కేంద్రం అచేతనంగా వ్యవహరిస్తోంది: బర్దన్ | Central government in Dilemma over Telangana issue | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 22 2013 5:13 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్ విమర్శించారు. రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాలు నేతలు కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. రెండు ప్రాంతాలను జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితిని తొలగించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితి గురించి బర్దన్కు వివరించినట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. కాంగ్రెస్కు ఇప్పుడైనా కనువిప్పు కలిగి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు జేడీ(యు) నేత శరద్ యాదవ్ను కలిశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement