కరుడుగట్టిన ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూ జైలు నుంచి పరార్ కావడంతో పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో వచ్చిన సాయుధులు నబా జైలుపై దాడి చేసి.. హర్మిందర్ సింగ్తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకుపోయారు. ఈ సందర్భంగా వందరౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్టు సమాచారం. సాయుధులు దాడి చేసి.. అత్యంత భద్రత నడుమ ఉన్న కీలక తీవ్రవాద సూత్రధారిని జైలు నుంచి విడిపించుకొనిపోవడం తీవ్ర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన, అనంతర పరిణామాలపై పంజాబ్ డీజీపీ, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ భేటీ అయి చర్చించారు.
Published Sun, Nov 27 2016 1:08 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement