ఏపీలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూలేని కరువును ఈ ఏడాది రాష్ట్రం ఎదుర్కొంటుందని, లక్షలాది ఎకరాల్లో భూములు బీడులుగా మారాయని తెలిపారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ కరువు పీడిత రాష్ట్రంలా మారిందని నాగిరెడ్డి ఆరోపించారు.