మెదక్ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు | cattle-smuggling-in-medak-district | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 15 2015 2:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై మెదక్ సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రామాయంపేట సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 3 చెక్ పోస్టుల వద్ద వాహనాన్నిఆపకుండా వెళ్తన్న డీసీఎం వ్యానును స్థానిక పోలీసులు వెంబడించారు. వ్యానులో ఆవులను తరలిస్తున్న 8 మంది హర్యానా వాసులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాయాయంపేట కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో హర్యానా వాసులపై పోలీసలు కాల్పులు జరిపారు. పేట్ బషీర్ వద్ద డీసీఎంను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement