ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు విచారించనుంది. బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరుతూ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు... విచారణను నేటికి వాయిదా వేశారు.
Published Mon, Sep 30 2013 12:19 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement