నాగోలులో విషాదం చోటుచేసుకుంది. టీకా వికటించడంతో ఓ చిన్నారి మృతిచెందింది. పోలియో చుక్కలు వేయడంతోనే చిన్నారి మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగోలులోని విజయపురి కాలనీకి చెందిన ప్రణవికి శనివారం అంగన్వాడీ సెంటర్లో పోలియో చుక్కలు వేయించారు. అయితే అప్పటి నుంచి అస్వస్థతకు గురైన ప్రణవి ఆదివారం ఉదయం ప్రాణాలొలింది. దీంతో చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
Published Sun, Sep 13 2015 10:25 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement