Demonetisation
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
Rahul Gandhi: బీజేపీ విధానాలతో ప్రజలకు చావులే
జంషెడ్పూర్/ధన్బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్ఎస్ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్పూర్లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.మహారాష్ట్రలోనూ కుల గణన సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్తో బదులిచి్చంది. పాక్లోని బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
హ్యపీ బర్త్డే: ‘నోట్ల రద్దు’ను వినూత్నంగా గుర్తు చేసిన అఖిలేష్ యాదవ్
ఏడేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు గాయాల్ని వినూత్నంగా గుర్తు చేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. నోట్ల రద్దు సమయంలో జన్మించిన 'ఖాజాంచి' (కోశాధికారి అని అర్థం) అనే చిన్నారి పుట్టినరోజును లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సతమతమవుతున్న సమయంలో 'ఖాజాంచి' ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చిన్నారి తండ్రి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి ఉండగా తల్లి ఆ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం రూ.15 లక్షల కోట్ల కార్పొరేట్ ఫ్రాడ్ను కప్పిపుచ్చడమేనని ఆరోపించారు. ధనికుల ఖజానాను నింపేందుకు పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. బీజేపీ చెప్పినట్లుగా నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం ముగిసిపోలేదని ఆక్షేపించారు. మరో అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పుడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఖాజాంచి తల్లి, ఇతర పార్టీ సభ్యులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..
దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్ పేమెంట్ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్ దొరకడమే కష్టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు. ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా.. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు. -
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
93 శాతం 2,000 నోట్లు వెనక్కు వచ్చేశాయ్: ఆర్బీఐ
ముంబై: ఉపసంహరణ నిర్ణయం వెలువడిన మే 19వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన ఒకటి పేర్కొంది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం, ఆగస్టు 31వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.0.24 లక్షల కోట్లకు పడిపోయింది. బ్యాంకులకు తిరిగి వచి్చన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో జరగ్గా, 13 శాతం బ్యాంకుల్లో ఇతర కరెన్సీలోకి మారి్పడి ద్వారా వెనక్కువచ్చాయి. అధిక విలువ నోట్లు కలిగి ఉన్న ప్రజలు 2023 సెప్టెంబరు 30 నాటికి ఆ నోట్లను డిపాజిట్ చేయాలని లేదా నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2016 నవంబర్లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, మే 19వ తేదీన ఒక కీలక ప్రకటన చేస్తూ, రూ.2,000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8% మాత్రమే. వ్యవ స్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
పాక్లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా?
పేదరికం అంచునకు చేరుకున్న పాకిస్తాన్ను ఇప్పుడు నల్లధనం సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్లో నల్లధనం విపరీతంగా పెరిగిపోవడంతో దానిని అరికట్టడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. పాకిస్తాన్లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన పోలీసు అధికారులు తమ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్లో నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా విఫలం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. పాక్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై మాట్లాడేందుకు ఏ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరని సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పాకిస్తాన్లో నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని పాక్ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇది మొదట్లో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసిరింది. కానీ తరువాతి కాలంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచిందని ఆ పత్రిక పేర్కొంది. నగదు నిల్వలను అరికట్టేందుకు పాకిస్తాన్లో రూ.5000 నోటును దశలవారీగా రద్దు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. అయితే దీనిపై పాక్ అధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్లోనే అతిపెద్ద నోటు దక్షిణాసియా దేశాల్లో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన నోటు మరే ఇతర ఆసియా దేశంలోనూ లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గత ఏడాదిలో నగదు ప్రవాహం గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ మొత్తంమీద భౌతిక నగదు మారకం 29 శాతం వరకూ ఉంటుంది. పాకిస్తాన్లో జీడీపీలో 40 శాతం నల్లధనం పాకిస్తాన్లో నల్లధనంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ 341.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐపీఎస్ఓఎస్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం మేరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి సంవత్సరం 6 శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా నెట్టివేస్తున్నది ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..! -
రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా,‘ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి ఫోన్పే యూజర్లకు గుడ్న్యూస్.. సరికొత్త ఫీచర్, అదనపు బెనిఫిట్స్ కూడా -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!
న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ పబ్లిక్ యాప్ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) 55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, 23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి, 22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. మే 19వ తేదీన వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి. వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ... ► తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు. ► ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు. ► సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ► 2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు. ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్ చేయవచ్చు. లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు. ► ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి. ► రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. ► 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ మరిన్ని బిజినెస్ అపడేట్స్, ఇంట్రస్టింగ్ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పిచ్చి మోదీ: అధీర్
కోల్కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది. మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్ ఓ నేరగాడంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్ అన్నారు. -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెద్ద నోట్ల(500, 1000)ను 2016 నవంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, భారీ సంఖ్యలో ఉన్న ఈ నోట్లను ఏం చేశారు? కరెన్సీ నోట్లను కాల్చివేశారా?.. లేక ఈ కరెన్సీ నోట్లను ఆర్బీఐ వద్దే దాచి పెట్టారా? లేక రీసైక్లింగ్ చేశారా? అంత విలువ చేసే నోట్లను ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. -
గతంలో రద్దైన పెద్ద నోట్లను ఏం చేశారో తెలుసా ?
-
ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేనా?
బ్రిటిష్ వలస పాలకులు కూడా పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నామని కోతలు కోసేవారు. అవే మాటల్ని దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా చెప్పింది. అవే ఇప్పటికీ కేంద్ర పాలకులు చెబుతారు. ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు. కానీ ఈ రాజకీయవేత్తలకు తమ ‘అమాయక మనస్తత్వం’ నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకు అందనంత పెద్ద జబ్బు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. రూ. 2 కూడా చేతిలో ఆడని అసంఖ్యాక కష్టజీవులకు దీనివల్ల కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? ‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కారణం – ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొలదిమంది సంపన్న స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోరికలేనని మరచిపోరాదు.... దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా తాను పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నానని బీరాలు పలకవచ్చు. కానీ, బ్రిటిష్ వలస పాలకులు కూడా అలాంటి కోతలే కోసేవారు. కానీ అసలు రహస్యం – పేద ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరక పోవడం. ఈ సత్యాన్ని స్వతంత్ర భారత పాలకులు వినమ్రతతో అంగీకరించి తీరాలి.’’ – జాతిపిత గాంధీజీ (1947 డిసెంబర్ 11); ‘ది హిందూ’ ప్రచురించిన ‘మహాత్మాగాంధీ: ది లాస్ట్ 200 డేస్’ నుంచి. ‘‘సంపన్నుల చేతిలో అంత అధికారం ఎలా గూడు కట్టుకుంది? పాలకులు ప్రయివేట్ కార్పొరేషన్ల పైన, సంపన్నుల ఆస్తుల పైన శ్రుతి మించిన ఆదాయంపై విధించే పన్నుల్ని తగ్గించి వేయడంవల్ల! మరోవైపున శ్రమజీవులైన కార్మిక సంఘాలను అణచి వేయడం ద్వారా వారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం ద్వారా కోత పెట్టేయడం రివాజుగా మారింది.’’ – ప్రసిద్ధ ఆర్థికవేత్త పాల్ క్రూగ్మన్ 2016లో అకస్మాత్తుగా బీజేపీ పాలకులు పెద్ద నోట్ల చలామణీని అదుపు చేసి దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడుతామని బీరాలు పలికి తాము చతికిలపడటమే గాక కోట్లాదిమంది సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు తేరుకోలేదు. ఈలోగానే ‘పెద్ద నోట్ల భారం’ పేరిట వాటిని చలామణీ నుంచి ఉపసంహరించే పేరిట గతంలో 500, 1000 నోట్లకు ఎసరు పెట్టినట్టే ఇప్పుడు రూ. 2000 నోట్లపై యుద్ధం ప్రకటించారు. 2016లో ‘పాకిస్తాన్పై యుద్ధం కోసం’ పెద్ద నోట్ల చలామణీని అదుపు చేస్తే, ఈ రోజు దాకా తేరుకోకుండా కునారిల్లుతూ వస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. సామాన్య ప్రజాబాహుళ్యం మౌలిక ప్రయోజనా లకు రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రత్యక్షంగా నష్టం కలగక పోవచ్చు. అయితే పరోక్షంగా ఎన్నికల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీలతో అనుసరించే ఎత్తుగడల నుంచి మాత్రం రెండువేల రూపాయల నోటు తొలగిపోదు. లోపాయకారీగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కేవలం పాలకపక్ష నాటకంగా పైకి కనిపించినా, పరోక్షంగా ప్రతిపక్షాల ప్రయోజనాలు నెరవేర్చడంలో కూడా ‘రెండు వేల నోటు’ ఉపయోగపడుతుందని మరచిపోరాదు. గతంలో రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు వల్ల ‘నల్ల ధనం, నకిలీ నోట్లు’ చలామణీ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఏళ్ల తరబడిగా తలదాచుకుంటున్న భారత పెట్టుబడి దారుల దొంగ డబ్బును దేశానికి తీసుకొచ్చి, భారత ప్రజలకు లక్షలు, కోట్లు పంచిపెడతానన్న ప్రధాన మంత్రి మాట ‘నీటి మూట’గా ఎలా మారిందో ప్రజలు చూశారు. ఈ సందర్భంగా నాటి రిజర్వు బ్యాంక్ గవర్నర్గా ఉన్న రఘురామ్ రాజన్ పాలకుల నిర్ణయాల్ని నిరసించి, ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం’లోకి పాలకులు నెట్టబోతున్నారని ప్రజల్ని హెచ్చరించి మరీ గవర్నర్ పదవికి రాజీనామా చేసి అమెరికాలో కొలువుకి ‘చెక్కేయ’వలసి వచ్చింది. రాజన్ హెచ్చరికలు దేశానికి ముందస్తు మెలకువలయ్యాయి. అయినా పాలకులలో చలనం లేదు. సుప్రీం కోర్టు కూడా ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న’ తీవ్ర నిరాశను బాహాటంగానే వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు స్వతం త్రంగా, ఎలాంటి ‘ఉచ్చులు’ లేకుండా బతకవచ్చునో జూలియస్ నైరేరి అధ్యక్షతన ఏర్పడిన ‘సౌత్ కమిషన్’ నిరూపించింది (1990 రిపోర్టు). కాంగ్రెస్ హయాంలో ప్రధాని హోదాలో నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆ రిపోర్టును ఆహ్వానించి కూడా ఆచరణలో అమలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా – ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అన్నార్తులైన ప్రజాబాహుళ్యంపై ఎక్కుపెట్టిన దారి దోపిడీ పద్ధతుల వల్ల ఆయా ఖండాల ప్రజలు ఎలా ఆర్థికంగా కునారిల్లి పోయారో ఆ సంస్థల ఆదేశంపై వాటి తరఫున ఆ దేశాలలో పని చేసిన వైస్ ప్రెసిడెంట్ డేవిసన్ బుధూ తన అనుభవాలను అమితమైన దుఃఖంతో అక్షరబద్ధం చేశారు. ‘‘ఈ ఖండాలలో కోటానుకోట్ల పేద ప్రజలు పట్టెడన్నం కోసం మాడుతున్నారు. అన్నార్తుల రక్తంతో తడిసిన మా అధికారుల చేతులను కడగటానికి ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ చాలవు’’ అని ప్రకటించారు! ‘రూ. 2000’ పెద్ద నోటును సర్క్యులేషన్ నుంచి కట్టడి చేసినంత మాత్రాన రూ. 2లు కూడా చేతిలో ఆడని అసంఖ్యాక సామాన్య కష్టజీవులకు కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర పాలకులు కొత్త వేషానికి గజ్జె కట్టారు. కర్ణాటక తాజా ఎన్నికల్లో రెండువేల రూపాయల కట్టలు ప్రాణం పోసుకున్నందువల్ల 2024 ఎన్నికల నాటికన్నా ఈ కట్టల్ని ‘కట్టడి’ చేయాలన్నది కేంద్ర పాలకుల ఎత్తుగడ! అసలు ‘మంచి పాలన’ పేరిట దేశ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు అని నిశితమైన ఆర్థిక వ్యవహారాల నిపుణులలో ఒకరైన సంజీవి గుహన్ ఖండించవలసి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ చరిత్రకారులైన ఎడ్వర్డ్ మాసన్, రాబర్ట్ ఆషర్ అభిప్రాయం కూడా అదే! అంతేగాదు, బీజేపీ పాలకుల నిర్ణయాలను ‘ఆదర్శం’గా భావించిన ఒక ‘నేత’ మరొక అడుగు ముందుకు వేసి – ప్రతిపక్షాల కూటమికి తనను రథసారథిని చేస్తే మొత్తం ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని అన్నట్టుగా ఓ ఇంగ్లిష్ ఛానల్లో బాహాటంగా ప్రకటించడంతోనే – రెండు వేల రూపాయల నోటుకు ‘వేటు’ పడిందని కొల్లలుగా ప్రకటనలు వెలువడజొచ్చాయి. ఈ సందర్భంగా రాజకీయ పాలకుల, నాయకుల తప్పిదాలకు మూలాన్ని కనుగొనే యత్నంలో ఐన్స్టీన్కూ, సోషలిస్టు నాయకుడు రావ్ుమనోహర్ లోహియాకూ మధ్య సాగిన ఒక ఆసక్తికరమైన సంభా షణను గమనించాలి. ఐన్స్టీన్: ‘రాజకీయులు చేసే తప్పిదాలు వాళ్ల లోని చెడ్డ తలంపుల వల్లగాక, అమాయకత్వం నుంచి పుట్టే లక్షణంగా మనం భావించవచ్చా?’ లోహియా: ‘అసలు రహస్యం – రాజకీయవేత్తలకు తమ అమా యక మనస్తత్వం నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకి అందనంత పెద్ద జబ్బు. ఆ జబ్బే వారిని పీడిస్తుండే పెద్ద రోగం. ఈ రోగం నుంచి బయట పడటం ఇష్టం లేనందుననే చాలా మంది రాజకీయులకు దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు గాక ఉండదు’! ఆర్థిక నిపుణులైన శుభదారావు నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్థికవేత్తల బృందం (క్వాంట్ ఎకో) వివరించినట్టుగా, పన్నుల ఎగ వేతకు వీలుగా దొంగచాటుగా అట్టిపెట్టుకోవడానికి ఈ 2000 లాంటి పెద్ద నోట్లు సంపన్నుల వద్ద మేట వేసుకున్నాయి. అవి ఇప్పుడు కోట్లాది విలువ చేసే లోహ సంపద పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గతంలో బ్యాంకుల వద్ద పొద్దుగూకులు పెద్ద నోట్లు మార్చుకోవడానికి పడిగాపులు పడి 125 మంది సాధారణ ఖాతాదార్ల ప్రాణాలు ‘హరీ’ అన్నాయి. ఈసారి ‘భాగోతం’ ఎలా ముగుస్తుందో రేపటి ‘వెండి తెర’పై చూడాల్సిందే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
2,000 నోటు.. సవాలక్ష ప్రశ్నలు!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నాటితో పోలిస్తే చిన్న లైన్లు, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలపరమైన గందరగోళం మధ్య రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. పాన్ లేదా ఆధార్ వంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఫారంలు తప్పనిసరని ఆర్బీఐ సూచించకపోయినా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది అవి కావాల్సిందే అనడంతో ఖాతాదారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఎల్రక్టానిక్ ఎంట్రీలు చేసుకుని నోట్లను మార్చగా, మరికొన్ని మాత్రం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలేమీ అడగకుండా రిజిస్టరులో పేరు, మొబైల్ నంబరు రాయాలంటూ కస్టమర్లకు సూచించాయి. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డులను చూపించాలని అడిగినట్లు కొందరు కస్టమర్లు తెలిపారు. అలాగే, మరికొన్ని బ్యాంకులు నోట్లను మార్చలేదని, దానికి బదులుగా తమ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా సూచించాయని వివరించారు. అయితే, 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు (డీమానిటైజేషన్) కనిపించినంతగా చాంతాడంత లైన్లు ఈసారి కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావొచ్చనే అంచనాలతో కూర్చునేందుకు, తాగు నీటికి ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది రాలేదు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) నోట్లను మార్చుకునేందుకు దాదా పు 130 రోజుల పైగా వ్యవధి ఉండటం ఇందుకు కారణమని పరిశీలకులు తెలిపారు. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నాలుగు నెలల సమయం ఉండటంతో డీమానిటైజేషన్తో పోలిస్తే అంత హడావుడి ఏమీ లేదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు వివరించారు. రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఎటువంటి ఫారం లేదా పత్రం అవసరం లేదంటూ ఎస్బీఐ తమ శాఖలకు అధికారికంగా మెమో పంపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి ఫారం నిర్దేశించకపోయినా, తమ ఖాతాదారులు కాకపోతే మాత్రం ఐడీ ప్రూఫ్ మాత్రం అడుగుతోంది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఇక కోటక్, హెచ్ఎస్బీసీ వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులు కాని వారి దగ్గర్నంచి ఫారం/ఐడీ ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రం తాము ఎటువంటి ఫారం లేదా ఐడీ ప్రూఫ్ను తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చెల్లుబాటవడం కొనసాగుతుంది. సెపె్టంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చు లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. (అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) సమర్థించుకున్న ఆర్బీఐ.. రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ఢిల్లీ హైకోర్టులో ఆర్బీఐ సమర్థించుకుంది. ఇది డీమానిటైజేషన్ కాదని చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపింది., నిర్వహణ సౌలభ్యం కోసమే నోట్ల మార్పిడిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా నోట్లను మార్చుకోవచ్చన్న ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే లాయరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆర్బీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. ధ్రువీకరణ పత్రాల ప్రసక్తి లేకపోతే మాఫియా, నక్సల్స్ మొదలైన వారి వల్ల ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనరు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా?
ముంబై: రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ప్రొఫార్మా కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీనిని అన్ని బ్యాంకులకు పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. నోట్లను మార్పిడి చేయాలనుకునే వారు ఈ ప్రొఫార్మాను పూర్తి చేయడం తప్పనిసరని చెబుతున్నారు. ఈ ప్రొఫార్మా మొదటి కాలమ్లో నోట్లను మార్పిడి చేయాలనుకునే వారి పూర్తి పేరు రాయాలి. రెండో కాలమ్లో గుర్తింపు ధ్రువీకరణకు చూపే కార్డు, మూడో కాలమ్లో ఆ కార్డులోని నంబర్ నాలుగో కాలమ్లో రూ.2,000 నోట్లు, వాటి సంఖ్య, వాటి మొత్తంను తెలపాలి. చివరిగా డిపాజిట్ చేసే వ్యక్తి సంతకం చేయాలి. ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, పాస్పోర్టు, ఎంఎన్ఆర్జీఏ కార్డు లేదా పాపులేషన్ రిజిస్టర్లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిల్లో ఏదో ఒకటి గుర్తింపు పత్రం ఒరిజినల్ కాపీని బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ లేకున్నా నోట్ల మార్పిడికి ఓకే. గత తప్పును కప్పిపుచ్చుకునేందుకే: విపక్షాలు రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా రెండో విడత నోట్ల రద్దు అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తం నోట్ల రద్దు వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మొదటిసారి నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా అసంఘటిత రంగం ఆసాంతం కుప్పకూలింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు’అంటూ ఖర్గే శనివారం పలు ట్వీట్లు చేశారు. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రభుత్వ ప్రకటనను ఎద్దేవా చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మరోసారి చపలచిత్తంతో తీసుకున్న నిర్ణయం. తుగ్లక్ తరహా నోట్ల రద్దు డ్రామా’అంటూ ఆమె అభివర్ణించారు. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా ఉంటుందంటూ ఆమె పలు ట్వీట్లలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. -
ఫ్లాష్బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం
సాక్షి, నేషనల్ డెస్క్: అది 2016. నవంబర్ 8. రాత్రి 8 గంటల సమయం. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న వేళ. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి టీవీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. జాతినుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్న వాళ్లందరికీ షాకిస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) నల్లధనాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రూ.1,000, రూ.500 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ నోట్ల బెడద పోవడమే గాక నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ నిర్ణయంతో ఊపొస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి! కానీ అనంతర పరిణామాలను, ముఖ్యంగా నోట్ల మార్పిడి ప్రక్రియను సజావుగా డీల్ చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దాంతో కొద్ది నెలల పాటు దేశమంతా అక్షరాలా అల్లకల్లోలమైపోయింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంకు ముందు చూసినా కొండవీటి చాంతాటిని తలదన్నే లైన్లే. ఆ లైన్లలోనే కుప్పకూలిన ప్రాణాలు. నగదు మీదే ఆధారపడి నడిచే వ్యాపారాలు పడకేసి ఆర్థికంగా చితికిపోయిన సగటు బతుకులు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి కథలే! మనసుల్ని మెలిపెట్టే గాథలే. వ్యవసాయం మొదలుకుని ఆటోమొబైల్, నిర్మాణ తదితర కీలక రంగాలు నగదు కటకటతో కొన్నాళ్ల పాటు పూర్తిగా పడకేశాయి. మొత్తంగా దేశ ఆర్థిక రంగమే అతలాకుతలమైపోయింది. ఇంతా చేస్తే నోట్ల రద్దు వల్ల నల్లధనం ఏ మాత్రమూ కట్టడి కాలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు నిరూపణ కావడం మరో విషాదం. అప్పట్లో ప్రవేశపెట్టిన రూ.2,000 కరెన్సీని ఆర్బీఐ తాజాగా రద్దు చేసిన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలను జనం మరోసారి భయంభయంగా గుర్తు చేసుకుంటున్నారు... నోట్ల రద్దు–కొన్ని వాస్తవాలు ♦ పలు అంచనాల ప్రకారం మన దేశ జీడీపీలో 20 నుంచి 25 శాతం దాకా నల్లధనమే. అంటే రూ.30 లక్షల కోట్ల పై చిలుకు! ♦ నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధాని చెప్పుకొచ్చారు. జనం కూడా అందుకు సిద్ధపడ్డారు. ♦ నోట్ల రద్దుతో తమకు కలిగిన నష్టాలను, వ్యయప్రయాలను పళ్ల బిగువున భరించారు. ♦ నోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్ వ్యవస్థకు ఆవల ఉన్న రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం కింద మారుతుందని కేంద్రం ఆశించింది. ♦ కానీ వాస్తవంలో జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధమని గణాంకాలు తేల్చాయి. ♦ నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశం చలామణిలతో ఉన్న నగదులో ఏకంగా 86 శాతం (రూ.16.24 లక్షల కోట్లు) రూ.1,000, రూ.500 నోట్లే. ఇందులో రూ1,000 నోట్ల వాటా 38 శాతం కాగా రూ.500 నోట్లది 47 శాతం. అదంతా రాత్రికి రాత్రి పనికిరాకుండా పోయింది. ♦ ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చిందని అనంతరం రిజర్వు బ్యాంకే అధికారికంగా ప్రకటించింది. నల్లధనం కట్టడి లక్ష్యం ఇసుమంతైనా నెరవేరలేదని తద్వారా స్పష్టమైంది. ♦ నగదు కార్యకలాపాలను తగ్గించాలన్న ఉద్దేశమూ నెరవేరలేదు. 2016 నవంబర్లో దేశ ప్రజల దగ్గర రూ.17.7 కోట్ల విలువైన నగదుంటే 2022 అక్టోబర్ నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ♦ నకిలీ నోట్ల చలామణి కూడా పెద్దగా తగ్గలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్లలో అత్యధికం వంద రూపాయల నోట్లే కావడం ఇందుకు కారణమని తేలింది. ♦ కాకపోతే నోట్ల రద్దు వల్ల ఇటు ప్రజలకు, అటు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. ♦ నగదు కార్యకలాపాల మీదే ఆధారపడే 48 కోట్ల మందికి పైగా భారతీయులను పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ♦ దేశ జీడీపీలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్ల పాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్థికవేత్తల విస్మయం పలువురు ఆర్థికవేత్తలు కూడా నోట్ల రద్దు నిర్ణయంలో ఔచిత్యమేమిటో అంతుబట్టడం లేదంటూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ‘‘నల్లధనంలో మహా అయితే ఓ 5 శాతం మాత్రం నగదు రూపంలో ఉంటుందేమో. మిగతాదంతా భూములు, బంగారం వంటి ఆస్తుల రూపేణా మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మాయమైపోతుందని ఆర్బీఐ అనుకున్నారో!’’ అన్నారు. ♦ 2016 సెప్టెంబర్ దాకా ఆర్బీఐ గవర్నర్గా చేసిన రఘురాం రాజన్ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని కుండబద్దలు కొట్టారు. ♦ నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమేనని గత జనవరిలో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కూడా, ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టంగా పేర్కొంది. చదవండి👉 ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్కు ‘కర్ణాటక’ కిక్! -
ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
దేశంలో ఇప్పటివరకూ చలామణిలో రూ.2 వేల నోటు శకం ముగిసింది. రూ.2 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా చలామణి నుంచి ఉపసంహరించింది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఆరేళ్ల ప్రస్థానం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా 2016 నవంబర్ 8న ఆర్బీఐ ఈ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్తో విడుదల చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ఆకర్షణీయ డిజైన్ రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్యాన్ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది. మైసూరులో ప్రింటింగ్ రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2017 మార్చి ఆఖరు నాటికి 3,285 మిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది వీటి సంఖ్య కేవలం 3,365. అప్పటి నుంచి ముద్రణను క్రమంగా తగ్గించేసింది ఆర్బీఐ. 2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.18,037 కోట్లు. 2020 మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న అన్ని నోట్లలో రూ.20 వేల నోట్లు కేవలం 22.6 శాతం. ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి.. పరిమితికి మించితే అనుమతి తప్పనిసరి -
నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని... ఈ నిర్ణయం వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ తగ్గకపోగా 54 శాతం పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటిౖకైనా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కృష్ణమోహన్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్లతో కలసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు విఫలమని కేంద్రమే అంగీకరించిందన్నారు. బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి అనేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయమే ఉదాహరణని ఎద్దేవా చేశారు. ప్రధానిపై నమ్మకంతో అప్పట్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని తాము సమర్థించామని, అయితే చెప్పిన లక్ష్యం ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఏ ప్రణాళిక, ఆలోచన లేకుండా ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారని... ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని హరీశ్రావు పేర్కొన్నారు. నగదు చెలామణి పెరిగింది.. పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ కాబట్టే దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని హరీశ్రావు ఎద్దేవా చేశారు. చెలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. 2014కు ముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు ఉండేదని, అదిప్పుడు 13 శాతానికి పెరిగిందన్నారు. అలాగే గతంతో పోలిస్తే పెద్ద నోట్ల వాడకం రెట్టింపయ్యిందని చెప్పారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి తెచ్చిన రూ. 2 వేల నోటు వల్ల పెద్ద నోట్ల వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. కొత్త నోట్ల ముద్రణకు మోదీ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు ఖర్చు పెట్టిందని... ఈ మొత్తంతో ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేదని హరీశ్రావు పేర్కొన్నారు. పట్టుకున్న నల్లధనమే రూ. 40 వేల కోట్లు.. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉండదని చెప్పిన ప్రధాని మాటలు అపహాస్యమయ్యాయని హరీశ్రావు విమర్శించారు. 592 కేసుల్లో రూ. 40 వేల కోట్ల నల్లధనం పట్టుకున్నారని చెప్పారు. బీజేపీ వేసే ప్రతి అడుగు పేదలపై పిడుగులా మారిందని, నీతి ఆయోగ్ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడం.. తప్పులు చేయడం బీజేపీ విధానంగా మారిందని, కేంద్రం ప్రతిరోజూ చేస్తున్న అప్పు రూ. 4,618 కోట్లని ఆయన పేర్కొన్నారు. మోదీ హయాంలో రూ. కోటీ ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చారని వివరించారు. పెద్ద నోట్ల మార్పు కోసం క్యూలలో నిలబడి 108 మంది మరణించారని, నోట్ల రద్దు కారణంగా 62 లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిందని, దేశంలో అవినీతి, ఆకలి పెరిగిపోతోందని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో 50 రోజుల్లో అంతా బాగుంటుందని భరోసా ఇచ్చిన పెద్దలు... ఇప్పుడు 2 వేల రోజులైనా ఏం మార్పు తెచ్చారని హరీశ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు మూడింతలు పెరిగాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం పెరిగాయని ఆరోపించారు. -
‘నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగమని తెలంగాణ మంత్రి హరీష్రావు విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సుమారు 62 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) హరీష్రావు మాట్లాడుతూ.. ‘ దేశంలో నగదు చలామని గతం కంటే రెట్టింపు అయ్యింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. దేశంలో అవినీతి పెరిగిందని సీబీడీఐ చెప్పింది. దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగింది. టెర్రరిజాన్ని అదుపులోకి తెస్తామన్నారు.. ఏం చేశారు?, కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని మందిపడ్డారు. -
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..!
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..! -
గురి తప్పిన లక్ష్యాలు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్? జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి? 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది. ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి. 2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది. ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్లో అప్పుడు భారత్ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది? వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది. రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు. మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
Demonetisation: పెద్ద నోట్ల రద్దు ఫలితమేంటి?
2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దుపై వ్యాజ్యాలను విన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రక్రియలో ప్రభుత్వం పరిధి మీరడం లాంటిదేమీ లేదనీ, అంతా పద్ధతి ప్రకారమే జరిగిందనీ తీర్పు వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఇదే అభిప్రాయం వెలిబుచ్చగా, ఒక్కరు మాత్రం సరికాదంటూ విభేదించారు. న్యాయస్థానం మద్దతు ప్రభుత్వానికి కొంచెం ఊరట. ఒకవేళ ఆ ప్రక్రియని న్యాయస్థానం తప్పుపట్టి ఉన్నా వాస్తవంలో పెద్ద ప్రభావం ఏమీ ఉండేది కాదు గానీ ప్రభుత్వం వైపు నుండి తప్పు జరిగినట్లు భావన స్థిరపడి పోయేది. ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం.. పర్యవసానాలు కూడా అనుభవమై పోయాక అది, తప్పో ఒప్పో అన్నది కేవలం మేధోమధనం కోసమే. అయినా విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం ఎటూ జోక్యం చేసు కోదు. అది దాని పరిధిలోని అంశం కాదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకును సంప్రదించకుండా ఏకపక్షంగా, హఠాత్తుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది పిటిషనర్ల వాదన. అయితే ఆరు మాసాల ముందు నుండే సంప్ర దింపుల ప్రక్రియ జరిగినట్లు, ప్రకటన వరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి నట్లు ప్రభుత్వం చెప్పడంతో న్యాయస్థానం ఆ ప్రక్రియ చట్టబద్ధతను సమర్థించింది. ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తెలియజేసింది. ఒక న్యాయమూర్తి మాత్రం నోట్ల రద్దు ప్రతిపాదన రిజర్వు బ్యాంకు నుండి కాకుండా కేంద్రం నుండి రావడాన్నీ, ప్రకటించే ముందు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకపోవడాన్నీ తప్పు పట్టారు. వారి అభిప్రాయం కూడా గమనంలోకి తీసుకుని ప్రభుత్వం భవిష్యత్లో ఈ తరహా పెద్ద నిర్ణయాల్లో ఇలాంటి వైఖరి తీసుకోకుండా ఉంటే సబబుగా ఉంటుంది. భిన్న వాదనల్ని పక్కకు పెట్టి నిష్పక్షపాతంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు ప్రకటించక ముందు ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్త వహించి అన్నికోణాల్లో ఆలోచించి ఉంటే బాగుండేది. తీవ్రంగా నష్టపోయిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తక్కువ తగిలేది. జనజీవనం, సామాన్యుల నగదు లావాదేవీలు కుదుపు నుండి తొందరగా కోలుకొనేవి. వెరసి ఆర్థిక వ్యవస్థకు లాభం జరిగేది. (క్లిక్ చేయండి: 2023లో మన విదేశాంగం ఎటు?) పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఇవి అంటూ ప్రధాని ఏవైతే చెప్పారో (నల్లధనం తగ్గుదల, నకిలీ నోట్ల నివారణ, తీవ్రవాదులకు ఫండింగ్) వాటిలో ఎన్ని సాధ్యమయ్యాయో ఇప్పటికీ లెక్కలు లేవు. అధ్యయనం చేసి ఆ గణాంకాల్ని వెలికితీస్తే గానీ అసలు వాస్తవం బోధపడదు. నిర్ణయం చట్టబద్ధమే కావొచ్చు కానీ ఫలితం ఏమిటి అన్నది ప్రధానం. ఔషధం సరియైనదా, కాదా... సరియైనదే అయినా వికటించిందా, లేక అనుకున్న ప్రభావం చూపిందా అన్నదే గీటురాయి. – డాక్టర్ డి.వి.జి. శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
చెంపదెబ్బ వాళ్లిద్దరికీ కాదు....
చెంపదెబ్బ వాళ్లిద్దరికీ కాదు.... -
Demonetisation: ఇప్పటికీ క్యాషే కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. -
నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందో?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించి డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నాటి సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నోట్ల రద్దు అంశంపై రెండు వేర్వేరు తీర్పులుంటాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చే ఈ తీర్పులు ఏకీభవిస్తాయా, భిన్నంగా ఉంటాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ధర్మాసనంలో వీరితోపాటు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఉన్నారు. -
‘నోట్ల రద్దు’పై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ నెల 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్ -
Demonetisation: తిరగదోడకండి.. నోట్ల రద్దుపై సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: సంచలనానికి, దేశవ్యాప్త ప్రభావానికి దారితీసిన నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణను కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నించొద్దని శుక్రవారం కోర్టుకు సూచించింది. ‘‘ఈ విషయంలో ఇప్పుడు కోర్టు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే కాలాన్ని వెనక్కు తిప్పలేం. పగలగొట్టి గిలక్కొట్టిన గుడ్డును మళ్లీ యథారూపానికి తేలేం’’ అని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. కార్యనిర్వాహక పరమైన నిర్ణయంపై న్యాయ సమీక్షకు కోర్టు దూరంగా ఉండాలని సూచించారు. దాంతో, నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు ఆర్బీఐ సెంట్రల్ బోర్డును సంప్రదించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇవన్నీ నిపుణులు చూసుకునే ఆర్థికపరమైన అంశాలు గనుక వాటిని ముట్టుకోరాదన్నది మీ వాదన. ఈ నిర్ణయం ద్వారా అభిలషించిన లక్ష్యాలను సాధించామనీ మీరు చెబుతున్నారు. కానీ పిటిషనర్ల వాదనపై మీ వైఖరేమిటి? నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్కు 26(2)కి అనుగుణంగా లేదని వారంటున్నారు. మీరనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టమన్నది ఆరోపణ. దానికి బదులు చెప్పండి’’ అని ఏజీకి సూచించింది.నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. నోట్ల రద్దు కేవలం ఓ స్వతంత్ర ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాదని ఏజీ బదులిచ్చారు. ‘‘అదో సంక్లిష్టమైన ద్రవ్య విధానంలో భాగం. ఆర్బీఐ పాత్ర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. అంతేగాక, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన దాని వెనక ఉద్దేశం లోపభూయిష్టమని విజ్ఞులెవరూ అనరు. అది సరికాదు కూడా’’ అని వాదించారు. జస్టిస్ గవాయ్ బదులిస్తూ, పిటిషన్దారుల అభ్యంతరాలు కరెన్సీకి సంబంధించిన విస్తృతమైన అన్ని అంశాలకు సంబంధించినవన్నారు. ‘‘ద్రవ్య విధాన పర్యవేక్షణ పూర్తిగా ఆర్బీఐకి మాత్రమే సంబంధించినది. ఇందులో మరో మాటకు తావు లేదు’’ అన్నారు. కానీ ఆర్బీఐ తన సొంత బుర్రను ఉపయోగించి స్వతంత్రంగా పని చేయాలన్న పిటిషనర్ల వాదన సరికాదని ఏజీ స్పష్టం చేశారు. ఆర్బీఐ, కేంద్రం కలసికట్టుగా పని చేస్తాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దీనితో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘ఆర్బీఐ సిఫార్సులకు కేంద్రం కట్టుబడి ఉండాల్సిందేనని మేమనడం లేదు. కానీ ఈ విషయంలో ఆర్బీఐ పాత్ర ఎక్కడుందన్నదే ఇక్కడ ప్రధాన అభ్యంతరం’’ అని చెప్పారు. మార్చుకునే చాన్సే ఇవ్వలేదు! పాత నోట్ల మార్పిడికి తన క్లయింట్కు అవకాశమే ఇవ్వలేదని ఒక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. ‘‘2016 డిసెంబర్ 30 డెడ్లైన్ తర్వాత కూడా పాత నోట్లు మార్చుకోవచ్చని ఆర్బీఐతో పాటు ప్రధాని కూడా ముందుగా ప్రకటించారు. కానీ 2016 డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల మార్పిడి కుదరదంటూ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు. నా క్లయింటేమో ఆ ఏడాది ఏప్రిల్లోనే విదేశాలకు వెళ్లి 2017 ఫిబ్రవరి 3న తిరిగొచ్చారు. తర్వాత తన దగ్గరున్న రూ.1.62 లక్షలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే కుదరదన్నారు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి కేసులను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది. నోట్ల రద్దు అత్యంత లోపభూయిష్ట నిర్ణయమని సీనియర్ లాయర్ పి.చిదంబరం గురువారం వాదించడం తెలిసిందే. -
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్ ప్రైస్..లిమిటెడ్ పీరియడ్, త్వరపడండి!) 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో ఇది 46.690 మిలియన్ నోట్లుగా ఉందని ఐఏఎన్ఎస్ దాఖలు చేసిన RTI క్వెరీ లో తెలిపింది. మరోవైపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా 2,44,834గా ఉంది. (SuperMeteor 650: రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. -
‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2016 నవంబర్ 8న దేశంలో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు ఉన్నపళంగా రద్దయిపోయాయి. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు (డిమానిటైజేషన్) చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల రద్దు దుష్ఫలితాలు బయటపడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆరేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటే నిరాశే మిగులుతుంది. 115 మంది బలి! అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంలో వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు జనసందోహంతో కిటకిటలాడాయి. క్యూలో నిల్చొని 115 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం మాత్రం మరోలా ఉంది. 2016 నవంబర్ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు కాగా, 2022 అక్టోబర్ 21 నాటికి రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ‘మాస్టర్స్ట్రోక్’తర్వాత 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరగడం గమనార్హం. పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బడా బాబులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. సామాన్య జనం మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ 2016 నవంబర్ 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషన్లు పేర్కొన్నారు. వివేక్ నారాయణ్ శర్మ పిటిషన్పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. హైకోర్టుల్లోనిపిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే నిర్ణయం తీసుకున్నారు. నేడు సుప్రీంకోర్టు విచారణ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. చదవండి: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం -
నేషన్ వాంట్స్ టు నో
అది 1978, జనవరి 14వ తేదీ ఉదయం. ముంబై (అప్పుడు బొంబాయి)లో ఉన్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అకౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం. ఆయన ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లని చలా మణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పిం చిందనీ, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనీ, ఇదంతా చాలా గోప్యంగా జరగాలనీ రామన్ను ఆదేశించారు. అనుకున్న పద్ధతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారు జాము కల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్కు ఈ రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆయన అభి ప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు. భారతీయ ఆర్థిక విధానాలపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు. ‘పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ నాతో ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబ ట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.’ ‘సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు’ అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభిప్రాయం. 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నేళ్ళ తరు వాత, 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అయిదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలవి కావడం మరో పోలిక. నవంబర్ ఎనిమిది సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసే సమ యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చో బెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియ చేయడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజలనుద్దేశించి రేడియో, దూరదర్శన్లలో ప్రసం గించారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరనీ తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లలో భాగమే కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారు చేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం. ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోదీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభి ప్రాయం కలిగింది. ‘కొద్ది రోజులు కటకట పడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు’ అనే భావన సర్వత్రా కనబడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొ కటన్న అభిప్రాయం బలపడసాగింది. బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడక పోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల వద్దా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొట మరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. అయితే ప్రజలకు ఉన్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే మంచి రోజుల కోసం ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. దానితో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు పూర్తిగా లభించినట్టు అయింది. దేశానికి సంబంధించి తీసుకున్న ఒక కీలక, ప్రధాన నిర్ణయానికి ప్రజల మద్దతు పొందడం మామూలు విషయం కాదు. ఆ మేరకు ప్రధాని మోదీ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ నల్లధనం రద్దుకు తీసుకున్న ఈ నిర్ణయం వికటించిందా, ఫలించిందా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు అంతకు ముందు లేని ఒక మంచి అలవాటు అలవడింది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో దేశంలో ద్రవ్య చలామణి 17.97 లక్షల కోట్లు వుండగా ఇప్పుడది 72 శాతం పెరిగి 30.88 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబు తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి. ప్రతి చిన్నా, పెద్దా ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు విచ్చల విడిగా డబ్బు వెదజల్లారు. ఇదంతా ప్రజలు కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత కూడా బడా బాబుల దగ్గర ఇంతంత డబ్బు ఎలా పోగుపడింది? పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలించలేదు అనడానికి ఇది తార్కాణం. కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నోట్ల రద్దుపై వీడియో.. ‘PayPM’ అంటూ మోదీపై ఆగ్రహం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీని పేపీఎం (PayPM) అంటూ అభివర్ణించారు. తన 2-3 బిలియనీర్ స్నేహితుల కోసం ఉద్దేశపూర్వకంగా మోదీ తీసుకొచ్చిన చర్య అంటూ మండిపడ్డారు. ‘చిన్న, మధ్యతరహా వ్యాపారాలను సమూలంగా తుడిచిపెట్టి.. తన 2-3 బిలియనీర్ స్నేహితులకు భారత ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం అందించడం కోసం PayPM ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన చర్య ఈ నోట్ల రద్దు’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు విఫల చర్య అని సమర్థించేలా ఉన్న పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలను ఆ వీడియోలో చూపించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. మరోవైపు.. స్వతంత్ర భారతంలో నోట్ల రద్దు అనేది అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ అంటూ ఆరోపించింది కాంగ్రెస్. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. భారత్ను డిజిటల్, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది. 2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది కేంద్రం. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడంతో పాటు అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే నోట్ల రద్దు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలిపింది. అయితే, ఈ ఏడాది అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లతో కొత్త గరిష్ఠానికి చేరిందని, ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 72శాతం ఎక్కువని ఇటీవల నివేదికలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. Demonetisation was a deliberate move by ‘PayPM’ to ensure 2-3 of his billionaire friends monopolise India’s economy by finishing small & medium businesses. pic.twitter.com/PaTRKnSPCx — Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022 ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
నోట్ల రద్దు, కరోనా దెబ్బకు పరిస్థితులు మారడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపుకు మొగ్గుచూపారు. అందుకు నిదర్శనంగా ఇటీవల డిజిటల్ లావాదేవీలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవడం. అయితే అటు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ప్రజలు ఇటు నగదు వినియోగంపై ఫోకస్ పెడుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేతిలో నగదు నిల్వకు కూడా ప్రాధాన్యమిస్తునన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద రికార్డ్ స్థాయిలో నగదు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వామ్మె అంత నగదు ఉందా! నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్బీఐ తన తాజా నివేదికలో పేర్కొంది. కాగా 2016 నాటికి నవంబర్ నాటికి ప్రజల వద్ద రూ.17.70 లక్షల కోట్లు ఉండగా.. ఇటీవల ఆ వాటా అది 71 శాతం వరకు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. సాధారణ వ్యాపార లావాదేవీలు, వస్తువులు సేవల కోనుగోలు కోసం వినియోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. కాగా చెలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో అవినీతితో పాటు నల్లధనం (బ్లాక్ మనీ) తగ్గించడమే లక్ష్యంగా అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం! -
పన్ను వసూళ్లు పెరగడానికి డీమానిటైజేషన్ కారణం
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) కూడా తోడ్పడిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు. అంతిమంగా .. పెద్ద సంఖ్యలో ట్యాక్స్పేయర్లపై తక్కువ స్థాయిలో పన్నులు విధించగలిగే ఆదర్శవంతమైన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆమె పేర్కొన్నారు. నల్ల ధనం చలామణీని అరికట్టేందుకు, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు, వ్యక్తిగత ఆదాయాలపై పన్నుల స్థూల వసూళ్లు 24 శాతం పెరిగి రూ. 8.98 లక్షల కోట్లకు చేరినట్లు ఆదాయ పన్ను విభాగం అక్టోబర్ 9న వెల్లడించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ. 1.40 లక్షల కోట్ల పైగానే నమోదయ్యాయి. సెప్టెంబర్లో 26 శాతం పెరిగి (గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే) రూ. 1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
మా లక్ష్మణరేఖ తెలుసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖపై తమకు పూర్తిగా అవగాహన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయినా 2016లో మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని న్యాయమూర్తి ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం బుధవారం వివరించింది. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు సూచించింది. విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. -
... పిటిషన్లు రద్దు చేయడం కుదరనుకుంటా సార్!
... పిటిషన్లు రద్దు చేయడం కుదరనుకుంటా సార్! -
చిన్న పరిశ్రమలపై కుట్ర: రాహుల్ గాంధీ
కొచ్చి: తమకు ఆప్తులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు మేలు చేసేందుకే మోదీ సర్కార్ నోట్ల రద్దు, జీఎస్టీలను అమలుచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలో బుధవారం భారత్ జోడో యాత్ర సందర్భంగా కొచ్చిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘చిరు వ్యాపారుల పొట్ట కొట్టడమే మోదీ సర్కార్ పని. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చిధ్రం చేసి కేవలం తమకు అత్యంత దగ్గరివారైన అతి కొద్దిమంది భారీ పారిశ్రామిక వేత్తలకు లాభం వచ్చేలా ప్రభుత్వం పథకరచన చేసింది. ఈ కుట్రలో భాగంగానే మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అమల్లోకి తెచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ ధాటికి అసంఘటిత రంగం అతలాకుతలమైంది. మోదీ మిత్రులకు కావాల్సింది ఇదే’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చిన్న సంస్థలకు అనుమతుల మంజూరులో జాప్యం చేస్తూ పెద్ద తలకాయలకు లబ్ధిచేకూరుస్తున్నారని ఆరోపించారు. కేరళలో సుగంధ ద్రవ్యాలు, రబ్బర్ తోటల రైతుల సమస్యలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర సర్కార్ విస్మరించడం వంటి సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ బృందం రాహుల్ను వివరించింది. ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతానని రాహుల్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రాహుల్.. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురుకు నివాళులర్పించి కొచ్చి సమీపంలోని మాదవనలో బుధవారం భారత్ జోడో యాత్రను కొనసాగించారు. రాహుల్తోపాటు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పాల్గొన్నారు. -
India@75: పెద్ద నోట్ల రద్దు
2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చేసిన ఆ అకస్మాత్తు ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. కొన్ని నెలల పాటు ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఆరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడం తోపాటు, కొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా నవంబర్ 9, 10 తేదీలలో ఏటీఎం లను, అన్ని బ్యాంకులను మూసి ఉంచారు. పాత పెద్ద నోట్లను కొత్తవాటితో మార్చుకునేందుకు 2016 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఆ గడువును 2017 మార్చి 30 వరకు పొడిగించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జయలలిత, చో రామస్వామి, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్, నాయని కృష్ణకుమారి, పరమేశ్వర్ గోద్రెజ్.. కన్నుమూత పార్లమెంటులో జి.ఎస్.టి. బిల్లుకు ఆమోదం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 26 ఏళ్ల దళిత పిహెచ్.డి. స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య. అత్యంత వేగంగా ప్రయాణించే ‘గతిమాన్ ఎక్స్ప్రెస్’ రైలు ఢిల్లీ ఆగ్రాల మధ్య ప్రారంభం. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047.. కృత్రిమ మేధస్సు) -
కరెన్సీ నోట్లపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో ఒరిజినల్ నోట్లు,ఫేక్ నోట్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్ల ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి నోట్ సార్టింగ్ మెషీన్లను (డబ్బులు లెక్కించే యంత్రం) పరీక్షించాలని ఆర్బీఐ తెలిపింది. 2016 నవంబర్ నెలలో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసింది. నాటి నుంచి ఆర్బీఐ కొత్త రూ.200, రూ.500, రూ.2000నోట్ల సిరీస్ను విడుదల చేస్తుంది. అయితే కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్బీఐ నోట్ల ప్రామాణీకరణ,బ్యాంకుల్లో డబ్బులు లెక్కించే ఫిట్నెస్ సార్టింగ్ మెషిన్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలుపుతూ కొత్త మార్గ దర్శకాల్ని విడుదల చేసింది. ►'నోట్ సార్టింగ్ మెషీన్స్ అథెంటికేషన్, ఫిట్నెస్ సార్టింగ్ పారామీటర్స్' అనే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం..ఫిట్ నోట్ అనేది "వాస్తవమైన, తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్కు అనుకూలంగా ఉంటుంది" అని పేర్కొంది. ►నోటు భౌతిక స్థితిని బట్టి..రీసైక్లింగ్కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించనుంది. ►రీసైక్లింగ్కు అనువుగా ఉన్న నోట్లను తప్పని సరిగా వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్ చేయించాలని రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ►నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాలి. ►ఇలా కరెన్సీ నోట్లను చెక్ చేసి సంబధిత వివరాల్ని ఆర్బీఐకి పంపాలని తెలిపింది. అలాగే చినిగిపోయిన నోట్లు, నకిలీ నోట్లను అన్ఫిట్ నోటు కేటగిరి కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు తప్పని సరిగా అమలు చేయాలని ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
నోట్ల రద్దుతో అలా..భారత్పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్లో తీవ్ర పేదరికం 2011–2019 మధ్య 12.3 శాతం మేర తగ్గినట్టు ప్రపంచబ్యాంకు తన చర్చా పత్రంలో తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2011 నేషనల్ శాంపిల్సర్వే (ఎన్ఎస్ఎస్) తర్వాత భారత్ గృహ వినియోగానికి సంబంధించిన సర్వే వివరాలను ఇంత వరకు వెల్లంచలేదు. దీనికితోడు పేదరికం, అసమానతలకు సంబంధించి గత పదేళ్లలో అధికారికంగా ఎటువంటి గణాంకాలను ప్రకటించలేదు’’అని ఈ చర్చా పత్రం రూపొందించడంలో భాగమైన ఆర్థికవేత్త సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్డెర్ వీడ్ తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తిన 2020లో భారత్లో తీవ్ర పేదరికం రేటు 0.8 శాతానికి పరిమితం అయిందని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇందుకు సాయపడినట్టు లోగడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన చర్చా పత్రం కూడా ప్రకటించడం గమనార్హం. ‘‘భారత్లో 2011–2019 మధ్య తీవ్ర పేదరికం 12.3 శాతం తగ్గింది. 2004–2011 మధ్య కాలంలో ఉన్న రేటుతో పోలిస్తే ఎంతో మెరుగుపడింది’’ అని ప్రపంచబ్యాంకు చర్చా పత్రం వివరించింది. 2016లో డీమోనిటైజేషన్ సమయంలో పట్టణాల్లో పేదరికం 2 శాతం పెరిగిందని.. ఆ తర్వాత గణనీయంగా క్షీణించినట్టు తెలిపింది. 2019లో వృద్ధి కుంటు పడడంతో గ్రామీణ పేదరికం 0.10 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. వినియోగంలో అసమానతలు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఆర్థికవేత్తలు ఈ చర్చా పత్రంలో స్పష్టం చేశారు. చిన్న రైతులకు ఆదాయం 10 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. చదవండి: చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..ఇది మన పరిస్థితి..! -
పెద్దనోట్ల రద్దుకు అయిదేళ్లు...!
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రకంపింపజేసిన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి అయిదేళ్లు నిండాయి. దేశప్రజలపై సర్జికల్ స్ట్రయిక్ అని చెబుతున్న ఈ ఒక్క నిర్ణయంతో చలామణిలో ఉన్న 86 శాతం నగదు ఉనికిలో లేకుండా పోయింది. యావద్దేశం నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. డబ్బుకోసం పడిగాపులు కాస్తూ 120 మంది సామాన్యులు చనిపోయారు. ఈ పిడుగుపాటు నిర్ణయం ద్వారా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. నల్లధనం బయటపడలేదు. సంపన్నుల అక్రమార్జనను ఇది అడ్డుకోలేదు. డిజిటల్ చెల్లింపుల లక్ష్యం పనిచేయలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ. 15 లక్షల కోట్లకు పైగా నగదు చలామణిలో ఉండగా 2021 అక్టోబర్ నాటికి అది రూ. 28 లక్షల కోట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 94 శాతం శ్రామికులకు ఉపాధి కలిగిస్తున్న అసంఘటిత రంగం కోలుకోలేనంతగా కుప్పగూలి పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. పెద్దనోట్ల రద్దు దేశంపై రుద్దిన విధాన నిర్ణయ సంక్షోభం మాత్రమే. అయిదేళ్ల క్రితం అంటే 2016 నవంబర్ 8 రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దుపై ‘చారిత్రక’ నిర్ణయాన్ని ప్రకటించారు. దీన్ని భారత ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించే చర్యగా ప్రధాని పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థలో చలామణిలో లేకుండా దాగి ఉంటున్న లెక్కలోకి రాని డబ్బును వెలికి తీయడం, నకిలీ నోట్ల పనిపట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు ప్రాధాన్యత తగ్గించి డిజిటల్ చెల్లింపులను పెంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలోని రాబడిని పెంచుకోవడమే పెద్ద నోట్ల రద్దు లక్ష్యమని తెలిపారు. ప్రధాని నిర్ణయంతో అంతవరకు చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఒక్కక్షణంలో రద్దయిపోయాయి. దేశ కరెన్సీలో వీటి వాటా 86 శాతం. మరి ఈ అయిదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పులేమిటి? పెద్దనోట్ల రద్దుకు, ఈ కాలంలో జరిగిన మార్పులకు ఉన్న సంబంధం ఏమిటి? దాదాపు 86 శాతం కరెన్సీ నోట్లు ఉపయోగంలో లేకపోవడంతో యావద్దేశం గగ్గోలు పెట్టింది. వేలాది మంది నిత్యం తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేయడం రోజువారీ కార్యక్రమమైపోయింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గట్టిగా సమర్థించుకుంటూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయలు దాచుకుంటున్నట్లు వస్తున్న వార్తలపట్ల నిజాయితీ కల పౌరులు బాధపడటం లేదా? గన్నీ బ్యాగ్ల నిండా అక్రమ సంపాదన దాచుకుంటున్న వార్తలు చూసి దేశంలో బాధపడనివారెవ్వరు? ఇలా అక్రమంగా డబ్బు దాచుకుంటున్న వారు తమ వద్ద అంత డబ్బు ఎలా కూడిందో పన్ను అధికారుల ముందు చెప్పేలా చేయడం, లేదా తమ వద్ద పోగుపడిన ఆ డబ్బుపై ఆశ వదులుకునేలా చేయడానికే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నామని ప్రధాని సెలవి చ్చారు. అందుకే చాలామంది పెద్ద నోట్ల రద్దు చర్యను అవినీతికి వ్యతి రేకంగా కేంద్రం చేపట్టిన మరో సర్జికల్ స్ట్రయిక్గా వర్ణించారు. అక్రమ నగదు ఎక్కడకు పోయినట్లు? కేంద్రం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం దేశప్రజలకు పిడుగుపాటులా తగిలింది. కానీ కొంతమంది ఆర్థిక వేత్తలు మాత్రం పెద్దనోట్ల రద్దు భావనను సమర్థించారు. 2016 నవంబర్ 14న ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఒక వాణిజ్య పత్రికకు రాస్తూ, పెద్ద నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థనుంచి 4.5 లక్షల కోట్ల రూపాయలు అదృశ్యమైపోతాయని పేర్కొన్నారు. ఇలాంటి నమ్మకాలు, ఆశావహ ప్రకటనలు అతి త్వరలోనే మాయమైపోయాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెద్ద నోట్ల రద్దు జరిగి మూడు నెలలు కాకముందే 2017 ఫిబ్రవరి 2న పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో చావుకబురు చల్లగా చెప్పేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో లెక్కలోకి రాకుండా దాగివున్న నగదు నిల్వలు పెద్దగా బయటకు రాలేదని తేల్చేశారు. ఆ సంవత్సరం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 లోపు, 2 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకు నగదును 1.09 కోట్ల ఖాతాలలో ప్రజలు తిరిగి డిపాజిట్ చేశారు. అలాగే 80 లక్షలకు పైబడిన డిపాజిట్లను 1.48 లక్షల ఖాతాలలో పెద్ద నోట్ల రద్దు సమయంలోనే సంపన్నులు డిపాజిట్ చేశారని బడ్జెట్ ప్రసంగం పేర్కొంది. ఈ రెండు విభిన్న ఖాతాలనుంచి బ్యాంకులకు చేరిన మొత్తం 10.38 లక్షల కోట్లు. దేశం మొత్తంలో చలామణిలో ఉన్న నగదు 15.44 లక్షల కోట్లు అని నాటి అంచనా. అంటే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో మూడింట రెండువంతులు తిరిగి బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చేసినట్లు లెక్క. పైగా రద్దయిన పెద్దనోట్లలో అధిక భాగం నయా సంపన్నుల నుంచే డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని 2017 ఫిబ్రవరి 2 నాటికే పత్రికలు కోడై కూశాయి. దీనికి పరాకాష్టగా రద్దయిన పెద్ద నోట్లలో 99 శాతం వరకు బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని భారతీయ రిజర్వ్ బ్యాంకు స్వయానా పేర్కొంది. మరి ఆర్థిక వేత్తలు పేర్కొన్నట్లు అక్రమంగా దాచుకున్న 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్లు? పైగా ఆర్థిక కార్యకలాపాలు నెలలపాటు స్తంభించిపోయాయి. నల్లధనం అంటే అక్రమ నగదు కాబట్టి పెద్దనోట్లను ఉన్నఫళానా రద్దు చేస్తే సంపన్నులు దాచిపెట్టిన నల్లధనం హుష్ కాకీ మాదిరి మాయమైపోతుందని పాలకపార్టీ భ్రమించింది. కానీ వాస్తవానికి నల్లధనంపై పిడుగుపాటు ఆనుకున్నది కాస్తా దేశ ప్రజలపై విధ్వంసంలా విరుచుకుపడింది. నగదు రహిత భారత్ సిద్ధించిందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తాను భావించిన ప్రాథమిక లక్ష్యాలపై పదే పదే మాట మారుస్తుండటం గమనార్హం. అయిదేళ్ల తర్వాత ఇప్పడు, అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడం పెద్దనోట్ల రద్దు లక్ష్యం కానే కాదంటూ బీజేపీ కొత్త పాట పాడుతోంది. ప్రభుత్వ పన్నుల రాబడిని పెంచుకోవడానికి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యమివ్వడమే పెద్దనోట్ల రద్దు లక్ష్యమని ఇప్పుడు చెబుతున్నారు. గత రెండేళ్ల కాలంలో దేశంలోని సంపన్నులు మరింత సంపన్నులు కావడం, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోవడం స్పష్టమవుతున్నప్పుడు కేంద్ర లక్ష్యాల డొల్లతనం బయటపడుతుంది. డిజిటల్ చెల్లింపులు తగుమాత్రంగా పెరుగుతున్నప్పటికీ ముందెన్నడూ లేనంత స్థాయిలో నగదు చలామణి కూడా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 నవంబర్ 4న దేశంలో నగదు చలామణీ దాదాపు రూ. 15 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తంమీద చెప్పాలంటే, పెద్ద నోట్లరద్దు నేపథ్యంలో సంపన్నులు వివిధ మార్గాల ద్వారా నల్లధనాన్ని ఆస్తులుగా మార్చుకుని మరింత బలపడగా, అసంఘటిత రంగంలోని శ్రామికులు నిరుపేదలు దారుణంగా దెబ్బతినిపోయారని డాక్టర్ అమర్త్యసేన్, డాక్టర్ అభిజిత్ వినాయక్, డాక్టర్ అరుణ్ కుమార్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉత్పాతానికి, మెజారిటీ ప్రజానీకం దుస్థితికి ప్రధాని స్వయంగా బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని వీరు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు సృష్టించిన ఉత్పా తంతో 120 మంది నిరుపేదలు బ్యాంకుల్లో చెక్కుల కోసం వడిగాపులు కాస్తూ కన్నుమూశారు. ఇక అసంఘటిక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి మార్కెట్కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. పెద్దనోట్ల రద్దువల్ల 2017 జనవరి–ఏప్రిల్ కాలం లోనే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికవ్యవస్థకు కోలుకోని దెబ్బ శరీరంలోని అన్ని అవయవాలకు పోషకాలను అందించడంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆర్థిక వ్యవస్థకు డబ్బు కూడా అలాగే జీవం పోస్తుంది. నగదు చలామణిలో ఉండటం వల్లే ఆర్థిక లావాదేవీలు జరిగి ఆదాయాలను సృష్టించవచ్చు. శరీరం నుంచి 85 శాతం రక్తాన్ని తోడేసి, ప్రతివారమూ 5 శాతం రక్తాన్ని మాత్రమే తిరిగి చేర్చుతూపోతే శరీరం చచ్చి ఊరుకుం టుంది. అదే విధంగా చలామణిలో ఉన్న నగదులో 85 శాతాన్ని రద్దు చేసి సంవత్సరం పాటు కొంచెం కొంచెంగా తిరిగి చేరుస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా జరిగిన ఉత్పాతం ఇదే. దేశ కార్మికరంగంలో 94 శాతానికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం... డబ్బులేక కుప్పగూలిపోయింది. ఈ రంగంలోని లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లకు నిరంతరం డబ్బు అవసరం. అయిదేళ్లు గడిచిన తర్వాత కూడా పెద్దనోట్ల రద్దు అసంఘటిర రంగాన్ని దెబ్బతీస్తూనే ఉంది. వైఫల్యాల దాటివేతకే ఈ ‘బిగ్ బ్యాంగ్’ శత్రుదేశం వ్యూహాలను అరికట్టేందుకు సైన్యం చేసే మెరుపుదాడులనే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రయిక్ అంటారు. ఊహించని సమయంలో, ఊహించని చోట శత్రువులపై మెరుపుదాడి చేసి తేరుకోకముందే దెబ్బకొట్టి తిరిగి రావడమే సర్జికల్ స్ట్రయిక్. కానీ దేశంలో, అంతర్గతంగా పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక మెరుపుదాడికి ప్రభుత్వం దిగడానికి కారణం ఏమిటి? అంటే 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నల్లధనాన్ని నిర్మూలిస్తాననీ, విదేశాల్లో దాచుకున్న దేశ సంపదను వెలికి తీస్తామనీ హామీ ఇచ్చింది. అలా విదేశాలనుంచి వెలికితీసి రప్పించిన నల్లధనం నుంచి దేశంలోని ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయల నగదును ఇస్తామని బీజేపీ నాటి ప్రచారంలో అడక్కుండానే వాగ్దానాలు చేసింది. కాని ఇది తప్పుడు ప్రచారమని త్వరలోనే తేలిపోయింది. విదేశాలనుంచి నల్లధనం తీసుకురావడం అసాధ్యమని స్పష్టమైంది. పర్యవసానంగా పాలకపార్టీ 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతింది. దీంతో నల్లధనానికి చెక్ పెట్టడానికి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించడం, నల్లధనం వెలికితీత పన్ను చట్టం, ఆదాయ ప్రకటన పథకం వంటి పలు చర్యలకు కేంద్రం దిగింది. కానీ ఇవేవీ పనిచేయలేదు. ఒక బిగ్ బ్యాంగ్ లాంటి విస్ఫోటనం అవసరమని స్పష్టమైంది. అదే పెద్ద నోట్ల రద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. అది ప్రకటించిన లక్ష్యాలను వేటినీ సాధించలేదు. పైగా నష్టాన్ని గ్రహించి లక్ష్యాలను మార్చుకున్న తర్వాత కూడా ఫలితాలు ఒనగూరలేదు. ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి అది కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కేంద్ర పాలకవర్గం దీన్ని గ్రహించింది కాబట్టే తదనంతర ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు గురించి ప్రచారంలో వాడుకోలేదు. పెద్దనోట్ల రద్దు దేశం ముందు విధాన నిర్ణయ సంక్షోభాన్ని తీసుకొచ్చింది. మహిళలు, రైతులు, కార్మికులు వంటి బలహీన వర్గాలపై తీవ్రప్రభావం చూపింది తప్పితే నల్లధనం వెలికితీతపై అది సాధించింది శూన్యం మాత్రమే. – సాత్యకి చక్రవర్తి, సీనియర్ కాలమిస్ట్ -
డీమానిటైజేషన్తో పెరిగిన డిజిటల్ చెల్లింపులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత గత అయిదేళ్లలో ప్రజలు నగదు రహిత చెల్లింపు విధానాలవైపు మళ్లుతుండటంతో డిజిటల్ చెల్లింపుల విధానం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో కాస్త మందకొడిగా అయినప్పటికీ చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ పరిస్థితుల మధ్య ప్రజలు చేతిలో నగదు ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల వినియోగం ఎగిసింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2016లో రూ. 17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉండగా 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కి చెందిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ).. పేమెంట్లకు ప్రధాన మాధ్యమంగా మారుతోంది. 2016లో యూపీఐని ఆవిష్కరించగా కొన్ని సందర్భాలు మినహా ప్రతి నెలా లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. 2021 అక్టోబర్లో లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లుగా నమోదైంది. అక్టోబర్లో యూపీఐ ద్వారా 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. నల్లధనాన్ని అరికట్టే దిశగా రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: మెటావర్స్పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
మ్యాగజైన్ స్టోరీ 08 November 2021
-
పెద్దనోట్ల రద్దుపై హార్వర్డ్ కీలక వ్యాఖ్యలు, మరి ఆర్బీఐ ఏమందంటే..!
పెద్దనోట్ల రద్దు నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016 నవంబర్ 8న అప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దు చేసిన ఆ రెండు పెద్దనోట్లను డిసెంబర్ 30వ తేదీలోపల ప్రజలు బ్యాంకుల్లో జమ చేసి రూ.2000,రూ.500కొత్త పెద్ద నోట్లను తీసుకోవచ్చని గడువు విధించారు. అయితే కేంద్రం ఈ నిర్ణయంపై తీసుకొని 5ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగిపోయాయి కేంద్రం తీసుకున్న డీమానిటైజేషన్ కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్ లలో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు జరిగి గడించిన రెండేళ్లైనా యువత డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేశారే తప్పా నగదు చెల్లింపులు జరపలేదని పేర్కొంది. నవంబర్ 8, 2016న డీమానిటైజేషన్ ప్రభావంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయని, అదే సమయంలో సాంప్రదాయ ట్రాన్సాక్షన్లు తగ్గాయని,డిజిటల్ లావాదేవీలు 2017 నుండి స్థాయిలు, వృద్ధి రేటులో సాంప్రదాయ లావాదేవీలను స్థిరంగా అధిగమించినట్లు తేలింది. ఆర్బీఐ నివేదిక ఇక,ఆర్బీఐ నివేదిక ప్రకారం..నోట్ల రద్దు దేశాన్ని తక్కువ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చినట్లు తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2014-15 కంటే 14.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ రేటు ప్రకారం, 2020-21 చివరి నాటికి చెలామణిలో ఉన్న నోట్లు రూ.32.62 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే, 2021 చివరి నాటికి ఇది చాలా తక్కువగా రూ.28.26 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా! -
వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సొమ్మంతా వృధానేనా!
చెన్నై: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్ 16నలో డీ మానిటైజేషన్ ప్రవేశ పెట్టి రూ.500/-, రూ.1000/- నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి అప్పుడే ఐదేళ్లు అయినా దీని గురించి కొంతమందికి ఇంకా తెలియదంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రస్తుతం ఈ విషయం గురించి తనకు ఏమి తెలియదంటున్నాడు తమిళనాడుకి చెందిన ఒక వృద్ధ బిచ్చగాడు. (చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది) వివరాల్లోకెళ్లితే... తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన చిన్నక్కణ్ను అనే వృద్ధ బిచ్చగాడు తాను అడుక్కుంటూ జీవితాంతం పోదుపు చేసుకుంటూ కూడబెట్టిన సొమ్ము రూ.65,000 వృద్ధా అయిపోయిందంటూ ఆవేదన చెందాడు. తాను ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన డీమానిటైజేషన్ గురించి చెప్పులు కుట్టే కన్నయ్యన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. దీంతో తాను దాచిని సోమ్మంతా పనికిరాదని అర్థమైందని, చివరిగా తన వద్ద మిగిలన డబ్బు కేవలం రూ 300/- మాత్రమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు చిన్నక్కణ్ను కలెక్టర్కు ఒక పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు జిల్లా రెవెన్యూ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్కు ఈ పిటిషన్ను పంపించడమే కాక రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం అని చిన్నక్కన్నకి హామీ కూడా ఇచ్చారు. అయితే నోట్ల మార్పిడి మార్చి 31, 2017తో ఆఖరు కాబట్టి కాబట్టి నోట్లు మారే అవకాశం ఉండదేమోనంటూ అదికారులు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా యంత్రంగం చిన్నక్కణ్నుని ఆదుకోవడానికి ముందకు రావడమే కాక వృద్ధాప్య పెన్షన్ని కూడా ఏర్పాటు చేసింది. (చదవండి: 'బీరు' బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) -
కాబూల్ ఎయిర్పోర్టులో తొక్కిసలాట, కాల్పులు
Chaotic Scenes At Kabul Airport అఫ్గానిస్తాన్ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. అఫ్గాన్లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది. రన్వేపై విమానాల కోసం వేచిచూస్తున్న వందలాది మంది పౌరులు దేశవిదేశీ పౌరులతో కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. ఎయిర్పోర్టుకు దారితీసే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. కాబూల్ నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రయాణికుల విమాన సేవలే కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్టులో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జనం గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. విమానాల రాకకోసం వేలాది మంది పిల్లా పాపలతో కలిసి ఆకలి దప్పులు మరిచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏకంగా రన్వే పైకి చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఏదైనా విమానం రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. టేకాఫ్ అవుతున్న విమానాల వెంట ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆకాంక్షే అందరిలోనూ కనిపిస్తోంది. కొందరు విమానం రెక్కలపైకి ఎక్కి కూర్చుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇక్కడ నిలబడడానికి స్థలం లేదని వాపోయారు. పిల్లల ఏడుపులు, పెద్దల అరుపులు, యువకుల ఆగ్రహావేశాలతో ఎయిర్పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పది మంది మృతి దేశం విడిచి వెళ్లడానికి కాబూల్ ఎయిర్పోర్టులో విమానం పైకి ఎక్కి కూర్చున్న జనం తాజాగా కాబూల్ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్క్రాఫ్ట్ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు. ఈ దృశ్యాలను టెహ్రాన్ టైమ్స్ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్ ఎయిర్పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎయిర్పోర్టులో రన్వే నుంచి టేకాఫ్నకు సిద్ధమవుతున్న అమెరికా జెట్ విమానంపైకి ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. విమానం కదులుతుండగా పెద్ద సంఖ్యలో జనం దాని వెనుక పరుగులు తీయడం వారి ఆత్రుతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతోపాటు కొందరు జారిపడ్డారని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అలాగే విమానాశ్రయంలో అమెరికా సైనికుల కాల్పుల్లో ఇద్దరు సాయుధులు చనిపోయారు. బయటకు రావాలంటే భయం భయం ప్రాణం కోసం పరుగులు అఫ్గానిస్తాన్ను ఆక్రమించుకొనే క్రమంలో తాలిబన్లు కేవలం సైనికులు, పోలీసులతో తలపడ్డారు తప్ప సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినప్పటికీ జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. జైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయుధాగారాలను లూటీ చేశారు. కాబూల్లోని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. నిలాన్ అనే 27 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. తాను కాబూల్ వీధుల్లో 15 నిమిషాల పాటు ప్రయాణించానని, పురుషులు తప్ప మహిళలెవరూ కనిపించలేదని చెప్పారు. వంట సరుకులు తెచ్చుకోవడం లాంటి చిన్నచిన్న పనుల కోసం కూడా మహిళలు బయటకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. ‘ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. మా ఉద్యోగాలు ఉన్నాయో ఊడాయో తెలియదు. మా జీవితం ముగిసిపోయినట్లే, భవిష్యత్తు లేనట్లే అనిపిస్తోంది’ అని నిలాన్ వ్యాఖ్యానించారు. మరో వేయి మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి మళ్లుతున్న అమెరికా, దాని మిత్రదేశాల ఉద్యోగుల రక్షణ కోసం కాబూల్ ఎయిర్పోర్టుకు రాబోయే 48 గంటల్లో వేయి మంది సైనికులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ భద్రత కోసం ఇప్పటికే అమెరికా అక్కడ 5వేల మంది సైనికులను మోహరించింది. ఎయిర్పోర్టు జోలికి రావొద్దు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఖతార్ రాజధాని దోహాలో సీనియర్ తాలిబన్ నాయకులతో తాజాగా చర్చలు జరిపారు. కాబూల్ ఎయిర్పోర్టు నుంచి తమ ఉద్యోగులు, పౌరులను స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్పోర్టు తమ నియంత్రణలోనే ఉంటుందని, దాని జోలికి రావొద్దని సూచించారు. దీనికి తాలిబన్లు అంగీకరించారని సమాచారం. ‘ఉగ్ర’నిలయంగా మారనివ్వద్దు: ఐరాస తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్ ఉగ్ర మూకలకు నిలయంగా మారకుండా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వ్యవహరించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ సోమవారం పిలుపునిచ్చారు. అఫ్గాన్ ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలివేయకూడదని భద్రతా మండలికి గుటెరస్ విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేక అత్యవవసర సమావేశం భారత్ నేతృత్వంలో జరిగింది. అఫ్గాన్పై భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్కు ఇది కీలక కఠోర సమయమని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబన్లు యత్నించాలని ఈ సందర్భంగా అంటోనియో హితవు పలికారు. తక్షణమే ఈ ప్రాంతంలో హింసను నివారించాలని, మానవ హక్కుల పరిరక్షణ చేయాలని అన్ని పక్షాలను గుటెరస్ కోరారు. -
రూ.2 వేల నోట్ల రద్దంటూ రూ.45 లక్షలు దోపిడీ
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ‘ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్మనీ ఉంది.. అన్నీ రూ.2 వేల నోట్లే.. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు.. వాళ్లు రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే.. నేను రూ.2 వేల నోట్లు రూ.కోటి ఇస్తా.. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’.. అంటూ డీల్ కుదుర్చుకుని రూ.45 లక్షలు దోచుకెళ్లిన ఘటన చిత్తూరులో సంచలనం సృష్టించింది. ఈ ఘరానా మోసానికి సంబంధించి చిత్తూరు పోలీసులు గురువారం తమిళనాడుకు చెందిన ఆర్.నరేష్కుమార్ (29), అబీద్బాషా (37), డి.రమేష్ ప్రభాకర్ (54), వి.కె.కుమార వడివేలు (54), ఆర్.విజయానందన్ (45), జి.మురుగదాస్ (55), సి.జయపాల్ (27), ఎ.జగన్రాజ్ (25)లతోపాటు చిత్తూరులోని గుడిపాలకు చెందిన డి.శ్రీకాంత్రెడ్డి (45)ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్రెడ్డి, సీఐ బాలయ్య ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ఘరానా మోసం జరిగిందిలా.. కేరళకు చెందిన కె.వి.అశోకన్ చెన్నైలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. వ్యాపారంలో భాగంగా ఆయనకు కేరళలోని పాలక్కాడ్కు చెందిన మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. కోయంబత్తూరుకు చెందిన షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి తన పేరు సాయికృష్ణ అని మహ్మద్తో పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్మనీ ఉందని.. త్వరలో రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని.. వీటిని రూ.500 నోట్లుగా మార్పించి ఇస్తే 2 శాతం కమీషన్ ఇస్తానని మహ్మద్కు చెప్పాడు. దీంతో తనకు పరిచయం ఉన్న అశోకన్కు మహ్మద్ విషయం చెప్పగా.. రూ.45 లక్షలున్న రూ.500 నోట్లను తీసుకుని సాయికృష్ణ చెప్పినట్టు చిత్తూరు శివారులోని గంగాసాగరం వద్దకు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు తమిళనాడు పోలీసు దుస్తుల్లో, వాహనాల్లో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ అనుచరులు అశోకన్కు తుపాకులు చూపించి రూ.45 లక్షలు దోచుకున్నారు. దీంతో అశోకన్ చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల సాయంతో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా అలియాస్ సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరో రూ.13 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమిళనాడు కృష్ణగిరిలో రూ.80 లక్షల లూటీ, చిత్తూరులోని యాదమరిలో రూ.10 లక్షల దోపిడీ కేసుల్లో సైతం నిందితుల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. -
డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (2016 నవంబర్లో డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన గృహిణులకు సంబంధించి ఎటువంటి పరిశీలన అవసరం లేదని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ ఏటీ) ఆగ్రా బెంచ్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని అసెస్సీ ఆదాయంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఇదే మాదిరి అన్ని కేసులకూ వర్తిస్తుందని తేల్చింది. గ్వాలియర్కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016–17 ఏడాదికి రూ.1,30,810 ఆదాయంగా పేర్కొం టూ ఐటీ రిటర్ను దాఖలు చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత రూ.2,11,500 పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. దీంతో ఈ కేసును పరిశీలన కోసం ఆదాయపన్ను శాఖ తీసుకుంది. భర్త, పిల్లలు, బంధువులు ఇవ్వగా పొదుపు చేసుకున్న మొత్తం ఇదంటూ ఆమె ఆదాయపన్ను శాఖ పరిశీలన అధికారికి వివరించారు. కానీ, దీన్ని ఆదాయపన్ను శాఖ అంగీకరించలేదు. వివరణలేని ధనంగా తేల్చింది. దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆమె ఆశ్రయించారు. చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?! -
డీమోనిటైజేషన్ నాటి సీసీటీవీ రికార్డులు జాగ్రత్త
ముంబై: డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో బ్యాంకుల శాఖలు, కరెన్సీ చెస్ట్ల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా పదిలపరచాలంటూ ఆర్బీఐ కోరింది. ఆ సమయంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సహకరించేందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తపరచాలని కోరింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లధనం గుర్తింపు, నకిలీ నోట్ల ఏరివేత లక్ష్యాలతో నాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం ప్రకటించుకుంది. ఇందులో భాగంగా రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకు శాఖల్లో మార్చుకునేందుకు అదే ఏడాది డిసెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. దాంతో బ్యాంకు శాఖల వద్ద భారీ క్యూలు చూశాము. రద్దు చేసే నాటికి రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, బ్యాంకుల్లోకి రూ.15.31 లక్షల కోట్లు వచ్చాయి. పెద్ద ఎత్తున నల్లధనాన్ని కలిగిన వారు సైతం అక్రమ మార్గాల్లో తెల్లధనంగా (సక్రమమైనదిగా) మార్చుకున్నారనే విమర్శలున్నాయి. దీనిపైనే దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. దర్యాప్తునకు సహకరించేందుకు వీలుగా సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలని గతంలోనూ ఆర్బీఐ కోరింది. ఇప్పుడు మరో విడత సీసీటీవీ రికార్డులను నిర్వీర్యం చేయరాదంటూ ఆర్బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది. -
రూ.2,000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన
2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-2021)లో కూడా కొత్తగా నోట్లు ముద్రించలేదని పేర్కొంది. మే 26వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంగా కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లుగా ఉన్నాయి. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,23,875 లక్షలు. రూ.500 నోటు, రూ.2,000 నోట్లు ఆర్ధికవ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్లలో అత్యధిక కరెన్సీ విలువను కలిగి ఉన్నాయి. చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువలో వీటి విలువ 85.7 శాతం. గత ఏడాది 83.4 శాతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ. నోట్ల ముద్రణ పరంగా చెలామణిలో ఉన్న అన్ని బ్యాంక్ నోట్లలో రూ.500 నోట్ల సంఖ్యే 31.1 శాతం. ఆర్బీఐ గత సంవత్సరం వార్షిక నివేదికలో, భద్రతా సమస్యల కారణంగా తాత్కాలికంగా రూ.2000 నోటు ముద్రణను నిలిపివేసినట్లు తెలిపింది. 2018 నుంచి వ్యవస్థలో రూ.2,000 నోట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2018 మార్చి నాటికి 33,632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లు, 2020 చివరి నాటికి 27,398 లక్షల నోట్లకు తగ్గాయి. నల్లధనం నిల్వలను అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 నోటు, పాత రూ.1,000 నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత రూ.1,000 నోటు స్థానంలో రూ.2,000 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నోటు రద్దు కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ రూ.2000 నోటును రద్దు చేయకుండా క్రమ క్రమంగా ముద్రణను నిలిపివేస్తుందా? అనే మరో వాదన కూడా ఉంది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఇంకా మూడు రోజులే గడువు -
పంజాబ్లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
పాత 100 నోట్ల రద్దుపై ఆర్బీఐ స్పందన
న్యూఢిల్లీ : రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రద్దు చేయనుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను త్వరలో చలామణిలోంచి తీసేయనున్నట్లు కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని పేర్కొంది. అంతకు క్రితం కేంద్రం కూడా ఈ నోట్ల రద్దుపై స్పందించింది. పాత నోట్ల రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. ( ఎన్బీఎఫ్సీలు : ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు ) నిన్న (ఆదివారం) ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) దీనిపై ట్విటర్ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అదో ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. కాగా, 2021 మార్చి లేదా ఏప్రిల్ చివరి నాటికి రూ.100, రూ.10, రూ.5 పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోనుందని మీడియాలో వెలువడ్డ వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect. — ReserveBankOfIndia (@RBI) January 25, 2021 -
నోట్ల రద్దుకు నాలుగేళ్లు
-
వేల రూపాయలు దాచి దాచి చివరికి..
సాక్షి, తమిళనాడు : మట్టిలో పాతి పెట్టిన రూ.35 వేల నోట్లు చెల్లవని తెలుసుకుని ఓ దివ్యాంగురాలు ఆవేదనకు లోనైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నాగై జిల్లా సిర్కాలి సమీపంలో ఉన్న పట్టియమేడు గ్రామానికి చెందిన రాజ (58) కూలీ కార్మికుడు. ఇతని భార్య ఉష (52). వీరి కుమార్తె విమల (17). తల్లీ, కుమార్తెకు మాటలురావు. మహాత్మాగాంధీ జాతీయ పథకం కింద పనికి వెళుతూ వచ్చారు. పది సంవత్సరాలుగా తన కుమార్తె వివాహం కోసం రూ.1000, రూ.500 నోట్లని రూ.35,500 వరకు కొంచెంకొంచెంగా ఉషా చేర్చిపెట్టింది. ఆ నోట్లను ఒక ప్లాస్టిక్ సంచిలో భద్రంగా చుట్టి దాంతో ఒక గ్రాము బంగారు బిస్కెట్ను పెట్టి తన భర్తకు తెలియకుండా ఇంటి వెనుక భాగంలో గుంత తవ్వి పాతి పెట్టింది. 2016లో కేంద్ర ప్రభుత్వం పాత వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ విషయం తల్లి, కుమార్తె తెలుసుకోలేకపోయారు. రాజదురై తన గుడిసె ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం నిధి సహాయంతో ఇటుకల ఇంటిని కట్టే పథకంలో అనుమతి పొంది ఇల్లు కట్టే పనిని ప్రారంభించారు. ఈ పని కోసం శుక్రవారం కార్మికులు ఇంటి వెనుక భాగంలో తవ్వినప్పుడు, నగదు చిక్కింది. ఆ నగదు తన కుమార్తె వివాహం కోసమే చేర్చి పెట్టినట్లుగా సైగ ద్వారా ఉషా తెలిపింది. అప్పుడు కార్మికులు ఈ నగదు నోట్లు చెల్లవు అని, కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకు ముందే ప్రకటించిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతితో తల్లి, కుమార్తె అలాగే నిలబడి పోయారు. తన కుమార్తె వివాహానికి ఏంచేయాలో తెలియలేదని, తమిళ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నోట్లను మార్చడానికి సహాయం చేయాలని కన్నీరు పెట్టారు. -
‘625 టన్నుల కొత్త నోట్ల రవాణా’
ముంబై: 2016లో నోట్ల రద్దు తర్వాత వాయుసేనకు చెందిన విమానాల్లో 625 టన్నుల బరువు గల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేసినట్లు వాయుసేన మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పేర్కొన్నారు. శనివారం ఐఐటీ–బాంబేలో జరిగిన ఓ టెక్ ఫెస్ట్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్గత సేవల్లో భాగంగా 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేయడానికి 33 మిషన్లు నిర్వహించామన్నారు. 2016, నవంబర్ 8న పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నోట్ల రద్దు సమయంలో కొత్త కరెన్సీ నోట్లను వాయుసేన రవాణా చేసింది. కోటి రూపాయలకు 20 కేజీల బ్యాగ్ ఉపయోగించామ’ని బీఎస్ ధనోవా అన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇలాంటి వివాదాలు ఆయుధాల సేకరణపై ప్రభావం చూపుతాయన్నారు. -
కార్చిచ్చు కాకూడదు
మట్టి ఏ దేశానిదైనా ఒకటే అయినప్పుడు మనుషుల్లో ఇన్ని అంతరాలెందుకు? మాటల్లో మానవత్వాన్ని చాటే మనం మతాలుగా విడిపోవడమెందుకు? అభద్రతా భావమేనేమో..! విభిన్న మతాలను సృష్టించి ఆధిపత్యం కోసం పాకులాడే విష సంస్కృతిని ప్రేరేపించింది ఏదైనా మనదాకా వస్తేనే కదా తెలిసొచ్చేది పక్కోడి ఇల్లు కాలినా, కూలినా మనకేంటి నోట్లో బూడిద కొట్టి ప్రసాదమంటే పరవశించిపోయే మన లాంటి వాళ్ళ కోసం కొత్త చట్టాలు పుడుతూనే ఉంటాయి దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి లౌకికతత్వాన్ని తుత్తునియలు చేసే సవరణలు జరుగుతూనే ఉంటాయి పెద్దనోట్ల రద్దు నల్లధనం జాడ తీయలేదు ఒకే దేశం – ఒకే పన్ను నినాదం అద్భుతాలూ సృష్టించలేదు సామాన్యుడిని కష్టాల పాలు జేశాయి దేశాన్ని మాంద్యం బారిన పడకుండా ఆపలేకపోయాయి సవరణ జాతిని ఏకం చేసే సంస్కరణ కావాలి కానీ విద్వేషాలను రగిల్చే కార్చిచ్చు కాకూడదు -గుండు కరుణాకర్, వరంగల్ మొబైల్ : 98668 99046 -
రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది. -
రూ. 2000 నోటు రద్దుపై కేంద్ర మంత్రి క్లారిటి
-
రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకుంటుందనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని సాగుతున్న ప్రచారం అవాస్తవమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్ చెప్పారు. అసంఘటిత రంగాన్ని సంఘటితపరచడంతో పాటు తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ లావాదేవీలను నోట్ల రద్దు ద్వారా పెంచగలిగామని తెలిపారు. -
హతవిధీ! ఆ నోట్లు ఎంత పని చేశాయి
సాక్షి , చెన్నై : కన్నతల్లి మమకారం ఆ అక్కాచెల్లెళ్లను పొదుపరులుగా మార్చింది. ఏనాటికైనా చావు తప్పదు, అయితే తమ అంత్యక్రియలకు ఆయ్యే ఖర్చు తమ సంతానానికి భారం కాకూడదని తలచేలా చేసింది. ఏడుపదులు దాటిని వృద్ధాప్య దశలో ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి గోప్యంగా దాచి ఉంచిన రూ.46వేలు బయటకు తీయగా అవన్నీ రద్దయిన పెద్దనోట్లు కావడంతో ఖిన్నులై కృంగిపోయారు. బిడ్డలకు చెప్పుకుని బోరుమని విలపించారు. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పూమలూరులో కే రంగమ్మాళ్ (75), పీ తంగమ్మాళ్ (72) అనే అక్కచెల్లెళ్లు నివసిస్తున్నారు. రంగమ్మాళ్కు ఏడుగురు, తంగమ్మాళ్కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరు ఊళ్లలో కాపురం ఉంటున్నారు. వారిద్దరి భర్తలు చనిపోవడంతో పశువులు మేపడం వృత్తిగా పెట్టుకుని వేర్వేరుగా కాపురం ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో ఇద్దరూ కూడబలుక్కుని పిల్లలకు తెలియకుండా కొంతదాచిపెట్టేవారు. నెలరోజుల క్రితం తంగమ్మాళ్ ఆస్మావ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఒక కుమారుడిని పిలిచి ఇంటిలో తన అంత్యక్రియల ఖర్చుకోసం కొంతసొమ్ము పొదుపుచేసి ఉన్నాను, అందులో నుంచి కొంత తీసుకురమ్మని పంపింది. ఇంటికి వెళ్లి నగదును చూడగా అవన్నీ రూ.24వేల విలువైన రద్దుకు గురైన రూ.1000, రూ.500 పెద్దనోట్ల కావడంతో అతడు బిత్తరపోయాడు. ఈవిషయాన్ని తల్లికి చెప్పగా తనతోపాటూ సోదరి రంగమ్మాళ్ కూడా ఇలానే రూ.22వేలను దాచిపెట్టి ఉందనే విషయాన్ని తెలిపి కన్నీరుపెట్టుకుంది. లోకజ్ఞానం లేని నిరక్షరాస్యులైన ఈ అక్కచెల్లెళ్లకు పెద్దనోట్ల రద్దు విషయం వీరికి తెలియకపోవడంతో సదరు సొమ్మును బ్యాంకులో మార్చుకోకుండా అలానే ఉంచుకున్నారు. రంగమ్మాళ్ కుమారుడు సెల్వరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత టీవీలు వారిద్దరి ఇళ్లలో ఉన్నా గత కొంతకాలంగా అవిపనిచేయడం లేదని, దీంతో పెద్దనోట్ల రద్దు విషయం వారి దృష్టికి రాలేదని తెలిపాడు. రోజువారీ ఇంటి ఖర్చుల కోసం కొడుకుల నుంచి కొంత తీసుకుంటూ అంత్యక్రియల కోసం వారిద్దరూ కలిసి రూ.46వేలు దాచుకున్నారు. ఆ సొమ్ము ఇక చెల్లదని తెలియడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నాడు. వారిని హెల్పేజ్లైన్ ఆదుకునేనా : నిరక్షరాస్యులైన ఆ అక్కాచెలెళ్లకు పెద్దనోట్ల రద్దుతో అనుకోని సమస్య వచ్చి పడింది. మూడేళ్ల కిత్రమే చెల్లకుండా పోయిన నోట్లను చెల్లుబాటు చేసే పరిస్థితులు లేకపోవడం వారిని దిగాలులోకి నెట్టేసింది. వృద్ధుల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ఉత్తర్వులు అక్కాచెల్లెళ్ల సమస్యను తీర్చేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన సామాజిక భద్రత కల్పిస్తోంది. అంతేగాక వృద్ధులు తమకు అవసరమైన సహాయాన్ని పొందేందుకు టోల్ఫ్రీ నంబరును సిద్ధం చేసింది. చెన్నై పరిధిలోని వారు 1253, చెన్నై మినహా ఇతర జిల్లాల వారు 1800–180–1253 టోల్ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు. హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలలా ఉన్న సీనియర్ సిటిజెన్స్, వృద్ధులకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా ఫోన్ నంబర్లను ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ : 044–24350375, సెల్ఫోన్ : 93612 72792 నంబర్లను ప్రకటించింది. ఈ హెల్పేజ్ లైన్కు అక్కాచెల్లెళ్లు తమ సమస్యను తీసుకెళితే ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. -
బ్లాక్మనీ వెలికితీత ఏమైంది?..
సాక్షి, రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న విధానాల వల్లే దేశంలో ఆర్థిక మాద్యం తలెత్తిందని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్డీకపూల్లోని కలెక్టరేట్ని ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా తీరు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు ఊదరకొట్టిన ‘బ్లాక్మనీ వెలికతీత’ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీని అసంబద్ధంగా అమలు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్కు పరిపాలించడం ఏమాత్రం చేతకాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం నియంతలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హడావుడిగా పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత నిధులు విడుదల చేయడాన్ని విస్మరించారని విమర్శించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు. ఏ పథకమూ సక్రమంగా కొనసాగడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు లేకపోవడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనడానికి నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పతనం జిల్లా నుంచే మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారిణి ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, జానకిరాం, శివకుమార్, ఉదయ్మోహన్రెడ్డి, బాబర్ఖాన్, అధికార ప్రతినిధి సిద్దేశ్వర్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వినోద్, దేపభాస్కర్రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రియాజ్, శంకర్, సంజయ్ యాదవ్, గోపాల్ రెడ్డి, ఖలీద్, చిగురింత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.2000 నోటు : ఎస్సీ గార్గ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సగానికి పైగా చలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రకంపనలు రేపారు. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ డిమానిటైజేషన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రూ. 2 వేల నోటు రద్దుపై పలు అనుమానాలు, అంచనాలు ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తున్నాయి. ద్రవ్య చలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా అనే భయాందోళనలు మరోసారి రేగాయి. నవంబర్ 8, 2016 న డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త రూ .2000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ .2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోందని గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలావరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదనీ, ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 85 శాతానికి పైగా చెల్లింపు లావాదేవీలు ఇంకా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్ని డిజిటల్ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఇందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని..ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకింగేతర డిజిటల్ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 2016లో నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూ .500, రూ .1,000 నోట్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రధానమంత్రి నరేంద మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శుక్రవారమిక్కడ ఆమె మాట్లాడుతూ... నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు. ‘గ్రామీణ భారత దేశం పనులకోసం ఎదురు చూస్తుంది. బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయి. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నా. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంత మంది స్వామీజీలు కూడా ఉన్నారు’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. మోదీ సర్కారు తలాక్ బిల్లుపై చూపిన శ్రద్ధ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు చూపడం లేదని బృందాకారత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అధికార పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు బృందాకారత్ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. -
క్యాష్ ఈజ్ కింగ్!
పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? సాక్షి, బిజినెస్ విభాగం: 2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్ యాప్ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!! మళ్లీ క్యాష్ జమానా! నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్ఏఎస్ వెల్లడించింది. మరి బ్లాక్మనీ సంగతి? నలుపు... తెలుపైపోయిందా? నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి. ► రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు ► బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు ► వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు ► తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు డిజిటల్ లావాదేవీల్లోనూ వృద్ధి.. నోట్ల రద్దు తరవాత డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. ఆర్బీఐ, ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి. మందగమనానికి బీజం.. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. ► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది. ► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ► నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్అండ్ఎఫ్ఎస్ కుదేలవటం గతేడాది నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. కష్టాలకు అదే మూలం.. డీమోనిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. – అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత -
నేడే వైఎస్సార్ నవోదయం పథకం
-
నేడే ‘నవోదయం’
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, మందగమనం లాంటి వరుస కష్టాలతో ఆర్థికంగా కుంగిపోయిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ నవోదయం’ పథకం గురువారం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రచారం.. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి. రుణాలు తీర్చలేని యూనిట్లను గుర్తించి వైఎస్సార్ నవోదయం పథకంలో చేర్చే బాధ్యతను కలెక్టర్లు, జిల్లా లీడ్ బ్యాంకులకు ప్రభుత్వం అప్పగించింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థలను గుర్తించి పథకంలో చేర్చాలని ఆదేశించింది. దీనిపై ప్రతి జిల్లాలో అవగాహన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్బీఐ సహకారంతో అమలు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తీర్చలేక నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారిన ఖాతాలతోపాటు మొండి బాకీలుగా మారేందుకు సిద్ధంగా ఉన్న (స్ట్రెస్డ్ అకౌంట్స్)ను ఆదుకునేలా వైఎస్సార్ నవోదయం పథకాన్ని రూపొందించారు. గరిష్టంగా రూ.25 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్టైమ్ రీస్ట్రక్చరింగ్ కింద పునరుద్ధరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అవసరమైన ఆడిట్ నివేదిక తయారీ వ్యయంలో 50 శాతాన్ని, గరిష్టంగా రూ.2 లక్షల వరకు సాయం చేయనున్నారు. ఈ కంపెనీలకు గత ప్రభుత్వం బకాయి పడ్డ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రాధాన్య క్రమంలో విడుదల చేస్తారు. టీడీపీ సర్కారు పరిశ్రమలకు సుమారు రూ.3,000 కోట్లు రాయితీలు బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరేందుకు 2020 మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. రిజర్వ్ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. -
ద్రవ్య లోటుపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు. -
ఆర్థిక మందగమనమే
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందని ప్రముఖ పాత్రికేయులు వివేక్ కౌల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన మంథన్సంవాద్ కార్యక్రమంలో ఆయన ‘ది గ్రేట్ఎకనమిక్ స్లో డౌన్’ అనే అంశంపై ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామంతో చిన్న పరిశ్రమలు చితికిపోయాయని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. ప్రజల తలసరి ఆదాయం కూడా తగ్గుతోందని తెలిపారు. కార్పొరేట్లకు అను కూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వారికే గరిష్ట ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి రుణభారం పెరిగి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయన్నారు. గాంధీ ఆదర్శప్రాయంగా నిలిచారు.. సత్యాగ్రహం, అహింస, సత్యంతో తాను చేసిన ప్రయోగాలతో మహాత్మాగాంధీ నాటికీ.. నేటికీ అన్ని దేశాలకు.. అన్ని వర్గాలకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రముఖ ఫిలాసఫర్స్ దివ్య ద్వివేదీ, షాజ్హాన్లు అన్నారు. ‘గాంధీస్ ట్రూత్’ అనే అంశంపై వారు ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు దేశంలోని అన్ని రంగాల్లో గుణాత్మక మార్పులను ఆయన ఆకాంక్షించడంతో పాటు అందుకు నడవాల్సిన దారిని చూపారని కొనియాడారు. స్వాతంత్య్రమే కీలకం ‘లిబర్టీ అండ్ ది బిగ్ స్టేట్స్’ అనే అంశంపై ప్రము ఖ పాత్రికేయురాలు సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సామా జిక, ఆర్థిక రంగాల్లో అన్ని వర్గాలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ లభించాలన్నారు. కేరళలో పౌరసమాజం తమ హక్కుల సాధనకు రాజకీయ నేతలను ప్రశ్నించడం శుభపరిణమమన్నారు. అలరించిన కామెడీ ప్రముఖ టీవీ యాంకర్ అజీమ్ బనత్వాలా సమకా లీన అంశాలు, రాజకీయా లపై నిర్వహించిన లైవ్ కామెడీ షో ఆహూతులను అలరించింది. దేశం లో చోటుచేసుకుంటున్న మతపరమైన అసహనం, గోరక్షణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలు వంటి వాటిపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించడంతో పాటు ఆలోచింపజేయడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
పాత రూ.500 నోటు ఇస్తే రూ.50 వేలు..
సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్కు ముందు అమలులో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్కు చెందిన ఒక నోటు ఇస్తే రూ.50 వేలు వస్తాయంటూ నమ్మబలికిన ముఠా రూ.12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా ఫిర్యాదు అందినప్పటికీ సైదాబాద్ పోలీసులు 48 గంటల్లో కేసు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఎం.రమేష్, మలక్పేట ఏసీపీ ఎం.సుదర్శన్లతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన రాజ్కుమార్ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్మహల్ రోడ్లో శ్రీ సంతోషి ఫిల్లింగ్ స్టేషన్ పేరుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రకాష్నగర్కు చెందిన సంబరం రాజేష్ పని చేస్తున్నాడు. బండ్లగూడకు చెందిన ఏఎం మెటల్ స్టోర్ నిర్వాహకుడు అబేద్ మొహియుద్దీన్, తలాబ్కట్టకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి షేక్ అబ్దుల్ బాసిత్ రాజేష్కు స్నేహితులు. తన యజమాని బగాడియాకు ఆశ ఎక్కువని, గతంలోనూ అనేక చిన్న చిన్న వ్యవహారాలు నడిపాడని అతడి ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వారిద్దరూ రాజేష్తో కలిసి వెళ్లి బగాడియాను పరిచయం చేసుకున్నారు. అదును చూసుకుని బగాడియా వీక్నెస్పై కొట్టాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ త్రయం ఇటీవల బగాడియాను కలిసి తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం ఉందని చెప్పింది. 2002లో ముద్రితమైన పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్కు ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చిందని, ఆ కరెన్సీ దొరికితే ఒక్కో నోటుకు రూ.50 వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు బగాడియాతో చెప్పారు. తేలిగ్గా డబ్బు వస్తుందనడంతో ఆశపడిన అతను అందుకు అంగీకరించాడు. అయితే ఇప్పుడు పాత నోట్లు ఎక్కడ దొరుకుతాయంటూ ప్రశ్నించగా, సైదాబాద్లోని ఓ వ్యక్తి వద్ద రూ.2 కోట్ల పాత కరెన్సీ ఉందని చెప్పారు. అడ్వాన్స్గా కొంత మొత్తం ఇస్తే ఆ నోట్లు ఇచ్చేస్తాడని, వాటిలో తమకు కావాల్సిన సిరీస్ పాత నోట్లు ఎంచుకుని మిగిలినవి తిరిగి ఇచ్చేదామని గత శనివారం చెప్పారు. దీంతో ఆదివారానికి రూ.12 లక్షలు సిద్ధం చేసిన బగాడియా ఆ మొత్తం తీసుకుని అబేద్, బాసిత్లతో కలిసి బయలుదేరాడు. ఇతడిని సైదాబాద్లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వరకు తీసుకువెళ్లిన నిందితులు అక్కడ దృష్టి మళ్ళించారు. సదరు వ్యక్తి అందరినీ ఇంట్లోకి రానీయడని, ముందు తాము వెళ్ళి డబ్బు చూపిస్తామని, ఆపై నమ్మకం కలిగి మిమ్మల్నీ లోపలకు అనుమతిస్తాడని చెప్పారు. అందకు అంగీకరించిన బగాడియా రూ.12 లక్షలు ఇచ్చి వారిని పంపాడు. కొద్దిదూరం వెళ్లిన ఇరువురూ ఆ మొత్తం తీసుకుని ఉడాయించారు. కాస్సేపు అక్కడే వేచి చూసిన బగాడియా తిరిగి తన బంకుకు వచ్చేసి ఆ ఇద్దరి విషయం రాజేష్ను అడిగాడు. ఎంత ప్రయత్నించినా తనకూ వారి ఫోన్ నెంబర్లు కలవట్లేదని చెప్పిన అతగాడు బహుశా పోలీసులు పట్టుకుని ఉంటారని, ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారని చెప్పాడు. రెండు రోజులు వేచి చూసిన బగాడియా తాను మోసపోయినట్లు గుర్తించి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కస్తూరి శ్రీనివాస్ నేతృత్వంలో రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు. రాజేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని రూ.12 లక్షలు రికవరీ చేశారు. ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మూడింతలు చేస్తానని ముంచేశాడు..ఓ డ్రైవర్కు నకిలీబాబా బురిడీ బంజారాహిల్స్: యంత్ర తంత్రాలు, పూజలతో మూడింతల డబ్బును చేస్తానంటూ నగరానికి చెందిన ఓ డ్రైవర్ను మహారాష్ట్ర బురిడీ బాబా నిండా ముంచాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఎన్ నగర్కు చెందిన బండారు రత్నయ్య డ్రైవర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు జాఫర్ కోసం అతను తరచూ మంచిర్యాల వెళ్లేవాడు. ఇటీవల మంచిర్యాలకు వెళ్ళినప్పుడు జాఫర్, ప్రభాకర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. జాఫర్, ప్రభాకర్ ఇద్దరూ కలిసి తమకు మహారాష్ట్రలో మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ అనే బాబా తెలుసని రూ. లక్ష ఇస్తే మంత్రాలు, పూజలు చేసి రూ. మూడు లక్షలు చేస్తాడని నమ్మించాడు.రూ. 12 లక్షలు సర్ధితే ’ 36 లక్షలు తీసుకోవచ్చని చెప్పడంతో రత్నయ్య ఈ ఏడాది మే 2న విడతల వారిగా వారికి డబ్బులు ఇచ్చాడు. గత మే నెలలో ఎల్ఎన్ నగర్లోని రత్నయ్య ఇంటికి బాబా మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ వచ్చాడు. డబ్బును ఓ బ్యాగులో పెట్టి పూజల అనంతరం రూ. 50 లక్షలు అయ్యిందంటూ ఓ బ్యాగును రత్నయ్యకు ఇచ్చి 15 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం బ్యాగ్ను తెరవాలని చెప్పి వెళ్లిపోయాడు. బాబా చెప్పినట్లుగానే రత్నయ్య, జయ దంపతులు పూజలు నిర్వహించి బ్యాగు తెరిచి చూడగా అందులో తెలుపు, నలుపు పేపర్ల బండిళ్లు కనిపించాయి. వెంటనే బాబాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా, పూజల్లో ఏదో లోపం జరిగిందని వెంటనే ఆ బ్యాగు తీసుకొని మహారాష్ట్రకు రావాలని సూచించాడు. దీంతో భార్యతో కలిసి కారులో అక్కడికి వెళ్ళాడు. ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి రూ. 60 వేలు వసూలు చేశాడు. తాను కొద్దిసేపట్లో వస్తానని ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా బాబా రాకపోవడంతో రత్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. జాఫర్, ప్రభాకర్, బాబా ఇర్ఫాన్ ముగ్గురూ కలిసి తనను మోసం చేశారని తెలుసుకొని నిలదీయగా, బాబా వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ బాబాతో పాటు జాఫర్, ప్రభాకర్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్లిస్ట్ను విడుదల చేసింది. లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్లిస్ట్లో పేర్కొన్నారు. -
ముసద్దిలాల్ జ్యువెల్లర్స్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు ఇన్వాయిస్లతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయంలో అడ్డంగా దొరికిపోయిన ముసద్దిలాల్ జ్యువెల్లర్స్పై తాజాగా మరో కేసు నమోదైంది. తమకు రూ.75 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) ఫిర్యాదుతో సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను నిందితులుగా చేర్చింది. పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009 అక్టోబర్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.55 కోట్లు రుణం తీసుకుంది. ఈ క్రమంలో తమ రుణాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)కు మార్చాలంటూ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ ఐఎన్జీ వైశ్యా బ్యాంకుకు విన్నవించుకుంది. బ్యాలెన్స్ షీట్ సరిగానే నిర్వహించడంతో సంతృప్తి చెందిన ఐఎన్జీ వైశ్యా బ్యాంకు 2013 మార్చిలో ఆ రుణాన్ని ఐవోబీ బ్యాంకుకు మార్చారు. ఆ తర్వాత బ్యాంకు వద్ద మరికొంత రుణం తీసుకున్నారు. అది కాస్తా రూ.82 కోట్లకు చేరింది. రానురాను రుణాన్ని తిరిగి చెల్లించడంలో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ విఫలమవుతూ వచ్చింది. దీంతో 2014 మార్చిలో ఖాతాలను బ్యాంకు స్తంభింపజేసింది. 2016లో జరిగిన ఆడిట్ తనిఖీల్లో వారు తీసుకున్న రుణంలో రూ.58 కోట్ల రూపాయలను ఇతర కంపెనీలకు మళ్లించినట్లుగా గుర్తించారు. దీంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి తమకు రూ.75 కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఐవోబీ బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ రవిచంద్రన్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ బెంగళూరు శాఖ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలపై ఐపీసీ 120, 406, 420, 468, 471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసింది. -
పాత నోట్లు.. కొత్త పాట్లు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కేసు దర్యాప్తు సీఐడీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. నిందితులను పట్టుకునేందుకు యూపీ, ఢిల్లీ, బిహార్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా మొత్తం 8 రాష్ట్రాల్లో వేట సాగించాల్సి వచ్చింది. దీనికితోడు ఆధారాల సేకరణ మరింత కష్టంగా మారింది. కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో గాలింపు చేపట్టిన సీబీఐ మరోవైపు తెలంగాణ, ఆంధ్రాలో నిందితుల వేటను ఉధృతం చేసింది. అదే సమయంలో కస్టడీలో ఉన్న కమిలేశ్ సింగ్ (55) గుండెనొప్పితో చనిపోయాడు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. అతనిచ్చిన సమాచారంతో పోలీసులు స్థానికంగా వారి ఏజెంట్లను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సీఐడీ పోలీసులకు అనుకోని అవాంతరం వచ్చిపడింది. పట్టుకున్నవన్నీ పాతనోట్లే..: రూ.50 లక్షల్లో అధిక శాతం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. అన్నీ కూడా రద్దయిన నోట్లు. నిందితులు కూడా వాటిని మార్చలేక ఏం చేయాలో పాలుపోక వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు వారిపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, నగదును కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని న్యాయనిపుణుల వద్ద సలహా తీసుకున్నారు. రద్దయిన నోట్లను కోర్టులో ఎలా సమర్పిస్తారన్న సందేహం లేవనెత్తారు. అదే సమయంలో విధించిన ఆర్బీఐ గడువు ముంచుకొస్తోంది. పిడుగులాంటి ఈ విషయం మీద పడేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతపెద్ద మొత్తాన్ని మార్చడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక నానాతిప్పలు పడ్డారు. చివరికి గడువులోగా నోట్లు మార్చి నగదును కోర్టుకు సమర్పించగలిగారు. -
నోట్ల రద్దు ఇతివృత్తంగా ‘మోసడి’
తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం మోసడి అని ఆ చిత్ర దర్శకుడు జగదీశన్ తెలిపారు. విజూ హీరోగా నటిస్తున్న ఇందులో హీరోయిన్గా పల్లవిడోరా నటిస్తోంది. జయకుమార్ ఎన్సీబీ.విజయన్, వెంకటాచలం. నీలు సుకుమారన్, ఓఎస్.శరవణన్, మోహన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న దీనికి ఆర్.మణికంఠన్ ఛాయాగ్రహణం, షాజహాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మోసడి చిత్రం పూర్తిగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. 2016 నవంబర్ నెల 8వ తేదీన సాయంత్రం అనూహ్యంగా రూ.1000, 500 నోట్లు చెల్లవు అన్న ప్రకటన వెలువడిన తరువాత బడాబాబులందరూ తమ అధికారాన్ని ఉపయోగించుకుని పెద్ద నోట్లను ఎలా రూ.2000నోట్లకు మార్చుకున్నారు? సాధారణ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రకటనతో దొడ్డి దారిన ఎలాంటి మోసాలు జరిగాయి? లాంటి యథార్థ అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా మోసడి ఉంటుందని తెలిపారు. జరిగిన సంఘటనలే ఈ∙చిత్రంలో చూపించామని, అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి సెన్సార్ కూడా అయిపోయిందని తెలిపారు. కమర్శియల్ అంశాలతో కూడిన జనరంజకంగా సాగే మోసడి చిత్రాన్ని ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జగదీశన్ తెలిపారు. -
రోడ్డెక్కిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ సంక్షోభంతో అనేక ఇబ్బందుల పాలవుతున్న ఉద్యోగులు పోరుబాట బట్టారు. తమకు జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్ఎయిర్వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని కోరారు. సంస్థ భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అటు దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అటు విమానాలకు అద్దెబకాయిలు చెల్లించలేక ఇప్పటికే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా సోమవారం దాకా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
ఉరుము లేని పిడుగులా..!
అది నవంబర్ 8, 2016.. రాత్రి 8 గంటలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియా ముందుకు వచ్చారు. ఉరుము లేని పిడుగులా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలో చెలామణిలో ఉన్న నోట్లలో 86శాతం ఉన్న పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేయడంతో జాతి యావత్తూ గందరగోళానికి లోనైంది. పాత నోట్లు మార్చుకోవడానికి 50 రోజులు సమయం ఇచ్చినా సామాన్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గంటల తరబడి బ్యాంకు క్యూ లైన్లలో నిల్చొని పడరాని పాట్లు పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు, రైతులు, చిన్న పరిశ్రమలు, రోజువారీ కూలీలు, కార్మికులు విలవిలలాడిపోయారు. నగదు లావాదేవీలపైనే అధికంగా ఆధారపడే వ్యవసాయ రంగం, అసంఘటిత రంగంపై నోట్లరద్దు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా దేశ సంక్షేమం కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని జనం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచారు. నరేంద్ర మోదీపై ప్రజలు ఎంత భరోసా ఉంచారో నోట్ల రద్దు జరిగిన నాలుగు నెలల్లోనే 2017, ఫిబ్రవరిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. నోట్ల రద్దు ఒక అనవసర ప్రహసనమని విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని మెజార్టీని బీజేపీకి కట్టబెట్టారు. నోట్ల రద్దు లక్ష్యాలేంటి ? అవినీతిని అంతం చేసి బ్లాక్ మనీని బయటకు తీసుకురావడం నకిలీ నోట్ల దందాను అరికట్టడం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయల వరకు బ్లాక్ మనీ ఉంటుందని, దానిని రొటేషన్లోకి తీసుకురావడం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునని మోదీ సర్కార్ భావించింది. అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి ♦ నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బొక్క బోర్లా పడింది. తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. భారతదేశంలో బ్లాక్ మనీ బంగారం, భూముల రూపంలోనే ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడానికి ఎంతో కాలం పట్టం లేదు. నోట్ల రద్దు జరిగిన రెండేళ్ల తర్వాత ఆర్థిక రంగంపై పడిన దుష్ప్రభావాలు ఒక్కొక్కటి బయటపడసాగాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సర్వేలు నోట్ల రద్దు వల్ల పైసా ఉపయోగం లేదని పెదవి విరిచాయి. ♦ నోట్ల రద్దు జరిగిన కేవలం 35 రోజుల్లోనే 99.3 శాతం కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017–18 వార్షిక నివేదిక వెల్లడించింది. ♦ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏకంగా 7.3శాతం వరకు జీడీపీ పడిపోయిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ♦ నోట్ల రద్దు కారణంగా నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు చేసిన ఫలితాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2011–12లో 5 శాతం మాత్రమే ఉన్న నిరుద్యోగ సమస్య 2017–18 వచ్చేసరికి 17.5శాతానికి పెరిగిపోయింది. ♦ భారత స్థూల జాతీయోత్పత్తి నోట్ల రద్దుకు ముందు 8 శాతం ఉంటే ఆ తర్వాత రెండేళ్లలో 2 శాతం పడిపోయిందని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ సర్వీస్ అంచనా వేసింది. ♦ అయితే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు మాత్రం 150 శాతం వరకు పెరిగాయి. ఎన్నికల్లో ప్రభావం ఎంతవరకు ? నోట్ల రద్దుపై మొదట్లో ఉన్నంత సానుకూలత రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో కనిపించలేదు. సీఎస్డీఎస్ సర్వేలో నోట్ల రద్దు దేశానికి అవసరమా అంటే 53 శాతం మంది అవసరమేనని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏదో ఒకటి చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు ప్రభావం ప్రత్యక్షంగా ఎంతవరకు ఉందో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మిగిలింది. కానీ పరోక్షంగా దాని ప్రభావం తీవ్రంగానే పడింది. చిన్న వర్తకులు, కార్మికులు, రైతులు విలవిలలాడారు. అదే సీఎస్డీఎస్ సర్వేలో 2017లో వర్తకుల్లో 50 శాతం మంది ఎన్డీయేకి అనుకూలంగా ఉంటే 2018 వచ్చేసరికి వారి సంఖ్య 48 శాతానికి పడిపోయింది. రైతుల మద్దతు ఎన్డీయేకి 2017 మేలో 49శాతం ఉంటే, ఆ తర్వాత ఏడాదికి 37శాతానికి తగ్గిపోయింది. నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని జీఎస్టీ వల్ల పూడ్చుకోవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు పుల్వామా దాడుల తర్వాత మొత్తంగా రాజకీయ చిత్రం మారిపోయి నోట్ల రద్దుని పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొందని అంచనా. -
ఐదువేల నోటు బ్యాన్ చేయమన్నా?
సాక్షి, హైదరాబాద్ : చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప అట. మీరెప్పుడైనా ఐదు వేల నోటు చూశారా. అలాటింది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం... ఐదు వేల నోటును రద్దు చేయమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారట. వినేందుకు నమ్మకశ్యం కాకపోయినా... ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ మొదలు నోబెల్ పురస్కారాల వరకూ ప్రతిదానిలో ‘నేనే’ అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే. మరి అలాంటిది చంద్రబాబు చెబితే నమ్మాల్సిందే కదా. (గాంధీలా బతుకుతున్న నన్నంటాడా?) అంతెందుకు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంతో పాటు, దేవేగౌడను ప్రధాని మంత్రిని చేయడం, పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేర్పించడం, సత్యా నాదెళ్లకు కంప్యూటర్ కోర్సు చేయమని తానే చెప్పానంటూ మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ అభాసుపాలయ్యారు కూడా. చేసిందేమీ లేకపోయినా... వాటి క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకుని, మీడియాలో గప్పాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు... పెద్దనోట్లు రద్దు అంశంపై మీడియా సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో నోట్ల రద్దు సూపర్, శెభాష్... అదంతా నా క్రెడిట్ అన్న బాబుగారూ... తాజాగా పెద్దనోట్ల రద్దు చెత్త నిర్ణయం అంటూ మాట మార్చారు. కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘనకీర్తీ అంతా తనదేనని, తాను చెబితేనే ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేశారంటూ అవకాశం దొరికిప్పుడల్లా ఊదరగొట్టారు చంద్రబాబు. గత ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీతో జతకట్టి గద్దెనెక్కిన చంద్రబాబు... మోదీ సర్కార్ ఏం చేసినా... తానా, తందానా అంటూ ఒత్తాసు పలికారు. నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు నాయుడు మాత్రం.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని తానే స్వయంగా నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు. అంతేకాకుండా పెద్ద నోట్లరద్దు చేయగానే మోదీకి ఫోన్ చేసి అభినందించానని మీడియా సాక్షిగా చిరునవ్వులు చిందిస్తూ చెప్పుకొచ్చారు. గతంలో మోదీ సర్కార్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన చంద్రబాబు... తాజాగా ప్రధాని గుంటూరు పర్యటన అనంతరం తన ద్వంద్వ వైఖరిని మరోసారి బయట పెట్టారు. బుద్ధి ఉన్నవాడు నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటాడా అంటూ మండిపడ్డారు. ఇది పిచ్చి తుగ్లక్ చర్య అని, వెయ్యి నోటు రద్దు చేసి, రెండువేల నోటు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదండోయ్... ఏకంగా అయిదువేల రూపాయల నోటును రద్దు చేయాలని కూడా అప్పట్లో చెప్పారట. అసలు ఐదువేల నోటు చెలామణిలో ఉందా? ఆ విషయం చంద్రబాబుకు తెలిసే మాట్లాడారా లేక, తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారా? అనేది పాపం ఆయనకే తెలియాలి మరి. ఇక్కడ చంద్రబాబుకు అర్థం కానిది ఒక్కటే. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. చేసిన గొప్పలు ఇంకెవరైనా చెబితేనే... జనాలు నమ్ముతారనే విషయం చంద్రబాబుకు ఎప్పుడు అర్థం అవుతుందో? -
చంద్రబాబు నాడు-నేడు
-
రద్దయి రెండేళ్లయినా...ఇంకా పాతనోట్లు..
అహ్మదాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పెద్దమొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్లోని నౌరాసిలో రూ.3.5 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా...పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లు పట్టుబడిన విషయాన్ని గుజరాత్ ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పాత కరెన్సీని ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం అంటూ కేంద్రం జీవో కూడా అమల్లోకి తెచ్చింది. అయినా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా రద్దయిన నోట్లను సీజ్ చేస్తూనే ఉన్నారు. -
‘ఈ సారి రూ.100 నోట్లను రద్దు చేయండి’
న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మోదీ బడ్జెట్ను ఓట్ల బడ్జెట్గా చిత్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వరుస ట్వీట్లు చేశారు. ‘మోదీ ప్రభుత్వం జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతు సవరణలు చేస్తోంది. కానీ పెగురుతున్న నిరుద్యోగుల సంఖ్యను మాత్రం దాచి పెడుతుంది. వాటిని కూడా సవరించండ’ని పేర్కొన్నారు. అలానే ‘మోదీ ప్రభుత్వంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన ఏడాదే అత్యధిక వృద్ధి రేటు(8.2 శాతం) నమోదయ్యింది. ఈ సారి వంద రూపాయల నోట్లను రద్దు చేయండి. మరోసారి అద్భుతమైన వృద్ధి రేటు నమోదవుతుందం’టూ ఎద్దేవా చేశారు. అంతేకాక ‘సగటున 7 శాతం కూడా ఉపాధి లేకుండా ఒక దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశ్నిస్తున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం.. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగిత ఇప్పుడే నమోదయ్యింది. అలాంటిది ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందంటే మేం ఎలా నమ్మాల’ని ప్రశ్నిస్తూ చిదంబరం వరుస ట్వీట్లు చేశారు. Modi Government revises GDP growth figures upward. What government did not realise was that unemployment figure was also revised upwards! — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 The demonetisation year was the best year of growth (8.2%) under Mr Modi. So, let's have another round of demonetisation. This time let's demonetise 100 rupee notes. — P. Chidambaram (@PChidambaram_IN) February 1, 2019 -
‘నోట్ల రద్దు గొప్పదనమే’
సూరత్: చవక ధరకు ఇళ్లు కొనుగోలు చేయాలనే యువత ఆకాంక్ష తమ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పుకొచ్చారు. తన హయాంలో జరిగినన్ని పనులు పూర్వ ప్రభుత్వాలు చేయాలంటే కనీసం 25 ఏళ్లు పడుతుందన్నారు. సూరత్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ‘పెద్ద నోట్లను రద్దు చేస్తే కలిగిన ప్రయోజనమేమిటి అని అనేకమంది అడిగారు. ఈ మాటను మీరు యువత వద్ద అనండి. ఈ నిర్ణయం వల్ల తమకు చవక ధరలకు ఇళ్లు లభిస్తున్నా యని వారు మీకు జవాబిస్తారు. నల్లధనం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంపైనే పెట్టారు. అయితే నోట్ల రద్దు, రెరా (రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం)లను అమల్లోకి తీసుకురావడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగాం’ అని అన్నా రు. తమ ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని, దీంతో సామాన్యులు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు. 1.30 కోట్ల గృహాలు నిర్మించాం గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం 1.30 కోట్ల గృహాలను నిర్మించిందని మోదీ చెప్పారు. అయితే యూపీఏ హయాంలో కట్టింది కేవలం 25 లక్షల ఇళ్లేనని ఆయన తెలిపారు. గడచిన మూడు దశాబ్దాల కాలంల్లో హంగ్ పార్లమెంట్ను కూడా దేశం చవిచూసిందని, దీని వల్ల అభివృద్ధికి విఘాతం కలిగిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగికి సింగర్ కుచ్చుటోపీ!
న్యూఢిల్లీ : రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హర్యానా సింగర్ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పారా మిలిటరీ ఉద్యోగిని మోసగించిన సదరు సింగర్ అతడి నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసిందని పేర్కొన్నారు. వివరాలు... హర్యానాకు చెందిన శిఖా రాఘవ్(27) స్టేజీ సింగర్గా గుర్తింపు పొందారు. ఆధ్మాత్మిక గీతాలు ఆలపించే శిఖా హర్యానాతో పాటు ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇందులో భాగంగా 2016లో ఆమె ఉత్తర ఢిల్లీలోని రామ్లీలాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ రిటైర్డ్ పారా మిలిటరీ ఉద్యోగి కుటుంబంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెద్ద నోట్లరద్దు అంశం తెరపైకి రావడంతో తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు సదరు ఉద్యోగి ప్రయత్నించారు. ఇదే అదునుగా భావించిన శిఖా, ఆమె స్నేహితుడు పవన్ పాత నోట్లను మారుస్తామంటూ అతడి దగ్గరి నుంచి సుమారు 60 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఎన్నిరోజులైనా వారి నుంచి ఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసుల సహాయంతో.. గురువారం శిఖాను అరెస్టు చేశామని డీసీపీ నుపుర్ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. -
భారతీయ కరెన్సీని చట్టబద్ధం చేయండి
కఠ్మాండ్: నోట్ల రద్దు అనంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను నేపాల్లో చట్టబద్ధం చేయాలని కోరుతూ ఆ దేశ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)కి లేఖ రాసింది. దేశంలో ప్రసుత్తం చలామణి అవుతున్న రూ. 200, రూ. 500, రూ. 2,000 కొత్త నోట్లకు సంబంధించిన బ్యాంకు బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని కోరింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంకు (ఎన్ఆర్బీ) శుక్రవారం ఆర్బీఐకు లేఖ రాసినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. నేపాలీల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పించాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేసింది. నోట్ల రద్దు అనంతరం నేపాల్లో రూ. 100, అంతకంటే తక్కువ విలువున్న నోట్ల చలామణికి మాత్రమే ఆర్బీఐ అనుమతిచ్చింది. భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్లకు నేపాల్లో చట్టబద్ధత కల్పించకపోవడంతో పెద్ద నోట్లను రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించినట్లు ఎన్ఆర్బీ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై పలు రంగాల ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెనక్కుతగ్గామని పేర్కొన్నారు. -
అప్పుడు ఎన్ని నోట్లు ముద్రించారో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.500 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో ఆయన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు (సీఐసీ) అప్పీలు చేసుకున్నాడు. ఆర్బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ లిమిటెడ్’ సీఐసీకి తన వాదనలు వినిపిస్తూ... కరెన్సీ నోట్ల ముద్రణ, సంబంధిత వివరాలను ప్రజలతో పంచుకోరాదని, ఇది నకిలీ కరెన్సీ వ్యాప్తి, ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని చెప్పింది. ఇది పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారంగా పేర్కొంది. ఈ సమాచారాన్ని వెల్లడిస్తే అది దేశ సమగ్రతకు, సౌర్వభౌమత్వం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) కింద ఈ సమాచారానికి మినహాయింపు ఉందని తెలియజేసింది. అయితే ఈ వాదనలను సీఐసీ భార్గవ తోసిపుచ్చారు. రోజువారీగా ఎన్ని నోట్లను ముద్రించారన్న సమాచారం అంత సున్నితమైనదేమీ కాదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించారు. -
పెద్దనోటు అదృశ్యం
చిత్తూరు అగ్రికల్చర్: రెండు వేల నోటు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పాత నోట్ల రద్దు తర్వాత కనిపించిన ఈ నోటు రానురానూ అదృశ్యమవుతోంది. బ్యాంకులో నగదు విత్డ్రా చేసుకుంటే రూ. 100 నోట్లను మాత్రమే చేతికిస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఈ నోట్లనే తీసుకోవాల్సి వస్తోంది. పెద్ద నోట్లు ఇచ్చే పరిస్థితి బ్యాంకుల్లో ప్రస్తుతం లేదు. జిల్లాలో 39 బ్యాంకులకు చెందిన 618 బ్రాంచిలున్నాయి. రోజూ దాదాపు రూ. 30 కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటీఎంల ద్వారా మరో రూ. 10 కోట్లకు పైబడి ఖాతాదారులు తీసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి తీసుకోవాలంటే పరిమితి పెట్టారు. దీంతో పెద్దమొత్తంలో నగదు కావాల్సిన ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిందే. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా వంద నోట్లే ఇస్తున్నారు. కాకుంటే రూ.200 నోట్లు ఇస్తున్నారు. దీంతో వీటిని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. నోట్ల కట్టల భద్రత విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. ఆర్బీ నుంచి రూ.2 వేల నోట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిసింది. రూ.500 నోట్లు కూడా రావడం తగ్గిపోయింది. కొద్దో గొప్పో ఉన్నా అవి ఏటీఎంల ద్వారా మాత్రమే పొందే వీలుంది. ముద్రణ నిలిపివేత పది నెలల క్రితమే రూ.2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రూ. 500 నోట్ల సరఫరాను కూడా పూర్తిగా తగ్గించినట్లు తెలిసింది. రూ.500 నోట్లు ఏటీఎంలకు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2 వేల నోట్లు నల్లకుబేరులకు వరంలా పరిణమించింది. విడుదలైన కొన్నాళ్లు మాత్రమే జనం చేతుల్లో చెలామణి అయింది. కొద్దికాలంలోనే పెద్దనోటు వాడకం తగ్గిపోయింది. సంపన్నవర్గాల చేతిలో ఇవి చిక్కుకున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు నోట్ల కష్టాలు మళ్లీ దాపురించాయి. చిన్న మొత్తాలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందే పెద్ద నోట్లు సరఫరా నిలిచిపోవడంతో చిన్న మొత్తాలను తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. బ్యాంకులో రూ. 10 వేలు డ్రా చేసినా చేతికి చిన్ననోట్ల కట్టలు అందిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుంటే ముందస్తుగా సంచులు తీసుకెళ్లాల్సి వస్తోంది. – గురునాథరెడ్డి, కృష్ణంపల్లె ఏటీఎంలో రూ.500 మాత్రమే వస్తున్నాయి రూ. 500 నోట్లు ఏటీఎంలలో మాత్రమే వస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటే కేవలం రూ. 100 నోట్లు మాత్రమే చేతికిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకున్నా రూ.2 వేల నోట్లు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులను నుంచి నగదు తీసుకురావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కారేటి గోవిందరెడ్డి, పెనుమూరు ఉన్న 2వేల నోట్లే చెలామణి అవుతున్నాయి కొత్తగా ఆర్బీఐ నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు. ఉన్న నోట్లే చెలామణి అవుతున్నాయి. ప్రస్తుతం 500, 200, 100 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. – లక్ష్మీ నారాయణ, జోనల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ -
నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కూడా తన పుస్తకంలో డీమోను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దువల్ల చిన్న వ్యాపారాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అయితే, వీటి పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ‘డీమో విషయంలో చిన్న విషయాలను పట్టించుకొని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండాల్సింది. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు.. దీనికంటే అధిక విలువగల రూ.2,000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా అమలు చేయడంలో వ్యూహం కూడా సరిగ్గా లేదు. భారీ స్థాయిలో నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్లుగా సరైన విలువ(డినామినేషన్) గల నోట్లను అంతే స్థాయిలో ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అయితే, డీమోతో ఫైనాన్షియల్ రంగానికి మాత్రం చాలా మేలు జరిగింది, నమ్మశక్యం కానంతగా పొదుపు పెరిగింది’ అని కోటక్ అభిప్రాయపడ్డారు. -
నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్) దాఖలు చేసిన వారి సంఖ్య 6.08 కోట్లకు పెరిగిందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు గణనీయంగా తోడ్పడిందని ఆయన వెల్లడించారు. ‘పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరగడానికి డీమోనిటైజేషన్ గణనీయంగా తోడ్పడింది. ఈ ఏడాది ఇప్పటిదాకా (2018–19 అసెస్మెంట్ ఇయర్) 6.08 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం వృద్ధి. కాబట్టి ఇది డీమోనిటైజేషన్ ప్రభావమేనని చెప్పవచ్చు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఏ తేదీ నాటికి ఫైలింగ్స్ 6.08 కోట్లకు చేరాయన్నది మాత్రం చంద్ర వెల్లడించలేదు. ‘స్థూలంగా ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 16.5 శాతంగాను, నికర ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 14.5 శాతంగాను ఉంది. పన్నులు చెల్లించేవారి సంఖ్య పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు తోడ్పడిందనడానికి ఇదే నిదర్శనం‘ అని చంద్ర తెలిపారు. 2016 నవంబర్లో కేంద్రం రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న నాలుగు గంటల వ్యవధిలోనే ఎలక్ట్రానిక్ రూపంలో పర్మనెంట్ అకౌంటు నంబరు (ఈ–పాన్) జారీ చేసేందుకు సీబీడీటీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 4 గంటల వ్యవధిలోనే పాన్ను జారీ చేయడానికి అవకాశం ఉంది. ఆధార్ గుర్తింపు సంఖ్యను సమర్పిస్తే చాలు.. 4 గంటల్లో మీ కు ఈ–పాన్ జారీ అవుతుంది‘ అని చంద్ర తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సాధిస్తాం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్నట్లుగా రూ. 11.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించగలమని చంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మొత్తం ప్రత్యక్ష పన్నులకు సంబంధించి బడ్జెట్ అంచనాల్లో 48 శాతం వసూలైనట్లు చెప్పారు. 2018–19 అసెస్మెంట్ ఇయర్లో సీబీడీటీ ఇప్పటిదాకా 2.27 కోట్ల రీఫండ్లు జారీ చేసిందని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చంద్ర చెప్పారు. డీమోనిటైజేషన్ అనంతరం కార్పొరేట్ ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య 8 లక్షలకు చేరిందన్నారు. గడిచిన నాలుగేళ్లలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య 80 శాతం పైగా పెరిగిందని చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అసెసీలను ట్యాక్స్ ఆఫీసులకు పిలిపించకుండా సుమారు 70,000 పైగా కేసులను ఆన్లైన్లోనే పరిష్కరించినట్లు చెప్పారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి, ఆదాయాలకు రిటర్నులకు పొంతన లేని వారికి సీబీడీటీ దాదాపు 2 కోట్ల ఎస్ఎంఎస్లు పంపినట్లు చంద్ర చెప్పారు. -
నోట్లరద్దుతో సీన్రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
అవినీతి అంతం కోసమే.. నోట్ల రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని నీతి ఆయోగ్ వైస్చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి కోసం కాదని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం నిర్వహించిన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) హెల్త్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ‘సుబ్రమణియన్ నివేదిక చదివాను. అందులో ఆర్థిక వికాసానికి నోట్ల రద్దు వ్యతిరేకంగా ఉందని రాశారు. అయితే సుబ్రమణియన్ ఈ పదాన్ని ఎందుకు వాడారో నాకు తెలియదు. ఇది కేవలం అవినీతిపరులకు, అక్రమంగా నగదు దాచుకున్నవారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రమేఆర్థిక వికాసం గురించి తెలిసినవారు నిజాయతీపరులై ఉంటారు, చట్టానికి కట్టుబడి ఉంటా’రని రాజీవ్కుమార్ పేర్కొన్నారు. కాగా పెద్ద నోట్ల రద్దు దారుణమని, ఇది ఆర్ధిక వృద్ధికి పెనుప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అరవింద్...నోట్లరద్దు తదనంతర పరిణామాలపై ఆరు నెలలు అధ్యయనం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోయిందన్నారు. గతంలో ఇది ఎనిమిది శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
మాజీ ఆర్థిక సలహదారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల రద్దు పెద్ద తప్పిదమని విమర్శలు గుప్పిస్తోంటే.. మరోవైపు నోట్ల రద్దు అమానుషం అదొక మానిటరీ షాక్ అంటూ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ మరో బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు 8శాతంగా ఉన్న జీడీపీ దాదాపు ఏడు త్రైమాసికాల్లో 6.8శాతానికి కి పడిపోందని విమర్శించారు. డీమానిటైజేషన్పై పెద్ద నోట్ల రద్దుపై మౌనాన్ని వీడిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ "భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్" అని పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80 శాతం కరెన్సీ రద్దు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందన్నారు. డిసెంబర్ 5న విడుదలవనున్నఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ అనే పుస్తకంలో అరవింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థికవృద్ది మరింత మందగించిందని టు పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్- పొలిటికల్ అండ్ ఎకానమిక్ అనే చాప్టర్లో రాసుకొచ్చారు. అధిక వడ్డీరేటు, జీఎస్టీ చట్టం అమలు, చమురు ధరలు లాంటి అంశాలు ఆర్థికవృద్ది రేటును ప్రభావితం చేసినప్పటికీ నోట్లరద్దుతో వృద్ది మందగించిందనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు. -
డబ్బులిచ్చి మరి పాత నోట్లను కొంటున్నారట..!
‘డిమానిటైజేషన్’.. ‘పెద్ద నోట్ల రద్దు’ జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమానిటైజేషన్ ప్రభావం నేటికి కూడా ఉంది. అయితే పనికి రాకుండా పోయిన ఈ పాత నోట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి కొంటున్నారట జనాలు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘ఇ-బే’లో ఈ పాత నోట్లను 6 డాలర్ల(రూ. 423)కి అమ్ముతున్నారు. అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పుకొంటున్న ఓ వ్యక్తి ఇ-బేలో ఈ పాత రూ. 500 నోట్లను అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికే 15 పాత నోట్ల అమ్ముడు పోయాయి.. మరో 9 మాత్రమే ఉన్నాయి త్వరపడండి అంటున్నాడు సదరు వ్యక్తి. అయితే పనికి రావని తెలిసి కూడా ఈ పాత నోట్లను జనాలు ఎందుకు కొంటున్నారు.. అది కూడా దానికి సమానమైన విలువ చెల్లించి.. అంటే పాత కరెన్సీని, కాయిన్స్ని సేకరించే అలవాటు ఉన్న వారే ఇలా కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అయితే పాత నోట్లను ఇలా అమ్మకానికి పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చాలా మంది తమ దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను ఇండియామార్ట్, ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి పెట్టారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. -
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. -
సేద్యానికి నోట్ల సెగ..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో చిన్న రైతులు చితికిపోయారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బ్లాక్ మనీ నియంత్రించేందుకు ఇది అవసరమని ఇన్నాళ్లూ మోదీ సర్కార్ సమర్ధించగా తాజాగా నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ నిర్ణయం వెలువడిన రెండేళ్ల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు నగదుపై ఆధారపడే చిన్న రైతులు నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. రబీ సీజన్కు ముందు నగదు కొరతతో లక్షలాది రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయలేకపోయారని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నోట్ల రద్దు అమలైన సమయంలో రైతులు వారి ఖరీఫ్ దిగుబడులను అమ్ముకోలేక, రబీ పంటలను సాగుచేయలేక సమస్యల్లో కూరుకుపోయారని తెలిపింది. రైతుల చేతిలో ఉన్న నగదంతా నోట్ల రద్దుతో చెల్లుబాటు కాకుండా పోయిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం సైతం విత్తనాలను విక్రయించలేదని, తమ పొలాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి క్రమంలో పెద్ద రైతులు సైతం నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. నగదు కొరతతో నేషనల్ సీడ్ కార్పొరేషన్కు చెందిన 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు విక్రయానికి నోచుకోలేదని తెలిపింది. పాతనోట్లతోనూ గోధుమ విత్తనాలు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తర్వాత సడలింపు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది. -
‘ఆయన ఎవరితో కాపురం చేస్తారో తెలీదు’
సాక్షి, చిత్తూరు : ఆర్బీఐ, ఎన్నికల కమిషన్, సీబీఐ వంటి సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీ కబంధ హస్తాల్లో నలిగి పోతున్నాయని సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాభై రోజుల్లో నోట్ల రద్దు ప్రయోజనాలు లేకుంటే తనని కాల్చి చంపాలని మోదీ చెప్పారని, ఈ లెక్కన ఆయనను 24 సార్లు కాల్చి చంపాలంటూ మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ పరిస్థితి డోలాయమానంలో పడిందన్నారు. ఎన్డీయే పాలనను అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని నారాయణ పేర్కొన్నారు. రఫేల్ కుంభకోణంతో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. ఎన్నికల కమిషన్ సైతం మోదీ అడుగుజాడల్లో నడుస్తోందని ఆరోపించారు. సీబీఐ ప్రస్తుతం ముక్కలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇక.. పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రస్తావిస్తూ, ఆయన ఎప్పుడు ఎవరితో కాపురం చేస్తారో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ సవ్యంగా సాగడం లేదని, సిట్ నివేదికపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని నారాయణ చెప్పారు. -
బీజేపీపై సూపర్స్టార్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనేది నిజమేనేమో అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ... నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమని, ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని పేర్కొన్నారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనుకుంటున్నాయి కాబట్టే విపక్షాలు కూటమి దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయేమోనని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రజనీకాంత్.. బీజేపీ గురించి ఇలా మాట్లాడటం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం మోదీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో అందుకు మద్దతు తెలిపిన రజనీ ప్రస్తుతం ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలేమిటో అనే చర్చ మొదలైంది. -
నోట్ల రద్దుపై మాటమార్చిన చంద్రబాబు
-
‘మోదీ నిర్ణయంతో తీవ్రవాదం పెరిగింది’
సాక్షి, విజయవాడ : పెద్దనోట్ల రద్దు చేసి రెండేళ్లు గడిచినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ విమర్శించారు. 130 కోట్ల మంది భారతీయులను నడిరోడ్డుపై నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు విఫల ప్రయోగంగా వర్ణించారు. బ్లాక్ మనీ, తీవ్రవాదం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశామని మోదీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు సాధించారో ప్రజలు తెలపాలని ఆయన డిమాండ్. నోట్ల రద్దు తరువాత కశ్మీర్లో తీవ్రవాదం మరింత పెరిందన్నారు. దేశంలో అనేక చోట్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన మండిపడ్డారు. -
చలా‘మణీ’కి రెండేళ్లు
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో సామాన్య ప్రజలకు పెద్ద కష్టాలే వచ్చాయి. సరిగా రెండేళ్ల క్రితం (2016 నవంబర్ 8న )నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రూ.100 నోటు కోసం అన్ని వర్గాల ప్రజలూ నానాపాట్లు పడ్డారు. ప్రకటన మరుసటి రోజు నుంచే చేతిలో రూ.కోట్ల కరెన్సీ ఉన్నా విలువలేని నోట్లుగా చూడాల్సి వచ్చింది. నోట్ల మార్పిడి, కొత్త కరెన్సీ నోట్ల కోసం జనం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరెన్సీ కష్టాలతో కటకట పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్బ్యాంకు అందుకనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కరెన్సీ కష్టాలతో అల్లాడిపోయారు. 34 ప్రధాన బ్యాంకులు, వాటి పరిధిలో 457 బ్యాంకు శాఖలు, 556 ఏటీఎంలు ఉన్నా నగు కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. లక్షలకు లక్షలు దగ్గరున్నా అవి చెల్లుబాటు కాకపోవడంతో భగవంతుడా ఏమిటీ శిక్ష, పగవాడికి కూడా ఇలాటి కష్టాలు రాకూడదని కోరుకున్నారు. పూటకోనిబంధన పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర ‘మార్పిడి’ చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు. పెళ్లిళ్లు, చదువులు, శుభకార్యాలకు అవస్థలు పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో రోగులకు డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. ఫించన్లకు వృద్ధులు, వికలాంగులు, పెన్షన్కు పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, ఇతరత్రా కార్మికులు, కూలీలు...తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండేళ్లు పూర్తవుతున్నా 2016 నవంబర్ 8 తర్వాత పడిన కష్టాలు, కన్నీళ్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రజలకు నిద్రలేని రోజులెన్నో పెద్దనోట్ల రద్దు ప్రకటనను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రజల వెన్నులో వణుకుపుట్టినంత పని అవుతుందని చెప్తారు. కేవలం రూ.100 నోటు కోసం నిద్రాహారాలు మాని బ్యాంకుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసిన సందర్భాలూ ఉన్నాయి. అన్ని పనులూ వదిలేసి బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ పోలీసు పహారా నడుమ రోజంతా నిలబడితేగానీ చేతికి నోట్లు అందని పరిస్థితి.ఏ బ్యాంకుకు వెళ్లినా ‘నోక్యాష్–క్యాష్ నిల్’ బోర్డులు కనిపించాయి. ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి. నోట్ల రద్దు సందర్భంగా ఏమి జరుగుతోందో ఏమి జరగబోతోందో అంతుచిక్కక ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అనుభవించారు. పేదలు, సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారుల మరీ ఇబ్బందికర జీవితం గడిపారు. -
రద్దుకు రెండేళ్లు!
-
‘అది అనాలోచిత నిర్ణయం’
సాక్షి, న్యూఢిల్లీ : రెండేళ్ల కిందట చేపట్టిన నోట్ల రద్దు దుష్ర్పభావాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న సమస్యలు నోట్ల రద్దు పర్యవసానమేనని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అనాలోచిత చర్యగా ఆయన అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ, సమాజంపై నోట్ల రద్దు విరుచుకుపడిన తీరు ఇప్పుడు అందరికీ తేటతెల్లమైందన్నారు. ఆర్థిక వృద్ధిపైనా నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోందని, యువతకు ఉద్యోగాలు కొరవడటం, చిన్నతరహా పరిశ్రమలు నగదు లభ్యత లేకపోవడంతో కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక దుస్సాహసాలు దేశంపై దీర్ఘకాల ప్రతికూల ప్రభావాన్ని ఎలా చూపుతాయో ఈ రోజు మనకు గుర్తుకుతెస్తోందని, ఆర్థిక విధాన నిర్ణయాలను అప్రమత్తతో, ఆచితూచి తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నదని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. -
ఆర్థిక పుటలో ‘ఈ రోజు’ శాశ్వతం
సాక్షి, న్యూఢిల్లీ : మన జీవితంలో చోటుచేసుకునే కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికీ మరచిపోలేం. ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లాడు పుట్టడం, ప్రేమించినవారు మరణించడం తదితర సంఘటనలను మరవలేం. అలాగే మన జీవితాలను ప్రభావితం చేసే సామాజంలో లేదా దేశంలో జరిగే సంఘటనలకు కూడా మరచిపోలేం. వాటి గురించి చెప్పమంటే నిన్న మొన్న జరిగినట్లే చెప్పగలం. అలాంటి సంఘటనల్లో ఒకటి దేశంలో పెద్ద నోట్ల రద్దు. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశానికే పెద్ద షాక్ ఇచ్చారు. దేశంలో రోజు రోజుకు పేరుకుపోతున్న నల్లడబ్బును వెలికి తీయడానికి, నకిలీ కరెన్సీని అరికట్టడానికి, టెర్రరిజాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్క లక్ష్యమైనా నేరవేరిందా? దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ఉద్యోగావకాశాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది? పెద్ద నోట్లను రద్దు చేసిన మరుసటి రోజు నుంచి సామాన్య ప్రజలు ఏటీఎంల ముందు భారీ ఎత్తున క్యూలు కట్టి అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడినా ప్రయోజనం లేకపోవడంతో అనేక మంది వృద్ధులు, పింఛనుదారులు క్యూలలోనే ప్రాణాలు వదిలారు. అలా దేశవ్యాప్తంగా 150 మందికిపైగా మరణించారు. రైతులు, ముఖ్యంగా కూరగాయ రైతులు, చిల్లర వ్యాపారులు భారీగా నష్టపోయారు. దేశంలో పలు చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. చేనేత కార్మికులు ఉపాధినికోల్పోయి వారి వద్ద పనిచేసే కార్మికులు దిక్కులేకుండా పోయారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయి సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇబ్బందులు పడ్డారు. ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికే రెండు లక్షల కోట్ల రూపాయల న ష్టం వాటిల్లింది. పేద, మధ్య తరగతి ఇళ్లలో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోగా, కొన్ని పెళ్ళిళ్లు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయినా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయంటూ మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఏడాది గడిచినా ఒక్క మంచి ఫలితం కనిపించలేదు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వచ్చింది. ఈ రోజుకు రెండేళ్లు గడిచాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దేశం మొత్తం కరెన్సీలో 86 శాతం ఉన్న రూ. 500, రూ 1000 నోట్లను రద్దూ చేయడం వల్ల దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా నల్లడబ్బుగా భారత ప్రభుత్వానికి మిగులుతుందని ప్రభుత్వం భావించింది. రద్దు చేసిన నోట్లలో 99. 30 శాతం వెనక్కి తిరిగి వచ్చాయి. అంటే, 10. 720 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన నల్లడబ్బు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలే. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వానికి చిక్కిన నల్లడబ్బు మొత్తం 16 వేల కోట్లే. కొత్త నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు 7,965 కోట్ల రూపాయలు. పట్టబడిన నల్ల డబ్బును లాభం అనుకుంటే అందులో నుంచి నోట్ల ముద్రణకు అయిన ఖర్చును తీసివేస్తే మిగిలేది 8, 035 కోట్ల రూపాయలు. పెద్ద నోట్ల రద్దు చేసిన సంవత్సరంలో పట్టుబడిన నకిలీ కరెన్సీ 7.6 లక్షల రూపాయలు. అంతకుముందు పట్టుబడిన నకిలీ కరెన్సీ 6.3 లక్షల రూపాయలు. స్థూల జాతీయోత్పత్తి వృద్థి రేటు అంతకుముందు 7.1 శాతం ఉంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా అది 5. 7 శాతానికి పడిపోయింది. పడిపోయిన వృద్ధి రేటును దాచి పెట్టేందుకు 2017వ ఆర్థిక సంవత్సరం నుంచి మోదీ ప్రభుత్వం వృద్ధి రేటును లెక్కించేందుకు కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టింది. కొత్త పద్ధతి ప్రకారం 2018లో వృద్ధి రేటును 7.3గా చూపింది. కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ఐదేళ్ల క్రితం వృద్ధి రేటు ఎంత ఉన్నదో కొత్త పద్ధతి ప్రకారం లెక్కించి తప్పనిసరిగా చూపించాలన్నది ఆర్థిక నియమం. ఈ నియమం ప్రకారం యూపీఏ ప్రభుత్వం హయాంలో వృద్ధి రేటు 10.5 శాతమని తేలింది. కేంద్ర ప్రభుత్వం స్టాటటిక్స్ వెబ్సైట్లో ఈ శాతాన్ని తొలుత చూపినా కొన్ని రోజులకే మాయమయింది. అయినప్పటికి రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చూస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సముచితం సాహసోపేతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సమర్థించుకున్నారు. సాహసోపేతం కావచ్చుగానీ సముచితం ఎలా అవుతుందో ఆయనకు, ఆయన ప్రభుత్వానికే తెలియాలి. ఆర్థిక చరిత్ర పుటలో ఈ రోజు ఎప్పటికి నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ‘కొన్ని గాయాలు కాలంతోపాటు మానిపోతుంటాయి. కాన్ని పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు మానకపోగా, కాలంతోపాటు అవి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, చిన్న, పెద్దా, ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గాయపర్చింది పెద్ద నోట్ల రద్దు’ అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. -
నోట్ల రద్దు: నెటిజనుల వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల ( 500, 1000 రూపాయల) రద్దు ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయింది. నల్లధాన్ని రూపుమాపేందుకు, అవినీతిపై అరికట్టేందుకు అంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన మారక విలువను రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్ను సమర్ధించుకుంటూ ట్విటర్లో ట్వీట్ల పరంపర సాగించారు. అక్రమంగా నిలవ చేసిన డబ్బును నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే విధంగా చేశామని, పన్ను వసూళ్లు బాగా పెరిగాయంటూ తమని తాము ప్రశంసించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల పరపంపరలో నోట్ల రద్దు కీలకమైందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావాన్ని చూపిందని జైట్లీ పేర్కొన్నారు. మే, 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం 3.8 కోట్ల రూపాయలుంటే.. తమ ప్రభుత్వం ఆధీనంలో మొదటి నాలుగేళ్లలో 6.86 కోట్ల రూపాయలకు పెరిగిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్నీ తగ్గించాం..కానీ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ పౌరులకు మంచి జీవనవిధానాన్ని అందించాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఆదాయాన్ని సమకూర్చామంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఒక వివరణాత్మక వ్యాసాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విశేషం. మరోవైపు పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా తమను పీడిస్తున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజనులు కూడా డీమానిటైజేషన్పై వ్యంగాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోట్లరద్దు చేపట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. డిమానిటైజేషన్ చర్యను 'ఆర్థిక దుష్ప్రభావం' గా పేర్కొంది. ఎన్డీఐ ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా, చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, 120 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని దేశం ఎప్పటికీ క్షమించదని దుయ్యబట్టింది. ఆర్థిక రంగంలో అనాలోచిత చర్యలు ఎకానమీపై ఎంతటి దుష్ర్పభావాన్ని పడవేస్తాయో, జాతికి దీర్ఘకాలికంగా ఎంతటి నష్టమో ఈ రోజు (నోట్ల రద్దు రెండేళ్లయిన సందర్భంగా) స్పష్టమవుతోందని మాజీ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆలోచించి, అతి జాగ్రత్తగా ఆర్థిక విధానానాలను చేపట్టాల్సి అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సంప్రదాయక స్వల్పకాలిక విధాన నిర్ణయాలకు స్వస్తి పలికి దేశ ఆర్థికస్థిరత్వానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల నుంచి 28వేల కోట్ల పెద్దనోట్ల మాయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలు పెద్దనోటును మింగేస్తున్నాయి. రవాణా చేసేందుకు, దాచిపెట్టేందుకు ఈజీగా ఉండే రూ.2వేల నోటుపైనే రాజకీయ పార్టీలతోపాటు బడావ్యాపారులు దృష్టిపెట్టారు. వీరంతా ఇప్పటికే పెద్దనోటును భారీగా నిల్వ చేయడంతో లావాదేవీలు చాలామటుకు తగ్గిపోయాయి. మరో 45 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు, తర్వాతి ఆర్నెల్లలో.. ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రూ.2వేల నోట్ల నిల్వ పెరిగిపోయింది. ఆర్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు రూ.53 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు సరఫరా చేస్తే మొన్నటి సెప్టెంబర్ 30వ తేదీనాటికి రూ.28 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్లాక్ అయ్యాయి. ఈ ప్రమాద తీవ్రతను ఆర్బీఐ ముందుగానే పసిగట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24 వేల కోట్ల విలువైన పెద్దనోట్లను వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది మే నాటికి దాచిపెట్టిన మొత్తంలో సింహభాగం చలామణిలోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ అంచనా వేస్తోంది. రకరకాల రూపేణా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ మొత్తం బ్యాంక్లకు రావచ్చన్నది ఆర్బీఐ ఆశ. వెళ్లడమే.. రావడం లేదు ఏడాది కాలంగా బ్యాంక్ల నుంచి పెద్దనోట్లు బయటకు వెళ్లడమే గానీ తిరిగి వస్తున్న దాఖలాలు లేకపోవడాన్ని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. ఆ మాటకొస్తే విడుదల చేసిన 6 నెలల్లోనే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల విలువైన ఈ నోట్లను బ్లాక్ చేసినట్లు రిజర్వు బ్యాంక్ అంచనాకు వచ్చింది. రాన్రానూ ఈ నోట్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించి.. 2017 డిసెంబర్ నుంచి పెద్దనోట్లను సరఫరా చేయడం ఆపేసింది. అప్పటికే తగినంత మొత్తంలో రూ.500, రూ.200 నోట్లను భారీగా బ్యాంక్లకు సరఫరా చేసిన ఆర్బీఐ.. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చలామణిలో ఉన్న రూ.2.50 లక్షల కోట్ల విలువైన 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెనక్కు తీసుకున్నవి రూ.24వేల కోట్లు అని ఆర్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేసిన తర్వాత.. 2016 నవంబర్ 11 నుంచి 2017 డిసెంబర్ 31 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.53వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లను సరఫరా చేసింది. అవసరమైనంత స్థాయిలో చిన్ననోట్లు ముద్రణ కాకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతోనే పెద్దనోట్లను ఇంత పెద్దమొత్తంలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాల్సి వచ్చింది. 2018 జనవరిలో పెద్దనోట్లు భారీ మొత్తంలో బ్లాక్ అవుతున్నట్లు గుర్తించి.. వెంటనే వీటి సరఫరాను ఆపేసింది. తెలంగాణ కంటే ఏపీలోనే ఈ నోట్లు భారీగా బ్లాక్ అయినట్లు ఆర్బీఐ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ‘రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ.28 వేల కోట్ల విలువైన నోట్లు బ్లాక్ అయినట్లు మా ఆడిట్లో బయటపడింది. ఇదే విషయాన్ని మేము కేంద్ర నిఘాసంస్థల దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖలు వీటిని గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి’అని ఆర్బీఐ హైద రాబాద్ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చలామణిలో 6వేల కోట్లే.. రిజర్వు బ్యాంక్ వెనక్కి తీసుకోవడంతోపాటు బ్లాక్ చేసిన నోట్లు పోగా.. తెలుగు రాష్ట్రాలలో రూ.6వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నట్లు సెప్టెంబర్ 30వ తేదీన ఆర్బీఐ అంచనా వేసింది. వీటిని కొంత మొత్తాన్ని బ్యాంక్లు ఏటీఎంల్లో పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే, ఏటీఎంల నుంచి బయటకు వెళ్లిన నోట్లు తిరిగి బ్యాంక్లకు రాకపోవడాన్ని గుర్తించారు. ప్రస్తుతం రిటైల్ వ్యాపారుల నుంచి 60% రూ.500 నోట్లు మిగిలిన 40% రూ.200, 100, 50 నోట్లు వస్తున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఈజీగా పంపిణీ చేసే లక్ష్యంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీటిని నిల్వ చేస్తూఉండొచ్చని ఆర్బీఐ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎప్పటినుంచో పెద్ద నోట్లను నిల్వ చేసిన బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందించే అవకాశమందని.. అజ్ఞాతంలో ఉన్న మొత్తంలో 50% వరకు వచ్చే ఏడాది మే నాటికి బ్యాంక్లకు వస్తుందని ఆర్బీఐ ఆశిస్తోంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లతో పాటే ఇటీవల రూ.500 నోట్లను కూడా పెద్దమొత్తంలోనే నిల్వచేస్తున్నారని ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తమకు ఏటీఎంల్లో వినియోగించడానికి రూ.500 నోట్లకు కొరత ఏర్పడి రూ.100 నోట్లను వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత తొలి ఆర్నెల్లలో బ్లాక్ అయిన వాటి విలువ రూ. 10,000 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి మాయమైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ. 28,000 కోట్లు -
వ్యవస్థలను మోదీ నాశనం చేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. దివంగత ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. విశాఖలో ఫిన్టెక్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరికాదని, 500, 2000 రూపాయల నోట్ల వల్ల జనానికి ఇబ్బందులే తప్ప దేశానికి ఏమీ ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అప్పట్లో పెద్దనోట్ల రద్దుకు నేనే సిఫార్సు చేశానని చెప్పిన మీరు ఇప్పుడిలా మాట్లాడడమేమిటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను పెద్ద నోట్ల రద్దుని దశలవారీగా అమలు చేయాలని సూచించానంటూ చంద్రబాబు మాటమార్చారు. ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగత ద్వేషంగానీ, విభేదాలుగానీ లేవని, రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధానితో విభేదిస్తున్నానని చెప్పారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ అమరావతి వచ్చి కూడా శ్రీకాకుళం జిల్లా తుపాను బాధితుల పరామర్శకు రాకపోవడం రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. తిత్లీతో శ్రీకాకుళం జిల్లాకు రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై సీఎం స్పందించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సమస్యలున్నాయని, అవి పరిష్కరించాక ఎన్నికలకు వెళతామని చెప్పారు. వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా వచ్చే సంవత్సరానికి రూ.500 కోట్ల పెట్టుబడితో 75 కంపెనీలు రానున్నాయని, వీటితో 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా 2016 నవంబర్ 8న ట్వీట్ చేసిన సీఎం. తర్వాత రోజు పత్రికల్లో ప్రచురితమైన కథనం -
కొత్తనోటుకు..‘చిరుగు’పాట్లు..!
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త నోట్లు వచ్చి రెండేళ్లు కావస్తున్నా అవస్థలు అలాగే ఉంటున్నాయి. చిరిగిన నోట్లను మార్చే వ్యవస్థను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో చిరిగిన కొత్త నోట్లు ఉన్నవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అనుకోకుండా, ఏదో కారణాలతో చిరిగిన నోట్లను కలిగిన వారు వాటిని మార్చుకుందామని హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. కొత్త నోట్లు చిరిగితే వాటిని మార్చే వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దీంతో అక్కడికి వచ్చినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆర్బీఐ వర్గాలు మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ. వెయ్యి నోట్ల రద్దును 2016 నవంబర్ 8న ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత రూ.2 వేల నోటును, ఆ తర్వాత రూ.500, రూ.200, రూ.50, రూ.20 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. సాధారణంగా నోట్లు చిరిగితే వాటిని బ్యాంకులలో ఇచ్చి కొత్తవి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే కొత్త నోట్లు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇవి చిరిగితే మార్చే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కేంద్రం, ఆర్బీఐ దీనిపై నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నా, ఆ ప్రక్రియను మాత్రం ఎంతకీ ప్రారంభించడంలేదు. పాతనోట్లకు రూల్స్ ఉన్నా.. కొత్తవాటికే.. చిరిగిన నోట్లు చెల్లక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉపశమనం కలిగిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి తిరిగి చెల్లింపు విషయమై 2009లోనే కొన్ని నిబంధనలు జారీ అయ్యాయి. తాజాగా వాటిలో కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో రూ.1 నుంచి రూ.2 వేల వరకు నోటులో ఎంత చిరిగినప్పటికీ ఎంతో కొంత విలువ తిరిగి పొందడానికి వీలు కల్పించింది. రూ.1 నుంచి రూ.20 వరకు సగం నోటు ఉన్నా పూర్తి విలువ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతకంటే ఎక్కువ విలువ ఉన్న నోట్లకు ఎక్కువ భాగం ఉంటే పూర్తి విలువ, అర్ధభాగంలోపు ఉంటే సగం విలువ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ రూల్స్–2018 ఉత్తర్వులు జారీ చేసింది. చిరిగిన నోటుకు పూర్తి విలువ పొందాలంటే ఏ నోటు కనీసం ఎంత మొత్తంలో మిగిలి ఉండాలో ఇందులో నిర్దేశించింది. అయితే కొత్తగా చలామణిలోకి తెచ్చిన నోట్లు చిరిగితే వాటిని మార్చే ప్రక్రియను ఇంకా ప్రారంభించడంలేదు. -
‘ఎమర్జెన్సీ కాదు.. అంతకు మించిన పరిస్థితి’
లక్నో : నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీ రోజులకంటే మరింత దిగజారిపోయిందని మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. గురువారం సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో జరిగిన లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వచ్చింది. ఇప్పుడు మనమంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పటికి మనం మెల్కొనకపోతే దేశంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ప్రజాస్వామ్య రక్షణ కోసం అంతా కలిసి కృషి చేయాలి’అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాల కూటమి ఎలాగైతే గెలిచిందో అలాగే 2019ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల కూటమి పక్కాగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పేరుకే మంత్రులు కానీ.. కేంద్ర కేబినేట్లోని అన్ని శాఖలను నరేంద్రమోదీ ఒక్కరే నిర్వహిస్తున్నారని యశ్వంత్ ఆరోపించారు. పేరుకే వివిధ శాఖలకు మంత్రులను నియమించారు, కానీ అధికారాలు మాత్రం వారికి ఇవ్వలేదని విమర్శించారు.‘ రాఫెల్ ఒప్పందం జరుగుతుంది కానీ రక్షణ మంత్రికి లెలియదు. నోట్ల రద్దు జరిగుతుంది కానీ ఆర్థిక మంత్రికి కేబినేట్ మీటింగ్కి వచ్చేదాకా తెలియదు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు కానీ ఆ విషయం హోం మంత్రికి తెలియదు, ఇది ప్రస్తుత కేంద్ర మంత్రుల పరిస్థితి’ అని యశ్వంత్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రధాని నరేంద్ర మోదీ విదేశి పర్యటనకు సంబంధించిన సదుపాయాలను మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఆమెను ప్రజలు ట్విటర్ మంత్రి, వీసా మంత్రి అని మాత్రమే గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపిని ఓడించి ప్రజాస్వామ్యాని రక్షించాలని కోరారు. -
నదుల అనుసంధానం సలహా నాదే!: సీఎం
సాక్షి, అమరావతి: వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఆయనకు నదుల అనుసంధానం సలహా ఇచ్చింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను చెప్పాకే నదుల అనుసంధానంపై సురేష్ ప్రభు నేతృత్వంలో ఒక కమిటీ వేశారని, కానీ అది ఆచరణలోకి రాలేదన్నారు. అలాగే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది కూడా తానేనని చెప్పుకొచ్చారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో వృద్ధి ఆగిపోయిందన్నారు. పెట్రోల్ ధర రూ.వందకు చేరేలా ఉందని.. రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోందన్నారు. నోట్ల రద్దుపై నా మాట వినలేదు..! నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దానివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. తాను రూ.2 వేలు, రూ.500 నోట్లు రద్దు చేయాలని చెప్పానన్నారు. అదే సమయంలో డిజిటల్ కరెన్సీ, రూ.100, రూ.200 నోట్లు ఎక్కువ తేవాలని సూచన చేశానని.. కానీ కేంద్రం తన మాట వినలేదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశారని విమర్శించారు. వేరే ఏ ప్రభుత్వమున్నా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదన్నారు. ప్రధాని మోదీకి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపరులను ప్రోత్సహిస్తూ ఆ మాటలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎథికల్ హ్యాకింగ్ను ప్రోత్సహిస్తాం.. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని, ఎథికల్ హ్యాకింగ్ను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ–ప్రగతి ప్రాజెక్టుపై సోమవారం వెలగపూడిలోని ఆర్టీజీ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో కూర్చునే అన్ని పనులు జరిగేలా ఉండాలన్నారు. ఈ–ప్రగతి ప్రాజెక్ట్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 793 సర్వీసులను ఇంటిగ్రేట్ చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. సీపీఎస్పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని, దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, హరికృష్ణ మృతి వల్ల ఆలస్యమైందన్నారు. ఉల్లి రైతులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15కల్లా అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. నెల రోజుల్లో 12 సాగునీటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తామని వెల్లడించారు. 45 రోజుల్లో మరో 12 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.58 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ డీపీఆర్ పంపించామని.. దాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. వచ్చే నెలలో ప్రాజెక్టు మొదటి గేటు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెల 17, 18, 19 తేదీల్లో జలసిరికి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. -
రాజన్పై మరోసారి ఆరోపణల వెల్లువ
న్యూఢిల్లీ : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అందరికి సుపరిచితమే. ఆయన పనితీరుపై ఓ వైపు నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. మరోవైపు భేష్ అన్నవారు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్గా రెండో సారి రాజన్ను కొనసాగించాలని మద్దతు కూడా తెలిపారు. కానీ రాజన్ ముక్కుసూటితనం, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు రెండో సారి ఆయనకు ఆర్బీఐ గవర్నర్ పదవి వరించకుండా పోయింది. తాజాగా రఘురామ్ రాజన్ మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృద్ధి రేటు పడిపోవడానికి కారణం రాజన్ అప్పట్లో తీసుకొచ్చిన విధానాలేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంలోని ఎన్పీఏలు పెరగడంతో, వృద్ధి రేటు పడిపోయిందని కుమార్ అన్నారు. 2015 చివరి క్వార్టర్ నుంచి 2016 వరకు వృద్ధి రేటు క్షీణించిందని చెప్పారు. దీనికి గల కారణం రఘురామ్ రాజన్ అనుసరించిన విధానాలేనని, పెద్ద నోట్ల రద్దు కాదని వ్యాఖ్యానించారు. ఎన్పీఏలను గుర్తించడానికి ఆర్బీఐ కొత్త మెకానిజం తీసుకొచ్చిందని, ఆ మెకానిజంతో మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్పీఏలు 4 లక్షల కోట్ల రూపాయలుంటే, 2017 మధ్యకు ఇవి రూ.10.5 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని కేసుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమ క్రెడిట్ కూడా కిందకి పడిపోయిందన్నారు. కొన్నేళ్లలో నెగిటివ్ వృద్ధి కూడా నమోదైందని తెలిపారు. అయితే వృద్ది రేటు నెమ్మదించడానికి, పెద్ద నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని కుమార్ తేల్చేశారు. ఇక స్థూల తరహా పరిశ్రమ తీసుకున్నా.. వృద్ధి రేటు ఒక శాతం మేర పడిపోయిందని, కొన్ని నెలలు రెండున్నర శాతం తగ్గిందని, మరికొన్ని త్రైమాసికాలు నెగిటివ్ కూడా నమోదైందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రిపోర్టుపై స్పందిస్తూ... డిమానిటైజేషన్ను బ్లాక్మనీ, బినామీ లావాదేవీలను నిర్మూలించడానికి తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. -
‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రధ్దు చేసి ప్రజలను నూరు పాట్లకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధ్వజమెత్తారు. ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై దుమ్మెత్తిపోశారు. నోట్ల రద్దు చేస్తు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచలోని ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రశంసించకపోవడం కాదుకదా సమర్థించడం కూడా జరగలేదని, అందరూ అది అనాలోచిత నిర్ణయమని అన్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. అసలు నోట్ల రద్దు విషయం ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్కే తెలియదన్నారు. నోట్ల రద్దు గురించి ఢిల్లీలో మోదీ వివరించిన రోజు సీఈఏ కేరళలో ఉన్నారని, సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది? అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అన్నది అవినీతి, తీవ్రవాదం, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయాలుగా చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి విజయం సాధించిందా అంటూ చురకలు అంటించారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను మెచ్చుకున్నారని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు ఎలా అమలుచేస్తున్నారో అడిగి తెలుసుకునేవారని తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్పై కూడా చిదంబరం విమర్శల వర్షం కురిపించారు. అదొక భీమా పథకం లాంటిదని.. 130 కోట్లకుపైగా జనాభా గల భారత్లో భీమా పథకాలతో ప్రజలకు లాభం జరగుతుందనే నమ్మకంలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్కీమ్లు ఏ దేశంలోనూ విజయవంతం కాలేదని వివరించారు. అంతేకాకుండా ఈ పథకంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆపై జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
రద్దయిన కరెన్సీ : బ్యాంకులకు చేరిన మొత్తమిదే..
సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్ 2016లో రాత్రికి రాత్రి రద్దయిన రూ 500, రూ 1000 నోట్లలో 99.3 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకులకు చేరుకుందని ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న రూ 15.41 లక్షల కోట్ల విలువైన రూ 500, రూ 1000 నోట్లలో రూ 15.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ బ్యాంకులకు చేరుకుందని ఆర్బీఐ తెలిపింది. రద్దయిన పాత నోట్ల ప్రాసెసింగ్, తనిఖీ ప్రకియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. బ్యాంకులకు చేరిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (ఎస్బీఎన్)ను హైస్పీడ్ కరెన్సీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ వ్యవస్థ (సీవీపీఎస్)లో తనిఖీ, లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు బ్యాంకులకు చేరిన పాత నోట్లు దాదాపు రద్దయిన కరెన్సీ నోట్లకు సమానంగా ఉండటంతో నోట్ల రద్దు ప్రయోజనాలపై విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. -
‘డిజిటల్’ డిస్కౌంట్పై కోత!
సాక్షి, సిటీబ్యూరో: పెట్రో ‘డిజిటల్’ డిస్కౌంట్పై కోత పడింది. డిజిటల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ 0.75 నుంచి 0.25 శాతానికి కుదింపునకు గురైంది. అయినా పెట్రోల్, డీజిల్ నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పెట్రోల్ బంకుల్లో సర్వీస్ చార్జీలు లేని కారణంగా వినియోగదారులు నగదు రహిత లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016 నవంబర్లో డీమానిటైజేషన్ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఈ– వ్యాలెట్, మొబైల్ ఇతరత్రా నగదు రహిత సదుపాయాల ద్వారా చెల్లింపులపై చమురు సంస్థలు రాయితీ ప్రకటించిన విషయం విదితమే. లీటర్ పెట్రోల్, డీజిల్పై 0.75 శాతం డిస్కౌంట్ వర్తింపజేసి నగదు రహిత లావాదేవీలు జరిపిన వినియోగదారులు బ్యాంక్ ఖాతాలో మూడు రోజుల్లో రాయితీ జమయ్యేలా చర్యలు చేపట్టింది. ఏటీఎంలలో నగదు ఇబ్బందుల కారణంగా ప్రధాన ఆయిల్ కంపెనీలైన ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేపట్టారు. పెట్రోల్ బంకులో డిజిటల్ చెల్లింపులపై సేవా పన్ను మినహాయించడంతో వినియోగదారులు దానికి అలవాటుపడ్డారు. తాజాగా చమురు సంస్థలు నగదు రహిత లావాదేవీలపై రాయితీ 0.25 శాతానికి కుదించి వేసింది. ఈ నిర్ణయం ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది. లీటర్ పెట్రోల్పై 20 పైసలు జమ.. పెట్రోల్ బంకుల్లో డిజిటల్ చెల్లింపు ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేస్తే లీటర్పై బ్యాంక్ ఖాతాలో జమయ్యేది అక్షరాల ఇరవై పైసలే. గ్రేట ర్ పరిధిలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 81.75 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్పై లభించే రాయితీ అక్షరాలా ఇరవై పైసలు. డీజిల్ ధర రూ.74.55 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్పై 18 పైసలు డిస్కౌంట్గా లభిస్తోంది. మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రో ల్, 30 నుంచి 40 లక్షల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. నగరంలో 55 లక్షల వివిధ రకాల వాహనాలకు తోడు ఇతర ప్రాంతాల నుం చి హైదరాబాద్కు రాకపోకలు సాగించే సుమా రు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్ను వినియోగిస్తుంటాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై రాయితీ తగ్గించినా స్వైపింగ్ ద్వారా కొనుగోలు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు. -
నకిలీ కరెన్సీ ఎక్కువగా దొరికింది అక్కడే..!
న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలించడానికి, అవినీతిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున్న నకిలీ కరెన్సీని పట్టుకున్నాయి. అయితే అత్యధిక నకిలీ కరెన్సీని గుజరాత్లోనే సీజ్ చేసినట్టు కేంద్రం నేడు లోక్సభకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.13.87 కోట్లకు పైగా నకిలీ కరెన్సీని సీజ్ చేస్తే, వాటిలో ఎక్కువగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం అహిర్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్లతో పాటు, రాష్ట్రాల్లో మొత్తం రూ.13.87 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను(ఎఫ్ఐసీఎన్) సీజ్ చేశామని చెప్పారు. దీనిలో అత్యధికంగా గుజరాత్లో రూ.5.94 కోట్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. గుజరాత్ అనంతరం ఉత్తరప్రదేశ్లో రూ.2.19 కోట్లను, పశ్చిమ బెంగాల్లో రూ.2 కోట్లను, మిజోరాంలో కోటి రూపాయలను సీజ్ చేసినట్టు చెప్పారు. నకిలీ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అనుమానం ఉన్న వారిపై కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్, సెక్యురిటీ ఏజెన్సీలు నిఘా ఉంచాయని, వారిపై చర్యలు కూడా తీసుకున్నాయని మంత్రి తెలిపారు. నకిలీ కరెన్సీని సృష్టించడం, స్మగ్లింగ్ చేయడం, చలామణిలోకి తీసుకురావడం చట్టవిరుద్ధ చర్యలు (నివారణ) చట్టం, 1967 కింద ఉగ్రవాద కార్యకలాపాల కిందకు వస్తాయి. -
కృష్ణా జిల్లాలో క్షుద్రపూజల కలకలం
-
బ్యాంకుల్లో గలగల
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత జనం భారీగా నగదు ఉపసంహరించుకోవడంతో డీలాపడ్డ బ్యాంకులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. డిపాజిట్లతో కళకళలాడుతున్నాయి. వరసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్న బ్యాంకులు గడచిన రెండు క్వార్టర్లలో (త్రైమాసికం) భారీగా డిపాజిట్లను ఆకర్షించాయి. గత ఏడాది చివరి త్రైమాసికం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కలిపి రూ.36 వేల కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది మొదటి క్వార్టర్ అంటే జూన్ 30 నాటికి కొత్తగా రూ.19 వేల కోట్ల డిపాజిట్లు వచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్ఎల్బీసీ) ఓ నివేదికలో పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి తెలంగాణలో మొత్తం 5,395 బ్యాంకు శాఖల వద్ద రూ.4.12 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దుకు రెండేళ్ల ముందు, నోట్ల రద్దు తర్వాత రెండేళ్లలో డిపాజిట్ల వృద్ధి రేటులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్తోపాటు జిల్లాల్లో రియల్ బూమ్ బాగా పుంజుకోవడంతో గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఐదు మాసాల్లో డిపాజిట్లు పెరిగాయి. మొత్తమ్మీద డిపాజిట్లలో 4.36 శాతం పెరుగుదలతో బ్యాంకులకు ఊరట లభించింది. ఆ 15 నెలలు గడ్డు పరిస్థితులు 2016 నవంబర్ 8న కేంద్రం నోట్లు రద్దు చేసింది. దీంతో 2016–17 రెండో అర్ధ సంవత్సరం, 2017–18 మొదటి మూడు క్వార్టర్లలో బ్యాంకులు 15 నెలలపాటు తీవ్ర నగదు కొరత ఎదుర్కొన్నాయి. దీనికితోడు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లకు సంబంధించిన సొమ్ముపై పన్ను చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ లక్షల మందికి నోటీసులు ఇవ్వడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. ఒక దశలో బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ చేయడానికి కూడా ఖాతాదారులు ధైర్యం చేయలేదు. దీంతో ఆ 15 మాసాలు బ్యాంకింగ్ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. ఖాతాదారులకు నగదు ఇవ్వలేక బ్యాం కులు చేతులెత్తేశాయి. చివరకు ఏటీఎంలను కూడా మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రిజర్వు బ్యాంకు పెద్ద ఎత్తున నగదును బ్యాంకులకు తరలించడం, ఖాతాదారులు కోరినంత నగదు ఇవ్వడంతో గడచిన ఆర్థిక సంవత్సరం నవంబర్ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఊపు తెచ్చిన రియల్ బూమ్ నగరంలో ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, జిల్లాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు పుంజుకోవడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు తర్వాత ఐటీ నోటీసుల కారణంగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచడం శ్రేయస్కరం కాదని భావించి ఇళ్ల స్థలాలు, భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం లభించింది. రియల్ బూమ్ కారణంగా పెద్దఎత్తున వచ్చి పడుతున్న డబ్బు మళ్లీ ఖాతాదారుల ద్వారా బ్యాంకులకు చేరడం మొదలైంది. గడచిన ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 దాకా డిపాజిట్ల రూపంలో రూ.13,500 కోట్లు, సేవింగ్, కరెంట్ ఖాతాల్లో రూ.43 వేల కోట్లు జమయ్యాయి. రద్దుకు ముందు.. తర్వాత.. నోట్ల రద్దుకు ముందు అంటే 2016 అక్టోబర్ 31 నాటికి తెలంగాణలో బ్యాంకుల వద్ద రూ.4.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉండగా.. నోట్ల రద్దు తర్వాత (2017 మార్చి 31 నాటికి) అవి రూ.3.95 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. ఆ డిపాజిట్ల మొత్తం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయి. 2014లో 16.05 శాతం పెరుగుదలతో 2.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది అంటే 2015లో 14.80 శాతం వృద్ధితో రూ.3.28 లక్షల కోట్లకు పెరిగాయి. నోట్ల రద్దుతోపాటు ఐటీ నోటీసుల కారణంగా 2016లో కేవలం 8.88 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత ఏడాది అతి స్వల్పంగా డిపాజిట్లలో 4.36 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. అది కూడా గడచిన ఏడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి 31 మధ్య పెరిగిన డిపాజిట్లే కావడం గమనార్హం. రుణాలపై ప్రభావం.. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన నగదు సంక్షోభంతో రాష్ట్రంలోని బ్యాంకులు గడచిన ఆర్థిక సంవత్సరంలో రుణాలను లక్ష్యం మేర ఇవ్వలేక పోయాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో వివిధ రంగాలకు ఇచ్చిన రుణాలు తక్కువే. 2016–17లో రూ.3.77 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగా 2017–2018లో రూ.3.92 లక్షల కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణాల వితరణలో వృద్ధి 4.03 శాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం బ్యాంకులకు ప్రజల నుంచి నగదు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 22.32 శాతం మేర పెంచి రూ.4.80 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.87,678 కోట్లు అధికం కావడం విశేషం. -
కొత్త నోట్ల తరలింపు ఖర్చు రూ.29.41 కోట్లు
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.2000ల నోట్లను తరలించటానికి ఏకంగా రూ. 29 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు రవాణా చేయటానికి వీలుగా సైనిక విమానాలను ఉపయోగించటం వల్ల ఈ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అత్యధిక భాగం సరఫరాలో ఉన్న డబ్బు చెల్లుబాటులో లేకుండా పోయింది. ఆర్బీఐ వీటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిని దేశం మొత్తం సరఫరా చేయటానికి సీ-17, సీ-130 సూపర్ హెర్క్యులీస్ వంటి సైనిక విమానాలను ఉపయోగించింది. దీంతో ఆ విమానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త 500, 2000 రూపాయల నోట్లు ముద్రించటానికి 2016-17 సంవత్సరానికి గానూ దాదాపు రూ. 7,965 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం మిగిలిన చిల్లర మొత్తాలను ముద్రించటానికి రూ. 3,421కోట్లు ఖర్చు చేసింది. ఉపసంహరణకు గురైన పాత నోట్లు 99శాతం బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల రవాణా కోసం సైనిక విమానాలను కాకుండా మామూలు విమానాలను ఉపయోగించి ఉంటే బాగుండేదని రిటైర్డ్ ఆర్మీ కమాండర్ లోకేష్ బట్రా అభిప్రాయపడ్డారు. -
రూపాయి పతనం ‘ఏల్నాటి శని’
పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని నిలవరించడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురించింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చేశారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్లమెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది. ‘‘ఆర్థిక మంత్రుల ఆదుర్దా అంతా ఎప్పటి కప్పుడు రాబడి పేరిట కొత్త మార్గాల అన్వేషణగా ఉండకూడదు. వారి ఆబ అంతా ఉత్పత్తినీ, ప్రజల క్షేమ సౌభాగ్యాలు పెంచే నూతన పద్ధతులను అనుసరించడంలో మాత్రమే ఉండాలి. ప్రజా సంక్షేమం భద్రంగా ఉండి, వారికి భరోసా ఏర్పడిననాడు ప్రభుత్వాలకు రాబడి కొరతే ఉండదు.’’ – 1871లో రాసిన ‘ఊడ్చుకుపోతున్న దేశ సంపద (డ్రెయిన్ థియరీ) అనే సుప్రసిద్ధ ఆర్థికపత్రంలో జాతీయవాది, ఆర్థికవేత్త దాదాభాయ్ నౌరోజీ ఉవాచ ‘‘అమెరికా తన డాలర్ని కాపాడుకునే క్రమంలో వర్థమాన దేశాల మార్కెట్ కరెన్సీలను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిలో మన రూపాయి విలువ దిగజారకుండా కాపాడడం భారత రిజర్వ్ బ్యాంక్ బాధ్యత.’’ – 2018 జూన్ 28న పలువురు భారత ఆర్థికవేత్తలు కాంగ్రెస్ ఏడు దశాబ్దాల పాలనలో ప్రారంభమై నేడు బీజేపీ పాలనలో(వాజ్పేయి–నరేంద్రమోదీ) కొనసాగుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిపాలనా విలువలు, ప్రకటిత రిపబ్లిక్ రాజ్యాంగ విలువలు వేగంగా పతనమౌతున్నాయి. ఈ దశలో అదే దామా షాలో దేశీయ రూపాయి విలువ, మారకం విలువ పదే పదే పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో వాజ్పేయి హయాంలోలాగే నేటి మోదీ పాలనలో కూడా బీజేపీ వాలిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోందని కితాబులిచ్చు కుంటోంది. మార్కెట్లో సామాన్య ప్రజలు కొను గోలు చేసే సరకుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతు న్నాయి. మధ్యతరగతి ఉద్యోగవర్గాలు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తిదారులు విలువ కోల్పోతున్న రూపాయినే ‘పుల్ల వెలుగే పూట బత్తెం’గా భావించి జీవితాలు గడుపుతున్నారు. ఒక వైపున పతన మౌతున్న రూపాయి విలువతో పోల్చితే ఇతర దేశాల కరెన్సీ బరువు పెరుగుతోంది. ముఖ్యంగా వర్థమాన దేశాలను అమెరికా డాలర్ వ్యవస్థ పరాధార స్థితిలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్వత్రా విలువలేని నోట్లు దేశంలో మార్కెట్ను ముమ్మరించే దశ వచ్చింది. మార్కెట్లోకి విలువలేని నోట్లు ముమ్మరించడ మంటే అర్థం– నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, ఆరోగ్య ఖర్చులు తడిసి మోపెడు కావడమే. మళ్లీ వర్ధమాన దేశాలను పీడిస్తున్న అమెరికా! 2007–2008లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న అమెరికన్ డాలర్, ఇతర దేశాల దోపిడీపై ఆధారపడిన దాని విలువ తర్వాత తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అయితే, ఈ పరిస్థితిని వర్థమాన దేశాలపై రుద్దడానికి ప్రయత్నించింది. దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభం. అమె రికా కొత్తగా తన కరెన్సీ రక్షణ పేరిట వేసిన ఎత్తుగడ ‘వాణిజ్య యుద్ధాలు’. వాణిజ్య యుద్ధాలను మొదట అమెరికా ఎదురుదాడిగా ప్రారంభించింది. ఇప్పటికీ ఈ ట్రేడ్ వార్ను తట్టుకుని నిలబడగలిగిన స్తోమత ఉన్న దేశం చైనా ఒక్కటే! ఇండియాకు అంత శక్తి లేదు. విలువ కోల్పోతున్న రూపాయి మారకంలో మనం విదేశాలకు చేయాల్సిన సరకుల ఎగుమతుల విలువ తరిగి–మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేటు పెరిగిపోతోంది. అంటే ఇరు వైపులా ‘క్షవరం’ అయ్యేది భారతదేశమే అని మరచిపోరాదు. అమెరికాను రేపో మాపో చైనా అధిగమించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి చేరు కుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పరిణామాన్ని నిలువరించడం కోసమే అమెరికా అధ్యక్షుడు కజ్జా కోరు డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధాలు ప్రకటిం చారని మరచిపోరాదు. అమెరికా సరకులపై చైనా సుంకాలు తగ్గించకపోతే, చైనా సరకులపై భారీగా సుంకాలు విధిస్తానన్న బెదిరింపులకు ట్రంప్ దిగారు. ఇంకా చైనా స్థాయికి ఎదగని ఇండియాను, మన పాలకులను అదే స్థాయిలో ఒత్తిడి చేస్తూ, అమెరికా సరకులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ హెచ్చరిస్తు న్నారు. అక్కడికీ సరేనని, మోదీ ప్రభుత్వం మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 25 వస్తువుల పైన సుంకాలు తగ్గిస్తానని ప్రతిపాదించింది. కానీ, నిజానికి ఇప్పటి దాకా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరించలేదు. మన దేశ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సుఖంగా ఉత్పత్తి చేసుకోగల దాదాపు రెండు వేలకు పై చిలుకు వస్తువులను అమె రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్న ఓ సత్యాన్ని మరచిపోకూడదు. పైగా, అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఆ సరకులపై సుంకాలను లోగడనే తగ్గించ డమో, రద్దుచేయడమో జరిగిందన్న సత్యాన్ని కూడా మర్చిపోరాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అమెరికా నుంచి చేసుకునే పాతిక దిగుమతులపై ‘రాయితీ’ ఇస్తానని ప్రకటించుకోవడం మన కరెన్సీ విలువను శాసిస్తున్న డాలర్కు లొంగిపోవడమే. సవాలు స్వీకరించిన చైనా ఎదురుదాడి! అమెరికా మార్కెట్ను ఇన్నాళ్లుగా చైనా ఎగుమతులే శాసిస్తున్నాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం సవాలును చైనా స్వీకరించింది. తానూ కయ్యానికి సిద్ధమని ఎదురు సవాలు విసిరింది. అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచేసింది. అమెరికా మార్కెట్ను ముంచెత్తే చైనాను అమెరికా మార్కెట్ నుంచి సాగ నంపడం సాధ్యపడని విషయం కాబట్టే ట్రంప్ ఒక మేరకు దిగిరాక తప్పలేదు. ఇక ఇండియా విషయా నికి వస్తే–మనం పలు రకాల అమెరికా దిగుమతు లపై ఆధారపడి ఉన్నాం. మొత్తం ఆర్థికవ్యవస్థను బహుళజాతి కంపెనీ పెట్టుబడుల పట్టు నుంచి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ దశ నుంచి తప్పిం చగలిగితేనే అమెరికా ఒత్తిళ్లను తట్టుకోగలం. పాలకులు ప్రజలకు చూపే సగటు జాతీయో త్పత్తుల విలువకు, చూపెడుతున్న ఆర్థికాభివృద్ధి వాస్తవ లెక్కలకు చాలా తేడా ఉంటోందని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ వెల్లడించారు. అలాగే వర్తమాన ఆర్థిక సంవత్సరాల్లో పాలకులు చూపే ఆర్థిక లోటు అంచనాలకు, వాస్తవంలో అంచ నాకు అందే లోటుకూ తేడా ఉందని తెలిపారు. ఎందుకంటే, జాతీయోత్పత్తుల విలువ 2017–18 తొలి మూడు మాసాలలో అంతకు ముందు ఏడా దిలో లోటు బడ్జెట్లో 0.6 శాతం నమోదు కాగా, ఆ లోటు చివరి మూడు మాసాల్లో 1.9 శాతానికి పెరిగి, 2019లో 2.5 శాతానికి పెరగనుంది. ఈ లెక్కన రూపాయి విలువను దిగజార్చి పెరిగిన డాలర్ 2019 ఆర్థిక సంవత్సరంలో ఇతర ప్రధాన పోటీ కరెన్సీ విలువలకు కనీసం 7.5 శాతం దాకా (ఫిబ్రవరికి) పెరిగిపోవచ్చని అంచనా. చివరికి రూపాయి విలు వలో అనిశ్చిత పరిస్థితి ఫలితంగా, 2018 ఏప్రిల్లో విదేశీ పెట్టుబడులు (పోర్ట్ఫోలియో) రూ. 15,561 కోట్లు అర్థంతరంగా దేశం నుంచి ‘ఉడాయించాయి’ . ఒక్క మే నెలలోనే రూ. 29,714 కోట్లు బయటకుపో యాయి. రూపాయి విలువ కుదేలయ్యాక భారత్ బాండ్స్ మార్కెట్ నుంచి ఈ విదేశీ నిధులు ఆక స్మికంగా తరలిపోయాయి. అంటే ఇండియన్ బాండ్స్ విలువ ఆ మేరకు పతనమైపోయింది. నోట్ల రద్దుతో రిజర్వ్ బ్యాంక్కు మరకలు పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటి సారి రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని నిల వరిం చడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురిం చింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవి డిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. పాలకులు హామీ పడిన జనధన్ అకౌంట్లు ప్రాణం పోసుకోవడం మానేశాయి, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 24 లక్షల కోట్ల మేర భారత సంపన్నుల దొంగ డబ్బును వెతికితెచ్చి, పేద వర్గాలకు కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పంచుతామన్న పాలకుల ప్రగల్భాలూ ‘గుంటపూలు’ పూశాయి. పైగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనానికి 2017లోనే అదనంగా రూ.7 వేల కోట్లు వచ్చి చేరడం బీజేపీ పాలకులకు పెను సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం పరువు మరింతగా బజారున పడిపోయింది. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చే శారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్ల మెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది. ‘‘మన దేశ జాతీయోత్పత్తుల విలు వను లెక్క కట్టడానికేగాక, ఆ విలువకు తగిన ఆర్థిక స్తోమతను కల్పించడంలో, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడుల ఈక్విటీని పెద్ద ఎత్తున సమకూర్చడంలో విదేశీ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ కంపెనీలు సమకూర్చిన విదేశీ నిధులనే విదేశీ మారక ద్రవ్య నిల్వలని చెప్పుకోడానికి ఇండియా వెరవటం లేదు,’’ అని ‘థామస్ రాయిటర్స్’ సంస్థ (2018) నివేదిక వెల్లడించింది. ఎందుకీ దుస్థితి? కేంద్ర ప్రభుత్వ పోకడలు, రిజర్వ్ బ్యాంక్ విధానాలు మనల్ని ‘ఏల్నాటి శని’గా పీడిస్తున్నాయి. అందుకు దీటైన సమాధానం కోసం వెతకాలి. అర్థం లేని సాకులను పక్కనపెట్టి గాలి కబుర్లతో తిరుగుతున్న మనమూ, పాలకులూ భారత రాజ్యాంగ నిర్దేశాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి: ‘దేశ పౌరులకు తగినంత జీవన భృతిని పొందే హక్కు కల్పించేందుకు వీలుగా అనువైన సాంఘిక వ్యవస్థను నెలకొల్పి రక్షించాలి. తద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాలి. అలాంటి వ్యవస్థ జాతీయ జీవనంలోని అన్ని వ్యవస్థలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలా వ్యవ హరించాలి’. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘ఆ ఒక్క కారణంతో ఆమెను విమర్శించడం తగదు’
సాక్షి, ముంబై : ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై మిత్రపక్షం శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. 1975లో విధించిన ఎమర్జెన్సీని సాకుగా చూపించి.. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవను మర్చిపోవడం తగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీని బీజేపీ నేతలు మరోసారి చర్చనీయాంశంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శిస్తూ తమ పార్టీ పత్రిక ‘ సామ్నా’ లో ఆదివారం వీకెండ్ కాలమ్ ఘాటుగా రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ఇందిరాకు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం ఎంటో తెలుస్తుందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువచేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఇందిరపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు. ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మంది సామాన్యులు ఉపాధి కోల్పోయారని విమర్శించారు. చిన్న చిన్న వ్యాపారులు నష్టపోయారని తెలిపారు. బ్లాక్ మనీ బయటకు వస్తుందని ప్రధాని చెప్పారు..కానీ నల్ల కుబేరుల మనీ వైట్ మనీగా మరిందని ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం క్యూలో నిలబడి ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాకు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు... కానీ నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలులు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 50 సీట్లను కూడా గెలువని అస్థిపంజరం లాంటి కాంగ్రెస్కు బీజేపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మానసిక స్థితికి బాగాలేదని అందకు ఆయన మాటలే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడాలి అంతే కానీ 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని శివసేన పేర్కొంది. -
మెట్రో సిబ్బంది సమ్మె బాట
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు చెందిన 9000 మంది ఉద్యోగులు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకుంటే ఈనెల 30 నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం డీఎంఆర్సీకి చెందిన స్టాఫ్ కౌన్సిల్లో ఓ వర్గం ఈనెల 19 నుంచి యమునా నదీ తీరంలో, శారదా మెట్రో స్టేషన్ల వద్ద ప్రదర్శనలు చేపడుతున్నాయి. జూన్ 29లోగా తమ డిమాండ్లను నెరవేర్చనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. తమ డిమాండ్లను ఇప్పటికే ఢిల్లీ మెట్రో అధికారులకు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొంది. డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్ను డీఎంఆర్సీ ఉద్యోగుల సంఘంగా మార్చాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని, మూడవ వేతన సవరణ స్కేల్కు అనుగుణంగా తమకు ఐడీఏ వర్తింప చేయాలన్నవి ఇతర డిమాండ్లని కౌన్సిల్ సెక్రటరీ రవి భరద్వాజ్ చెప్పారు. నిరసనలో భాగంగా తొలిరోజు మెట్రో డ్రైవర్ల నుంచి స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది నల్ల రిబ్బన్లతో విధులకు హాజరవుతారని తెలిపారు. తదుపరి దశలో నిరాహార దీక్షలు చేపడతామని, ఎలాంటి ఆహారం తీసుకోకుండా విధులకు హాజరై ఫ్లాట్ఫాంలపై ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. కాగా, మెట్రో సిబ్బంది సమ్మెతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. -
1974 నాటికి నేటికి తేడా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) విధించడం కాంగ్రెస్ చేసిన పాపమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడమే కాకుండా అది రాజ్యాంగాన్ని కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని కూడా ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. ఇందులో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది? నాడు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన 1974 పరిస్థితులు నేడున్నాయా? తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం నాటి ఎమర్జెన్సీ గురించి ప్రస్థావించడం లేదని, నాటి పరిస్థితులు గురించి తెలుసుకొని భవిష్యత్తులో మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత నేటి, భవిష్యత్ తరాలపై ఉందని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకు ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఏమిటీ? నేటి పరిస్థితులకు నాటి పరిస్థితులకు పోలికలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు నేడు అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉందా? దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేటి లేదా భవిష్యత్ తరాలకు వస్తుందా? 1973లో పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పాలనపై ప్రజలు విసిగెత్తారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ముందుగా గుజరాత్లో, ఆ తర్వాత బీహార్లో తిరుగుబాటు తలెత్తింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలంటూ, ప్రభుత్వాలను రద్దు చేయాలంటూ పట్టణ మధ్య తరగతికి చెందిన యువకులు తిరుగుబాటు లేవనెత్తారు. ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల వారు, ఉన్నత వర్గాల వారు, వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్ తిరుగుబాటుకు మద్దతు తెలిపారు. ఇందిర ప్రభుత్వం దళితులు, ఎస్సీలు, ఎస్టీలను రాజకీయ రంగంలోకి తీసుకరావడం, వారి సంక్షేమం కోసం ఉచిత, ఆకర్షణీయ పథకాలను అమలు చేయడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. అప్పటికే పాలనా వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతిని ఆయుధంగా చేసుకొని ఆ వర్గాల వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. 1974లో జరిగిన రైల్వే సమ్మెను అణచివేయడం ఉద్యమాలకు మరింత ఊపునిచ్చింది. దళితులు, బడుగువర్గాల సంక్షేమం పేరిట సీపీఐతో సత్ససంబంధాలు పెట్టుకున్న ఇందిరాగాంధీ వామపక్ష భావాలు కలిగిన వీఆర్ కృష్ణ అయ్యర్ను 1973లో సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారు. ముగ్గురు జడ్జీల సీనియారిటీ కాదని ఆయన్ని సుప్రీం కోర్టు జడ్జీగా నియమించడం వివాదాస్పదమైంది(పేదలు, బడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలన్న ఉద్దోశంతో ఎన్నో న్యాయ సంస్కరణలను తీసుకొచ్చిన కృష్ణ అయ్యర్ కేరళ వామపక్షాల ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు లా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు). 1975లో పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ తీర్పును ఇందిర సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఆమె నియమించిన జడ్జీ వీఆర్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ తీర్పుపై షరతులతో కూడిన స్టేను మంజూరు చేశారు. బేషరతుగా స్టేను ఇవ్వనందుకు అప్పట్లో ఆయన్ని ప్రశంసించిన ప్రజలు కూడా ఉన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిరను ప్రధాని పదవికి రాజీనామా చేయలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఆ మరుసటి రోజే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే వీఆర్ కృష్ణ అయ్యర్ తీర్పును వ్యతిరేకిస్తూ నలుగురు సుప్రీం జడ్జీలు తమ పదవులకు రాజీనామా చేశారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ దేశంలో ఆర్థిక ప్రగతి మందగించడం, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, గుజరాత్, బీహార్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై అంతులేని అవినీతి ఆరోపణలు రావడం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. పార్టీలో ఇందిర ఏకఛత్రాదిపత్యం చెలాయించడం పార్టీ సీనియర్ నాయకులకు, రాష్ట్రాల నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. తోటి నాయకుల అభిప్రాలను కాదని ఆమె ఆనాడు వివి గిరిని రాష్ట్రపతిని చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను ముందే దెబ్బతీసిన ఇందిర ఎమర్జెన్సీ పేరిట ఇటు న్యాయవ్యవస్థ, అటు పత్రికా స్వేచ్ఛను హరించి వేశారు. మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఉండే కార్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలనుకున్న ఇందిర పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ ‘1971’లో మారుతి సంస్థను తీసుకొచ్చి అందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలపై ఒత్తిడి తెచ్చారు. అది కూడా పారిశ్రామిక వేత్తల ఆగ్రహానికి కారణమైంది(సంజయ్ సూచన మేరకు ‘పీపుల్స్ కార్’ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇందిర కేబినెట్ ఆమోదించింది. సూర్యరామ్ మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్గా ఏర్పడిన ఆ సంస్థకు సంజయ్ తొలి డైరెక్టర్గా వ్యవహరించారు). దేశ పురోభివృద్ధికి పెరుగుతున్న అధిక జనాభే కారణమన్న ఉద్దేశంతో కుటుంబ నియంత్రణను దౌర్జన్యంగా సంజయ్ గాంధీ అమలు చేయించడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మానవ హక్కులు కూడా పూర్తిగా హరించుకు పోవడంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసంఘ్, సీపీఎం, నక్సలైట్లు, జయప్రకాష్ నారాయణ్ తదితరులు ఉద్యమాలు నిర్మించారు. జయప్రకాష్ నారాయణ్ 1974లోనే బీహార్, గుజరాత్ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నాటి పరిస్థితులు నేడున్నాయా? నాటి లాగే నేడు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ఏడు శాతాన్ని దాటలేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అందులో మూడో వంతు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. నాటి ఇందిర ‘గరీబీ హఠావో’ నినాదం లాగానే నేడు మోదీ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అబాసు పాలయింది. నాటి అవినీతి మరకలు నేడు లేకున్నా ‘పెద్ద నోట్ల రద్దు’తో బీజేపీ నేతలు లాభ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ ప్రాభవానికి వన్నె తగ్గినట్లే నేడు బీజేపీ ప్రాభవం పడిపోతోంది. నాడు కాంగ్రెస్పై మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు తిరుగుబాటు చేయగా, నేడు బీజేపీకి వ్యతిరేకంగా దిగువ తరగతి, దళితులు, నిమ్న వర్గాల ప్రజలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఆనాటి స్థాయిలో ఆందోళనలు, అరెస్ట్లు నేడు కనిపించకపోయినా అశాంతి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గోరక్షణ పేరిట, హిందూత్వం పేరిట దాడులు జరుగుతున్నాయి. కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కొలీజియం చేసిన సిఫార్సులను రెండు సార్లు ప్రధాని కార్యాలయం తిరస్కరించడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను ప్రశ్నిస్తోంది. మీడియాపై కూడా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందిరకు మోదీకి తేడా ఏమిటీ? నాడు ఇందిరా గాంధీ ఏకఛత్రాధిపత్యంగానే దేశాన్ని పాలించారు. దాదాపు అదే స్థాయిలో నేడు నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఎలాంటి కఠోర నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనకాడని మనస్తత్వం ఆమెది. ఆచితూచి వ్యవహరించకపోయినా అంతటి కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసం మోదీ చేయలేరు. -
అమిత్ షా.. దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్న నేపథ్యంలో అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులో అనూహ్య డిపాజిట్ల స్కామ్ వెలుగుచూసింది. ఇందులో నిజంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షాకు పాత్ర ఉందా? ఉంటే అది ఏ మేరకు? ఈ కుంభకోణంలో లాభపడింది అమిత్ షా ఒక్కరేనా? ఇతరులేమైనా ఉన్నారా? బీజేపీ పార్టీ పాత్ర కూడా ఏమైనా ఉందా? పెద్ద నోట్లను రద్దు చేసిన ఏడాదిలోనే బీజేపీ నిధులు ఏకంగా 81 శాతం పెరగడానికి ఈ స్కామ్కు ఏమైనా లింకు ఉందా? అసలు ఇది స్కామా? కాదా? దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2016, నవంబర్ 8న ప్రకటించిన అయిదు రోజుల్లోనే అమిత్ షా డైరెక్టర్గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులోకి 746 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చి చేరాయి. ఓ జిల్లా సహకార బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు నమోదవడం ఇదే మొదటిసారి. మరో రకంగా చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు అనంతరం డిపాజిట్ల నమోదులో మొదటి స్థానంలో నిలిచింది అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు. ఆ తర్వాత రెండో స్థానాన్ని 693 కోట్ల రూపాయల డిపాజిట్లతో గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా కోపరేటివ్ బ్యాంక్ ఆక్రమించింది. ఈ బ్యాంక్కు చైర్మన్గా రాష్ట్ర బీజేపీ కేబినెట్ మంత్రి జయేష్ భాయ్ విఠల్ భాయ్ రాడాడియా వ్యవరిస్తున్నారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 జిల్లా సహకార బ్యాంకులు డిపాజిట్లలో ముందున్నాయి. ఎందుకిలా జరిగింది? పెద్ద నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించినందున ఇంత మొత్తాల్లో డిపాజిట్లు వచ్చాయని ఎవరైనా సమర్థించవచ్చు. దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే గుజరాత్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకులో 1.11 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్లు నమోదయ్యాయి. అంత ఎక్కువ డిపాజిట్లకు, ఇంత తక్కువ డిపాజిట్లకు కారణాలేమిటో ఏ విజ్ఞులైన వివరించగలరా? సహకార చట్టం కింద సామాజిక కార్యకర్త మనోరంజన్ ఎస్. రాయ్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఈ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ గురువారం తొలిసారిగా ఈ వార్తను వెలుగులోకి తీసుకురాగా, ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు యథాతథంగా, మరికొన్ని మీడియా సంస్థలు మార్పులు, చేర్పులతో ప్రజల దష్టికి తీసుకొచ్చాయి. ఇందులో పెద్ద కుంభకోణం ఉందంటూ కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అందుకోవడంతో జిల్లా సహకార బ్యాంకుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఓ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోనే అహ్మదాబాద్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు ఉత్తమమైనదిగా గుర్తింపు పొందిందని, అందుకే ఆ బ్యాంకుకు అన్ని డిపాజిట్లు వచ్చాయని పేర్కొంది. ఓ జిల్లా సహకార బ్యాంకులో 746 కోట్లు వస్తే ఎంత చెత్తదైనా రాష్ట్ర సహకార బ్యాంకుకు 1.1 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయా? అంతటి చెత్తయితే ఆ బ్యాంకును రద్దు చేయడం ఉత్తమం కదా! అహ్మదాబాద్ సహకార బ్యాంకులో 98.66 శాతం మంది రెండున్నర లక్షల రూపాయలకు లోపే డిపాజిట్లు చేశారని, వారిలో కూడా ఎక్కువ మంది రైతులే ఉన్నారని కూడా నాబార్డ్ సమర్థించేందుకు ప్రయత్నించింది. ఈ లెక్కన మిగిలిన దాదాపు 1.44 శాతం మంది మాత్రమే రెండున్నర లక్షలకుపైగా డిపాజిట్లు చేశారన్నమాట. వీరిలో ఎవరు, ఎంత డిపాజిట్ చేశారో నాబార్డ్ వివరాలు ఇవ్వలేదు. 98.99 శాతం మంది రెండున్నర లక్షల రూపాయల లోపు డిపాజిట్ చేశారంటే, ఒక్కొక్కరు 2,49,999 రూపాయల చొప్పున డిపాజిట్ చేశారనుకుంటే 395 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మిగిలిన 1.44 శాతం మంది 351 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు అవుతుంది. అంతటి కుభేరులు ఎవరు? వారికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుకు ముందు అంటే 2015–2016 ఆర్థిక సంవత్పరానికి బీజేపీ నిధులు 570.86 కోట్ల రూపాయలు ఉండగా, పెద్ద నోట్ల రద్దు అనంతరం అంటే, 2016–2017 సంవత్సరానికి 1,034.27 కోట్ల రూపాయలు పెరిగింది. ఒక్కసారే 81.18 శాతం పార్టీ నిధుల పెరుగుదలకు ఆర్థిక సూత్రం ఏమిటో ఎవరైనా వివరించగలరా? జిల్లా సహకార బ్యాంకుల్లో ఆరవ రోజు నుంచి పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించమంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకు పెద్ద నోట్లను రద్దు చేసిన ఐదవ రోజున కొత్త ప్రకటన చేసింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో వివరించలేదు. బ్యాంకులు అమలు చేస్తున్న ‘నో యువర్ కస్టమర్’ నిబంధనలను జిల్లా సహకార బ్యాంకులు పాటించడం లేదు కనుక వాటిల్లో నల్లడబ్బు వచ్చి చేరే అవకాశం ఉంది. దీన్ని ముందుగా గ్రహించలేకపోయిన ఆర్బీఐ గుజరాత్ డిపాజిట్లను చూసి కళ్లు తెరిచిందా? బీజేపీ నేతలు, వారి అస్మదీయుల డిపాజిట్లు రాగానే, ఇతర పార్టీల నేతలకు ఆ అవకాశం కల్పించరాదన్న దురాలోచనతో కొత్త నిబంధనను తీసుకొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నట్లు పెద్ద నోట్ల రద్దు దేశంలోనే ‘అతిపెద్ద కుంభకోణం’ కాకపోవచ్చు కానీ ‘దాల్ మే కుచ్ కాలా హై’ అనిపించక తప్పుదు. -
నోట్ల రద్దు.. షాకింగ్ రిపోర్ట్
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దుకు సంబంధించి దిగ్భ్రాంతికి గురిచేసే నివేదిక ఒకటి బయటపడింది. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా ఓ పిటిషన్ దాఖలు చేయగా.. విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చెందిన ఓ బ్యాంకులో రద్దైన నోట్లు భారీగా డిపాజిట్ అయినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి ‘ది వైర్’ పూర్తి కథనం ప్రచురించింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లు ఏ మేర జమ అయ్యాయో తెలపాలంటూ ముంబైకి చెందిన మనోరంజన్.. నాబార్డ్కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన నాబార్డ్ పూర్తి లెక్కలతోసహా వివరాలను అందించింది. ముఖ్యంగా గుజరాత్లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను స్వీకరించినట్లు వెల్లడైంది. అందులో ఒకటి అహ్మదాబాద్ డీసీసీబీ కాగా, రెండోది రాజ్కోట్ డీసీసీబీ. ఐదు రోజుల్లోనే... అహ్మదాబాద్ డీసీబీకి అమిత్ షా 2000 సంవత్సరంలో చైర్మన్గా వ్యవహరించారు. గతకొన్నేళ్లుగా డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు కూడా ఇచ్చారు. అయితే కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే రూ.745. 59 కోట్ల విలువైన నోట్లు ఏడీసీబీలో డిపాజిట్ అయ్యాయి. విషయం ఏంటంటే కొన్నిరోజులకే డీసీసీబీల ద్వారా అనేక మంది నల్లధనాన్ని వైట్గా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో నవంబర్ 14 నుంచి కేంద్రం డీసీసీబీల్లో నోట్ల డిపాజిట్ను నిలిపివేసింది. అయితే అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగిపోగా... ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు కూడా. 2017 మార్చి 31 నాటికి అహ్మదాబాద్ డీసీసీబీలో మొత్తం డిపాజిట్లు రూ. 5050 కోట్లు. ఇది రాష్ట్ర సహకార బ్యాంకు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎంతలా అంటే ఎస్సీబీలో డిపాజిట్లు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. మరోవైపు రాజ్కోట్ డీసీసీబీలో కూడా రూ. 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఈ బ్యాంకు చైర్మన్ అయిన జయేష్ భాయ్ విఠల్భాయ్ రదాదియా.. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా బడాబాబులకే లబ్ధి చేకూరిందన్నది తేటతెల్లమైందని మనోరంజన్ అంటున్నారు. -
ఎకానమీ వేగంగానే ఎదుగుతోంది..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ఎదుగుతోందనడంలో సందేహమేమీ లేదని, గతంకన్నా భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎకానమీ వృద్ధికి సంబంధించి మార్చిలో నమోదైన 7.7 శాతం గణాంకాలే దీనికి నిదర్శనమన్నారు. ‘జీడీపీ వృద్ధి 2 శాతం క్షీణిస్తుందంటూ జోస్యం చెప్పిన వారి అంచనాలు తప్పని రుజువైంది‘ అని వ్యాఖ్యానించారు. డీమోనిటైజేషన్ భారీ తప్పిదమని, దీనివల్ల జీడీపీ వృద్ధిపై రెండు శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అంచనా వేసిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, పనిలో పనిగా మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, యశ్వంత్ సిన్హాల విమర్శలకు కూడా జైట్లీ దీటైన జవాబునిచ్చే ప్రయత్నం చేశారు. వ్యవస్థాగతమైన పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల విధానం, దివాలా చట్టం అమలు మొదలైన వాటితో దేశం రెండు త్రైమాసికాల పాటు సవాళ్లు ఎదుర్కొనాల్సి వచ్చిందని, అయితే ఇప్పుడు పరిస్థితులు గతంకన్నా మెరుగ్గా ఉన్నాయన్నారు. సిన్హా విమర్శలపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘పేదరికంలోనే గడిచిపోతుందేమోనంటూ నా కన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రముఖులు ఒకరు ఆందోళన చెందారు. కానీ అలాంటి భయాలేమీ అక్కర్లేదు. భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతోంది. నాలుగో త్రైమాసికంలో జీడీపీ ఏకంగా 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ తన స్థానాన్ని పటిష్టంగా నిలబెట్టుకుంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం మరికొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగుతుంది‘ అని పేర్కొన్నారు. అందరూ పన్నులు సక్రమంగా కట్టాలి.. వేతనజీవులు తమ వంతు పన్నులను సక్రమంగా చెల్లిస్తుండగా, చాలామటుకు ఇతర వర్గాలు కూడా తమ చెల్లింపుల రికార్డును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. అంతా నిజాయితీగా పన్నులు చెల్లిస్తే, ప్రభుత్వం ఆదాయం కోసం చమురు ఉత్పత్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ. 25 మేర తగ్గించవచ్చన్న పి. చిదంబరం సూచనలను జైట్లీ తోసిపుచ్చారు. ఇది ప్రభుత్వాన్ని ’బుట్టలో పడేసే’ ప్రయత్నమంటూ కొట్టిపారేశారు. చిదంబరం తన హయాంలో ఎన్నడూ కూడా అలాంటి చర్యలను కనీసం పరిశీలించను కూడా లేదని ఫేస్బుక్లో ఒక పోస్టులో జైట్లీ పేర్కొన్నారు. మెరుగుపడిన ఉద్యోగావకాశాలు.. నిర్మాణ రంగం రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తుండటం, రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండటం, తయారీ రంగం వృద్ధి, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే పథకాలు మొదలైనవన్నీ కూడా ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పన అవకాశాలు పెరిగేందుకు తోడ్పడ్డాయని జైట్లీ చెప్పారు. పన్నుల వసూళ్ల తీరు ఇదే స్థాయిలో కొనసాగితే భవిష్యత్ మరింత మెరుగ్గా ఉండగలదన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఎయిరిండియాపై అధికారులతో జైట్లీ సమావేశం ఎయిరిండియాలో వాటాల విక్రయ ప్రతిపాదన విఫలం అయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఇతర సీనియర్ మంత్రులు, అధికారులతో జైట్లీ భేటీ అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు, తాత్కాలిక ఆర్థిక మంత్రి పియుష్ గోయల్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు దీనికి హాజరయ్యారు. డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదన విఫలం కావడానికి గల కారణాలను వివరిస్తూ కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇచ్చిన నివేదికపై ఇందులో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నష్టాలు, రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో మెజారిటీ వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించినప్పటికీ ఆఖరు తేదీ మే 31 నాటికి ఒక్క సంస్థ కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే. నేడు గోయల్తో ప్రభుత్వ బ్యాంక్ల చీఫ్లు భేటీ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకుల చీఫ్లు మంగళవారం ఆర్థికమంత్రి పియూష్ గోయెల్తో సమావేశం కానున్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, మూలధన అవసరాలు, ఆర్థికమోసాల వంటి అంశాలుసహా బ్యాంకింగ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై సమావేశం దృష్టి సారించనుంది. పీఎన్బీ, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యుకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రాబ్యాంక్, కెనరాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయాబ్యాంక్ల చీఫ్స్ ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. 2017–18 వార్షిక ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖ జరుపుతున్న మొదటి సమావేశం ఉంది. -
లెక్క తప్పితే జైలుకే...200 శాతం పెనాల్టీ
-
బాబు డబుల్ గేమ్ : నాడు అలా.. నేడు ఇలా..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి మరోమారు బయటపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడిన చంద్రబాబు.. సోమవారం నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు. 2016 నవంబర్ 8న నోట్ల రద్దును ఉద్దేశించి ‘రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయం వల్ల దేశంలో అవినీతి తగ్గతుంది’ అంటూ ట్విటర్లో చంద్రబాబు రాసుకొచ్చారు. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులో పాల్గొన్న ఆయన ‘ప్రధాని నరేంద్ర మోదీ చర్యలతో ప్రభుత్వ పాలన గాడి తప్పింది. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పనులు తక్కువ. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే. వారి పథకాలతో బాగుపడ్డ వాళ్లు ఎవరూ లేరు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్వవస్థను నిర్వీర్యం చేశారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడింది’ అంటూ ఎన్డీయే ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అందితే జుట్టు అంతక పోతే కాళ్లు అన్న సామెత చందంగా... చంద్రబాబు తీరు మళ్లీ బయటపడింది. -
మోదీ నిర్ణయాలను తప్పుపట్టిన ‘పతంజలి’
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీకి ఊహించని బ్రేక్ పడింది. 2009లో వినియోగ ఉత్పత్తుల ఆయుర్వేద కంపెనీని ఏర్పాటు చేసిన నాటి నుంచి అనూహ్య లాభాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీ 2018 సంవత్సరానికి తన లాభాలు రెట్టింపు అవుతాయని ఆశించింది. 2017లో సాధించిన ఉత్పత్తుల టర్నోవర్ 10, 500 కోట్ల రూపాయల వద్దనే ఆగిపోయింది. అంటే, 2018 సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ ఒక్క పైసా కూడా పెరగలేదన్న మాట. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీ పన్నును ప్రవేశ పెట్టడం వల్ల ఎలాంటి పురోగతి సాధించలేకపోయామని పతంజలి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకష్ణ మీడియాకు తెలియజేశారు. 2018 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఇరవై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. వ్యక్తిగత వినియోగం నుంచి గృహావసరాలు, ఆహార పదార్థాల వరకు దాదాపు వెయ్యి ఉత్పత్తులను పతంజలి సంస్థ విక్రయిస్తోంది. త్వరలో దుస్తుల రంగంలో కూడా ప్రవేశించాలనుకుంటోంది. ఈసారి టర్నోవర్ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని కంపెనీ సాకుగా చూపిస్తోందని, వాటి ప్రభావం చాల తక్కువని టెక్నోపాక్ కన్సల్టింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు అంకూర్ బైసన్ తెలిపారు. పతంజలి అతి తక్కువ ఉత్పత్తులతోని మార్కెట్లోకి ప్రవేశించడం, స్వచ్ఛ వనమూలికలతోని చేసినవంటూ వాటికి మంచి ప్రచారం కల్పించడం, యోగా గురువుగా పతంజలికి మంచి పేరు ఉండడం, అప్పటికే మార్కెట్ రంగంలో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తులకు అంతగా ప్రచారాన్ని కల్పించక పోవడం వల్ల పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో దూసుకుపోయాయని, ఆ తర్వాత పతంజలి తమ ఉత్పత్తులను విపరీతంగా పెంచేయడం, వాటిలో జంతు సంబంధిత అవశేషాలు కూడా వాడుతున్నారని తెలియడం, పతంజలికి పోటీగా ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తులకు విస్తత ప్రచారాన్ని కల్పించడం తదితర కారణాల వల్ల పతంజలి ఉత్పత్తుల జోరుకు బ్రేక్ పడిందని ఆయన వివరించారు. కేశాల సంరక్షణకు హిందూలేఖ బ్రాండ్ను 2015లో హిందుస్థాన్ లీవర్ కంపెనీ తీసుకరావడం, కాల్గేట్ కంపెనీ కూడా 2016లో హెర్బల్ టూత్పేస్ట్ను తీసుకరావడం, ఆయుష్ బ్రాండ్ కూడా గతేడాది హెర్బల్ పర్సనల్ కేర్ ఉత్పత్తి తీసుకరావడంతో పతంజలి ఉత్పత్తులకు పోటీ పెరిగిందని బైసన్ తెలిపారు. 2018 సంవత్సరంలో వాస్తవానికి హెర్బల్ ఉత్పత్తుల రెవెన్యూ 13.5 శాతం పెరిగిందని నీల్సన్ ఇండియా కంపెనీ ఓ నివేదికలో వెల్లడించింది. -
బ్యాంకు డిపాజిట్లు తగ్గుతున్నాయ్!
న్యూఢిల్లీ: మోదీ సర్కారు కొలువు తీరాక బ్యాంకింగ్ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిపాజిట్లకు చిక్చొచ్చి పడుతోంది. 2017–18లో బ్యాంకు డిపాజిట్లలో పెద్దగా పెరుగుదల లేకపోవటం దీన్ని కళ్లకు కడుతోంది. ఈ సారి గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం... బ్యాంకుల్లోకి వెళ్లే డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, బీమా, ఇతర మార్గాలవైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ గణాంకాలను గమనిస్తే... బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ల వృద్ధి 2017–18 లో 6.7 శాతమే. 1963 తర్వాత ఇదే తక్కువ వృద్ధి. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకోవటమే కాక... తిరిగి బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గిందని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘డీమోనిటైజేషన్ (2016 నవంబర్) తర్వాత డిపాజిట్లు పెరిగాయి. అందుకే ఆ సంవత్సరం బ్యాంకు డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంది. అయితే, ఈ డిపాజిట్లన్నీ గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇది బ్యాంకు డిపాజిట్ల వృద్ధిపై ప్రభావం చూపించింది’’ అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. డీమోనిటైజేషన్ తర్వాత మార్పు 2016 నవంబర్–డిసెంబర్ నెలల్లో బ్యాంకుల్లోకి రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. చలామణి నుంచి రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమే దీనికి కారణం. దీంతో బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 15.8% వృద్ధితో రూ.108 లక్షల కోట్లకు చేరాయి. ఈ వృద్ధి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.114 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లడం వృద్ధి క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో రూ.21.36 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. 2017 మార్చి నాటికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.17.55 లక్షల కోట్లుగానే ఉంది. ఇక 2016 మార్చికి ఫండ్స్ ఆస్తుల విలువ రూ.12.33 లక్షల కోట్లే. అంటే నాటి నుంచి 2017 మార్చికి 42% పెరిగినట్టు అర్థమవుతోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లోనూ పెరుగుదల అధికంగానే ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ద్వారా మొదటి ప్రీమియం ఆదాయం రూ.1.93 లక్షల కోట్లకు చేరింది. ఇది 2016–17లో రూ.1.75 లక్షల కోట్లు, 2015–16లో రూ.1.38 లక్షల కోట్లుగానే ఉంది. -
రూ.200, 2వేల నోట్లు.. కొత్త సమస్య
సాక్షి, ముంబై: పెద్ద నోట్లు రద్దు తరువాత దేశీయ బ్యాంకులను మరో కొత్త తలనొప్పి వేధిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ వ్యవహారంలోనే ఈ కొత్త చిక్కు. పాడైపోయిన, లేదా చిరిగిపోయిన 200, 2000 రూపాయల నోట్ల మార్పిడి బ్యాంకర్లకు తాజాగా పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి సంబంధించిన ఆర్బీఐ చట్ట నిబంధనలను త్వరితగతిన సవరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా ఆర్బీఐ ‘నోట్ రీఫండ్’ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజ్ కౌంటర్లలో ఇలాంటి (పాడైపోయిన, మాసిన) నోట్లు పేరుకుపోతున్నాయి. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం రూ .5, రూ 10, రూ .50, రూ 100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన 200 రూపాయలు, 2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల( ఏప్రిల్,17న) ప్రకటించారు. సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపి వేసిందని కూడా స్పష్టం చేశారు. కాగా 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000, 200 నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
ఒక్క నెలలోనే.. 35,000కోట్లు
నోట్ల రద్దు పరిణామాలతో బ్యాంకులంటే భయం బ్యాంకుల్లో కుంభకోణాలు,రుణ ఎగవేతలు, ఐటీ నిబంధనలూ కారణమే! ఖాతాల్లో డిపాజిట్లు కొనసాగించేందుకు జంకుతున్న జనం ఆ సొమ్మంతా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకే.. భారీగా ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ల శాఖకు ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.513 కోట్ల ఆదాయం ఈ లావాదేవీల రిజిస్ట్రేషన్ విలువ రూ.8,500 కోట్లు..మార్కెట్ ధరల ప్రకారం చూస్తే రూ.30–35 వేల కోట్ల పైమాటే! సాక్షి, హైదరాబాద్: ‘బ్యాంకుల్లో డబ్బుంటే జేబులో ఉన్నట్టే.. నాలుగు రాళ్లు వెనకేసుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరానికి పనికొస్తుంది..’..ఇది పాత మాట. ‘బ్యాంకుల్లో డబ్బులు పెట్టి కష్టాలు తెచ్చుకునేకన్నా.. ఆ డబ్బుతో ఎక్కడైనా ఓ ఇల్లు లేదా కొంత స్థలమో కొనుక్కుందాం.. డబ్బులకూ భద్రత.. ధర పెరిగితే మరింత డబ్బూ వస్తుంది..’..ఇది ఇప్పటిమాట. .. కొద్దినెలలుగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు జమ చేయడం బాగా తగ్గించేశారు. వీలైతే ఉన్న డిపాజిట్లనూ వెనక్కి తీసేసుకుంటున్నారు. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులవైపు మళ్లిస్తున్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలు, బ్యాంకుల్లో కుంభకోణాలు, ఆదాయ పన్ను శాఖ నిబంధనలు, రియల్ ఎస్టేట్లో పెడితే సొమ్ము వేగంగా పెరుగుతుందన్న ఆశలు వంటివన్నీ దీనికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయం ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతోంది. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఏప్రిల్ ఒక్క నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్లకు పైగా స్థిరాస్తిలావాదేవీలు జరిగాయి. బహిరంగ మార్కెట్ ధరల లెక్కన చూస్తే ఈ లావాదేవీల విలువ ఏకంగా రూ. 35 వేల కోట్లకుపైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క నెలలో రూ.513 కోట్ల ఆదాయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అ«ధికారిక గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా రూ.513 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీకి సంబంధించి మార్కెట్ ధరలో 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మార్టిగేజ్లు, గిఫ్ట్డీడ్లు, లీజు ఒప్పందాలకు కొంచెం తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఇవి మొత్తం లావాదేవీల్లో 10 శాతానికి మించవు. అంటే ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన రూ.513 కోట్ల ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే... ఆయా రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ.8,500 కోట్లు. ఇది కేవలం రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే. సాధారణంగా> చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువతో పోలిస్తే.. మార్కెట్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన ఏప్రిల్ నెలలో స్థిరాస్తి లావాదేవీల విలువ కనీసం రూ.30 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్ల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులన్నీ ఖాళీ! కొద్ది నెలలుగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోయాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. అంటే బ్యాంకుల్లోకి డిపాజిట్లుగా వెళ్లే సొమ్మంతా రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతోందని స్పష్టమవుతోందని.. స్థిరాస్తి లావాదేవీల లెక్కలే దీనికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో 1,26,655 స్థిరాస్తి లావాదేవీలు జరిగాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లావాదేవీల్లో మొత్తంగా నగదు మాత్రమే చేతులు మారే అవకాశం లేదు. బ్యాంకుల్లో ఉన్న సొమ్మును బదలాయించడం ద్వారానే లావాదేవీల చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే స్థిరాస్తిని విక్రయించినవారు ఇలా తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్మును.. బ్యాంకుల్లో నిల్వ ఉంచడం లేదు. వాటిని విత్డ్రా చేయడం ద్వారాగానీ, ఇతర విక్రేతకు బదలాయించడం ద్వారాగానీ వెంటనే మరో స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ శాతం ఓపెన్ ప్లాట్లకే మొగ్గు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంచనా ప్రకారం.. స్థిరాస్తి లావాదేవీలు చేస్తున్నవారిలో 75 శాతం మంది ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారు. అంటే మొత్తం రూ. 30–35 వేల కోట్ల వ్యాపారంలో దాదాపు రూ. 25 వేల కోట్ల సొమ్ము ఈ లావాదేవీల ద్వారానే చేతులు మారుతోంది. మరో 15 శాతం మంది అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, డూప్లెక్స్లు కొనుగోలు చేస్తుండగా.. ఇంకో 10 శాతం మంది ఇళ్లు, వాణిజ్య సముదాయాల కొనుగోళ్లకు డబ్బు వెచ్చిస్తున్నారు. వీటిలో మరో రూ. 5–10 వేల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం కన్నా.. ఏదో ఒక రకంగా రియల్ఎస్టేట్లో పెట్టుబడులు పెడదామనే భావన పెరిగిపోతోంది. బ్యాంకులంటే భయమెందుకు? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. డబ్బును బ్యాంకుల్లో జమ చేసుకుందామనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు, అనంతరం తీవ్రంగా నగదు కొరత ఏర్పడడం, అవసరానికి సొమ్ము తీసుకోలేకపోవడమే దీనికి కారణం. బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేస్తే.. అవసరానికి తీసుకునే వీలు ఉంటుందో లేదోనన్న సందేహంతో చాలా మంది ప్రజలు తమ వద్దే నగదును భద్రపరుచుకుంటూ వస్తున్నారు. అవసరమైతే తప్ప బ్యాంకు లావాదేవీల వైపు మొగ్గు చూపడం లేదు. దీనికితోడు బ్యాంకుల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు, పలువురు పారిశ్రామికవేత్తలు కూడా బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొడుతుండటం వంటివాటితోనూ తమ డబ్బు భద్రతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్ను నిబంధనల కారణంగానూ.. మరోవైపు బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించి డబ్బులు జమ చేయడానికి, అంతకు మించి లావాదేవీలు జరపడానికి జనం వెనుకంజ వేస్తున్నారు. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, లావాదేవీలపై కేంద్రం కన్నేసి ఉంటుందని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని విచారిస్తుందనే ప్రచారం కూడా ప్రజలను బ్యాంకులకు దూరం చేస్తోంది. బ్యాంకుల్లో జమ చేస్తే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ఎక్కడ నోటీసులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
‘స్టేట్మెంట్ 8/11’ .. ఇది మోదీ సినిమా
ప్రస్తుతం ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికల సందర్భంగా రాజుకున్న రాజకీయ వేడితో కర్ణాటక ప్రజలకు ఊపిరి సలపడం లేదు. ఇలాంటి సమయంలో వినోదం కోసం సినిమాకు వెళదామన్నకున్న వారిని.. అక్కడ కూడా ఎన్నికల ఫీవర్ వదిలేలా లేదు. అయితే ప్రచారంలో భాగంగా మోదీని స్వయంగా చూడలేని ఆయన అభిమానులు థియేటర్లో చూసి తరించవచ్చు. అర్థంకాలేదు కదా.. అయితే స్టేట్మెంట్ 8/11 సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడండి. స్టేట్మెంట్ 8/11.. కన్నడ నాట ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్న సమయంలో.. చరిత్రాత్మక నిర్ణయమైన డీమానిటైజేషన్ గురించి తెరకెక్కిన సినిమా విడుదల కానుండటం విశేషం. స్టేట్మెంట్ 8/11 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో అచ్చం ప్రధాని నరేంద్ర మోదీలా ఉన్న ఎంపీ రాజేంద్రన్ అనే వ్యక్తి ఆయన పాత్ర పోషించారు. నవంబర్ 8 అర్ధరాత్రి అన్ని పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన సీన్తో ఈ సినిమా మొదలవుతుందట. అలాగే డీమానిటైజేషన్ వల్ల సమాజంపై ప్రభావం, వివిధ మార్పుల గురించి వచ్చిన మార్పుల గురించి ఈ సినిమాలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా డీమానిటైజేషన్కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా కానీ ఉండదని చెబుతున్నారు నిర్మాత కేహెచ్ వేణు. అప్పి ప్రసాద్ దర్శకత్వంలో స్టేట్మెంట్ 8/11 తెరకెక్కింది. ఎవరీ ఎంపీ రాజేంద్రన్... ప్రధాని మోదీ పేరు చెప్పగానే.. తెల్లటి గడ్డం, కళ్లద్దాలు, లాల్చీ, పైజామా, కోటు గుర్తుకువస్తాయి. కానీ మోదీ టీ షర్ట్ వేసుకుని...బ్యాగ్ తగిలించకుని.. చేతిలో మొబైల్ పట్టుకుని రైల్వే స్టేషన్లో నిల్చొని ఉండటాన్ని మనం ఊహించగలమా.. అయితే గత జులైలో ఇది జరిగింది. కానీ అక్కడ నిల్చుని ఉన్నది మన ప్రధాని మోదీ కాదు. అచ్చం ఆయనలా ఉన్న మరో వ్యక్తి. ఆయన పేరు ఎంపీ రామచంద్రన్. ఓరోజు రైల్వే స్టేషన్లో నిల్చుని ఉన్నపుడు ఆయన ఫొటో తీసిన విద్యార్థి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాపులర్ అయ్యార్. మోదీ ఇన్ పయ్యనూర్ స్టేషన్ అంటూ ఆ విద్యార్థి చేసిన కామెంట్.. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో నటుడిగా కొత్త ప్రయాణానికి నాంది పలికిందంటున్నారు 64 ఏళ్ల రాజేంద్రన్. -
భారీగా పెరిగిన నకిలీ కరెన్సీ, కారణమిదే
న్యూఢిల్లీ : డిమానిటైజేషన్.. నకిలీ కరెన్సీ నిర్మూలనకు 2016లో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న హఠాత్తు నిర్ణయం. దీంతో నకిలీ కరెన్సీ ఆట కట్టించవచ్చంటూ చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితి దీనికి తలకిందులైంది. నోట్ బ్యాన్ భారీ ఎత్తున నకిలీ కరెన్సీకి దారితీసింది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీ ఎత్తున్న నకిలీ కరెన్సీ చేరినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. అంతేకాక అనుమానిత లావాదేవీల్లో 480 శాతం జంప్ అయినట్టు గుర్తించినట్టు పేర్కొన్నాయి. ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు తర్వాతే ఎక్కువగా చోటు చేసుకున్నట్టు రిపోర్టులు తెలిపాయి. ప్రైవేట్, పబ్లిక్, కోఆపరేటివ్ రంగాలు, ఇతర ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లు.. 400 శాతం ఎక్కువ అనుమానిత లావాదేవీల రిపోర్టులను(ఎస్టీఆర్) జనరేట్ చేశాయని రిపోర్టులు వెల్లడించాయి. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం చేపట్టిన అనుమానిత లావాదేవీలను ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పరిశీలిస్తోంది. ఇది నివేదించిన రిపోర్టులో బ్యాంకింగ్, ఇతర ఎకనామిక్ ఛానళ్లలో నకిలీ కరెన్సీ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3.22 లక్షల సందర్భాలలో పెరిగినట్టు తెలిసింది. నకిలీ కరెన్సీ రిపోర్టులు(సీసీఆర్లు) 2015-16లో 4.10 లక్షలకు పైగా ఉంటే, 2016-17లో 7.33 లక్షలకు పైగా పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. సీసీఆర్ అనేవి ‘లావాదేవీ ఆధారిత రిపోర్టులు’.. వీటిని కేవలం నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లు గుర్తించినప్పుడు రికార్డు చేస్తారు. అయితే నకిలీ కరెన్సీ విలువను ఎంత ఉందని మాత్రం రిపోర్టు వెల్లడించలేదు. అనుమానిత లావాదేవీల రిపోర్టులు కూడా 2015-16తో పోలిస్తే నాలుగు సార్లకు పైగా పెరిగి 4,73,006గా నమోదయ్యాయి. డిమానిటైజేషన్తోనే ఈ రిపోర్టుల సంఖ్య మరింత పెరిగినట్టు తాజా రిపోర్టులు తెలిపాయి. ఎప్పడికప్పుడు అన్ని బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లు ఎస్టీఆర్లను రికార్డు చేసి, యాంటీ-మనీ లాండరింగ్ లా కింద వాటిని ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు పంపిస్తుంటారు. -
కరెన్సీ కొరత
దేశాన్ని డిజిటల్ బాట పట్టించి నగదురహిత ఆర్థిక వ్యవస్థను సాకారం చేస్తామని చెప్పిన పాలకుల లక్ష్యం కాస్తా దారి తప్పి ఎటో పోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రహ సనానికి ముందు కళాకాంతులతో చల్లని లోగిళ్లుగా వెలిగిన ఏటీఎంలు ఆ తర్వాత షట్టర్లు దించుకుని... డబ్బు లేదని చెప్పే కాగితాలు, అట్టలు అతికించుకుని దీన వదనాలతో దర్శనమివ్వడం మొదలైంది. కాస్త ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఎప్పటికప్పుడు జనం సహనంతో ఎదురుచూస్తుంటే ఉన్నకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు ఒకే తీరుగా నగదు కొరతతో ఇబ్బం దులెదుర్కొంటున్నాయి. పది పన్నెండు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఖాళీ డబ్బాలుగా మిగిలిపోయాయి. అటు కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకు అక్క డక్కడ కొన్ని సమస్యలు మినహా అంతా బాగానే ఉన్నదని ఇస్తున్న వివరణలు అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. దేశంలోని 2.2 లక్షల కోట్ల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఇంచక్కా పనిచేస్తున్నాయని కేంద్రం నమ్మబలుకుతోంది. ఆ నోటితోనే ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని హామీ ఇస్తోంది. కానీ ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం దేశంలో రూ. 70,000 కోట్ల మేర కొరత ఉంది. ఈ నెల మొదటి నుంచి ఇంతవరకూ ఏటీఎంలలో ఉంచే డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు 30 శాతం మేర తగ్గించేశాయని ఏటీఎం పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. దేశంలో ప్రతి నెలా ఏటీఎంల నుంచి ఖాతాదార్లు సగటున రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్ల వరకూ విత్డ్రా చేసుకుంటారని అంచనా. అంత మొత్తం ఏటీఎంలలో ఉండేలా చూసుకోవడంలో బ్యాంకులెందుకు విఫల మయ్యాయి? నిజానికిది హఠాత్తుగా వచ్చిపడిన సమస్య కాదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదలైన ఈ సమస్య కొద్దో గొప్పో తేడాతో నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మూడు నాలుగు నెలల నుంచి మరింత ఉగ్రరూపం దాల్చింది. మీడి యాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తరచు దీనిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా కేంద్రంగానీ, రిజర్వ్బ్యాంక్ గానీ సకాలంలో మేల్కొనలేదు. కరెన్సీ కొరత తాత్కాలికమేనంటూ వివరణనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చాలినంత కరెన్సీ చలామణిలో ఉన్నదని చెబుతున్నారు. చలామణి అంటే నగదు లావాదేవీలు జరగడం. బ్యాంకులకు డబ్బు వస్తూ పోతూ ఉండటం. ఎక్కడో ఒక చోట అది ఆగిపోయినప్పుడు కొరత మొదలవుతుంది. కరెన్సీ కష్టాలకు ఒక్కొ క్కరు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు. పంటల కొనుగోళ్ల సీజన్ కారణమని ఒక రంటే, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణమని మరికొందరు, మొత్తం డబ్బు బ్యాంకులో పెట్టుకోవడం కన్నా దగ్గరుంచుకుంటే మంచిదని జనం అనుకోవడం వల్లే ఈ స్థితి తలెత్తిందని ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. ఇలా అంటున్నవారంతా సామాన్యులు కాదు. అందులో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్య దర్శి, ఎస్బీఐ చైర్మన్ వగైరాలున్నారు. కానీ పంటల సీజన్, సంక్షేమ పథకాలు వంటివి ఇంతకు ముందూ ఉన్నాయి. ఇప్పుడే అవి కరెన్సీ కొరతకు కారణమెలా అయ్యాయి? కొత్తగా ఖాతాలు తెరిచేవారినుంచి డెబిట్ కార్డుకోసమని రూ. 130 నుంచి రూ. 300 వరకూ వసూలు చేస్తున్న సంగతి బ్యాంకులకు గుర్తుందో లేదో తెలియదు. పైగా ఖాతాలో తగినంత మొత్తంలో డబ్బులేదని తెలియక ఏటీఎం దగ్గరకెళ్లి కార్డు ఉపయోగించిన వారికి దాదాపు రూ. 25 వడ్డిస్తున్నాయి. అలాగే పరిమితికి మించి లావాదేవీలు నడిపినా, అసలు లావాదేవీలే జరపకపోయినా బ్యాంకులు సర్చార్జీల మోత మోగిస్తున్నాయి. వేరే బ్యాంకుల ఏటీఎంల దగ్గర డ్రా చేసుకోవడానికి పరిమి తులు పెట్టి అవి మించితే వడ్డిస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఖాతాదారుల నుంచి ఏటా వేల కోట్లు రాబట్టుకుంటున్న బ్యాంకులు తమ ఏటీఎంలు ఖాళీగా ఉంచినం దుకూ, ఖాతాదార్లకు అవసరం పడిన సమయంలో డబ్బు అందించలేకపోయినం దుకూ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు 40 శాతం ఏటీఎంలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయని గణాం కాలు చెబుతున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం డబ్బు రాల్చనప్పుడు తప్పని సరై మరో బ్యాంకు ఏటీఎంకు ఎవరైనా పరుగెడతారు. అలాంటివారందరిపైనా చార్జీలు విధించడం వ్యాపారమవుతుందా, నిలువుదోపిడీ అవుతుందా? అసలు తాము డబ్బు దాచుకుంటున్న బ్యాంకు సమయానికి మొహం చాటేసిందన్న అభి ప్రాయం ఖాతాదారుల్లో ఒకసారంటూ ఏర్పడితే... బ్యాంకింగ్ వ్యవస్థపై ఒకసారి నమ్మకం కోల్పోతే వాటి పర్యవసానాలెలా ఉంటాయో రిజర్వ్Sబ్యాంకుకు తెలిసే ఉండాలి. అయినా మూడు నాలుగు నెలలుగా ఏర్పడ్డ కరెన్సీ కొరతను అది గుడ్లప్ప గించి చూస్తూ ఉండిపోయింది. బ్యాంకింగ్ రంగం అంటే డబ్బుతో వ్యాపారం చేయడం. ఖాతాదార్లు జమచేసే సొమ్ముతో అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడటం వాటి ప్రధాన వ్యాపకం. అలా అప్పులిచ్చే ముందు తీసుకుంటున్నవారు తీర్చగలరో లేదో చూడాల్సి ఉంటుంది. ఆ స్తోమత ఉన్నదని గుర్తించాక తగినంత మేర స్థిరాస్తులను కుదువ పెట్టుకుని డబ్బు విడుదల చేస్తాయి. కానీ పబ్లిక్ రంగం, ప్రైవేటు రంగం అనే తేడా లేకుండా దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతున్నాయి. బ్యాంకుల ఈ చేతగానితనాన్ని ఆసరా చేసుకుని విజయ్ మాల్యా, నీరవ్మోదీ లాంటివారు వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి విదే శాలకు పరారవుతున్నారు. దానికితోడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్ఆర్ డీఐ బిల్లు చట్టమైతే బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు భద్రత ఉండదన్న భయం సామాన్య పౌరుల్లో ఏర్పడింది. తమపై ఏర్పడ్డ ఈ అవిశ్వాసాన్ని తొలగించేందుకు బ్యాంకులు చేసిందేమీ లేదు. సమస్య ఏర్పడినప్పుడు అందుకు గల కారణాలేమిటో పౌరులకు చెప్పాల్సిన బాధ్యత రిజర్వ్బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకు బదులు అంతా సవ్యంగానే ఉన్నదని దబాయిస్తే నమ్మడానికెవరూ సిద్ధంగా లేరు. -
‘ఆ దెయ్యం వెంటాడుతోంది’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నగదు కొరత నెలకొనడంపై కేంద్రం ప్రభుత్వం, ఆర్బీఐ లక్ష్యంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు దెయ్యం సర్కార్ను వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి తిరిగి వాటిని జమ చేయడం లేదని అన్నారు. రూ 500, 1000 నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం రూ 2000 నోట్లు ముద్రించింది..ఇప్పుడు రూ 2000 నోట్లను కొందరు తమ వద్దే ఉంచుకుంటున్నారని చెబుతోంది. అసలు ఈ నోట్లను ముద్రించిందే అలాంటి వారి కోసమని తాము ముందునుంచే చెబుతున్నామని చిదంబరం వ్యాఖ్యానించారు. నగదు కొరతతో నోట్ల రద్దు దెయ్యం మళ్లీ వెంటాడుతోందని అన్నారు. నోట్ల రద్దు జరిగి 17 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా ఎందుకు సర్ధుబాటు చేయలేదని చిదంబరం వరుస ట్వీట్లలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నోట్ల రద్దు అనంతరం చెలామణీలో ఉన్న నగదు కేవలం 2.75 శాతమే పెరిగిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే దేశ జీడీపీకి అనుగుణంగా నగదు సరఫరాను పెంచేందుకు ఆర్బీఐని ప్రభుత్వం అనుమతించడం లేదని అనుమానించాల్సి ఉంటుందన్నారు. నోట్ల ముద్రణ, సరఫరా సంతృప్తికరంగా ఉందని ఆర్బీఐ చెబుతుండటాన్ని ఆయన ఆక్షేపించారు. ఆర్బీఐ వాదన వాస్తవమైతే మరి నగదు కొరత ఎందుకు ఏర్పడిందన్నారు. -
2వేల నోట్లను నిలిపేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి నగదు కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు లభించకపోవడంతో మరోసారి పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. మళ్లీ నోట్ల కష్టాలు ఎందుకు పునరావృతం అయ్యాయి? రూ. 2వేల నోట్లు బయటకు రాకుండా నిజంగానే నిలిపేశారా? ఇదే విషయమై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దినేశ్ త్రివేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నగదు కొరతకు అసలు కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. రూ. 2వేల నోట్ల చెలామణిని నిలిపేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్థిక రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్న దినేశ్ త్రివేది బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 2వేల నోట్లను నిలిపివేయడంతోనే దేశంలో మళ్లీ నగదు కొరత ఏర్పడినట్టు కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. నగదు కొరత విషయంలో నిజానిజాలపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టజారని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని అన్నారు. గత కొన్ని నెలలుగా తనకు కూడా బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేయడంతో వ్యవస్థలోని వాటి విలువను భర్తీ చేయడానికి కేంద్రం రూ. 2వేలనోట్లు అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్ల కొనసాగింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. -
24 గంటల్లో 80శాతం ఏటీఎంలలోకి క్యాష్!
సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర కిందట చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రభావం మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెద్దలతో సమావేశమైంది. దేశంలో తీవ్ర నగదు కొరత నెలకొని ఉండటం, నగదు లేక ఏటీఎంలు వెలవెలబోతుండటం, బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు దొరకక ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం భేటీ అయింది. దేశంలోని ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు, నగదు ప్రవాహం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. 24 గంటల్లో దేశంలోని 80శాతం ఏటీఎంలు పనిచేస్తాయని, నగదు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా భరోసా ఇచ్చింది. ఆర్బీఐ కూడా నగదు కష్టాలపై స్పందించింది. ఏటీఎంల వద్ద పరిస్థితి మెరుగుపడుతోందని, నగదు కొరత కష్టాలు క్రమంగా తొలగిపోతున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దుతో పడరాని పాట్లు పడ్డాం. మళ్లీ అదే పరిస్థితి దాపురించింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నగదుకు కొరత ఉందని ముందుగా దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ అంగీకరించారు. ఈ సమస్య తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా అన్నారు. ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని బ్యాంకింగ్ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రం రాష్ట్రాల వారీగా కమిటీలను వేయగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్రాష్ట కమిటీని వేసింది. ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణను ఐదింతలు పెంచాక కూడా నోట్ల కొరత ఎందుకుంటుందని ఆర్బీఐ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. నోట్ల కొరత ప్రమాదం ఉందంటూ ఫిబ్రవరి నెలలో వచ్చిన వార్తలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని అర్థం అవుతుంది. తమకు నోట్ల కొరత ఎక్కువగా ఉందంటూ ఫిబ్రవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. డిజిటల్ లావాదేవీలు పెంచడానికే నగదును అడ్డుకుంటున్నారన్నది వారి వాదన. కుట్రపూరితంగా చెలామణి నుంచి రెండు వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయని మధ్యప్రదేశ్లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అయినా ప్రభుత్వం నుంచి, ఆర్బీఐ నుంచి నివారణ చర్యలు లుప్తం. ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చేదిన్’ వస్తాయంటూ తన మానాన తాను చెప్పుకుంటూ పోతుంటే దేశంలో నిత్యం నీరవ్ మోదీ స్కామ్లు, కథువా, ఉన్నావో కేసులు వినిపిస్తున్నాయి. -
‘నోట్ల రద్దు’తో బీజేపీకి కాసులపంట
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ‘తుగ్లక్ పని’ అని దానివల్ల నల్లడబ్బు వెలికి రాకపోగా, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం లేకపోవచ్చుగానీ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం బాగా లాభం చేకూరింది. 2015–16 సంవత్సరానికి బీజేపీ వద్ద 570. 86 కోట్ల రూపాయల ఆదాయం ఉండగా, పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరంలో, అంటే 2016–17 సంవత్సరానికి ఏకంగా ఆ ఆదాయం 1,034.27 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకంగా 81.18 శాతం పెరుగుదల నమోదయింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం అంతకుముందు సంవత్సరం కన్నా 14 శాతం తగ్గింది. మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఒక్క బీజేపీకే 66.4 శాతం ఆదాయం రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 శాతం ఆదాయం వచ్చింది. దేశంలోని రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్ల ఆధారంగా ఢిల్లీలోని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్)’ అనే సంస్థ ఈ డేటాను సేకరించింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోన్న బీజేపీకి ఇతర పార్టీలకన్నా ఎక్కువ నిధులు విరాళంగా రావడం సహజమేగానీ, ఏకంగా 81 శాతం పెరగడం అనూహ్యమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదుకనుక, ఎక్కువ వరకు నల్లడబ్బే బీజేపీకి తరలి వచ్చి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదే 2016–17 సంవత్సరం కోసమే బీజేపీ ఎన్నికల కోసం ఏకంగా 606 కోట్లను ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 149 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టింది. బీజేపీ మొత్తం ఆదాయం 1034 కోట్ల రూపాయల్లో 997.12 కోట్ల రూపాయలు, అంటే 96 శాతం నిధులు విరాళాలు, ఆర్థిక సాయం రూపంలోనే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 116 కోట్ల రూపాయలు కూపన్ల రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన విరాళాల్లో 96 శాతం నిధులు అజ్ఞాత వ్యక్తుల నుంచే వచ్చాయి. వారి పేర్లు, ఊర్ల వివరాలు లేవు. కనీసం పాన్ నెంబర్లు లేవు. ఆదాయం పన్ను మినహాయింపుల కోసం ఎన్నికల కమిషన్కు బీజేపీ ఆదాయం పన్ను రిటర్నులు సమర్పిస్తున్నప్పటికీ డొనేషన్లు ఎవరిచ్చారో మాత్రం 2012 నుంచి ఇంతవరకు బీజేపీ వెల్లడించలేదు. పైగా ఈ పార్టీ విదేశాల నుంచి నల్లడబ్బును తీసుకొస్తానని, నల్ల కుబేరుల పేర్లు వెల్లడిస్తానంటూ అప్పుడప్పుడు తాటాకు చప్పుళ్లు చేస్తూ ఉంటోంది. ఒక్క రాజకీయ పార్టీలకే సమాచార హక్కు పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడమంటే ప్రభుత్వాల నక్కజిత్తులను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపులేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లకుబేరుల నుంచి పార్టీ విరాళాలను తీసుకుంటూ ఎలా వారిని క్షమిస్తూ వచ్చిందో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగానే నల్ల కుభేరులను కాపుకాస్తోంది. పార్టీలకిచ్చే విరాళాల్లో మరింత పారదర్శకత్వాన్ని తీసుకొస్తానంటూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అధికార పార్టీకి మాత్రమే ఎక్కువ విరాళాలకు ఆస్కారమిచ్చే ఈ కొత్త విధానంలో ఎన్ని చిల్లులున్నాయో సాక్షి వెబ్సైట్ ఇదివరకే వెల్లడించింది. -
రూ.2000 నోట్లు అదృశ్యమైపోతున్నాయ్
భోపాల్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చిన రూ.2000 నోట్లు ఇటీవల చలామణిలో తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలలో కూడా ఈ నోట్లు తక్కువగానే వస్తున్నాయి. అయితే రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి అదృశ్యమైపోతున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ కూడా మండిపడ్డారు. దీని వెనుక అతిపెద్ద కుట్రే ఉందని ఆయన ఆరోపించారు. రైతుల సమావేశంలో పాల్గొన్న చౌహాన్, డిమానిటైజేషన్కు ముందు రూ.15,00,000 కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేవని తెలిపారు. డిమానిటైజేషన్ తర్వాత కరెన్సీ సర్క్యూలేషన్ రూ.16,50,000 కోట్లకు పెరిగిందని, కానీ రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి అదృశ్యమైపోతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. రూ.2000 డినామినేషన్ నోట్లను ఎక్కడికి పోతున్నాయ్? వాటిని ఎవరూ సర్క్యూలేషన్ నుంచి బయటికి తీసుకుపోతున్నారు? నగదు కొరతకు బాధ్యులెవరు? ఈ సమస్యలను సృష్టించడానికి ఏదో కుట్ర జరుగుతోంది. దీనిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లనున్నట్టు చౌహాన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఏమైనా వ్యవసాయ సమస్యలుంటే రైతులు తన అధికారిక రెసిడెన్సీలోని కంట్రోల్ రూం నెంబర్ 0755-2540500 కు కాల్ చేయాలని సూచించారు. వ్యవసాయదారుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండవని చౌహాన్ చెప్పారు. -
ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది
-
రియల్ బూమ్.. జూమ్.!
సాక్షి, హైదరాబాద్: రూ. 2.23 లక్షల కోట్లు.. అక్షరాలా రెండు లక్షల ఇరవైమూడు వేల కోట్లు.. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నమోదైన రిజిస్ట్రేషన్ లావాదేవీల విలువ ఇది.. వీటితో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.13,380 కోట్లు. రాష్ట్ర విభజన జరిగితే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అంచనాలను పటాపంచలు చేస్తూ... తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతూనే ఉంది. విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531.05 కోట్లుకాగా.. 2017–18 నాటికి 67% పెరిగిపోయి.. రూ.4,222 కోట్లకు చేరింది. ప్రభుత్వం స్థిరాస్తుల మార్కెట్ విలువను పెంచకపోయినా కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ బూమ్తోపాటు శాఖాపరంగా చేపట్టిన సాంకేతిక సంస్కరణలు, పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల ఇబ్బందుల కారణంగా జనం భూములు, స్థలాల కొనుగోలు వైపు చూడటం వంటివి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణంగా చెబుతున్నారు. తొలి ఏడాదిలో మందకొడిగా.. రాష్ట్ర విభజనకు ముందు రెండేళ్లు, తర్వాతి రెండేళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,589.62 కోట్లుగా నమోదైంది. అయితే విభజన సమయంలో అనిశ్చితి కారణంగా.. విభజన జరిగిన ఏడాది ఆదాయం కొంత తగ్గింది. రాష్ట్ర విభజన జరిగిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాది కన్నా రూ.57 కోట్లు తక్కువ ఆదాయం వచ్చింది. ముఖ్యంగా విభజన జరిగిన 2014 జూన్లో అత్యల్పంగా రూ.180 కోట్లే వచ్చాయి. దాంతో రాష్ట్రం విడిపోతే రియల్ బూమ్ తగ్గిపోతుందన్న అపోహలు, ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల్లనూ వ్యక్తమయ్యాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుని.. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.453 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం సమకూర్చే స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇదే ఆల్టైమ్ రికార్డు కావడం గమనార్హం. 2014–15 మొదలు 2017–18 వరకు ఏటా రిజిస్ట్రేషన్ లావాదేవీలు, ఆదాయం పెరుగుతూనే వచ్చాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014–15తో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం ఏకంగా 67 శాతం పెరిగి రూ.4,222 కోట్లకు చేరింది. సర్వర్లు, నెట్వర్క్ మెరుగుపర్చుకోవడంతోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు.. రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు చేయడంతో ఆదాయంలో గణనీయంగా వృద్ధి కనిపించింది. ఆంధ్రప్రదేశ్తో కలసి ఉన్న నెట్వర్క్ నుంచి విడిపోయి తెలంగాణకు స్వతంత్ర నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, సర్వర్ను అప్గ్రేడ్ చేసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. సర్వర్ అప్గ్రెడేషన్కు ముందు నెలకు నాలుగైదు రోజులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు సంబంధించి సాంకేతిక అవాంతరాలు ఎదురయ్యేవి. సర్వర్ను ఆధునీకరించాక వేగంగా లావాదేవీలు జరగడం, సాంకేతిక సమస్యలు ఎదురవకపోవడంతో.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. దీంతో గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. 2016 డిసెంబర్లో రూ.223 కోట్ల ఆదాయం వస్తే.. 2017 డిసెంబర్లో 79.03 శాతం ఎక్కువగా 400.46 కోట్లు ఆదాయం వచ్చింది. 2017 జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే.. 2018 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వరుసగా 109.60 శాతం, 105.22 శాతం ఆదాయం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దుతో భూముల వైపు..! పెద్ద నోట్ల రద్దు అనంతరం జనం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి భయపడుతున్నారు. ఐటీ అధికారులు వివరణ కోరుతారని.. నోటీసులు, విచారణల వంటి తలనొప్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్యాంకుల్లో కుంభకోణాలు పెరిగిపోవటం కూడ ఆందోళనకరంగా మారింది. దీంతో బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయడానికి బదులుగా.. స్థలాలు, భూముల కొనుగోలుపై దృష్టిసారిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దు తరువాతి నుంచి.. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడం గమనార్హం. ఇక కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా చోట్ల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. దీంతో జిల్లాల్లోనూ రియల్ఎస్టేట్పై పెట్టుబడులు భారీగా పెరిగాయి. -
పరిపాలన చేయడంలో మోదీ ఫెయిల్..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి ప్రధాన మంత్రిగా ఉండి దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అంతేకాక దేశంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. దళితులపై దాడులు పెరుగుతన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం స్విమ్మంగ్ ఫుల్, ఏటీఎంలకు వెళ్తే జీఎస్టీ ఎందుకు కట్టాలని పొన్నం ప్రశ్నించారు. నాలుగు వంతుల మెజారిటీ ఉంది.. అలాంటప్పుడు పార్లమెంట్ను సమర్థవంతంగా నడుపలేక అవిశ్వాసం రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేయడంలో మోదీ ఫెయిల్ అయ్యారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ దీక్ష ఎందుకు.. ఫొటో పోజులకా.. లేక, దేశంలో పరిపాలన సరిగా చేయలేక ఓడిపోయానని ప్రధాన మంత్రి దీక్షలో కూర్చున్నారా అని పొన్నం ఎద్దేవా చేశారు. -
వడ్డీ లేని రుణానికి క్యూ!
డీమోనిన్యూఢిల్లీ: వడ్డీ ఉండదు. అసలు మొత్తాన్నే నెలసరి వాయిదాల్లో చెల్లించొచ్చు. ఇదే... నో కాస్ట్ ఈఎంఐ. ఇపుడు ఎంత ఖరీదైన వస్తువైనా ఈ ‘నో కాస్ట్ ఈఎంఐ’ సదుపాయంతో కొనుగోలు చేసే ధోరణి పెరిగిపోతోంది. దీంతో ఈ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు మొత్తం అమ్మకాల్లో నోకాస్ట్ ఈఎంఐపై వైట్ గూడ్స్ (రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు తదితర ఉత్పత్తులు) విక్రయాలు 25 శాతంగా ఉంటే, ప్రస్తుతం అవి 40 శాతానికి చేరాయి. ఈ మార్కెట్ ఎంత శరవేగంగా వృద్ధి చెందుతుందో చెప్పటానికి ఈ గణాంకాలు చాలు. అందుకే ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హోమ్ క్రెడిట్ ఇండియా, టీవీఎస్ గ్రూపు ఈ మార్కెట్ అవకాశాలను అందుకునేందుకు చొరవ చూపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ మార్కెట్లో లీడర్గా ఉంది. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 25 శాతం ఫైనాన్స్పైనే జరుగుతుండడం వినియోగదారుల ఆసక్తిని తెలియజేస్తోంది. డీమోనిటైజేషన్కు ముందు ఇది 10 శాతమే. దేశీయ వైట్గూడ్స్, స్మార్ట్ఫోన్ల మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని, ఏటా ఇది 10 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని అంచనా. డీమోనిటైజేషన్ తర్వాత వినియోగదారుల ఆలోచనలు మారాయని, నగదు రహిత లావాదేవీలు పెరిగాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్నంది తెలిపారు. వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు టైర్–2, టైర్–3 పట్టణాల్లోకి చొచ్చుకుపోవడంతో ఫైనాన్స్ పథకాల విస్తరణ పెరిగిందన్నారు. పోటీ పడుతున్న కంపెనీలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు తమ సబ్సిడరీల ద్వారా సున్నా వడ్డీ రుణ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అనుబంధ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టీవీఎస్ గ్రూపులు ఇప్పటికే డ్యురబుల్స్, స్మార్ట్ఫోన్ల ఫైనాన్స్ మార్కెట్లో పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాయి. బ్యాంకుల పరిధిలోని వైట్గూడ్స్ ఫైనాన్స్ మార్కెట్ 2017లో రూ.18,400 కోట్లకు పరిమితం కావడం గమనార్హం. దీంతో ఈ మార్కెట్లో ఉన్న భారీ అవకాశాలు ఎన్బీఎఫ్సీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. హోమ్ క్రెడిట్ సంస్థ ఎల్జీ, శామ్సంగ్తో కస్టమర్లకు సున్నా వడ్డీకి రుణాలిచ్చేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ‘‘కొత్త కస్టమర్లే మా లక్ష్యం. నగదు రహిత లావాదేవీలు మాకు పెద్ద అవకాశం’’ అని హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ ఆర్టెమ్ పొపోవ్ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ సోనీ, ఇంటెక్స్ కంపెనీలతో టైఅప్ అయి సున్నా వడ్డీ రుణాలను ఆఫర్ చేస్తోంది. మెట్రోల్లో అధికం మెట్రోల్లో మొత్తం జరిగే కన్జ్యూమర్ ఉత్పత్తుల విక్రయాల్లో ఫైనాన్స్పై జరిగేవి 60 శాతానికి చేరినట్టు ముంబై కేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్ చెయిన్ సంస్థ విజయ్సేల్స్ మేనేజింగ్ పార్ట్నర్ నీలేశ్ గుప్తా తెలిపారు. పెద్ద పట్టణాల్లో రానున్న కాలంలో మొత్తం విక్రయాల్లో ఫైనాన్స్ మార్కెట్ 70–75 శాతానికి వృద్ధి చెందగలదన్నారు. పలు బ్యాంకులు డ్యురబుల్, ఎలక్ట్రానిక్స్ ఫైనాన్స్లోకి ప్రవేశిస్తున్నాయని, రుణ జారీ ప్రక్రియ అంతా ఆటోమేషన్ చేయడంతో వినియోగదారులు ఈ పథకాలను ఎంచుకోవడం సులభంగా మారిందని రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బేడ్ తెలిపారు. -
భారీగా పెరిగిన నీరవ్ మోదీ క్లయింట్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం వెలుగులోకి రాకముందు వరకు నీరవ్ మోదీ డైమండ్ జువెల్లర్స్కు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ ఈయన కస్టమర్లే. 2016లో డిమానిటైజేషన్ ప్రకటించిన ఆ సమయంలో నీరవ్ జువెల్లర్స్కు ఇక అడ్డూ అదుపు లేదు. 2015-16లో మోదీ డైమండ్స్ను కేవలం 86 మంది ధనిక వ్యక్తులే కొనుగోలు చేయగా... ఆ తర్వాత ఏడాది డిమానిటైజేషన్ ప్రకటించిన సమయంలో(2016లో) 340 మంది ప్రముఖ, ధనిక కస్టమర్లు నీరవ్ మోదీ డైమండ్స్ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అంటే దాదాపు నాలుగు రెట్లు ఈయన కస్టమర్లు పెరిగినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వీరందరూ పన్ను అధికారుల కనుసన్నల్లోకి వచ్చేశారు. పీఎన్బీలో రూ.13,600 కోట్ల స్కామ్కు పాల్పడిన నీరవ్ మోదీపై ఇప్పటికే విచారణను ముమ్మరం చేసిన అధికారులు, ప్రస్తుతం ఆయన కస్టమర్లపై కూడా కన్నేశారు. పాన్ కార్డు లేకుండా.. నగదు ఎక్కడి నుంచి వచ్చిందో సరియైన వనరు తెలుపకుండా.. కోట్లలో విలువ చేసే జువెల్లరీ కొనుగోలు చేసిన 650 మందికి పైగా భారతీయుల జాబితాను పన్ను అధికారులు రూపొందించినట్టు ఇండియా టుడే టీవీ పేర్కొంది. ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో జువెల్లరీ కొనుగోళ్లు సంపన్న, ప్రముఖ వ్యక్తులే జరిపినట్టు తెలిసింది. వీరిలో నీరవ్ మోదీకి అధికంగ క్లయింట్స్ ఉన్నట్టు వెల్లడైంది. నీరవ్ మోదీకి ఉన్న ప్రముఖ, ధనికవంతులైన క్లయింట్స్లో లాయర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అభిషేక్ సింఘ్వీ ఉన్నారని తెలిసింది. ఆయన బ్లాక్మనీతో రూ.6 కోట్ల విలువైన జువెల్లరీ కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ తాను కేవలం రూ.1.6 కోట్ల జువెల్లరీని మాత్రమే కొనుగోలు చేశానని, అదీ కూడా చెక్పేమెంట్ ద్వారా జరిపినట్టు సింఘ్వీ చెప్పారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో సీనియర్ కాంగ్రెస్ మంత్రి కోడలు కూడా కోట్ల విలువ చేసే మోదీ జువెల్లరీని కొనుగోలు చేసిందని, ఆమె నీరవ్ మోదీకి అతిపెద్ద కస్టమర్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ జాబితాలో అహ్మదాబాద్కు చెందిన రియాల్టర్, టూ-వీలర్ దిగ్గజం ప్రమోటర్స్ కుటుంబ సభ్యులు, పుణేకు చెందిన రియాల్టీ సంస్థ ప్రమోటర్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరందరికీ ఐటీ నోటీసులు పంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ ఏడాదిన్నర క్రితమే విచారణ జరిపినట్టు, నీరవ్ మోదీ కేసు అనంతరం ఎందుకు నోటీసులు పంపుతున్నట్టు ఓ కాంగ్రెస్ నేత ప్రశ్నిస్తున్నారు. -
క్యూ4లో తగ్గనున్న కంపెనీల మార్జిన్లు
ముంబై: బేస్ ఎఫెక్ట్ కారణంగా 2016–17 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2017–18 క్యూ4లో కంపెనీల ఆదాయాల వృద్ధి తొమ్మిది శాతానికి పరిమితమయ్యే అవకాశాలుయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. లాభాల మార్జిన్లు కూడా 0.70 శాతం దాకా క్షీణించి పన్నెండు త్రైమాసికాల కనిష్ట స్థాయి 18.6 శాతానికి తగ్గొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. 2016–17 నాలుగో త్రైమాసికంలో డీమోనిటైజేషన్ ప్రభాలు తగ్గుతుండటం వల్ల వినియోగ ఉత్పత్తుల రంగం గణనీయమైన వృద్ధి కనపర్చిందని క్రిసిల్ తెలిపింది. దానితో పోలిస్తే తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయ వృద్ధి కొంత తగ్గనున్నప్పటికీ.. మెరుగైన పనితీరు కనపర్చేందుకు వినియోగ రంగమే (టెలికం విభాగం కాకుండా) దోహదపడనుందని వివరించింది. 2018 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కార్పొరేట్లు ప్రధానంగా వినియోగ ఉత్పత్తులు, కమోడిటీల ఆధారిత రంగాల ఊతంతో రెండంకెల స్థాయి వృద్ధి కనపర్చవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ కొపార్కర్ పేర్కొన్నారు. కమోడిటీల అధిక రేట్లతో రిస్కు.. డేటా వినియోగం భారీగా పెరిగినప్పటికీ.. టెలికం రంగం లాభదాయకత ఆందోళనకర స్థాయిలో 4.50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. కమోడిటీలు, ముడి వస్తువుల అధిక ధరలు ఎక్కువగా విద్యుత్, ఉక్కు, వినియోగ ఉత్పత్తుల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని, అటు రూపాయి మారకం విలువ పెరుగుదలతో ఐటీ, ఫార్మా కంపెనీలు సహా ఎగుమతి సంస్థల ఆదాయాలు దెబ్బతినొచ్చని క్రిసిల్ వివరించింది. కమోడిటీల ధరలు అధికంగా ఉండటం వల్ల మార్జిన్లపై ఒత్తిళ్లు కొనసాగవచ్చని.. అయితే నిర్వహణపరమైన అంశాలు ఈ ప్రభావాన్ని కొంత తగ్గించవచ్చని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, చమురు కంపెనీలు కాకుండా వివిధ రంగాలకు చెందిన మొత్తం 400 కంపెనీల పనితీరు అధ్యయనం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. కంపెనీలు ఈ వారం నుంచే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూ.950 కోట్ల రద్దైన నోట్లు, వెనక్కి తీసుకోరా..
కాఠ్మాండు : రద్దయిన పెద్ద నోట్లు నేపాల్లో ఇంకా భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ వారంలో భారత్లో పర్యటించనున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, తమ వద్దనున్న లక్షల కొద్దీ రద్దయిన భారత నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో మన దేశ అధికారులతో చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత, నేపాల్ ప్రజల వద్ద, అధికారిక రంగాల్లో సుమారు రూ.950 కోట్ల రద్దయిన భారత బ్యాంకు నోట్లు ఉన్నట్టు అంచనాలు వెలువడ్డాయి. ఈ నోట్లను ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనే విషయంలో నేపాల్, భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నేపాల్ ప్రజల వద్ద భారీగా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నట్టు తెలిసింది. అవినీతికి వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీ నోట్లకు, ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే భారత్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్న నేపాల్, భూటాన్ దేశాలు ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. భారత డిమానిటైజేషన్ నిర్ణయం నేపాలీ దేశస్తులను తీవ్రంగా బాధించిందని, ఇప్పటికే పలుమార్లు భారతీయ నేతలతో ఈ విషయంపై చర్చించామని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరామని పీఎం ఓలీ నేపాల్ పార్లమెంట్కు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే భారత పర్యటనలో నేపాల్ ప్రధాని ఓలీ, మన ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను, ఇతర అధికారులను కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్య చర్చల్లో భాగంగా రద్దయిన నోట్ల విషయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఆర్బీఐ మాటిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్చలు జరుగలేదని సెంట్రల్ నేపాల్ రాష్ట్ర బ్యాంకు గవర్నర్ చింతా మనీ శివకోటి చెప్పారు. ఆర్బీఐ, నేపాల్ లేదా మరే ఇతర దేశాల నుంచి పాత కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోలేదని మన దేశ సీనియర్ అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో దీనిపై ఎలాంటి ప్రొవిజన్లను రూపొందించలేదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని, భారత ప్రధానితో భేటీ అయి, ఈ విషయంపై చర్చించబోతున్నారు. నేపాల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. భారత కరెన్సీని నేపాలీ ప్రజలు, వ్యాపారస్తులు అధికంగా వాడతారు. అయితే ఒక్కసారిగా మోదీ డిమానిటైజేషన్ ప్రకటించడంతో, భారత కరెన్సీ నోట్లను ఇళ్లలో పొదుపు చేసుకున్న నేపాలీ ప్రజలపై ఈ ప్రభావం అధికంగా పడింది. -
రూ.37,500 కోట్లు మిగిలిపోయాయ్!
న్యూఢిల్లీ: రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గుర్తింపు కోల్పోయిన కంపెనీలకు సంబంధించి దేశీ బ్యాంకుల్లో రూ.37,500 కోట్లు మూలుగుతున్నాయి. నీరవ్ మోదీ బ్యాంకులను ముంచిన రూ.13,000 కోట్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లు ఎక్కువ. డీమోనిటైజేషన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఆయా డొల్ల కంపెనీలు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు తెలియజేశాయి. ఈ నిధులన్నీ కూడా పేపర్పై నడిచే కంపెనీల తాలూకు అక్రమ చలామణి నగదుగా (నల్లధనం) కేంద్రం భావిస్తోంది. ఎటువంటి కార్యకలాపాల్లేని 2.97 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ గతేడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తే గుర్తింపును తిరిగి పునరుద్ధరిస్తామంటూ, అప్పటి వరకు డిపాజిట్లను తిరిగి పొందే అవకాశం లేకుండా చేసింది. అయితే, 2.97 లక్షల కంపెనీల్లో గుర్తింపు పునరుద్ధరణకు ముందుకు వచ్చినవి 60 వేల కంపెనీలేనని అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన కంపెనీలు ఆయా డిపాజిట్లు ఎలా వచ్చాయో నిరూపించుకోవాల్సి వస్తుందన్న భయంతో మిన్నకుండిపోయాయి. ‘‘2.37 లక్షల కంపెనీల లావాదేవీల సమాచారం ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులను కోరగా, ప్రైవేటు రంగ బ్యాంకులు తొలుత అయిష్టతను ప్రదర్శించాయి. బ్యాంకింగ్ సెక్రటరీ బ్యాంకులతో సమావేశమైన తర్వాతే వాటి నుంచి సమాచారం వచ్చింది’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రానున్న రోజుల్లో షెల్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ శాఖ మరో జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. -
కోట్లకు కోట్లు రద్దైన నోట్లు : వెంకన్నకు తిప్పలు
తిరుపతి : పెద్దనోట్ల రద్దు సామాన్యులకు చుక్కలు చూపించింది. రద్దు చేసిన 1000, 500 నోట్లను మార్చుకోవడానికి జనాలు పడ్డ కష్టాలు వర్ణానాతీతం. ఆ సమయంలో పేదలు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నగదును మార్చుకోడానికి తిప్పలు పడితే, ధనవంతులు తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని అటు మార్చుకోలేక, ఇటు ఎవ్వరికి ఇవ్వలేక ఏమి చేయాలో పాలుపోక చివరకు ఆ నగదును వెంకన్న హుండీలో వేశారు. ఒక్క ధనవంతులు అనే ఏముంది, పిల్లికి భిక్షం వేయని వారు సైతం దేవుని హుండీలో వేలకు వేలు వేశారు. ఎలాను చెల్లని నోట్లె కదా, పుణ్యం...పురుషార్థం కలసి వస్తాయని... ప్రస్తుతం వెంకన్న హుండీలో దాదాపు రూ.25కోట్ల రద్దయిన నోట్లు వేసినట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించిన కొద్ది నెలల తరువాత వచ్చిన మొత్తం ఇది. 2016 నవంబర్ 8న మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీటీడీ వీటిని మార్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. ‘భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మేము ఈ నగదును మార్చుకోవాలని అనుకుంటున్నాం. అందుకు అవకాశం కల్పించమని ఆర్బీఐని ఒక లేఖ ద్వారా కోరాం. ఆర్బీఐ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’ అని టీటీడీ అదనపు ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ ఓ. బాలాజీ అన్నారు. ఈ రద్దయిన నోట్ల స్టాక్ను ప్రస్తుతం ఆలయంలోనే సురక్షితంగా భద్రపరచి ఉంచినట్టు పేర్కొన్నారు.