‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు! | Mulayam Singh Daughter in Law's cold war in Samajwadi Party | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 5 2017 3:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వాస్తవానికి.. అఖిలేశ్ను 2012లో ముఖ్యమంత్రిగా ప్రకటించే సమయంలోనే.. ములాయం రెండో భార్య, అఖిలేశ్ సవతి తల్లి అయిన సాధనాగుప్తా.. తన కుమారుడైన ప్రతీక్ను ములాయం వారసుడిగా ప్రతిష్టించాలని కోరుకున్నారు. అయితే ప్రతీక్ రాజకీయాలను కాదని, రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో ప్రతీక్ భార్య, తన కోడలు అపర్ణను అఖిలేశ్కు పోటీగా దించాలని సాధనాగుప్తా నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన డింపుల్ తన భర్త అఖిలేశ్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన తన తండ్రి ములాయంను ప్రతి రోజూ కలుస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయినా కూడా తండ్రి నివాసం నుంచి సాధనాగుప్తాతో పాటు తన బాబాయి శివ్పాల్లు తనకు ఇబ్బందులు సృష్టించగలరని తేటతెల్లమయ్యాక అఖిలేశ్ తన నివాసాన్ని ఏకంగా ములాయం ఇంటి పక్కకే మార్చేశారు. శివపాల్-అపర్ణల శిబిరం వ్యూహాలను ప్రతిఘటిస్తూ వచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement