నగదు కష్టాలు తీవ్రతరమవుతుండటంతో అసహనానికి గురవుతున్న సాధారణ ప్రజానీకం బ్యాంకు శాఖలపై దాడికి కూడా పాల్పడుతున్నారు. నగదు అందించలేని బ్యాంకుల వద్ద నిరసనలకు దిగుతున్నారు. హైదరాబాద్లోని టోలిచౌక ప్రాంతంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమకు అవసరమైన నగదును అందించడంలో విఫలమైనందుకు నిరసనగా.. ప్రజలు రోడ్డును బ్లాక్ చేశారు. బస్సులను నిలిపివేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గురుద్వారా ట్రాహాలోని ఓ కోఅపరేటివ్ బ్యాంకు తమ కస్టమర్లకు సరిపడ నగదు అందించలేదని తెలుసుకున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) సభ్యులు ఆ బ్యాంకు వద్దనున్న రోడ్డును బ్లాక్ చేశారు. బ్యాంకు తలుపును కూడా బీకేయూ సభ్యులు నిన్న సాయంత్రం నుంచి లాక్ చేసి ఉంచారు.
Published Sat, Dec 10 2016 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement