అయిపోయింది... భయపడినంతా జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలు నాశనమైపోయాయి. భావితరాలు పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. విభజన కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రానికి సంజీవని వంటి ‘ప్రత్యేక హోదా’ ఆశను సమాధి చేసేశారు.