి, కవ్ అండ్ ఫార్మర్ ఈగ జ్యూస్, శబ్ద కాన్సెప్ట్స్, ఎస్ఎన్ఎం డెవెలెపేర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ (భీమవరం), టెర్రాన్ స్పేస్ (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ), ప్రొపెనెక్స్ రాజశేఖర్ ఆర్ధిక సహకారం అందించారు. (చదవండి: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్కు 'అరుదైన గౌరవం') -
కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు
కెనడా హాలిఫాక్స్లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి. తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ , దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది. కెనడా హెలి ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు. (చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్) -
యూఎస్లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
సూడాన్లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే.. వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు చేరుకునే వరుకు కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు. చదవండి: సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్రెడ్డి -
రామరాజ్యమే స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని ట్వీట్లో పేర్కొన్నారాయన. అంతకు ముందు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ‘‘నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సీతారాముల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. -
తెలుగు ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
మన్కీబాత్లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్కీబాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని ఈ సందర్భంగా వినిపించారు. మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్కుమార్ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్ నాయక్ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు. -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచుకుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023 -
బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. 12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు. ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్ టోల్ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ (చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2023 -
తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ’ అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మకర సంక్రాంతి మరింత ప్రగతితో కూడిన మార్పు తీసుకురావాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం అభిలషించారు. దీపావళి అంటే దీపాల వరస... దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక... మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు! — YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2022 -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాదాసీదాగా జరిపారు. అయితే ఈసారి కరోనా నియంత్రణలోకి రావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హుతాత్మ చౌక్ ముఖ్యంగా మంత్రాలయంతోపాటు అనేక చారిత్రాత్మక భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ ప్రాంతాల్లో ప్రజల కోసం వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హుతాత్మ చౌక్ను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంయుక్త మహారాష్ట్ర కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి బలిదానంతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం అవతరించి 63వ ఏట అడుగిడుతున్న సమయంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న మహారాష్ట్ర రాష్ట్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆందోళనలలో పాల్గొన్న తెలుగువారు.. సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో అనేక మంది తెలుగు ప్రజలు కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సంయుక్త మహారాష్ట్ర కోసం ఉద్యమం 1938లో ప్రారంభమైంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముఖ్యంగా 1955 నుంచి సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాటం ఉధృతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా 1955 నవంబర్ 21వ తేదీన సంయుక్త మహారాష్ట్ర కోసం జరిగిన ఆందోళనలలో ముంబైలోని ఫ్లోరా ఫౌంటన్ (నేటి హుతాత్మ చౌక్) పరిసరాల్లో నాటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి ఆదేశాలమేరకు ఆందోళనకారులపై దారుణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికిపైగా ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా 1956 జనవరిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో 90 మంది అమరులయ్యారు. వీరితోపాటు అనేకమంది బలిదానాలతో 1960 మే ఒకటవ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం అవతరించింది. ఈ నేపథ్యంలో సంయుక్త మహారాష్ట్ర కోసం పోరాడి అమరులైన 105 మంది అమరవీరుల జజ్ఞాపకార్థంగా ఫ్లౌరా ఫౌంటన్ పరిసరాల్లో ‘అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ ఫ్లోరా ఫౌంటన్ పేరు మార్చి హుతాత్మ చౌక్గా నామకరణం చేశారు. అయితే సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరులందరి కుటుంబీకుల వివరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేటికి లేవని తెలుస్తోంది. మరోవైపు సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలను అర్పించిన 105 మంది అమరవీరులలో ముగ్గురు తెలుగు వ్యక్తులున్నారు. వీరి పేర్లు బాలయ్య, ముత్తన్నలుగా తెలిసింది. అయితే మరో తెలుగు వ్యక్తి కూడా అమరవీరులలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం వివరాలేవి తెలియరాలేదు. పెరిగిన జిల్లాలు.. మహారాష్ట్ర అవతరణ అనంతరం ఇప్పటి వరకు ఒకటి రెండు కాకుండా ఏకంగా 10 జిల్లాలు పెరిగాయి. రాష్ట్రం అవతరించిన సమయంలో 26 జిల్లాలున్న మహారాష్ట్ర ప్రస్తుతం 36 జిల్లాలకు చేరుకుంది. 1981 మేలో జాల్నా, సింధుదుర్గా జిల్లా అవతరించగా 1982 ఆగస్టులో లాతూరు, గడ్చిరోలి జిల్లాలు, 1990 అక్టోబర్లో ముంబై సబర్బన్ (ముంబై ఉపనగరం), 1998 జూలైలో వాషీం, నందుర్బార్ జిల్లాలు ఏర్పాటుకాగా చివరగా రెండేళ్ల కిందట 2014 ఆగస్టు ఒకటవ తేదీన ఠాణే జిల్లాను విభజించి పాల్ఘర్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిస్పీకర్గా తెలుగు వ్యక్తి... సంయుక్త మహారాష్ట్ర అవతరించిన అనంతరం 1960 మే ఒకటవ తేదీ మధ్యాహ్నం నూతన మంత్రిమండలి ఏర్పాటైంది. అయితే రాష్ట్రానికి తొలిస్పీకర్ బాధ్యతలు చేపట్టే గౌరవం తెలుగు వ్యక్తి అయిన సీలం సయాజీరావ్కు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
Ugadi 2022: శుభకృత్లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీశుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 -
తెలుగు ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలందరికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పెద్ద పండుగకు మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన స్థానముందని పేర్కొన్నారు. సమృద్ధిగా ఇంటికి చేరిన ధాన్యం సిరులు, పంటల నడుమ వ్యవసాయదారులు, ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వంతో కూడిన ఉదాత్తమైన ఆలోచనలకు సంక్రాంతి పండుగ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. -
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్
తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ పిల్లల చదువు కోసం ప్రతి ఏడాది ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ చదువును కొనసాగించాలనే అభిరుచి ఉన్న తెలుగు విద్యార్థుల కోసం అండగా నిలబడుతుంది. గత ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో రూ. 2 కోట్ల డబ్బును పంచినట్లు తెలుగు పీపుల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఏడాది తెలుగు పీపుల్ ఫౌండేషన్ 13వ వార్షికోత్సవాన్ని డిసెంబర్ 11న జరపనున్నట్లు తెలిపింది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రచార కర్తగా ఆర్.పీ పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తెలుగు పీపుల్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల చదువు కోసం వియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. -
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాంకాంక్షలు. #HappyDussehra — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 -
డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు
చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు తెలుగు ప్రముఖులు బరిలో దిగుతున్నారు. గుమ్మిడిపూండీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్ తెలుగువారే. గుమ్మిడిపూండి సమీపంలోని దిగువముదలంబేడు గ్రామానికి చెందిన టీజేఎస్ విద్యాసంస్థల అధినేత టీజే గోవిందరాజన్. ప్రస్తుతం ఇతను డీఎంకే జిల్లా ఇన్చార్జ్గా కూడా పనిచేస్తున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ కూడా తెలుగు మూలాలు వున్న వ్యక్తి కావడం గమనించదగ్గ విషయం. ఇతని భార్య ఇందిరా రాజేంద్రన్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా వున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. -
‘యూజీపీఏటీ’ సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమం
బహుళజాతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉత్తర అమెరికా యూజీపీఏటీ సంస్థ నడుం బిగించింది. ఉత్తర అమెరికాలోని “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే. నారాయణస్వామి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్ రావు, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అశీర్వచనాలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి, తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలలో విస్తరింపజేయడానికి పూనుకున్న యూజీపీఏటీ నిర్వాహకుల ఆలోచనను సమిష్టిగా అభినందించారు. బలహీన వర్గాల కలల సహకారానికి దోహదపడే ఉద్దేశంతో ఈ సంస్థ ఆలోచనలను, ఆశయాలను రూపొందించడం గర్వకారణమని, భవిష్యత్తులో సామాజిక బలహీన వర్గానికి చెందిన ప్రతి పేదవారి ఆశను సంపూర్ణం చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడం ప్రపంచ తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. ప్రభుత్వాల ఆశయాలకు ఈ సంస్థ తమ తోడ్పాటును అందించి పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మార్గాదర్శకాలను, సూచనలను రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించాలానే సంకల్పం, తెలుగు జాతి భవిష్యత్తుకు ఒక పెద్ద పీట వేయడం అన్నారు. అణగారిన జాతి అభ్యున్నతి కోసం పాటుబడిన అంబేద్కర్, పెరియార్, ఫూలే వంటి ఎందరో మహానుభావులను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. విద్య, ఉద్యోగం, వ్యవస్థాపక అభివృద్ధి తమ ప్రామాణికాలు, కుల మతాలకు అతీతంగా, రాబోయే తరాలకు వారధిగా, చుక్కానిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఖండాంతరాలు దాటి విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయ తెలుగు వారు సమిష్టిగా కలసి భారదేశంలోని తమ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, తమ మేధస్సును వినియోగించ ఉద్దేశించిన కార్య-రూప ఆవిర్భావమే ఈ “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” యూజీపీఏటీ సంస్థ అని నిర్వాహకులు కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె, మెర్సీ ఏంజిలీన్ , కల్పనా దొప్పలపూడిలు అన్నారు. ప్రజా ప్రయోజన, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి ప్రజల అభినందలను అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజున ఈ సంస్థను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ అన్నివేళల బలహీన వర్గాల తెలుగు జాతి కోసం పాటుపడుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉత్తర అమెరిక తెలుగు ప్రజల వారధి రత్నాకర్ పండుగాయల కృషి మరువలేనిదని, వారి సహాయ సహకారాలతో ప్రభుత్వ పతినిధులను ఈ సంస్థ కార్యక్రమానికి ఆహ్వానించి జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరాలను సభ్యులందరితో చర్చించి సంస్థ వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికి సంస్థ కన్వీనర్ కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వాలకు, బడుగు జాతి వర్గానికి వారధిగా నిలుస్తూ, సంక్షేమ పధకాల రూపకల్పనలో జాతి అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ తమవంతు సహాయసహకారాలు అందించడం మంచి పరిణామం అని కొనియాడారు. ఇందుకు మత విభేదాలకు తావు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాల ఆశలను, ఆశయాలను సంపూర్ణం చేయడానికి తమవంతు కృషిని అందిస్తామని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తమ సంస్థ ఆవిర్భావ కార్యక్రమాన్ని, కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ వీడియో ప్రసారం ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులు సంస్థ వెబ్ సైట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ వీక్షించి, సంస్థ అభివృద్ధికి తమ సలహాలు సూచనలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సంస్థ గవర్నింగ్ కమిటీ సభ్యులు చార్లెస్ తోడేటి, బాబా సొంట్యాన, యువజన కన్వీనర్ తేజ యాదవ్, రీజినల్ కోఆర్డినేటర్స్ గాబ్రియేల్ కందుకూరి, ప్రవీణ్ మన్నం, సలీమ్ షేక్, కామేశ్వర రావు, వెంకట్ మట్ట, నరేంద్ర కడియం, సాంకేతిక నిపుణులు, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూఎస్లో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక విమానం
నెవార్క్ : కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. కాగా ఈ విమానం జూన్ 9(వచ్చే మంగళవారం)నెవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా యూఎస్- ఇండియా సాలిడారిటీ మిషన్ కింద ప్రైవేట్ ఛార్టర్ విమానానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. కాగా విమానంలోని ప్రయాణీకులు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హైదరాబాద్ చేరుకోగానే క్వారంటైన్ లో ఉంటామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్ రావాలనుకున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. రిజిస్ట్రేషన్ కోసం కింద లింక్ను క్లిక్ చేయండి. http://www.usism.org/register-private-charter-flight.html -
‘తెలుగువారు వచ్చేందుకు రంగం సిద్ధం’
సాక్షి, విజయవాడ: విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు మార్గం సుగమమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న సుమారు 30 వేల మందిని రాష్ట్రానికి తీసుకురావటానికి రంగం సిద్ధం చేశామని అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. రేపు మొదటి విమానం విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రానుందని ఆయన తెలిపారు. అందులో మొదటిగా 19మంది రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రానున్న రెండు వారాలలో జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వారికి రెండు ఆప్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. (సీఎం వైఎస్ జగన్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు) గవర్నమెంట్ క్వారంటైన్, పెయిడ్ క్వారంటైన్లను సిద్ధం చేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ హోటల్స్లో వెయ్యి గదులను సిద్ధం చేశామని ఆయన అన్నారు. 14 రోజులు క్వారంటన్లో ఉండటం తప్పనిసరి ప్రోటోకాల్ అని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. వచ్చేవారిని ఎయిర్పోర్టు దగ్గర పర్యవేక్షించటం కోసం ఒక బృందాన్ని, ప్రత్యేక మైన స్క్రినింగ్, ఏ జిల్లా వారైతే ఆ జిల్లాకు పంపేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్కు కూడా ఒక అధికారుల బృందాన్ని పంపామని, అక్కడి ఎయిర్పోర్టు నుంచి వచ్చేవారిని సైతం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. (‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’) జిల్లాలో 32 క్వారంటైన్ సెంటర్లలో ఐదు వేల బెడ్లు ఉన్నాయని క్వారంటైన్ సెంటర్లలో నాణ్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఒక్క వ్యక్తికి రోజుకు రూ. ఐదు వందల నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నామని ఆయన తెలిపారు. క్వారంటైన్ సెంటర్లో ఆహారం తీసుకున్న వారి స్పందన బాగుందని ఆయన తెలిపారు అదే మెనూను హోటల్స్కు కూడా ఇవ్వనున్నాము కలెక్టర్ చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు జిల్లాలో ఎవరులేరని, యూఎస్, యూరప్ నుంచి ఎక్కువ మంది జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. (ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్) -
తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్
సాక్షి, విజయవడ: విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనుందన్నారు. ముంబాయి నుంచి హైరారబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్పోర్టుకే వస్తారని ఆయన చెప్పారు. 14 రోజులపాటు క్వారెంటైన్కు తరలిస్తామన్నారు. ప్రభుత్వ క్వారెంటైన్లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నారు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం, పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు. పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ని వినియోగిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు) -
ఐటీబీపీ క్యాంప్లో తెలుగువారికి ముగిసిన క్వారంటైన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీ నుంచి దేశ రాజధానికి వచ్చిన 36 మంది తెలుగు వారికి ఐటీబీపీ క్యాంప్లో బుధవారం క్వారంటైన్ ముగిసింది. ప్రస్తుతం వారిని తమ స్వస్థలాలకు పంపేందుకు ఏపీ భవన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనుమతి కోసం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భవన సక్సేనా ఎదురు చూస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. కేంద్రం అనుమతి వచ్చే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే apbhavancovid19@gmail.comకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. (పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్తో మహేష్ సినిమా? ) -
ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి సాయం అందించండి
సాక్షి, తాడేపల్లి : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి, తీర్థయాత్రల కోసం వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు ప్రజలకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తెలుగువారికి సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ► వారణాసిలోని 16 ఆశ్రమాల్లో ఏపీకి చెందిన 400 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో.. కోవిడ్-19 స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి సాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో యూపీ ఎక్సైజ్ కమిషనర్ గురుప్రసాద్ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు చేపట్టి.. ఏపీ యాత్రికులకు రేషన్, నిత్యావసర సరుకులు అందజేశారు. ► గోరఖ్పూర్లో గుంటూరు జిల్లాకు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు.. యూపీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. ► రాజస్థాన్లోని ఆజ్మీర్లో చిక్కుకున్న 21 మంది కర్నూలు వాసులకు.. సీఎస్, నోడల్ ఆఫీసర్ జోక్యంతో రేషన్ సరకులు పంపిణీ జరిగింది. ► తమిళనాడు తీర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 500 మంది మత్య్సకారులు చిక్కుకుపోవడంతో.. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి రేషన్, నిత్యావసర సరుకులు అందేలా చూశారు. ► గోవాలోని మద్గావ్ సమీపంలో చిక్కుకున్న 25 మంది వైఎస్సార్ జిల్లా యాత్రికులకు స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం సాయంతో ఆహారం అందజేశారు. ► గుజరాత్ వెరవాల్కు ఉపాధి నిమిత్తం వెళ్లిన 1200 మంది శ్రీకాకుళం వాసులకు తక్షణ సాయం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ గుజరాత్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం వారికి రోజు విడిచి రోజు 2 కిలోల బియ్యం, కిలో పప్పు అందజేస్తుంది. వారి సహాయక కార్యక్రమాలను స్పెషల్ సెక్రటరీ సతీష్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. ► తమిళనాడులోని కోయంబత్తూరులో ఉపాధి నిమిత్తం వెళ్లి లాక్డౌన్ అక్కడే చిక్కుకుపోయిన 300 మంది ఏపీ కార్మికులకు బియ్యం, గోధుమలు అందిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► ముంబైలో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 500 మంది కార్మికులకు.. ముంబై అదనపు మున్సిపల్ కమిషనర్ సహాయంతో 15 రోజులకు సరిపడ రేషన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
కరోనాపై విజయంతో నవయుగానికి నాంది
సాక్షి, అమరావతి: శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కరోనామీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు -
న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసించే న్యూజెర్సీ, దాని పక్కనే ఉన్న న్యూయార్క్ నగరం కుప్పలు తెప్పలుగా నమోదవుతున్న కోవిడ్ కేసులతో తల్లడిల్లుతోంది. న్యూజెర్సీతోపాటు కాలిఫోర్నియాలోనూ రికార్డు సంఖ్యలో కేసులు నమోదు కావడం భారతీయ కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి ఒక్క న్యూయార్క్ నగరంలో 29,875 కేసులు నమోదుకాగా దాన్ని ఆనుకొని ఉన్న న్యూజెర్సీలో 2,844 మంది కోవిడ్ బారినపడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు కనిపించిన మొదట్లో అత్యధిక కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఇప్పుడు మూడు, నాలుగు స్థానాలకు పడిపోగా మార్చి మొదటి వారంలో మొదటి 10 స్థానాల్లోనూ లేని న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు మొదటి రెండు స్థానాలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్లో ఈ వ్యాధి బారినపడ్డ వారిలో 157 మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 2,844 మందికి పాజిటివ్ రాగా చికిత్స పొందుతూ వారిలో 27 మంది మరణించారు. రెండేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లతో పోలిస్తే మన వాళ్లు 3.8 శాతం ఉండగా శాన్ఫ్రాన్సికో, అలమేద (కాలిఫోర్నియా) కౌంటీల్లో భారతీయులు 3.4 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ కరోన వ్యాధి బారిన పడ్డ వారు ఎక్కువ సంఖ్యలో ఉంటడం సహజంగానే ఇక్కడి వారి కుటుంబాలు ఆందోళనగా ఉన్నాయి. మనవారిలో గుబులు... న్యూయార్క్, న్యూజెర్సీలలో పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎవ్వరూ గడప దాటి బయటకు రావడం లేదు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి 12,305 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీలో వందల సంఖ్యలో కోవిడ్ కేసులు పాజిటివ్ రావడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ‘మేము నివాసం ఉండే కమ్యునిటీలో 123 కేసులు నమోదయ్యాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. నెల రోజులకు సరిపడా ఉన్న సరుకులు రెండు మాసాల దాకా వచ్చేలా పరిమితంగా వాడుకుంటున్నాం. భారత్లో కరోనా కేసులు ఉన్నా ఇప్పుడు విమానాలు నడిస్తే ఇక్కడి నుంచి రావాలని ఉంది’అని పుంజాల సుస్మిత వాపోయింది. న్యూజెర్సీలో ఉండే మల్లు శ్రీదేవి (29) 8 నెలల గర్భిణి. ‘నేను, నా భర్త మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా తల్లిదండ్రులు ఏప్రిల్ 11న రావడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ వారు రాకపోవచ్చు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 20–22 నా ప్రసవ తేదీ. ఇప్పుడు నా పరిస్థితిని తలచుకుంటే కన్నీరు ఉబికి వస్తోంది’అంటూ పెట్టిన వాట్సాప్ సందేశం మిగిలిన వారిని కదిలించింది. అయితే ప్రసవ సమయంలో తాము అండగా ఉంటామని, కోవిడ్ను లెక్కచేయబోమని గ్రూపులో ఉన్న అనేక మంది తెలుగు మహిళలు మద్దతు ప్రకటించారు. -
తెలుగువారి తొలి నివాసం 'రాయలసీమ'
తెలుగు ప్రజల తొలి నివాసం రాయలసీమేనని చెప్పేందుకు వైఎస్సార్ జిల్లాలోని మోపూరు కొండపై గల భైరవేశ్వరుడి ఆలయం తిరుగులేని నిదర్శనమని తెనాలికి చెందిన పురావస్తు పరిశోధకుడు, ‘పురాతన’ సంస్థ వ్యవస్థాపకుడు కడియాల వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాయల సీమ ప్రాశస్త్యంపై ప్రముఖ చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్ హెచ్డీ సంకాలియా భావనను బలపరిచేలా అతి పురాతనం అనదగ్గ ఆధారాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. పర్వతాలు అధికంగా కలిగిన రాయలసీమలో కొండ గుహల్లో ఆది మానవుల జీవనం, సంస్కృతి కొనసాగిందని అభిప్రాయపడ్డారు. కాలక్రమంలో అక్కడ్నుంచి తూర్పుగా మైదాన ప్రాంతానికి విస్తరించారనీ, అందుచేత రాయలసీమే తెలుగు ప్రజల తొలి ఆవాసమని భైరవేశ్వరుడి ఆలయం, పరిసరాల్లో కొన్నేళ్లుగా తాను జరిపిన పరిశోధనల్లో స్పష్టమైందని ‘సాక్షి’కి వెల్లడించారు. –తెనాలి ఆ విశేషాలివి.. ‘వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలం, నల్లచెరువుపల్లె గ్రామానికి సమీపంలోని మోపూరు కొండపై 18 అడుగుల ఎత్తు, 14 అడుగుల చుట్టుకొలత కలిగిన విగ్రహం శివలింగంగా భక్తుల భావన. ఈ తరహా ఎత్తయిన నిలువురాళ్లను పూజించే ఆచారం అనేక దేశాల్లో ఉంది. వీటిని సూర్యభగవానుడికి సంకేతంగా/ ప్రతిరూపంగా ఆదిమ మానవుల కాలం (కొత్త రాతి యుగం), పాత రాతియుగం కాలం (క్రీ.పూ 3,000–2,000), ఇంకా పూర్వం నుంచీ పూజిస్తున్నారు. ‘వర్షిపింగ్ ఆఫ్ స్టాండింగ్ స్టోన్స్’, ‘డ్రూయిడికల్ రాక్స్’ పేర్లతో పిలుస్తుంటారు. డ్రూయిడ్స్ అంటే విగ్రహారాధకులు అనే అర్థముంది. ఆర్యులు భారత ఉపఖండంలోకి ప్రవేశించే నాటికి ముందుగానే (క్రీ.పూ 1,500–1,000) భారతదేశంలో నిలువురాతి శిలలను పూజించే ఆచారం ఉంది. ఈ మోపూరు కొండను ఆనుకొని ఉన్న మొగమేరు వాగు వేముల, లింగాల ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. ఈ పరీవాహక ప్రాంతమంతా నాటి కాలాలకు చెందిన రాతి ఆయుధాలు, ఆదిమ మానవుల సమాధులు, చారిత్రక యుగంనాటి పరికరాలు గుర్తించారు. ఫలితంగా ఇది ఆదిమవాసుల పవిత్ర ప్రార్ధనాస్థలంగా విలసిల్లింది. భైరవేశ్వరుడిగా పూజలందుకుంటున్న నిలువురాయి 18 అడుగులు ఉండటంతో, దీనిని రెండు అంతస్తుల్లో నిర్మించారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామ, కుమార ఆరామంలో రెండు అంతస్తులుగా నిర్మించిన శివాలయాలకు, ఈ మోపూరు భైరవేశ్వర ఆలయమే మాతృకగా భావిస్తున్నాం. 8–9 శతాబ్ది నుంచి 15వ శతాబ్దం వరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, వినుకొండ వల్లభరాయుడు, గండికోట రాజవంశీకుల విశిష్ట సేవల గురించి ఈ ఆలయం వద్ద దాన శాసనాలు లభించాయి. ఈ ఆలయం వెలుపల 50కి పైగా వీరశిలలు, 20 వరకు నాగ ప్రతిష్టల శిలలుండటం మరో ప్రత్యేకత. వీరశైవ మతంలో దేవుడికి ఆత్మార్పణం చేసుకొనే ఆచారముంది. వారి బలిదానానికి గుర్తుగా వీరశిలలను ప్రతిష్టిస్తుంటారు. శాసనాలూ చెక్కుతారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశంలోనే ఇది వీరశైవకులకు అతిముఖ్యమైన దేవాలయంగా చెప్పొచ్చు’ అని వెంకటేశ్వరరావు వివరించారు. -
చైనాలో తెలుగు వారు ఆందోళన చెందొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని తెలుగు వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఢిల్లీ తెలుగు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఏపీ ఎమ్మెల్సీ మాధవ్, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు, బీజేపీ నేత పి. రఘురాం, ఢిల్లీ తెలుగు సంఘాల నేతలు హాజరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషిచేయాలని కిషన్రెడ్డి వారిని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్కు సంబంధించి కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మనవారిని చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నామన్నారు. శనివారం 324 మంది, ఆదివారం మరికొంత మందిని తరలించామని, వారిని 15 రోజులు పరిశీలనలో పెట్టినట్లు తెలిపారు. బడ్జెట్పై స్పందిస్తూ..‘కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది.. అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదు..’అని పేర్కొన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం అండతో ఓ వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వారిపై జరిపిన దాడుల్లో బాధితుల ఆవేదనను బయట ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు సిద్దూపై పోలీసులు కేసులు పెట్టడం అక్రమమని తెలిపారు. సిద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన వైఖరిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిద్దూకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై తాను తెలంగాణ డీజీపీతో మాట్లాడతానని కిషన్రెడ్డి తెలిపారు. -
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
సాక్షి, అమరావతి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో...మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఇక మీదట కూడా ఇదే విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని, భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు. -
మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు
చీరాల/ వాషింగ్టన్: అమెరికాలో శనివారం ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన నలుగురు తెలుగు వ్యక్తుల (ఒకే కుటుంబం) మరణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. శవపరీక్ష పూర్తి అయిన తర్వాత వారి మరణానికి గల పూర్తి వివరాలు తెలియవచ్చే అవకాశం ఉందని సోమవారం అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్డెస్ మోయిన్స్లో యాష్వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు.. ప్రకాశం, గుంటూరు జిల్లావాసులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి తన పెద్ద కుమార్తె లావణ్యను గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన సుంకర చంద్రశేఖరరెడ్డికి ఇచ్చి 2003లో చీరాలలో వివాహం చేశారు. చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మే 29న వారు ఓ ఇంటిని కొనుగోలు చేయగా చంద్రశేఖరరెడ్డి అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతిలు గృహప్రవేశం నిమిత్తం అమెరికా వెళ్లారు. శనివారం ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో కింద పోర్షన్లో ఉంటున్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి చూశారు. రక్తపుమడుగుల్లో పడి ఉన్న నలుగురిని చూసి బయటకు వచ్చి స్థానికుల సహాయం కోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రక్తపుమడుగులో నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన ఇద్దరు పిల్లలు ప్రభాస్, సుహాన్ చదువులోగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారని చంద్రశేఖర్రెడ్డి కుటుంబంతో అమెరికాలో పదేళ్లుగా పరిచయం ఉన్న శ్రీకర్ సోమయాజులు తెలిపారు. -
అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం
వెస్ట్డెస్ మోయిన్స్: అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్డెస్ మోయిన్స్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల శరీరంపై తుపాకీ బుల్లెట్ల గాయాలున్నాయి. ఈ విషయమై నగర పోలీస్ సార్జంట్ డాన్ వేడ్ మాట్లాడుతూ..‘యాష్వర్త్ రోడ్డు–అస్పెన్ డ్రైవ్ల మధ్య ఉన్న 65 స్ట్రీట్లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్కాల్ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు 15, పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అటుగా వెళుతున్నవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు’అని తెలిపారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని వెల్లడించారు. పోస్మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్డెస్ మోయిన్స్లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కాగా, ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
మంచి మనసు చాటుకున్న ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు
అనంతపురం: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు తమ మంచి మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు బోర్లు వేసి వేరుశనగ సాగు చేసేవారు. అయితే పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో అతను అప్పుల పాలయ్యారు. అప్పుల బాధ భరించలేక, దిక్కుతోచక నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన ఆస్టిన్లో నివసిస్తున్న తెలుగువారు లక్ష రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వీరపాండియన్ చేతుల మీదుగా నారాయణరెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఎన్ఆర్ఐ బృందం, వారి స్నేహితులు పాల్గొన్నారు. అలాగే ఈ వార్తను ప్రచురించిన సాక్షి శింగనమల రిపోర్టర్ మునియప్పను కొనియాడారు. -
కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్పార్ట్లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్గా నిర్థారణకు వచ్చారు. -
అన్ని వర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ‘ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రచారానికి విరామం ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో నేడు(ఏప్రిల్ 6న) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు. -
తెలుగు మళ్లీ వెలగాలి
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ హవా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది. తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు. సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది. తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు. పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు. ఆధునిక యుగంలో తెలుగు తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి. సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి. ప్రాచీన హోదాకు వైఎస్ కృషి, బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
విడుదలైన ఆ ఇద్దరూ తెలుగువారే!
ముంబై: ఇథియోపియాలో నిర్బంధానికి గురై విడుదలైన ఇద్దరూ తెలుగువారేనని సమాచారం. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనుబంధ ఐటీఎన్ఎల్ కంపెనీ ఇథియోపియాలో చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొన్న స్థానికులు వేతనాలు అందకపోవడంతో గత నెల 25వ తేదీ నుంచి ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం, విదేశాంగ శాఖ అధికారుల జోక్యంతో భాస్కర్రెడ్డి, హరీష్ బండి అనే ఇద్దరిని స్థానికులు రెండు రోజుల క్రితం విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి రాజధాని ఆడిస్అబాబాకు తరలించినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది. మిగతా వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న భారత ఉద్యోగులకు జూలై నుంచి, స్థానికులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. -
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
కొచ్చిలో తెలుగువారి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడున్న తెలుగు వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొచ్చిలోని ఏలూరు కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వెయ్యి, పదిహేను వందల మంది ఇక్కడున్న ఫ్యాక్ట్ కంపెనీలో, షిప్యార్డుల్లో పని చేస్తున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.తెలుగువారికి చెందిన 20,25 ఇళ్లలో పదహారు ఇళ్లు వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ఆఇళ్లలో సామాన్లు ఏవీ పనికిరాకుండా పోయాయి.కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో ఉన్న వీరు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే, ఇళ్లలో రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేకపోవడంతో రోజు గడపడమే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొచ్చి తెలుగు అసోసియేషన్ వీరిని ఆదుకోవడానికి విరాళాల సేకరణ వంటి చర్యలు చేపడుతోంది.ఇక్కడి తెలుగు వారిలో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. వర్షాల వల్ల ఒక్కో తెలుగు కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత హనుమంతు నాయక్ చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ ఇక్కడి ఫ్యాక్ట్ కంపెనీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫ్లోరిడాలో ప్రజల రక్షణపై అవగాహన కల్పించిన నాట్స్
టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలోని ఫ్లోరిడాలో తెలుగువారి రక్షణపై ప్రత్యేక దృష్టిసారించింది. స్థానికంగా జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండటం ఎలా అనే దానిపై అవగాహన కల్పిచేందుకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే క్రైమ్ ప్రివెన్షన్అండ్ యాక్టివ్ షూటర్ ప్రిపేరేడ్నెస్ వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఆకస్మాత్తుగా చేసే దాడుల పట్ల ఎలా వ్యవహారించాలి. ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై ఇందులో ప్రధానంగా అవగాహన కల్పించారు. చైల్డ్ అండ్ యూత్ సేఫ్టీ, కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్, ట్రాఫిక్ స్టాప్, కాప్స్ ఎట్ యువర్ ఫ్రంట్ డోర్, అనే అంశాలపై స్థానిక రక్షణ అధికారులు డిప్యూటీ జాన్ ఫుట్ మ్యాన్ అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాపుకు వచ్చిన వారి ప్రశ్నలకు కూడా పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చి.. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో ప్రజలు అడిగిన ప్రశ్నలకు పోలీసులు అందించిన కొన్ని సమాధానాలు.. ప్రశ్న: మనం ఉన్న లొకేషన్ వివరాలు పోలీసులకు ఎలా చేరుతాయి? జవాబు: 911కి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు చివరి సిగ్నల్ పాయింట్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్ను కనిపెడతాము. అలాగే, చివరి కాంటాక్ట్ వివరాలు కూడా పోలీసుల వద్ద రికార్డ్ అవుతాయి. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వ్యక్తిని పోలీసులు రక్షిస్తారు. ప్రశ్న: డ్రైవింగ్ లైసెన్స్ ఇంటి వద్దే మరిచిపోయి వస్తే పరిస్థితి ఏంటి? జవాబు: లైసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి సమయంలో పోలీసులు జరిమానా విధిస్తారు. ఆ సమయంలో మంచి యాటిట్యూడ్తో ఉంటూ.. దురుసుగా ప్రవర్తించకుండా పద్దతిగా మాట్లాడితే ఒక్కోసారి పోలీసులు జరిమానా విధించకుండా వదిలేస్తారు. ప్రశ్న: రోడ్డు మీద నియంత్రణ లేకుండా.. దురుసుగా వాహనం నడిపే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? జవాబు: రోడ్డు మీద దురుసుగా వెళ్లే వారిని పట్టించుకోకపోవడం మంచిది. వారి దారిలో వారు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ పిల్లి ఎలుకలాగా ఎదుటి వ్యక్తి దూకుడుగా వెళ్తున్నాడు కదా అని మీరు కూడా అలాగే వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్న: స్కూళ్లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిస్తే పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి? జవాబు: కాల్పులు జరిగాయన్న వార్త వినగానే తల్లిదండ్రులు స్కూల్ వైపు రాకూడదు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల రోడ్లన్నీ పోలీసుల కోసం మూసివేస్తారు. పరిస్థితి అదుపులోకి వచ్చి, పోలీసులు ఓ ప్రకటన చేసే వరకు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండడమే ఉత్తమం. ప్రశ్న: పోలీసులు దర్యాప్తు లేదా తనిఖీలకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? జవాబు: పోలీసుల ముందు హఠాత్తుగా కదలడం లాంటివి చేయకూడదు. చేతులు కదల్చకూడదు. చేతులను స్టీరింగ్ మీద గాని, పైకి లేపి ఉంచాలి తప్ప జేబులో పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఉన్న పొజిషన్ మారకూడదు. ఎదుటి వ్యక్తి దాడికి దిగుతాడా, మంచి వాడా అనేది ఆ సమయంలోని ప్రవర్తనను బట్టి పోలీసులు అంచనాకు వస్తారు. ప్రశ్న: ఆభరణాలను ఎలా భద్రపరుచుకోవాలి? జవాబు: విలువైన నగలను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం అత్యుత్తమం. ఆభరణాలను డిపాజిట్ చేసేందుకు వెళ్లే సమయంలో ఒక్కరే వెళ్లడం కంటే ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్లడం మంచిది. అది కూడా రాత్రి వేళల్లో కంటే పగటి పూట అయితేనే మంచిది. లేదంటే దొంగలు నగలను దోచుకునే ప్రమాదం ఉంది. ప్రశ్న: స్కూల్లో కాల్పులు జరుగుతాయన్న బెదిరింపులు వచ్చినప్పుడు పిల్లలను పంపించడం మంచిదేనా? జవాబు: అలాంటి సమయంలో పిల్లల్ని స్కూలుకు పంపించడం సబబే. కాల్పులు జరిపే వ్యక్తి ఎక్కడున్నారనే విషయాలు పిల్లలు చెబుతారు. ఒకవేళ బెదిరింపు కాదు నిజమైన సంఘటన జరిగితే.. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిల్లలు దోహదపడతారు. ప్రశ్న: హైవే మీద వెళ్తున్నప్పుడు పోలీసులు వెంబడిస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి? జవాబు: అలాంటి సమయంలో సాధారణ వేగంతోనే వాహనాన్ని నడపాలి. ఆ సమయంలో ఏం చేస్తున్నా సరే చాలా క్యాజువల్గా ఉండాలి తప్ప పోలీసులను చూసి కంగారు పడకూడదు. ఆ సమయంలో కూడా వాహనాన్ని నడుపుతున్నప్పుడు రూల్స్ పాటించాలి. అప్పుడే ఎటువంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు. ప్రశ్న: వాహనాన్ని నెమ్మదిగా నడిపినా సరే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందా? జవాబు: కొన్ని సందర్భాల్లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం వల్ల కూడా జరిమానా కట్టాల్సి రావొచ్చు. నిర్దేశించిన వేగానికంటే స్లోగా నడిపినప్పుడు ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం అవుతారు. అలాంటప్పుడు జరిమానా విధిస్తారు. ప్రశ్న: 911కి ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది? జవాబు: ఎవరి మీదైనా దాడి జరుగుతున్నప్పుడు ఆ ఘటన వివరాలను చెప్పాలి. దాడి చేసే వ్యక్తి తాలూకు సమాచారం ఇవ్వాలి. అతని కళ్లు, జుట్టు రంగు, ముఖము, పర్సనాలిటీ వివరాలు తెలియజేయాలి. కాల్ చేసిన వ్యక్తి సురక్షిత ప్రదేశంలో ఉన్నాడో లేదో కూడా చెప్పాలి. -
వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాద్రిలోను, ఏపీలో ఒంటిమిట్టతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. -
వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-
‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. -
తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను హుషారైన వారిగా పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కొత్త శిఖరాలకు చేరాలని కోరుకున్నారు. దేశ ప్రగతిలో తన పాత్రను ఏపీ కొనసాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మోదీ.. రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ రోజు రాత్రి ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. ఇప్పటికే జర్మనీ, స్పెయిన్లో పర్యటించారు. Statehood Day wishes to the people of Telangana. I pray for the progress & prosperity of the state in the times to come. — Narendra Modi (@narendramodi) 2 June 2017 My good wishes to the dynamic people of Andhra Pradesh. May AP touch new heights of development & continue to contribute to India's growth. — Narendra Modi (@narendramodi) 2 June 2017 -
ప్రజలందరికీ శుభాలు కలగాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. -
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ‘శ్రీరామ నవమి’ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని వారు ఆకాంక్షించారు. లోక కల్యాణమే పరమావధిగా సాగిన శ్రీరాముడి పాలనే ఆదర్శమన్నారు. -
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేవళంబి సంవత్సరం అందరి ఇంటా సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందిరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మీకు మీ కుటుంబానికి శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) 29 March 2017 -
అమ్మో అమెరికా !
-
వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో ఇంటింటా వేడుకలతో సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పేరు చెప్పగానే రైతులు, పల్లెలు గుర్తుకు వస్తాయని, రైతన్న, పల్లెసీమ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని తాను ఎల్లప్పుడు కోరుకుంటానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ కార్యాలయం గురువారం ప్రకటన చేసింది. -
కడసారి చూపు కోసం...
-
అమెరికాలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి
అమెరికాలోని లూయిస్ విల్లీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల(35), రాజశేఖర్ రెడ్డి యారామాల(25), వెంకట ప్రశాంత్ కొమ్ము(27), అన్వేష్ కుమార్(24)లు లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్నారు. కారును నడుపుతున్న రామ ముందు ఉన్న భారీ టర్నింగ్ ను గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయినట్లు ఏజెన్సీ పేర్కొంది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ, రాజశేఖర్ లు, వెనుకభాగంలో కూర్చున్న అన్వేష్ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయినట్లు తెలిపింది. కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్(యూసీఎమ్ సీ) కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం. ఈ ఏడాది జనవరిలో ఎంఎస్ చేయడానికి రాజశేఖర్ అమెరికా వెళ్లాడు. రాజశేఖర్ రెడ్డి మృతితో బుచ్చిరెడ్డిపాలెంలో విషాదం అలుముకుంది. అలాగే యూసీఎమ్ సీ, సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్, రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం
సాక్షి, న్యూఢిల్లీ: ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు సురక్షితంగా ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఓరోమో వర్గీయులు తమ నిరసనలో భాగంగా బాలెరోబోకి వెళ్లే రహదారులను మూసివేయడంతో తెలుగు వారు బాలెరోబోలోని వర్సిటీలో చిక్కుకున్నారు. తమకు మరిన్ని హక్కులు కావాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని ఒరిమోలు నిరసనలు చేపట్టారు. ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాడవలబు వర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారని, తెలుగువారు సురక్షితమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు -
తెలుగు వారి అడుగుజాడ గురజాడ
పుంగనూరు టౌన్ : తెలుగువారి అడుగుజాడ గురజాడ అని వక్తలు కొనియాడారు. గురజాడ అప్పారావు జయంతిని పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జయచంద్రనాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేసి, చరిత్ర సృష్టించిన గురజాడ జయంతి తెలుగుజాతికి పండుగగా అభివర్ణించారు. సమాజంలో సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కన్యాశుల్కం వంటి గొప్ప సాంఘిక నాటకాన్ని రచించిన గురజాడ తెలుగు వాడవటం జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని దేశభక్తిని జాతి జనులలో రగిల్చిన యుగకర్తగా అభివర్ణించారు. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, అస్పృశ్యతను ఇతివృత్తాలుగా చేసుకొని కవితలు రచించి సాంఘిక మార్పు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ గ్రంథాలయాధికారిణి నసీబ్జాన్, తెలుగు భాషాభిమానులు వెంకటపతి, సీతాపతిరాజు, గండికోటరవీంద్ర, రామలింగప్ప, గురుమూర్తి, ఇట్టాభానుప్రకాష్, గిరిధర్, ఇంతియాజ్, హరి పాల్గొన్నారు. -
'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోందని భూమన అన్నారు. ప్రధానమంత్రే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదన్నారు. భూమన బీజేపీ ఎట్టి పరిస్థితిలో పోరాడకూడదన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం అవసరమా అని ప్రశ్నించారు. సీఎంగా ఉండటానికి చంద్రబాబు అనర్హుడని భూమన ధ్వజమెత్తారు. ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను పక్కన పెట్టిన టీడీపీ జీవచ్చవంలా మారిందన్నారు. -
'తెలుగు ప్రజల గుండె రాక్షస బొగ్గులా మండుతోంది'
-
‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’
-
‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’
ప్రకాశం: అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా తిరిగి వస్తారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన 150మంది తెలుగువారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా వారి యాత్రకు ఆర్మీ విఘాతం కలిగించింది. దీంతో అన్నపానీయాలు సైతం లేకుండా వారు అక్కడే యాత్రలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారితో తాను ఫోన్లో మాట్లాడినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని తాను సెంట్రల్ హోం సెక్రటరీ గోపాల్ రెడ్డికి చెప్పానని ఆయన వారిని సురక్షితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. -
తెలుగు వాళ్లకు తిరగడం ఇష్టం ఉండదట..!
హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు తమ ప్రాంతాన్ని దాటి పర్యాటకానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది. 2014-15 సంవత్సరానికిగాను చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. సొంత రాష్ట్రాలను దాటి ట్రిప్, హాలీడేయింగ్లాంటి వాటికి వెళ్లడానికి తెలుగు ప్రజలు శ్రద్ధ చూపడం లేదని పేర్కొంది. ఏడాదికాలంలో కేవలం 8.1 శాతం మంది ప్రజలు మాత్రమే ఓవర్ నైట్ ట్రిప్స్, ఆటవిడుపు, హాలీడేయింగ్, షాపింగ్, మెడికల్ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారని సర్వే ఫలితాల్లో తెలిసింది. వీటిలో కూడా సామాజిక, బిజినెస్, మెడికల్, మతాలకు సంబంధించినవే ఎక్కువని తేలింది. ఆట విడుపు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడాది కాలంలో అత్యధికంగా 1,30,600 ట్రిప్స్ జరిగితే, తెలంగాణ నుంచి 2,02,700 ట్రిప్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 30 రోజుల వ్యవధిలో మత సంబంధిత కార్యక్రమాల కోసం 1,44,200 ట్రిప్స్, సామాజిక అవసరాల పరంగా 14,08,400 ట్రిప్స్ జరిగాయి. తెలంగాణ నుంచి సామాజిక అవసరాలకు 6,54,000, మత సంబంధిత కార్యక్రమాలకు 53,100 ట్రిప్ లు జరిగినట్లు రికార్డుల లెక్కల్లో తేలింది. దక్షిణ భారతదేశంలో ఆటవిడుపు కోసం ట్రిప్స్ కు వెళ్లినవారి సంఖ్యలో అతి తక్కువ తెలుగువారిదేనని సర్వే తేల్చింది. తెలుగురాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల నుంచి ట్రిప్స్ కు వెళ్తున్న వారు అక్కడ అతి తక్కువ ఖర్చు చేసిన వారు కూడా మనవాళ్లే. ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున రూ.5,396లు ట్రిప్స్ కు వెళ్లిన వారు ఖర్చు చేశారని, అదే తెలంగాణ నుంచి అయితే రూ.9,777లు ఖర్చు చేశారని తెలిపింది. ఒంటరిగా ట్రిప్స్ వెళ్తున్న మహిళల్లో మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 53శాతం మంది మహిళలు, తెలంగాణ నుంచి 60 శాతం మంది మహిళలు ఒంటరిగా ట్రిప్స్ కు వెళ్లారని సంస్థ వివరించింది. 30రోజుల పరిధిలో అత్యధికంగా యాత్రికులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలుగు రాష్ట్రాలు 8,68,100 మందితో రెండో స్థానంలో నిలిచాయి. కాగా, హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 38 శాతం మంది ట్రిప్స్, హలీడేయింగ్ కు వెళ్లగా.. అత్యల్పంగా ఒడిశా నుంచి కేవలం 7.5 శాతం మంది మాత్రమే వెళ్లారు. -
నన్ను గెలిపిస్తే.. తెలుగోడి శక్తిని తెలియజేస్తా!
తమిళనాడు: తమిళనాడులో జయలలిత పోటీచేస్తున్న ఆర్కె నగర్, హోసూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆయన జయలలితకు ప్రత్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉండగా, హోసూరులో ఒక లక్ష ఎనభై వేలమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందంటూ ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో అభ్యర్థించారు. తమిళనాడు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా తెలుగు ప్రజలను కోరారు. తమిళనాడులో ద్విభాషా విద్యావిధానం అమలులో ఉందని, దీనికి బదులుగా త్రిభాష విద్యా విధానం అమలు చేయాలని, ఉగాది పండుగను ప్రభుత్వ పండుగగా ఘనంగా నిర్వహించుకోవాలని కేతిరెడ్డి చెప్పారు. తమిళనాడులో అన్నీ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 35 మంది శాసన సభ్యులు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అయితే తెలుగు వారి సమస్యలపై వారు ఏనాడు స్పందించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకుంటే తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తానని.. తెలుగు వాడి శక్తిని పాలకులకు తెలియజేస్తానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
తెలుగోళ్లు.. దమ్ము చూపించారు!
సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 92 మంది ఎంపికైనట్లు తెలుస్తోంది. 2015 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1078 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా, అందులో సుమారు 92 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామానికి చెందిన రైతు భోజన్న కుమారుడు వడ్నం నిఖిల్ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 794వ ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నవాళ్ల పేర్లు ఇలా ఉన్నాయి.. చేకూరి కీర్తి (14) హెచ్ఎస్ శ్రీకాంత్ (56) వల్లూరు క్రాంతి (65) సీహెచ్ రామకృష్ణ (84) వసన విద్యాసాగర్ నాయుడు (101) జొన్నలగడ్డ స్నేహజ (103) ఏ దీప్తి (113) వేమూరి విఎల్ అంబరీష్ (150) పోతరాజు సాయి చైతన్య (158) నివేదిత నాయుడు (159) పి.కృష్ణకాంత్ (169) ఏ పవన్ కుమార్ రెడ్డి (179) వై. రిషాంత్ రెడ్డి (180) ఆర్ విశ్వనాథ్ (181) వరుణ్ గుంటుపల్లి (183) ఆర్ మహేష్ కుమార్ (189) పసుమర్తి వీజీ సతీష్ (191) సలిజామల వెంకటేశ్వర్ (216) బట్ర ప్రీత్ పాల్ కౌర్ (225) కింతాడ ప్రవల్లిక (232) పి ఉదయ్ కుమార్ (234) శశాంక్ రెడ్డి (240) బండ్ల దినేష్ ఆదిత్య (270) గున్ను సుధీర్ (318) సుధాకర్ (324) వై విష్ణువర్ధన్ రెడ్డి (325) ఉప్పలూరి మీనా (326) కొడాలి గోకుల్ (345) సీహెచ్ శ్రీధర్ (348) జీ ఎల్ నరిసింహం (350) కంది ప్రవీణ్ (363) కీర్తిశ్రీ (380) శ్రుతి విజయకుమార్ (381) మల్లెల శ్రీకాంత్ (388) హరికృష్ణ (408) పి దిలీప్ కుమార్ (415) మద్దికుంట సిద్దార్థ (419) ఎం కృష్ణ కౌండిన్య (422) డి గౌరీ శంకర్ (457) డిఎన్ హరికిరణ్ ప్రసాద్ (461) నాగిరెడ్డిగారి మధులత (496) హెచ్ విష్ణు ప్రసాద్ (506) ముమ్మక సుదర్శన్ (526) అల ప్రియాంక (529) ఆర్ కృష్ణ ప్రసాద్ (531) కట్టా సింహాచలం (538) నార్నవారి మనీష్ శంకర్ రావు (552) దేవరాజు శివ ప్రకాష్ (572) వై విజయసింహారెడ్డి (588) ఆర్ఎస్ విద్యావతి (600) జి. ప్రదీప్ (609) ఎం కార్తీక (610) కె కృష్ణమూర్తి (615) పి శ్రుతి (617) ఆర్ ఆనంద్ (621) ఆర్ శివ ప్రసాద్ (622) ఎం గాయత్రి (642) శ్రీధర వెంకటేశ్వర్లు (683) ఎస్ భారతి (684) బి రవితేజ (694) సిగిలిపల్లి కృష్ణారావు (704) దారం వెంకటేశ్వరరావు (708) ఏ సురేష్ (718) బండారు బాల మహేంద్ర (730) చింత కుమార్ (768) సాయి సందీప్ కుమార్ (780) పురుషోత్తమ్ కుమార్ (828) కామినేని సంజయ్ రావు (830) పుష్పలత (845) ఎస్ భారత్ (866) చిలక సుధారాణి (876) విజయ్ కుమార్ (880) హెచ్ హనుమంతరాజు (898) పిల్లి ప్రేమకుమార్ (900) బి ప్రవీణ్ కుమార్ (907) ఆర్ భరత్ (914) ఇంటి నిహారిక (930) కుర్రా శ్రీనివాస్ (953) కారెల ముఖేష్ కుమార్ (972) ఎల్లసిరి శివప్రసాద్ (973) బి బాలస్వామి (977) జె విజయకృష్ణ (988) సీహెచ్ ప్రదీప్ కుమార్ (998) దాసరి కార్తీక్ (1000) మేకల సంధ్యా సమీర (1001) సుర్వే స్వాతి (1003) సాలి గౌతమి (1004) పెరుమాళ్ల సత్య స్వరూప్ (1012) కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ (1021) కొలకలూరి అరవింద్ (1022) నేగి సుష్మ (1029) దొండపర్తి వెంకట హరీష్ (1035) కె ఎస్ రమేష్ భారతి (1046) -
'అందులోనే ఉండటం బాబుకు సిగ్గుచేటు'
హైదరాబాద్:ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇంకా కేంద్రంలోనే ఉండటం సిగ్గు చేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం కేంద్రంతో రాజీపడుతున్నారని అన్నారు. తెలుగువారి పౌరుషం చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10న వైఎస్ఆర్ సీపీ నిర్వహించే ధర్నాలకు అందరూ మద్దతివ్వాలని అంబటి కోరారు. ప్రత్యేక హోదా కోసం 10న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా ఉంటుందని చెప్పారు. బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని, మరీ బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి మొదటి ముద్దాయి చంద్రబాబునాయుడని అన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా మోదీ కేసీఆర్ వద్ద ఉందని అందుకే.. స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేయడం లేదని ఆరోపించారు. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలుగువాళ్లు
చెన్నై: తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగువారు పోటీ చేస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో బాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాషపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు పోటీచేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి, సంస్థ కార్యదర్శులు మండ్లు శ్రీనివాసరావు, డి. శివశంకరరెడ్డి, యు. పించలయ్య, బి. గోవర్థన్, కె. మోహన కృష్ణ, ఎస్. బాలాజీలతో పాటు తమిళనాడుకు చెందిన తెలుగు సంఘాల ప్రముఖులందరూ చిత్తూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులను కలిసి ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగువారికి, తెలుగు సంఘాలకు మద్దతు తెలపాలని కోరుతామని కేతిరెడ్డి తెలిపారు.