తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని, అన్నిరకాల ఆధారాలతోనే మాట్లాడానని, న్యాయపోరాటానికి అయినా సిద్ధమే అని దిగ్విజయ్ మంగళవారమిక్కడ అన్నారు. ఓ వైపు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూనే మరోవైపు ముస్లిం యువతను తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.
Published Tue, May 2 2017 7:37 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement