వైఎస్ఆర్సీపీ నేత, దివంగత భూమా శోభానాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి నవంబర్ 8 తేదిన ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అక్టోబర్ 14 తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటన చేసింది. నవంబర్ 8 తేదిన పోలింగ్ నిర్వహించి.. 12 తేదిన ఓట్ల లెక్కింపు జరుపనున్నట్టు ప్రకటనలో పేర్కోన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం జరిగిన ఆళ్లగడ్డ స్థానానికి జరిగిన ఎన్నికలో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Published Tue, Oct 7 2014 8:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement