విదేశీ దౌత్యకార్యాలయాలే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ లో గల ఇండియన్ పాకిస్థానీ కానసులేట్ లకు అతి సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా అభివర్ణించిన స్థానిక అధికారులు.. పేలడులో నలుగురు పోలీసులు చనిపోయారని, పేలుడు తర్వాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు.