చంద్రబాబు సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బలహీనపడుతోందని వ్యాఖ్యానించారు. లంచగొండితనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందారు.