కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశముందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత జానారెడ్డి మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షంలో మెజారిటీ సభ్యులు ఆయన వ్యవహారశైలి పట్ల ఆగ్రహంగా ఉన్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి నివేదించారు. వీలైతే తదుపరి శాసనసభ సమావేశాలు ప్రారంభం నాటికి ఆయన స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నేతను ఎంపిక చేయాలని కూడా సోనియాకు వివరించారు.
Published Fri, Feb 20 2015 8:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement