కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 143వ జీఓ ద్వారా ఎనిమిది వేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని, ఇంటర్మీడియట్ వ్యవస్థకు వారే మూలస్తంభాలుగా నిలిచారని అన్నారు.