kill
-
డంపర్ ట్రక్కు బీభత్సం
డెహ్రాడూన్: డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఓ కారు రూపు ఇలా మారిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్–డెహ్రాడూన్ హైవేపైనున్న లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 7.3 0గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా దూసుకువచ్చిన ఈ డంపర్ ట్రక్కు ప్లాజా వద్ద వరుసగా ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక కారు ఇలా ఇనుప స్తంభాన్ని గుద్దుకుని ఇలా నుజ్జవగా మరో రెండు కార్లలోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తెహ్రిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగులైన వీరిద్దరూ విధులకు వెళ్తూ ఇలా ప్రమాదం బారినపడ్డారు. అతివేగం, ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. -
పార్కింగ్ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య
మొహాలీ: పంజాబ్లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్-66లో బైక్ పార్కింగ్ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్ స్వర్ణకార్(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నదని వారు తెలిపారు.అభిషేక్ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు -
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది. -
మరో మహమ్మారి.. 15 మందిని కబళించిన ‘బ్లీడింగ్ ఐ’
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.లక్షణాలివే..బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.కరోనా కంటే ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్ను వణికించిన వ్యాధులు -
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్ను రైల్వే హాస్పటల్కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. -
KILL ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ..
-
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా
ఓటీటీల వల్ల సినిమా చూడటం చాలా సులభమైపోయింది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల చిత్రాల్ని సింపుల్గా చూసేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మూవీస్.. కొన్ని సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే రీసెంట్గా రిలీజై హిట్ కొట్టిన హిందీ మూవీ విషయంలో జరగనుంది.పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హిందీ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో నిలబడుతున్నాయి. అలాంటిది జూలై 5న 'కిల్' అనే మూవీ బాలీవుడ్లో రిలీజైంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో తీయగా.. హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్లోకి తీసుకురానున్నారు. సోమవారం (జూలై 22) రాత్రి 9 గంటల నుంచి 'కిల్' మూవీ స్ట్రీమింగ్లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి హిట్ సినిమా రావడం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు.'కిల్' విషయానికొస్తే.. అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఎన్ఎస్జీ కమాండో. ఇతడి ప్రియురాలు తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె తండ్రి, వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేస్తాడు. దీంతో తనతో వచ్చేయాలని తులికాని అమిత్ అడగ్గా.. ఆమె నో చెబుతుంది. ఆ తర్వాత తులికా ఫ్యామిలీ.. ఢిల్లీ నుంచి రాంచీకి ట్రైన్లో వెళ్తుంటారు. తులికాకు తెలియకుండా అమిత్ కూడా ఇదే ట్రైన్ ఎక్కుతాడు. కాసేపటి తర్వాత బందిపోట్ల ముఠా ట్రైన్పై దాడి చేస్తుంది. తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు. మరి బందిపోట్ల నుంచి తులికా, ప్రయాణికులను లక్ష్య కాపాడగలిగాడా? లేదా అనేది స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?
జపాన్లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్టీఎస్ఎస్) అని అంటారు.జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్గఢ్లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
ఆయిల్ ట్యాంకర్ పేలి.. 40 మంది మృతి
మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం? భారత్ స్పందన ఇది
ఖలిస్థానీ వేర్పాటువాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఓ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కుట్రను తాము భగ్నం చేశామని, పైగా ఈ విషయాన్ని భారత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అమెరికా ప్రకటించడంతో మరింత దుమారం రేపింది. అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను.. తాము భగ్నం చేశామని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అందులో సారాంశం.. ‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ వర్గాలు తదుపరి దర్యాప్తు చేస్తాయని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్ వాట్సన్ పేరిట కథనం ప్రచురితమైంది. ఇదీ చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరో తెలుసా? మరోవైపు ఈ కథనంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగశాఖ.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని అన్నారు. మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించి అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోందట. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. ఇదీ చదవండి: గురపత్వంత్కు భారత్ దెబ్బ.. అదుర్స్ -
ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్బుక్దే’
అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్బుక్ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. ‘న్యూస్వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. నవంబర్ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్ అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్బుక్ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే లూకాస్ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్బీ కథనం పేర్కొంది. -
దారుణం: ఫోన్ లిఫ్ట్ చేయని భార్యపై అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ..
అనుమానం.. పెనుభూతం అంటారు. అతని విషయంలో అది ఉన్మాదం వైపు అడుగులేయించింది. పెళ్లి అయిన తొలినాటి నుంచే భార్యపైనా అనుమానం పెంచుకున్నాడు. అది అతన్ని ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్లు పరిశీలిస్తూ.. మాట్లాడే ప్రతి ఒక్కరి గురించి ఆరా తీసే స్థాయికి దిగజార్చింది. చివరకు.. పండటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను గొంతు నులిమి కడతేర్చే కిరాతకానికి పాల్పడ్డాడు. తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అత్తగారింటికి వెళ్లి తన భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదకొండు రోజుల క్రితమే ఈ దంపతులకు ఓ పాప పుట్టడం గమనార్హం. కిషోర్(32) ప్రతిభ(24) నవంబర్ 13, 2022న వివాహం చేసుకున్నారు. 11 రోజుల క్రితమే వారికి ఓ పాప పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె అమ్మ ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కిశోర్ నిత్యం అనుమానించేవాడు. ఆమె మెసేజ్లు, కాల్ రికార్డులను తరచుగా పరిశీలించేవాడు. ఆమెతో మాట్లాడే ప్రతి వ్యక్తి గురించి ఆరా తీసేవాడు. కాలేజీ నాటి పురుష స్నేహితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ప్రతిభ ఫోన్లో విలపించడంతో ఆమె తల్లి జోక్యం చేసుకుని కాల్ డిస్కనెక్ట్ చేసింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్కు సమాధానం ఇవ్వవద్దని ఆమె ప్రతిభకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం కిషోర్ తనకు 150 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ప్రతిభ.. తన తల్లిదండ్రులకు తెలిపింది. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిషోర్ రగిలిపోయాడు. చామరాజనగర్ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్.. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగి, నవజాత శిశువుతో ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసాడు. దుపట్టాతో ప్రతిభ గొంతునులిమి హత్య చేశాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చిన కిశోర్.. ఘటనాస్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. చికిత్స పూర్తి కాగానే కిషోర్ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
ఇజ్రాయెల్లో 9 మంది అమెరికన్లు మృతి
వాషింగ్టన్: ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో కనీసం 9 మంది అమెరికా పౌరులు మరణించారు. మరెందరో ఆచూకీ తెలియకుండా పోయారని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్లో జాడ తెలియకుండా పోయిన 8 మంది ఫ్రాన్స్ దేశస్తులు కూడా హమాస్ మిలిటెంట్లకు చిక్కడమో, వారి చేతిలో మరణించడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. 10 మంది బ్రిటిష్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో మరణించడమో, జాడ తెలియకుండా పోవడమో జరిగిందని చెబుతున్నారు. -
వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..
హోసూరు: మహిళ ఇంట్లో ప్రియుడు హత్యకు గురైన సంఘటన బేరికె పోలీస్స్టేన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. బేరికె సమీపంలోని కొళదాసపురం గ్రామానికి చెందిన జ్యోతి (39), ఈమె భర్త కేశవమూర్తి పదేళ్ల క్రితం మృతి చెందాడు. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చింది. బేరికె సమీపంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన వెంకటేష్ (40)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. వెంకటేష్ తరచూ జ్యోతి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇది తెలిసి జ్యోతి సోదరి కొడుకు హరీష్ (23) మీ వల్ల పరువు పోతోందని వారిద్దరినీ మందలించాడు. దీంతో ఆమె ప్రియున్ని ఇంటికి రావద్దని చెప్పింది. అయినప్పటికీ మంగళవారం వెంకటేష్ జ్యోతి ఇంటికి రాగా తలుపు వేసి జ్యోతి, హరీష్ కలిసి కట్టెలతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన ఇతన్ని స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని జ్యోతి, హరీష్ను అరెస్ట్ చేశారు. చదవండి: 15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు -
15 రోజులకు ఒకసారి ఇంటికి.. భార్య ప్రవర్తనపై అనుమానం.. ఓ రోజు
మండ్య(బెంగళూరు): అనుమానంతో భార్యను కడతేర్చిన ఉదంతం మండ్య జిల్లా నాగమంగల పట్టణంలో జరిగింది. ఇక్కడి టీబీ లేఔట్లోని ముళకట్టె రోడ్డులో నివాసం ఉంటున్న పుట్ట స్వామి, గిరిజ దంపతుల కుమార్తె మధుశ్రీ(25)కి నాగమంగళ తాలూకా కరడహళ్లికి చెందిన గంగాధర్ కుమారుడు మంజునాథ్తో వివాహమైంది. వీరికి నాలుగు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ బెంగళూరులో ఉంటూ 15 రోజులకు ఒక పర్యాయం వచ్చి వెళ్తుండేవాడు. అయితే మధుశ్రీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. మంగళవారం కూడా దంపతులు గొడవ పడ్డారు. ఓ దశలో భార్య కడుపులో కత్తితో దాడి చేసి కుమారుడితో కలిసి ఉడాయించాడు. బుధవారం ఉదయం ఎంతసేపైనా మధుశ్రీ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. నాగమంగల పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో
శివాజీనగర: నాలుగు రోజుల క్రితం హాసన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో గురువారం జేడీఎస్ నాయకుడు కృష్ణగౌడ (53)ను దుండగులు మారణాయుధాలతో కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 6 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈయన గ్రానైట్, రియాల్టీ వ్యాపారాలు చేయడంతో పాటు జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్ణకు అనుచరుడు కావడంతో సంచలనం కలిగించింది. వివరాలు.. గతంలో యోగానంద అనేవ్యక్తి కృష్ణేగౌడతో పరిచయమై వాహిని సినిమాకు పెట్టుబడి పెట్టారు. ఇందులో తనను మోసగించారని యోగానందతో కృష్ణగౌడ గొడవపడ్డాడు, ఆపై 2022 నవంబర్లో యోగానందను కొందరు కిడ్నాప్ చేసి దాడి చేయడంతో అతడు హాసన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మరోవైపు యోగానందపై కృష్ణగౌడ చీటింగ్ కేసు పెట్టారు. ఇలా ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరిగాయి. అప్పటినుంచి కృష్ణగౌడను అంతమొందించాలని కుట్ర మొదలైంది. కారులో వెళ్తుండగా నరికి చంపి ఈ నెల 9న మధ్యాహ్నం కృష్ణగౌడ నగర శివార్లలో కారులో వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అడ్డుకుని నరికి చంపి పరారయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి యోగానంద కుటుంబీకుల పాత్ర ఉందని గుర్తించారు. యోగానంద, అతని భార్య సుధారాణి, అతని స్నేహితురాలు, మామ కృష్ణకుమార్, బంధువు విజయ్–చైత్ర దంపతులు, అలాగే స్థానిక టీవీ చానెల్ భాగస్వామి సురేశ్ అనేవారిని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రాణం తీసిన రీల్స్ వ్యసనం.. చంపి నదిలో పడేశాడు
బెంగళూరు: నిత్యం మొబైల్లో మునిగిపోవడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వెరసి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి శవాన్ని నదిలో పడేసిన ఘటన మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం తాలూకా మండ్యకొప్పళు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ, శ్రీనాథ్ భార్యభర్తలు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, పూజా గంటల తరబడి మొబైల్ వాడేది. టిక్టాక్ చేసే పూజా అది లేకపోవడంతో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఆమె ఇతరులతో చాటింగ్ చేయడాన్ని భర్త గుర్తించాడు. సహించలేక మరో వ్యక్తితో కలిసి చంపేసి శవాన్ని నదిలో పడేశాడు. ఈ విషయం మూడు రోజుల తరువాత బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టాల్లో ఏముందంటే..? -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. చదవండి: Dr Radha Murder Case: డా.రాధా మర్డర్ కేసులో భర్తే హంతకుడు -
నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను..
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష. గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు.. -
మొసలి దాడిలో ఫుట్బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్స్టేషన్లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
సిగరెట్ కొనివ్వలేదని.. బాలుడిని కిరాతకంగా చంపాడు
హోసూరు(బెంగళూరు): అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుడి ప్రాణం తీసిన ఘటన క్రిష్ణగిరి తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని పాంచాలియూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (14) అదే ప్రాంతంలోని మద్యంషాపు వద్ద బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న ఓ మందుబాబు బాలున్ని పిలిచి దుకాణంలో సిగరెట్ కొనిపెట్టాలన్నాడు. అందుకు బాలుడు నిరాకరించాడు. ఆగ్రహంతో బాలుడిపై మందుబాబు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకొన్న బాలుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. క్రిష్ణగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో శాంతి చర్చలు జరిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. నష్టపరిహారం ఎవరిస్తారు..? అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్ని బర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని అన్నారు. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు.. -
జైపూర్ ఎక్స్ప్రెస్ కాల్పులు.. అకారణంగా కాల్చేశాడా?
ముంబయి: జైపూర్-ముంబయి సూపర్ఫాస్ట్ రైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ ట్రైన్లో తోటి సహోద్యోగులతో సహా ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జైపూర్-ముంబయి సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(12956) జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్గా గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న క్రమంలో ఘటనకు పాల్పడ్డాడు. బాధితుడు ఏఎస్ఐ టికారమ్ మీనాగా గుర్తించారు. టికారమ్ రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు చేతన్ సింగ్ షార్ట్ టెంపర్ అని పశ్చిమ రైల్వే ఎన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అధికారి ప్రవీణ్ సిన్హా తెలిపారు. ఎస్కార్ట్ డ్యూటీలో అధికారుల మధ్య ఎలాంటి వివాదం జరగలేదని వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి మహారాష్ట్రాలోని పాల్ఘర్కు చేరగానే కానిస్టేబుల్ చేతన్ సింగ్ అకారణంగానే కోపానికి లోనై తోటి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన అనంతరం బోగీ నెంబర్ బీ5 లో ఓ ప్రయాణికునిపై ఫైరింగ్ జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బోగీ బీ6లో మరో ఇద్దరు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. నిందితుడు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీనియర్ అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా సమయంలో విధుల్లో మొత్తం ముగ్గురు కానిస్టేబుల్స్తో పాటు సీనియర్ ఏఎస్ఐ అధికారి ఉన్నట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం దాహితార్ స్టేషన్ పరిధిలో రైలు చైన్ లాగి నిందితుడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి వస్తున్న క్రమంలో గుజరాత్లోని సూరత్ రాగానే.. ఈ ఆర్ఫీఎఫ్ పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీ విధుల్లో చేరారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అధికారి టికారమ్ మీనాకు రూ.15 లక్షల పరిహారాన్ని పశ్చిమ రైల్వే ప్రకటించింది. కాగా.. టికారమ్కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 80 ఏళ్ల తల్లి ఉంది. 2025లో ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: 'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం' -
హ్యపీ లైఫ్, ఇద్దరు పిల్లలు..కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు!
జైపూర్: పెళ్లి... ఇది కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు. వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో వారి ఆశీర్వాదాలతో ఇద్దరు వ్యక్తులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటిగా మారుతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ కొందరు దంపతుల మాత్రం వివాహం అయిన కొంత కాలానికే చిన్న చిన్న సమస్యలు వల్ల గొడవలు పడుతూ చివరకి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. 15 ఏళ్ల బంధం ముగిసింది మరికొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, లేదా ఆత్యహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే ప్రస్తుతం ట్రెండ్ ఇలానే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఇదే తరహాలో ఓ భర్త చిన్న కారణానికి 15 ఏళ్ల బంధాన్ని మరచి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లాలోని మాతా కథాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమేష్ బెనివాల్ (35), సుమన్ బెనివాల్ (32) భార్యాభర్తలు. ఆ ఒక్క మాట అనేసరికి వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు హాస్టల్లో చదువుతున్నారు. సుమన్ బేనివాల్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రమేష్ వ్యాపారవేత్త. తన వ్యాపారం నిమిత్తం తరచూ జోధ్పూర్కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి జోధ్ పూర్ వెళ్లి అర్థరాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం అతని భార్యను ఆహారం వడ్డించమని అడిగాడు. అయితే కాస్త అలసగా ఉందని.. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహం అతను తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో రమేష్ ఇంట్లో ఉన్న రాయితో భార్య తలపై కొట్టగా.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య హత్య అనంతరం ఇంటి తలుపులు వేసి ఉన్న రమేష్ తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించాడు. రమేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి భర్త అనుమానం.. టిఫిన్ కోసం వచ్చిన యువకుడికి భార్య... -
బైక్పై ప్రియురాలిని వదిలేసి.. రాత్రి స్నేహితుడితో కలిసేందుకు వెళ్లి
అన్నానగర్(చెన్నై): నెల్లై జిల్లా దిసైయాన్ విలై తాలూకా స్వామిదాస్ పట్టణంలో చెప్పులు కుట్టే కార్మికుడు కన్నియప్పన్ కుమారుడు ముత్తయ్య (19). సంగనాన్ కుళం గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఓ యువతి పని చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన చెందిన ముత్తయ్య, సదరు యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తయ్య ఇంటికి ప్రియురాలు వచ్చింది. అనంతరం 4.30 గంటలకు ముత్తయ్య తన బైకులో యువతిని ఇడమొళిలో వదిలేసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన ముత్తయ్య చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. సోదరులు అతన్ని వెతకగా ఆ ప్రాంతంలో మృతదేహమై పడివున్నాడు. దిసైయాన్విలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. నెల్లై ఎస్పీ శిలంబరసన్, వల్లీయూరు డీఎస్పీ యోగేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని భావిస్తున్నారు. చదవండి Hyderabad IIT Student Commits Suicide: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం -
వివాహితతో పరిచయం.. ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైం చూసి
చెన్నై: వివాహేతర సంబంధం విషయంలో మహిళకు నిప్పు అంటించి హత్య చేయడానికి ప్రయత్నించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టులో సంచలనం కలిగింది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా పాలరు భగత్ సింగ్ నగర్కు చెందిన ప్రతాప్ అనే కుళ్లన్ (33) పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. అయితే పిల్లలు లేరు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రకాష్ భార్య ప్రియ (27)తో పరిచయం ఏర్పడి వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర వ్యవహారం ప్రతాప్ భార్యకు తెలిసింది. దీంతో ప్రతాప్ను వారించింది. కానీ ఈ మాటలు పట్టించు కోకుకుండా ప్రియురాలతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ప్రతాప్ బావ అతని పై దాడి చేశాడు. దీంతో ప్రతాప్ ప్రియతో మాట్లాడడం ఆపేశాడు. అయితే తనతో సంబంధం కొనసాగించాలని ప్రియ ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో గురువారం పాలరు రోడ్డులో ప్రతాప్, ప్రియ గొడవ పడ్డారు. అనంతరం శనివారం ఉదయం ప్రియ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వెళ్లిన ప్రతాప్.. ఆమె పై కిరోసిన్, పెయింట్ కొట్టడానికి ఉపయోగించు టర్బెంట్ ఆయిల్ను రెండు కలిపి పోసి నిప్పంటించాడు. పాలరు సహాయ ఇన్స్పెక్టర్ కోదండన్ ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రియను చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చదవండి భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది! -
Bangalore: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీను హత్య చేసిన మాజీ ఉద్యోగి..
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మాజీ ఉద్యోగి తన పాత కంపెనీకి చెందిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ను హత్య చేశాడు. నిందితుడు సంస్థలోకి చొరబడి కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, విను కమార్లుగా గుర్తించారు. ఫణీంద్ర, విను కుమార్లు ఏడాది క్రితం ఏయిరోనిక్స్ ఇంటర్నెట్ అనే సంస్థను స్థాపించారు. దానికి ఫణీంద్ర సీఈఓ, విను కుమార్ ఎండీగా పనిచేస్తున్నారు. అయితే.. నిందితుడు వీరు కంపెనీలో క్రితం ఏడాది ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి అదే రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫణీంద్ర, విను కుమార్లు నిందితుని వ్యాపారంలో కలగజేసుకున్నారని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు ఫణీంద్ర, విను కుమార్లను కత్తితో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి.. -
కోటీశ్వరుడి కూతురు.. జాగింగ్ వెళ్లడమే శాపమైంది..
కోటీశ్వరుని కూతురు.. వృత్తిరీత్యా టీచర్.. గౌరవప్రదంగా సాగిపోతున్న జీవితం. దానికి తోడు ఎంత తిన్నా.. తరగని సంపదలు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే వ్యక్తిత్వం ఆమెది. అందిరినీ కలుపుకుపోయే తత్వం.. శత్రుత్వం అనే మాటే తెలియదు. ఉదయాన్నే 4 గంటలకే వ్యాయామం వెళ్లడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ ఓ రోజు ఉదయం.. అదే చివరి వ్యాయామం అయింది. అంత మంచి ఆవిడకు ఏమైంది? ఆవిడను ఎవరు హతమార్చారు? ఆమె పేరు ఎలిజా ఫ్లెచర్(34). ఆవిడ తండ్రి కోటీశ్వరుడు. వారు అమెరికాలోని టెన్నిసీ నగరంలో నివసిస్తున్నారు. ఫ్లెచర్ వృత్తిరీత్యా టీచర్గా పనిచేస్తున్నారు. ఇటు తల్లిగా.. టీచర్గా తన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. కావాల్సినంత డబ్బు.. జీవితం సుఖంగా సాగుతుంది. అయితే.. ఫ్లెచర్కు ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే వ్యాయామానికి వెళ్లే అలవాటు ఉంది. ఆ రోజు అలాగే వ్యాయామానికి వెళ్లింది. అనుకోని అతిథి.. ఫ్లెచర్ రోడ్డు వెంట జాకింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎదురయ్యాడు ఓ కరుడుగట్టిన నేరస్తుడు. యూనివర్శిటీ ఆఫ్ మెంఫీస్ క్యాంపస్ వద్ద ఆమె మార్గానికి అడ్డుతగిలాడు. చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు. గన్తో తలపై కాల్చేశాడు. బాధితురాలు ఫ్లెచర్ మృతదేహాన్ని ఓ కొండ ప్రాంతంలో గుర్తించామని పోలీసులు తెలిపారు. అటాప్సీ నివేదికల ప్రకారం బాధితురాల్ని గన్తో తల వెనక భాగంలో కాల్చినట్లు తేలింది. ఎలా పట్టుబడ్డాడంటే.. ఆ మరుసటి రోజే క్లియోథా అబ్స్టన్ అనే నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె మృతదేహం లభ్యమైన సమీప ప్రాంతంలోనే సర్వేలెన్స్ ఆధారంగా అబ్స్టన్ను పట్టుకున్నట్లు చెప్పారు. అయితే.. ఫ్లెచర్పై దాడి జరిగిన ప్రాంతంలో వదిలిన చెప్పుల జోడు ఆధారంతో డీఎన్ఏ రిపోర్టుల ద్వారా నిందితున్ని గుర్తించామని వెల్లడించారు. మరణశిక్ష విధించాలని డిమాండ్.. గత ఏడాది సెప్టెంబర్ 2న ఈ ఘటన జరిగగా.. ప్రస్తుతం కోర్టు విచారణ జరుపుతోంది. దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు తరుపు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. నేరస్తుడు బాధితురాలిపై వ్యవహరించిన తీరు హేయమైనదని చెప్పారు. ఫ్లెచర్ కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటి కేసుల్లో చట్టాన్నే అనుసరించి శిక్ష విధించాల్సి వస్తుందని న్యాయమూర్తి తెలిపారు. నేర చరిత్ర.. గతంలోనే అబ్ట్సన్కు చాలా నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో ఓ మర్డర్ కేసులో ఇప్పటికే 20 ఏళ్ల శిక్షను అనుభవించాడు. కాగా.. 2021 ఆగష్టులో అబ్ట్సన్ తనపై దాడి చేశాడని అలిసియా ఫ్రాంక్లిన్ అనే మహిళ ఆరోపించారు. తనను గన్తో బెదిరించి ఖాలీగా ఉండే అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడని తెలిపారు. అనంతరం తన కళ్లకు గంతకు కట్టి.. కారు వెనక భాగంలో పడేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘనటపై ఆమె పోలీసులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కానీ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి స్కెచ్, మరో మహిళతో ఫోన్ చేయించి
సాక్షి, నంద్యాల: హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వెంకటన్న (42)ను సొంత భార్యనే పొట్టన పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రూరల్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్నకు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న వెంకటన్న హత్యకు గురయ్యాడు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా భార్యనే నిందితురాలని తేలింది. బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో శ్యామలకు వివాహేతర సంబంధం ఉంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంకటన్న వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు కుమార్స్వామి, అతని స్నేహితులు ఐదుగురితో కలిసి శ్యామల హత్యకు కుట్ర పన్నింది. ఈ మేరకు బేతంచెర్లకు చెందిన దేవమణి అనే మహిళను రంగంలోకి దింపారు. ఆమె ఫోన్లో వెంకటన్నను పరిచయం చేసుకుని వల పన్నింది. ఈనెల 19న ఫోన్ చేసి జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని చెప్పడంతో వెంకటన్న బైక్పై వెళ్లాడు. కాగా అప్పటికే అక్కడ మాటు వేసిన కుమారస్వామి, అతని స్నేహితులు నలుగురితో కలిసి వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి చంపేశారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోదారు. కాగా పోలీసులు శ్యామల ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి ఛేదించినట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన శ్యామల, ఆమె ప్రియుడు కుమారస్వామి, అతని స్నేహితులు శ్రీనివాసులు, లక్ష్మన్న, హుసేన్ నాయుడు, రంగనాయకులు, దేవమణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. చదవండి: స్నేహితులను భార్యపైకి లైంగికదాడికి ఉసిగొల్పే భర్త... -
'తగ్గేదేలే..! విజయం సాధిస్తాం.. సల్మాన్ను చంపేస్తాం..'
ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ను చంపేస్తామని కెనడాకు చెందిన పరారీలో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. సల్మాన్ తమ కిల్ లిస్ట్లో ఉన్నాడని వెల్లడించాడు. హీరో సల్మాన్ను చంపేస్తామని గత మార్చిలోనే మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్యూలో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ కీలక సూత్రధారి అని ఆరోపణలు కూడా ఉన్నాయి. 'మేము ఇంతకు ముందే చెప్పాం. ఒక్క సల్మాన్నే కాదు.. జీవించి ఉన్నతం కాలం మా శత్రువులను చంపేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. సల్మాన్ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం. అందుకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయ్. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం.' అని గోల్డీ బ్రార్ తెలిపారు. గత మార్చిలోనే సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హీరో సల్మాన్ను చంపేస్తామని అందులో పేర్కొన్నారు. గతంలో అరెస్టైన లారెన్స్ భిష్ణోయ్ అంశంలో గోల్డీ బ్రార్ సల్మాన్తో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆ మెయిల్లో కోరారు. అప్పట్లో ఆ మెయిల్లపై గ్యాంగ్స్టర్ లారెన్స్ భిష్ణోయ్, గోల్డీ బ్రార్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. #EXCLUSIVE | Gangster #GoldyBrar's open threat to Salman Khan; man running India's biggest gang network speaks to India Today's @arvindojha. Here's the detailed report. #5ivLive with @nabilajamal_ - https://t.co/pEYfdF77O1 pic.twitter.com/dF0V2Bnnnq — IndiaToday (@IndiaToday) June 26, 2023 కెనడాలో టాప్ 25 మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నాడు. ప్రస్తుతం బ్రార్ కెనడాలోనే ఉన్నారని చాలా మంది విశ్వసిస్తారు. ఇండియాలో చాలా క్రిమినల్ నేరాల్లో అతని హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కెనడాలో మాత్రం అతనిపై ఎలాంటి క్రిమినల్ నేర చరిత్ర ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్.. -
ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్లో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత
పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అయితే వివాహం తర్వాత కొంత మంది దంపతులకు సంతానం కలగడం ఆలస్యం కావడంతో డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరికి పిల్లలు పుడితే.. మరికొందరి ప్రయత్నాలు విఫలమై దత్తత లాంటివి వాటితో పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైన పెళ్లైన దంపతులకు పిల్లలు లేకపోతే వారి పడే మనోవేదన వర్ణణాతీతమనే చెప్పాలి. అలాంటిది ఓ తల్లి మాత్రం తనకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టినప్పుడు కూడా అంతే కఠినంగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉండగా ఆమె తన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో.. తొలుత ఆమె పోలీసుల విచారణకు సహకరించలేదు. ఫ్రిజ్లో రెండు మృతదేహాలు లభ్యం కాగా చివరికి తన పసిపిల్లలను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. ఈ హత్యల గురించి తనకు తెలియదని మహిళ భర్త తెలిపాడు. తన భార్య తనకు రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు చెప్పిందని అతను చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిడిల్క్లాస్ భర్త.. రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. జాబ్ వచ్చాక మరొకడితో -
ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. వాటర్ మిలన్ కట్ చేస్తుండగా..
సందీప్, పూజ నాలుగేళ్లుగా లివ్ ఇన్లో ఉన్నారు. సందీప్ హరియాణాలోని హిసార్ ప్రాంతానికి చెందినవాడు. పూజ ఢిల్లీకి చెందిన యువతి. పూజ సిఎస్ఎస్బీలో సిపాయిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె చికిత్స కోసం సందప్ను ఆసుపత్రికి తీసుకు వచ్చింది. సందీప్ ఛాతీలో చాకుతో అయిన తీవ్ర గాయం ఉంది. చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. హరియాణాలోని గురుగ్రామ్లో ఛాతీలో చాకు దిగబడిన నేపధ్యంలో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ యువకుడిని అతని లివ్ ఇన్ పార్ట్నర్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనుమానాస్పద స్థితిలో ఆ యువకుడు మృతిచెందడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా భావిస్తూ, అతని లివ్ఇన్ పార్ట్నర్ను అరెస్టు చేసి, పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. డిఎల్ఎప్ పేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 35 ఏళ్ల సందీప్ను చికిత్స కోసం నారాయణ సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంద్భంగా సందీప్ లివ్ ఇన్ పార్ట్నర్ పూజాశర్మ(25) పోలీసులతో మాట్లాడుతూ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా సందీప్ ఛాతీలో చాకు దిగబడిందని తెలిపింది. దీంతో అతను తీవ్రంగా గయాపడ్డాడని, తాను వెంటనే ఆసుపత్రికి తీసుకు వచ్చానని, అయినా ఫలితం లేకపోయిందని తెలిపింది. తాను, సందీప్ గత నాలుగేళ్లుగా లివ్ ఇన్లో ఉంటున్నామని, సందీప్ వాహనాల కొనుగోలు- అమ్మకాల వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. కాగా సమాచారం తెలిసిన వెంటనే సందీప్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎసీపీ డీఎల్ఎఫ్ వికాస్ కౌశిక్ మాట్లాడుతూ సందీప్ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా, చాకు గుచ్చుకుని చనిపోయాడని పూజ చెబుతున్నదని అన్నారు. అయితే తాము పూజ చెబుతున్న దానిలో నిజా నిజాలు తేల్చేందుకు ఆమెను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
డెలివరీ బాయ్ మృతి.. బైకును ఢీకొట్టి వంద మీటర్లు లాకెళ్లిన కారు
యశవంతపుర(బెంగళూరు): కారు ఢీకొని ఫుడ్ డెలివరి బాయ్ మృతి చెందిన ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడిని మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాకు చెందిన ప్రసన్నకుమార్ (25)గా గుర్తించారు. ప్రసన్న ఆదివారం అర్ధరాత్రి వరకు ఓ సంస్థలో క్యాషియర్గా పనిచేసి , తెల్లవారుజామున ఫుడ్ డెలివరీకి బయలుదేరాడు. ఫుడ్ ఇవ్వడానికి బైక్పై మైసూరు రోడ్డులో వెళ్తుండగా వాయు వేగంతో వచ్చిన ఓ కారు ప్రసన్నను బలంగా ఢీకొంది. దాదాపు వంద మీటర్ల వరకు బైక్ను కారు లాక్కెళ్లడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పారిపోతుండగా ఆర్ఆర్నగర మెట్రో స్టేషన్ వద్ద స్థానికులు అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారును నడుపుతున్న వినాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్ -
ఖమ్మంలో కాల్పులు.. నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భోజ్యా తండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాలో లావుడ్యా సామ అనే వ్యక్తి తరుచుగా మద్యం సేవించి భార్య శాంతిపై గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చాక భార్యతో గొడవపడిన సామ తన భార్య బయట దుకాణానికి వెళ్లి వస్తున్న క్రమంలో నాటు తుపాకితో వెనుక నుండి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో సామ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న శాంతిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా గుండ్ల రేవు పంచాయతీ పరిధిలో ఉండే భర్త నాటు తుపాకితో భార్య గ్రామానికి వచ్చి కాల్పులు జరపడంతో కలకలం రేగింది. గ్రామానికి ఆనుకుని ఉండే అడవిలో జంతువులను వేటాడానికి సామ నాటు తుపాకీ వాడే వాడని దానితోనే ఇప్పుడు భార్య పై కాల్పులు జరిపాడని శాంత తల్లి, పిల్లలు బోరున విలపిస్తున్నారు. శాంతకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
ఇంగ్లండ్లో కత్తితో దుండగుడు వీరంగం
లండన్: సెంట్రల్ ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ వీధుల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక దుండగుడు మంగళవారం తెల్లవారుజామున కత్తి చేత పట్టుకొని కనిపించిన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్ సహా ముగ్గురు మరణించారు. గ్రేస్ ఒ మలే కుమార్ (19) అనే భారతీయ విద్యార్థికి క్రికెట్, హాకీ క్రీడలంటే ప్రాణం. కుమార్తో పాటు క్రికెట్ ఆడే అతని స్నేహితుడు బార్నబి వెబ్బర్ కత్తి పోట్లకు గురై ప్రాణాలు విడిచాడు. మరో 60 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయడంతో అతనూ మృతి చెందాడు. ఆ వ్యక్తి దగ్గర నుంచి వ్యాన్ను దొంగలించిన దుండగుడు మరో ముగ్గురుపై నుంచి వాహనాన్ని తోలుకుంటూ వెళ్లాడు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశంలో బుధవారం ప్రధాని సునాక్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చదవండి: వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి? -
మోదీ, యోగీ అంశంపై వాగ్వాదం.. వ్యక్తిని చంపిన యువకుడు!
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. రాజకీయ అంశాలపై వాగ్వాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆధిత్యనాథ్ అంశాలపై జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు తమ వ్యక్తిని చంపేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాజేశ్వర్ దూబే(50). మీర్జాపూర్లో అతని సోదరుని ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. కారులో ఐదుగురు ప్రయాణికులతో పాటు దూబే ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కారులో రాజకీయ అంశాలపై చర్చ మొదలైంది. ప్రధాని మోదీ, యోగీ ఆధిత్యనాథ్లపై చర్చ తారాస్థాయికి చేరింది. కారు మహోఖర్ గ్రామం వద్దకు చేరగానే ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్.. దూబేను కారు నుంచి దిగమని హెచ్చరించాడు. వారిరువురి వాగ్వాదంలో యువకుడు దూబేను చంపేశాడు. దూబే అక్కడికక్కడే మరణించినట్లు అతని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు మీర్జాపూర్-ప్రయాగ్రాజ్ రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనను శాంతింపజేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి:సన్ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు -
వావివరుసలు మరచిన వదిన,మరిది..చివరికి జరిగిందిదే!
రాజస్థాన్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. తనకన్నా 8 ఏళ్లు చిన్నవాడైన మరిదిపై వదిన మనసు పారేసుకుంది. కొన్ని రోజులుగా తనను పెళ్లిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వదినతో ఇతనికి సంబంధం ఏర్పడిన దరిమిలా ఆమె అతనిని వివాహం కోసం ఒత్తిడి చేసింది. ఈ నేపధ్యంలో ఆమె పోరుపడలేని మరిది ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్పురా గ్రామంలో తన అత్త కూతురి వివాహానికి హాజరయ్యింది. అయితే మే 23న ఉన్నట్టుండి ఆమె మాయమయ్యింది. అయితే మర్నాడు రోడ్డు పక్కన పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తమ దర్యాప్తులో ప్రాధమికంగా ఆమె నుంచి నగలు లాక్కొని ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వీరి దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు నైనా కన్వర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పోలీసు అధికారి కన్నయ్యాలాల్ మాట్లాడుతూ మే 24న మదన్పురా గ్రామశివారులోని పొదల్లో 28 ఏళ్ల వివాహిత మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందన్నారు. ఆమెపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారన్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మృతురాలు మే 23న రాత్రి పోనులో ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఉదయానికి కూడా ఆమె తిరిగిరాలేదన్నారు. పోను కాల్ డిటైల్స్ ఆధారంగా పోలీసులు ఆ మహిళ మరిదిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారన్నారు. కాగా నైనా భర్త ముంబైలో ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు చదువుల కోసం ననిహాల్లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెకు మరిదితో సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా వారి సంబంధం కొనసాగుతూనే ఉంది. నైనా మరిది దీపక్ ఆమెన్నా 8 ఏళ్లు చిన్నవాడు. అయినా ఆమె చాలాకాలంగా తనను పెళ్లిచేసుకోవాలంటూ దీపక్ను అడుగుతూ వస్తోంది. ఈ విషయమై మే 23న రాత్రి వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో దీపక్ ఆమపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పొదల్లో పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు దీపక్ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నా భార్యను అందుకే హత్య చేశాను’ అంటూ..!
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే దంపతులలో ఎవరైనా వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే వారి బాంధవ్యం బీటలు వారుతుంది. అప్పుడు పరిస్థితులు ఎంతవరకైనా దారితీస్తాయి. ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్ దెహాత్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్య గొంతునులిమి హత్యచేశాడు. తరువాత నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి సరెండర్ అయ్యాడు. అతను పోలీసులకు ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రసూల్బాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని కండవర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి చెందిన ములాయం సంఖ్వార్ భార్య ఖుష్బూ కొన్ని రోజుల క్రితం వారి ఎదురింటిలో ఉంటున్న ఆమె ప్రేమికుడు వివేక్తో పాటు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో ములాయం సంఖ్వార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ ఉదంతం పోలీస్స్టేషన్ వరకూ చేరుకుంది. అక్కడ భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిరిద్దరూ తిరిగి కలిసివుండసాగారు. అయితే భార్య గతంలో ప్రియుడితో వెళ్లిపోయిన విషయాన్ని ములాయం సంఖ్వార్ మరచిపోలేకపోయాడు. దీంతో గత మూడు రోజులుగా భార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ములాయం తన భార్య ఖుష్బూ గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..
దోమలు అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.దోమలు కుట్టడం వలన సాధారణ జ్వరం మొదలుకొని ప్రాణాంతక వ్యాధులు సైతం సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,500 దోమల ప్రజాతులు ఉన్నాయి. వీటిలో చాలా ప్రజాతులు దోమలు మనిషిని కుట్టవు. ఈ తరహా దోమలు పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తుంటాయి. కేవలం ఆరు ప్రజాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఇవి పలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మన దేశంలో దోమల కారణంగా ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. Mosquitoes are the deadliest animal in the world: They kill more people than any other creature, due to the diseases they carry. pic.twitter.com/3v2CxAg8gc — TheFacts (@TheWorldFactsjj) May 27, 2023 దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధులలో మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్ మొదలైనవి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మరణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ మట్టుబెడితే ఏం జరుగుతుందో తెలుసా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దోమలను చంపేందుకు కెమికల్స్ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్ వలన దోమలకన్నా అధికంగా మనుషులకే ముప్పు ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎటువంటి కెమికల్స్ సాయంలేకుండా దోమలను తరిమికొట్టే ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. దీనిలో చాలా దేశాలు విజయం సాధించాయి. మనిషిని కుట్టే ఆడ దోమల జీన్లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతిచెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్ ద్వీపంలో 2009-2010 కాలాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం వలన దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు. అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ప్రకృతి అందించిన ఫుడ్ చైన్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. ఫలితంగానే పూలు పండ్లుగా మారుతాయి. దోమలు కొన్ని ప్రాణులకు ఆహారం వంటివి. కప్పలు, బల్లులు, తొండలు మొదలైనవి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
హయత్నగర్ శివారులో యువకుడి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో
సాక్షి,హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండి కలకలం రేపింది. పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా.. మృతుడు ములుగు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రాజేష్ గా గుర్తించారు. రాజేష్ ఒంటిపై తీవ్ర గాయలు ఉండడంతో మర్డర్ కేస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్య వెనుక ప్రేమవ్యవహారం ఏమైనా ఉందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నల్లగొండ: విమాన డ్రోన్ కలకలం.. ఎయిర్టెల్ సిమ్, సీసీ కెమెరాలు.. -
ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్
ఉక్రెయిన్లో హత్యల జాబితాలో రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నంబర్ వన్ అని, అతను కిల్ లిస్ట్లో అగ్రస్థానంలో ఉన్నాడంటూ ఉక్రెయిన్ మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు రష్యా ఘాటుగా స్పందించింది. మా భద్రత బలగాలకు ఏం చేయాలో తెలుసని వారి పనేంటో కూడా వారికి తెలుసు అంటూ కౌంటరిచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ హెడ్ వాడిమ్ స్కిబిట్క్సీ, ఓ పత్రిక ఇంటర్యూలో ఉక్రెయిన్.. పుతిన్ని చంపేయాలనుకుంటుదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసని, ఉక్రెయిన్ హత్యల జాబితాలో తాను అగ్రస్థానంలో ఉన్నానని పుతిన్కి కూడా తెలుసని అన్నారు. అతను చేస్తున్న చర్యలకు ఏదోఒక రోజు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. తాము అతన్ని సమీపిస్తున్నామని, తన సొంత వ్యక్తులచే చంపబడతాడనే భయం కూడా పుతిన్లో ఉందని స్కిబిట్స్కీ వ్యాఖ్యలు చేశాడు. అంతేగాదు తాము ఇతర రష్యన్లు లక్ష్యగా పెట్టుకున్నామని అందులో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, కిరాయి బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్, మిలిటరీ కమాండర్ సెర్గీ సురోవికిన్ తదితరులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పుతిన్ తన లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని, చాలా సమయం తమ దళాలు రష్యాని నిలువరించాయిని స్కిబిట్స్కీ ధీమాగా చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ విషయమై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ని ఆరా తీసింది సదరు మీడియా. పుతిన్ను రక్షించే చర్యల ముమమ్మరం చేయనున్నారా అని పెస్కోవ్ని ప్రశ్నించింది. మమ్మల్ని నమ్మండి, మా భద్రత సేవలకు తాము ఏం చేయాలో తెలుసు, వారి పనేంటో కూడా తెలుసని సీరియస్ అయ్యారు. సరిగ్గా 15 నెలల క్రితం ఉక్రెయిన్లో రష్యా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం సరైనదని స్కిబిట్స్కీ ఇంటర్యూ చెప్పకనే చెప్పిందని విమర్శించారు. ఒకరకంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ని సమర్థించబడటమే గాక అవసరమైన దానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ద్వారా దాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పెస్కోవ్. కాగా, ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు మాత్రం దీన్ని ఆక్రమణ యుద్ధంగా అభివర్ణిస్తున్నాయి. అంతేగాదు రష్యాపై జరిపిన డ్రోన్ దాడిని కూడా పుతిన్ చంపేందుకు ఉక్రెయిన్ పన్నిట కుట్రగా అభివర్ణించగా, కీవ్ మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం గమనార్హం. (చదవండి: రాకెన్ రోల్ క్వీన్ ఇకలేరు) -
మళ్లీ మొదలు.. మణిపూర్లో టెన్షన్ టెన్షన్, ఇప్పటి వరకు 70 మంది మృతి
ఇంఫాల్: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిపోతోంది. ఇటీవల క్రమంగా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పలు ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ నిబంధనలను కూడా సడలించారు. దీంతో సమస్య సద్దుమణుగుతోందని అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపు తాజాగా మరో సారి అల్లర్ల చెలరేగడంతో మణిపూర్ను భయం గుప్పిట్లోకి నెట్టాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో సుమారు 70 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కాగా ఘర్షణల కారణంగా మంగళవారం మణిపూర్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. కర్ఫ్యూ అమలులో ఉండడంతో ప్రజలు ఇంట్లోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. పరిస్థితులు అదుపులో తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్ సింగ్ వెల్లడించారు. కాగా మణిపూర్లో తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం ఈ సమస్యకు అగ్గి రాజేసింది. ఈ దీంతో అక్కడ నివసిస్తున్న గిరిజనులు భగ్గుమనడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చదవండి: Viral Video: హెల్మట్ ధరించి బైక్పై రైడ్ చేస్తున్న కుక్క -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్హౌస్పై దాడి
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. (చదవండి: నమ్మకమే పునాది) -
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్పై మంత్రి సంచలన ఆరోపణలు..
-
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్పై మంత్రి సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడతామన్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో తన కార్యాలయానికి వచ్చిన సీఎఎస్.. 'నిన్ను చంపేస్తా' అని భయభ్రాంతులకుగురి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగా చీఫ్ సెక్రెటరీ తనను బెదిరిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా భరద్వాజ్ ఫిర్యాదు చేశారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ సైబర్ క్రైం -
ప్రేమ పెళ్లి.. ఇంటికి వచ్చిన కోడలిని గుడికి తీసుకెళ్లి
బీహార్ ఛప్రాలోని పానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధేనుకి చావర్ గ్రామ సమీపంలో 15 రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళ గౌరా ఓపీ పరిధిలోని చందా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ భార్య పూజా కుమారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన అనంతరం మహిళను ఆమె అత్త హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం నితీష్, పూజని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అతని కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా జరిగింది. పెళ్లయిన తర్వాత నితీష్ తన భార్యతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత నితీష్ కుటుంబ సభ్యులు అతనితో పాటు పూజను ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన కొడుకు, కోడలితో నితీష్ తల్లి ఎంతో అప్యాయంగా మాట్లాడింది. కొడుకుకి అనుమానం రాకుండా నితీష్ తల్లి తన స్నేహితులతో కలిసి కోడలిని గుడికి తీసుకెళ్తున్నట్లు చెప్పింది. కోడలిపై కోపం పెంచుకున్న అత్త.. ధనుక గ్రామంలో పూజను హత్య చేసి మృతదేహాన్ని చన్వార్లోని కాలువలో పడేసింది. భార్య అదృశ్యమైన తర్వాత నితీష్ ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పది రోజుల తర్వాత, పూజ మృతదేహాన్ని పోలీసులు కాలువలో కనుగొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ జరపగా పూజను ఆమె అత్త హత్య చేసినట్లు అసలు బండారం బయటపడింది. -
ఇంత దారుణమా!.. ప్రేమించాడని కొట్టి.. పొడిచి చంపేశారు
సాక్షి, నల్లగొండ: మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని కర్రలతో కొట్టి కత్తులతో నరికి చంపేశారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లిలో ఆదివారం జరిగిన దారుణ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలిలా.. త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన విరిగి నవీన్ (21) చదువును మధ్యలోనే మానేసి మిర్యాలగూడలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈట నాగయ్య కుటుంబం మిర్యాలగూడలోనే నివాసం ఉంటూ అక్కడే కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఈయన కుమార్తె, నవీన్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఏడాది కిందట తెలియడంతో అమ్మాయిని మర్చిపోవాలని లేకుంటే హత్య చేస్తామని ఆమె కుటుంబసభ్యులు బెదిరించారు. అందుకు వెరవకుండా నవీన్ తాము పెళ్లి చేసుకుంటామని వారికి చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నవీన్ గుంటిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు అనిల్, తిరుమల్తో కలిసి ఊళ్లో ఓ ఇంటి వద్ద మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారంపై మాట్లాడుకుందామని అమ్మాయి తరఫు బంధువులకు నవీన్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా.. అమ్మాయి తరఫు బంధువులైన జి.అన్నారం గ్రామానికి చెందిన మర్రి రాజు, లింగంపల్లి రాజేష్, కొడదల శివప్రసాద్, తాళ్ల నవదీప్, మణితేజ్తో పాటు మరికొంత మంది మూడు బైక్లపై కత్తులు, వేట కొడవళ్లు కర్రలతో గుంటిపల్లికి చేరుకున్నారు. స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న నవీన్పై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అనిల్, తిరుమల్ భయంతో పారిపోగా పరుగెత్తుతున్న నవీన్ను వారు వెంటాడి కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సీఐ గాంధీ నాయక్ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడి మిత్రుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ శోభన్బాబు తెలిపారు. -
ఎంత దారుణం.. మార్కెట్లో ప్రవేశించి 47 మందిని కాల్చి చంపారు!
ఆఫ్రికాలోని నైజీరియాలోని సాయుధులు నరమేధానికి తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో సాయుధులు 50 మందిని దారుణంగా చంపారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు. కాగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ రెండు దాడులకు సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో.. ఫులానీ మూలానికి చెందిన పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని "నైజీరియా ఆహార బుట్ట"గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది. -
బీజేపీ నేత దారుణ హత్య.. ఎక్కడినుంచి వచ్చారో గానీ రెప్పపాటులో..
పుదుచ్చేరిలో బీజేపీ నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వ్యవహారాలను కార్యకర్త సెంథిల్ కుమారన్ చూసుకునేవాడు. దీంతో పాటు అతను రియల్ ఎస్టేట్ డీల్స్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఇతర వ్యాపారాలను నడుపుతుండేవాడు. అయితే ఆదివారం రాత్రి కొందరు దుండగులు హఠాత్తుగా వచ్చి రెప్పపాటు సమయంలో బాంబు విసిరి, కుమారన్పై మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపారు. విలియనూర్లోని కన్నకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న బేకరీ దగ్గర నిలబడి ఉండగా ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కామారన్ని ప్రత్యర్థులు హత్య చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏడుగురు వ్యక్తులు ఈ హత్యకు సంబంధించి తిరుచ్చి కోర్టు ముందు లొంగిపోయినట్లు సమాచారం. -
ఇంట్లో భర్తని హత్య చేసి.. ఎవరూ రాకుండా కరెంట్ పెట్టి.. 5 రోజులుగా
రాంచీ: మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ, తన భర్తను హత్య చేసింది. ఇరుగు పొరుగు వారికి ఆమెపై అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను చేపట్టారు. ఈ ఘటనలో, జార్ఖండ్లోని జంషెడ్పూర్లోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్య చేసి.. ఇంట్లోనే 5 రోజులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్నాథ్ సింగ్ మామిడిలోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని సుభాష్ కాలనీలోని రోడ్- 3లో కొంత కాలంగా నివస్తిస్తున్నాడు. అతని భార్య మీరాకు మానసికస్థితి సరిగా లేదు. దీంతో తరచూ వారిమధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆమె అమర్నాథ్ను హత్య చేసింది. అయితే కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో అమర్నాథ్ కనిపించలేదు. దీంతో ఇరుగు పొరుగు అతని ఇంటికి వెళ్లి మీరాను అడిగారు. అందుకు ఆమె వింతగా ప్రవర్తించేది. అంతేకాకుండా ఇరుగుపొరుగువారు లోపలికి రాకుండా సింగ్ భార్య ఇంటి కంచెకు కరెంట్ కూడా పెట్టింది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దర్వాసన రావడంతో స్థానికులు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ కనెక్షన్ను ఆఫ్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో అమర్నాథ్ హత్య బయటపడింది. స్థానికులు దీని గురించి పోలీసులతో పాటు పుణెలో ఉంటున్న అమర్నాథ్ కుమారుడికి తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా
తిరుత్తణి(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆర్కేపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చంద్రవిలాసపురం పంచాయతీలోని సుందర్రాజుపురానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతనికి అదే గ్రామానికి చెందిన మేనమామ కుతూరు గాయత్రి (22)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో గాయతి తిరుత్తణిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో తిరుత్తణికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. భర్త అనుమానంతో పనులకు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో రెండు గదుల్లో వేర్వేరుగా భార్యభర్త నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో గాయత్రి గదిలో మరో యువకుడి ఉండడాన్ని గుర్తించిన యువరాజ్ వారిని నిలదీశాడు. ఈ క్రమంలో గాయత్రి ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసి అక్కడు నుంచి పరారైనట్లు తెలుస్తోంది. యువరాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆర్కేపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకుని పరారైన ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. -
ప్రేమ వివాహం.. కొండపైకి తీసుకెళ్లి
వేలూరు(చెన్నై): వేలూరు సమీపంలోని బాలమది కొండపై బండ రాళ్ల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. బాగాయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చిదంబరానికి చెందిన గుణప్రియ(20) అని తెలిసింది. దీంతో చిదంబరంలోని గుణప్రియ తల్లిదండ్రులకు సమాచారం అందజేయడంతో వారు వేలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. వేలూరుకు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కుమారుడు కార్తీ(22)తో 8 నెలల క్రితం గుణప్రియకు ప్రేమ వివాహం జరిగిందని.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కార్తీ గుణప్రియను కొండపైకి తీసుకెళ్లి దాడి చేసి అక్కడి నుంచి తోసేసినట్లు తెలిసింది. పోలీసులు కార్తీని అదుపులోకి తీసుకుని విచారించారు. గుణప్రియ చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు ఇన్స్ట్రాగామ్ ద్వారా తనకు పరిచయమైందని తెలిపాడు. దీంతో తామిద్దరం 8 ఎనిమిది నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నామన్నాడు. తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వేలూరులోని జీవా నగర్లో స్నేహితుడి ఇంటిలో అద్దెకు ఉన్నామని తెలిపాడు. ప్రస్తుతం గుణప్రియ ఆరు నెలల గర్భవతి అని.. ఈ విషయం తన ఇంట్లో చెప్పి తీసుకెళ్లాలని గొడవ పడేదని చెప్పాడు. దీంతో ఈనెల 25వ తేదీ బాలమది కొండపైకి వెళ్లామని.. అక్కడ కూడా ఘర్షణ జరిగిందని కోపంతో కర్రతో కొట్టడంతో మృతి చెందిందని వివరించాడు. చేసేది లేక కొండపై నుంచి మృతదేహాన్ని తోసి ఎవరికీ తెలియకుండా ఇంటికి వచ్చానని ఒప్పుకున్నాడు. చదవండి: వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం! -
అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.. సడన్గా వారి మధ్య..
రాయగడ: అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్న స్నేహితులు మధ్య మాటామాటా పెరిగింది. మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. జిల్లాలోని అంబోదల పోలీస్ స్టేషన్ పరిధి గడియాఖాల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గడియాఖాల్ గ్రామానికి చెందిన లుసిలి మాఝి(25), కిర్జో మాఝి(26) స్నేహితులు. శనివారం ఉదయం కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తూ అలవాడు ప్రకారం ఈత కళ్లు తెచ్చుకొని పొలం సమీపంలో తాగుతున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన లుసిలి.. ఒక కర్ర సాయంతో కిర్జోపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిర్జో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. చదవండి: మాయలేడి: సోషల్ మీడియాలో యువకులకు వల.. నమ్మించి జేబు ఖాళీ -
రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత
భోపాల్: కాంగ్రెస్ నేత రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మద్దతుదారులతో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని నరేంద్ర మోదీని లేకుండా చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ మహాత్మా గాంధీకి చెందిన పార్టీ కాదని, ఇటలీ ముస్సోలిని పార్టీ అని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఆయన సిద్ధాంతాలనే పాటిస్తోందని మధ్యప్రదేశ్ కమలం పార్టీ నేత నరోత్తమ్ మిశ్రా ధ్వజమెత్తారు. అయితే తన వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చారు. మోదీని లేకుండా చేయాలనేది తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో ఓడించాలనేదే తన మాటల్లోని అంతరార్థం అని చెప్పుకొచ్చారు. వీడియో తీసిన వ్యక్తి ఎవరో తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. మోదీని లేకుండా చేయడమంటే, అధికారం నుంచి గద్దె దించడమేనని వివరించారు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి అయిన రాజా పటేరియా సోమవారం తన మద్దతుదారులతో మాట్లాడుతూ మోదీపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటలకే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. यह है @INCIndia का असली चेहरा पूर्व मंत्री व कांग्रेस नेता श्री राजा पटेरिया मोदी जी की हत्या का बयान देकर समाज को विभाजित कर भड़काऊ भाषण दे रहे है @BJP4India @BJP4MP @vdsharmabjp @HitanandSharma @LokendraParasar pic.twitter.com/XfJ0EApASx — Rajpal Singh Sisodiya (@rpssisodiya) December 12, 2022 చదవండి: రొటీన్కు భిన్నంగా ఆలోచించండి.. ఇంకెన్నాళ్లు ఇలా? -
అయ్యో.. ఎంత ఘోరం, స్నేహితులే చంపేశారు!
యశవంతపుర: డబ్బుల విషయమై యువకున్ని అతని స్నేహితులే హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరె ఎపిఎంసీ యార్డులో జరిగింది. ఓంకార, విజయ్, సునీల్, ధనరాజ్లు మంచి స్నేహితులు. ఫైనాన్స్ వ్యవహారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న ఓంకార (30)ను మిగతా ముగ్గురు ఎపిఎంసీ యార్డుకు పిలుపించుకున్నారు. డబ్బు గురించి చర్చిస్తూ గొడవకు దిగారు. ఓంకారను సునీల్, ధనరాజ్, విజయ్లు తలపై బండరాయితో బాది హత్య చేశారు. ముగ్గురు నిందితులను తరీకెరె పోలీసులు అరెస్ట్ చేశారు. -
తండ్రిని చంపి ముక్కలుగా.. సాయం చేసిన తల్లి
దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసు మరువక మునుపే అచ్చం అలాంటి ఉదంతమే పశ్చిమ బెంగాల్ చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ నిందితుడు ప్రియురాలిని 35 ముక్కలుగా చేస్తే....ఇక్కడొక ఒక కొడుకు కన్న తండ్రేని హతమార్చి ఆరు ముక్కలుగా కోసేశాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కోల్కతలాని బరుయ్పూర్ ఉంటున్న రిటైర్డ్ నేవీ ఆఫీసర్ 55 ఏళ్ల చక్రవర్తి కన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. అతను 2000లో రిటైర్ అయ్యారు. ఒక ఎగ్జామ్ ఫీజు విషయమై తలెత్తిన వివాదం హత్య చేసేందుకు దారితీసింది. ఆ అధికారి కుటుంబ సభ్యల మధ్య ఎగ్జామ్ ఫీజు చెల్లింపు విషయమై వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కోపంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత అతన్ని ఆరు ముక్కలుగా కోసి తమ ఇంటికి సమీపంలో వేరు వేరు చోట్ల పడేశాడని చెప్పారు. అందుకు అతడి తల్లి సహకరించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏమి ఎరుగనట్లుగా పోలీసులకు నవంబర్ 15న మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న తాము ఆ తల్లి కొడుకులను గట్టిగా విచారించగా...అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యామని పోలీసులు చెబుతున్నారు. తామే హత్య చేసి ముక్కలుగా కోసి పడేసినట్లు తల్లి కొడుకులు ఒప్పుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించే విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడని..తట్టుకోలేక ఈ దారుణానికి నిందితుడు ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్తో చుట్టి సైకిల్పై తీసుకువెళ్లి పడేసినట్లు తెలిపాడు. బాధితుడి శరీర భాగాలను చెరువు సమీపంలో చెత్త డంప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసలు తెలిపారు. మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే విచారణలో బాధితుడు తరచు తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి కొడుకులిద్దర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు. (చదవండి: చెప్పకుండా పెళ్లి చేసుకుందని...కన్న తండ్రే కాలయముడిలా...) -
మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి దోచేశారు!
విజయనగర్కాలనీ(హైదరాబాద్): లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ ఆర్.జి.శివమారుతి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రాయణగుట్టకు చెందిన కె.జయంత్ ప్రైవేటు స్కూల్ టీచర్, ఈ నెల 6న సాయంత్రం రాజేంద్రనగర్ నుంచి మెహిదీపట్నం వైపు బైక్పై వెళుతున్నాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 294 వద్ద ఆగాపురాకు చెందిన మహ్మద్ షాహిద్ అలియాస్ సైఫ్ అనే వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని అర్జంట్గా వెళ్లాలని మోహిదీపట్నం వరకు లిఫ్ట్ అడిగి ఎక్కాడు. మెహిదీపట్నం పిల్లర్ నెంబర్ 28 వద్దకు రాగానే పక్కనే ఉన్న గల్లీలో దించాలని కోరాడు. అప్పటికే అక్కడ ఉన్న షాహిద్ స్నేహితులు షేక్ అక్రమ్, మహ్మద్ నసీర్ ముగ్గురు కలిసి జయంత్ను భోజగుట్ట స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు లాక్కున్నారు. అతని ఫోన్ నంబర్ తీసుకుని బెదిరించి పలు దఫాలుగా గూగుల్ పే ద్వారా రూ.51 వేలు బదిలీ చేయించుకున్నారు. ఈ నెల 13న బాధితుడు ఆసిఫ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఆసిఫ్నగర్ ఇన్స్పెక్టర్ జీహెచ్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్.ఐ. కె.శ్రీనివాసతేజ, క్రైమ్ సిబ్బంది టి.రవీంద్రనాథ్, బి.విద్యాసాగర్, జె.అచ్చిరెడ్డి, జి.రాహుల్, బి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంపేసి శవాన్ని సొంతూరుకు సాగనంపి..) -
2022 హీట్ దెబ్బ.. వేల మంది దుర్మరణం
కోపెన్హగ్: మునుపెన్నడూ లేని రేంజ్లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. జూన్ నుంచి ఆగష్టు మధ్య యూరప్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్వో రీజినల్ డైరెక్టర్ ఫర్ యూరప్ అయిన హాన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. స్పెయిన్లో 4వేల మరణాలు, పోర్చుగల్లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు బ్రిటన్కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది. ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం -
క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు
అగర్తల: క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. సొంతవారినే పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు. ఆ తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ధలాయ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు బాలుడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ‘ఓ మైనర్ బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.’ అని త్రిపుర పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్ పెంచి మ్యూజిక్ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: యాక్సిడెంట్గా చిత్రీకరించి మర్డర్కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీర్ మృతి -
ఘోరం: పేగులు బయటకొచ్చేలా పొడిచి....
దీపావళికి రెండు రోజుల ముందు ఒక దారుణ ఘటన చోటుచోసుకుంది. అక్టోబర్ 22 తేదిన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ...బస్సుకోసం ఎదురు చూస్తున్న వ్యక్తిపై కొందరూ వ్యక్తుల దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఏకంగా పేగులు బయటకొచ్చేలా 12 సార్లు కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి వాలెట్, ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని ఆస్పత్రిక తరలించగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. బాధితుడుని హర్షగా పోలీసులు గుర్తించారు. ఐతే హర్హ కుటుంబికులకు అతను మృతి చెందినట్లు మరసటి రోజు వరకు తెలియరాలేదన్నారు. హర్షే తన కుటుంబానికి జీవనాధారం అని, అతను అందరికి సహాయకారిగా ఉంటాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితుడి కుటుంబం తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీఫుటేజ్లు లేకపోవడంతో వారిని అరెస్టు చేయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని రైలు కిందకు తోసేసి..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు. నిందితుడ్ని అలందూర్కు చెందిన సతీశ్గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు. యువతికి నిశ్చితార్థం.. మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి -
మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు
ముంబై: ఒక మాజీ మంత్రి హిందుమతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక వ్యక్తిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ మేరకు ముంబై పోలీసులు సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజపాల్, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు సదరు వ్యక్తి తాను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండు వీడియోలను ఎన్సీప్ నాయకుడికి పంపించడంతో వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని వాపోయాడు. భుజపాల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని యోలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాదు ఆయ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు. (చదవండి: నామినేషన్ సమర్పించిన మరునాడే రాజీనామా చేసిన ఖర్గే) -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి ఇంట్లో..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకుడిని హత్య చేసిన వివాహిత, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం శారదాంబాల్ వీధికి చెందిన సౌందర్య కోడంబాక్కం మండలం 132 వార్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులతో నివాసముంటోంది. వీరితో ఆమె అక్క కుమారుడు కూడా ఉంటున్నాడు. ఇటీవల సౌందర్యకు ఆమె మాజీ భర్త స్నేహితుడు విజయ్ (27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సౌందర్య ఇంట్లో విజయ్ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అందులో.. సౌందర్యకు అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌందర్య తన ప్రియుడు ప్రభుతో కలిసి ఇంట్లో ఉన్న విజయ్ అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
ప్రేమ పెళ్లి, గల్ఫ్ వెళ్లి ఏడాది కిందట వచ్చాడు.. ఏమైందో గానీ
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం): ఇద్దరూ ప్రేమించుకున్నా రు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కలకాలం తోడుంటాడని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె ప్రాణం తీ శాడు. ఏ చేత్తో తాళి కట్టాడో అదే చేతితో భార్య ను హతమార్చాడు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామం కుమ్మరి వీధికి చెందిన నర్సింగ బెహరా మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన భవానీ బెహరా(25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత గల్ఫ్ వెళ్లిన నర్సింగ ఏడాది కిందట మళ్లీ స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఒక గుడిసెలో కాపురం ఉంటున్నారు. ప్రేమ వివాహమే అయినా నర్సింగ తరచూ భార్యతో గొడవపడేవాడు. అత్తామామలతోనూ సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నర్సింగ సహనం కోల్పోయి ఇంటిలో ఉన్న డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేసి కర్కశంగా దాడి చేశాడు. దీంతో ఆమె ముఖమంతా నుజ్జునుజ్జైపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను హుటాహుటిన ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అక్కడి నుంచి బరంపురం రిఫర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవానీ మృతి చెందింది. ఈ విష యం తెలుసుకున్న భర్త ఇంటి వద్ద బ్లేడ్తో గంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడిని 108లో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసు గల ఓ కుమారుడు ఉన్నాడు. సీఐ డీవీవీ సతీష్బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర! -
వివాహేతర సంబంధం: మహిళ సోదరుడికి తెలియడంతో..
రాయచూరు రూరల్(బెంగళూరు): జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కకొట్నేకల్లో శుక్రవారం సాయంత్రం వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణపై ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. మాన్వి పోలీసుల వివరాలు.. వీరేష్(25) అనే యువకుడిని హనుమేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. హనుమేష్ సోదరితో వీరేష్ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఇది గమనించిని హనుమేష్ అతని తీరు మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. అయితే ఆ మాటలను వీరేష్ పట్టించుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆ యువకుడిని హత్య చేశాడు హనుమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటప్ప నాయక్ తెలిపారు. చదవండి: 19 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన మహిళ.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి -
అల్లరి చేసింది.. చెప్పినా వినలేదని కూతురి తలపై..
వేలూరు(చెన్నై): ఇంట్లో అల్లరి చేస్తోందని ఆగ్రహించిన తల్లి కన్న కూతురిపై కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరువణ్ణామలై సమీపంలోని అరట్టాపట్టు గ్రామానికి చెందిన భూపాలన్ కూలీ కార్మికుడు. ఇతని భార్య సుకన్య. వీరికి పిల్లలు ప్రసన్న దేవ్, రితిక (06) ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సుకన్య, భూపాలన్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండంతో సుకన్య అమ్మగారింట్లో పిల్లలతో జీవిస్తోంది. మంగళవారం ప్రభుత్వ సెలవు రోజు కావడంతో ఇద్దరు పిల్లలు ఇంట్లో ఆట్లాడుకుంటూ అల్లరి చేస్తున్నారు. పలుమార్లు పిల్లలకు సర్ధిచెప్పినా వినకపోవడంతో ఆగ్రహించిన సుకన్య ఇంట్లో ఉన్న కర్రతో రితిక తలపై కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దహన క్రియలు చేసేందుకు అమ్మగారింటికి తీసుకెళ్ళింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భూపాలన్కు సమాచారం అందించారు. భూపాలన్ తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తల్లి సుకన్యను అరెస్టు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం -
వివాహేతర సంబంధానికి కూతురు అడ్డొస్తుందని.. సొంత అన్నతో కలిసి
సాక్షి, వరంగల్: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్ 100కు సమాచారం అందించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అల్ ఖైదా చీఫ్ అల్-జవహరి హతం
-
ప్రేమ పెళ్లి, మూడేళ్లు సంసారం.. బయటకు వెళ్దామని తీసుకెళ్లి..
తిరువళ్లరు(చెన్నై): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు సంసారం చేశాడు. ఆ తరువాత వరకట్నం కోసం భార్యను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో భార్యను చిత్తరు జిల్లా నారాయణవనం కైలాసకోనకు తీసుకెళ్లాడు. హతమార్చి మృతదేహం కనిపించకుండా మాయం చేశాడు. వివరాలు.. తిరువళ్లరు జిల్లా సెంగుడ్రం ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సజావుగా సాగిన వీరి సంసారం, వరకట్నం వేధింపుల వైపు వెళ్లింది. వరకట్నం తేవాలంట మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో గత జూన్ 25న తమిళ్సెల్వి మాయమైంది. దీంతో ఆందోళన చెందిన తమిళ్సెల్వి తల్లిదండ్రులు మణిగండన్, పల్గీస్ సెంగుడ్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అసిస్టెంట్ కమిషనర్ మురుగేషన్, ఇన్స్పెక్టర్ రమేష్ తమిళ్ సెల్వి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కైలాసకోన వైపు కదిలిన కేసు విచారణలో భాగంగానే పోలీసులు మదన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గత నెలలో తమిళ్సెల్వితో కలిసి చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసకోనలోని కొండపైకి వెళ్లానని, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. కోపంలో కత్తితో తమిళ్సెల్విపై దాడి చేశానని.. తీవ్రంగా గాయపడడంతో అక్కడే వదిలేసి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రాలో పోలీసుల దర్యాప్తు మదన్ ఇచ్చిన వాగ్మూలంతో సెంగుండ్రం పోలీసుల బృందం 20 రోజుల క్రితం కైలాసకోనకు వెళ్లింది. నారాయణవనం పోలీసుల సాయంతో కైలాసకోన కొండపై గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొండపైకి తమిళ్సెలి్వ, మదన్ జంటగా వెళ్లినట్టు నిర్ధారించారు. సుమారు రెండు గంటల తరువాత మదన్ ఒంటరిగా వచ్చినట్లు వీడియోలో రికార్డయింది. కానీ మృతదేహాం కనిపించకపోవడంతో విచారణలో పురోగతి కనిపించలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేసినా ఫలితం కనిపించలేదు. గత నెలలో మదన్ ఫోన్లో ఎక్కువ సార్లు మాట్లాడిన సంతోష్, బందారవిని సైతం విచారణ చేశారు. అయినా తమిళ్సెల్వి ఆచూకీ గుర్తించలేకపోయారు. చదవండి: భార్యను ఏడు గంటల పాటు చెట్టుకి కట్టి...చిత్రహింసలకు గురి చేసి.. -
ఆమె సౌందర్యమే శాపమైంది
శివాజీనగర(బెంగళూరు): నగరంలోని కెంపేగౌడ నగరలో భార్యపై యాసిడ్ దాడి చేసి ఆమె మరణానికి కారణమైన భర్తకు కోర్టు జీవితఖైదును విధించింది. అందంగా ఉండడంతో పరపురుషులు మోహిస్తారనే అనుమానం అతన్ని కిరాతకునిగా మార్చింది. వివరాలు.. 2017 జులై 14న కెంపేగౌడనగర సన్యాసిపాళ్య ఇంట్లో మంజుల అనే మహిళపై భర్త చెన్నేగౌడ యాసిడ్ దాడి చేశాడు. ఆమె అందంగా ఉందని, అందరూ ఆమెను చూస్తారని నిత్యం గొడవలు పడి వేధించేవాడు. దీంతో ఆమె చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. అయినప్పటికీ అక్కసు తీరని చెన్నేగౌడ ఆమెపై యాసిడ్ పోశాడు. మంజులకు తీవ్ర గాయాలు కాగా, విక్టోరియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఐదు రోజుల తరువాత నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో 46వ సీసీహెచ్ కోర్టు అతనికి జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. -
జేజే నగర హత్యకేసు: ప్రమాదం కాదు.. చికెన్కబాబ్ తినడానికి హోటల్కు వెళ్తే..
బనశంకరి(బెంగళూరు): జేజే.నగర చంద్రు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత అందరూ అనుకున్నట్లుగా అతని మృతికి బైక్ ప్రమాదం కాదని, ఉర్దూ భాషలో మాట్లాడలేదని హత్య చేశారని సీఐడీ కోర్టుకు అందజేసిన 179 పేజీల చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న స్నేహితుడు సైమన్ పుట్టినరోజు వేడుకల్లో చంద్రు పాల్గొన్నాడని, అనంతరం ఇద్దరూ చికెన్కబాబ్ తినడానికి హోటల్కు వెళ్లారని పేర్కొంది. హోటల్ పక్కన బైకు పార్కింగ్ చేసి బేకరిలోకి వెళ్లే సమయంలో సైమన్, చంద్రుకు షహీన్ అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ సమయంలో షహీన్ ఉర్దూలో తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో చంద్రు, సైమన్లు షహీన్తో గొడవపడ్డారని, ఈక్రమంలో చంద్రు హత్యకు గురైనట్లు సీఐడీ తన చార్జ్షీట్లో పేర్కొంది. చదవండి: వింత ఆచారం.. వాళ్ల సమాధులకు నీరు పోస్తే వానలు! -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి..
భువనేశ్వర్: భార్య తలను నరికి చేతిలో పట్టుకొని 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఒక పైశాచిక భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరపూర్ గ్రామానికి చెందిన నక్కొఫొడి మాఝి అక్రమ సంబంధం అనుమానంతో తన భార్య సుచల మాఝిని పైశాచికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకొని పోలీసులకు లొంగిపోవడానికి కాలి నడకన బయల్దేరాడు. జొంఖిరా గ్రామం ప్రధాన రహదారిపై నిందితుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన భార్యకు అక్రమ సంబంధం ఉండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలియజేశాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కత్తితో పీకకోసి చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి -
హత్య వెనుక అసలు నిజం దాచిన ఇన్స్పెక్టర్.. రెండేళ్ల తర్వాత..
సాక్షి, చెన్నై: హత్య కేసును ఆత్మహత్యగా మార్చేసిన ఓ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు వేస్తూ తిరునల్వేలి డీఐజీ ప్రవేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆర్ముగనేరి స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాలాజీ పనిచేస్తున్నారు. ఈయన రెండేళ్ల క్రితం తిరుచ్చి జిల్లా సెందురై స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో శ్రీవిశ్వపురంలో రౌడీ కాశి రాజన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఇది హత్య అనే ఆరోపణలు వచ్చినా, కేసును మాత్రం ఆత్మహత్యగా మార్చేసి ముగించాడు. విషం తాగి మరణించినట్టుగా నిర్ధారించేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు హోరెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అక్కడి నుంచి బాలాజీని ఆర్ముగనేరికి బదిలీ చేశారు. విచారణలో కాశి రాజన్ మరణం వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్టు వెలుగు చూసింది. కాశి రాజన్ వెన్నంటి ఉన్న వారే హతమార్చినట్టు వెలుగు చూసింది. ఈ కేసులో ఏడుగురిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. హత్యను ఆత్మహత్యగా మార్చేసిన ఇన్స్పెక్టర్ బాలాజీని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇన్స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి.. -
కార్మికుడి మృతి కేసులో మరో మలుపు
తిరువొత్తియూరు: వలసరవాక్కం ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్మికుడి మృతి కేసు మరో మలుపు తిరిగింది. విచారణలో లైంగిక వాంఛ తీర్చమని వేధించిన భర్తను భార్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వలసరవాక్కం సమీపం కైగాంకుప్పం వీసీ వీధికి చెందిన కుమార్ (48) కూలీ కార్మికుడు. అతని భార్య విజయ ఇంటి పని చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన కుమార్ తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. గత మూడో తేదీ అనుమానాస్పద రీతిలో కుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలో మృతుడి గొంతుపై కమిలిన గాయం ఉండడంతో పోలీసులు విజయను విచారణ చేయగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. చదవండి: చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్ -
ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి..
వేలూరు: తిరుపత్తూరు జిల్లా సెవ్వాత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పుదూరు గ్రామానికి చెందిన సెల్వరాజ్ ఓ ప్రైవేటు కంపెనీలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రామరోజ అలియాస్ రాణి(50). ఈమె కుమారుడు ఏయుమలై, భార్య హంస దంపతులకు 10 నెలల కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా గత నెల 29వ తేదీన సెల్వరాజ్ డ్యూటీకి వెళ్లాడు. ఇంటి హాలులో రాణి, తన గదిలో కోడలు హంస నిద్రించారు. గురువారం ఉదయం రాణి రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో హంస తరచూ ఒక యువకుడితో సెల్ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించి.. ప్రశ్నించారు. హంస హైస్కూ ల్ చదువుతున్న సమయంలో గున్నచ్చి మోటూరు గ్రామానికి చెందిన కార్తికేయన్ కలిసి చదువుకుంది. గత నెల 30వ తేదీ రాత్రి అత్త కోడలి మధ్య ఉదయం ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై వాదనలు జరిగాయి. దీంతో కోడలు హంస ఆగ్రహం చెంది తన స్నేహితుడు కార్తికేయన్ను రప్పించి అత్త రాణిని హత్య చేసింది. మృత దేహాన్ని అక్కడే వదిలి పెట్టి ఏమీ తెలియనట్లు నాటకం ఆడారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. చదవండి: ఉద్యోగం లేదు.. పెళ్లి కాలేదు.. 24వ అంతస్తు నుంచి దూకిన యువతి -
ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని..
ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు. వారిది ఆత్మహత్య కాదు హత్య.. సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. ఈ నెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా.. అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉండడంతో, వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారి లేక కుటుంబంతో సహా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది. కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి! ఆ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య కాదని, విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్త నిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహ్మద్ అలీ అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్తాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైన కోణం కూడా దాగుందా అని పోలీసులు భావిస్తున్నారు. -
రెండున్నరేళ్ల నుంచి వివాహేతర బంధం.. రాత్రి నిద్రపోతుంటే..
సాక్షి,కేసముద్రం(మహబూబాబాద్): వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామశివారు చెరువు కొమ్ముతండాలో ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తను చంపిదో మహిళ. ఈమేరకు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుకొమ్ముతండాకు చెందిన బానోత్ వీరన్న 15 ఏళ్ల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి శివారు జగ్గుతండాకు చెందిన వినోదను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కలుగలేదు. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తండాకు చెందిన అజ్మీర నరేశ్తో వినోద వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలో తండా పెద్ద మనుషుల మధ్య వీరన్న పంచాయితీ కూడా పెట్టాడు. అనంతరం వీరన్న, వినోద, నరేశ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వినోద పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి రావాలని వీరన్న పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయినా వినోద రాకుండా.. ఆళ్లపల్లి పోలీస్స్టేషన్లో భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ భర్తతో ఉండలేనని, అతడిని ఎలాగైనా చంపాలని వినోద తన ప్రియుడు నరేశ్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో వీరన్నను చంపేందుకు తన స్నేహితులైన కురవి మండలం కంచర్లడూడెం తండాకు చెందిన బానోత్ సుమన్, నారాయణపురం శివారు చెరువుకొమ్ముతండాకు చెందిన దారావత్ రాంబాబు, దేవాతో నరేశ్ చేయి కలిపాడు. వీరంతా కలిసి ఈనెల 21న అర్ధరాత్రి నిద్రిస్తున్న వీరన్న మెడ చుట్టూ తాడు బిగించి చంపేశారు. పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వీరన్నను నరేశ్, అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి వినోద హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దీంతో సోమవారం హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య వినోద పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు రమేశ్బాబు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
భార్యను కడతేర్చి బకెట్లో పెట్టి.. ఆపై నాంపల్లికి వెళ్లి..
సాక్షి,హైదరాబాద్: ఏం జరిగిందో ఏమోగానీ నిండు నూరేళ్లు తోడుగా కలిసి ఉంటానని చెప్పిన భర్తే చివరికి ఆమె పాలిట యముడిగా మారాడు, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటూ జీవీకే మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతుండగా నిన్న(సోమవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో ముంచి హత్య చేసి అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు గమనించి మృతదేహాన్ని పోస్టమార్టం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నాడు. దీంతో నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రేమ్ నగర్ లోని వారి నివాసం ఉంటున్న గదికి తాళం వేసి ఉండగా తాళాలు పగలగొట్టి భార్య మృతదేహానికి పోస్టమార్టం జరిపించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. చదవండి: ఉద్యోగం మానేసి మరీ ప్రియుడికి దగ్గరైన సారిక.. -
సంచలనం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు ప్లాన్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు జరిగిన కుట్ర జరిగింది. ఈ హత్యకు పాల్పడాలని అనుకుంది ఎవరో కాదు.. యువ నటుడు ర్యాన్ గ్రాంథమ్(24). తల్లి హత్యకేసులో నిందితుడిగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ర్యాన్ గ్రాంథమ్.. ఈ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రివర్డేల్’, ‘డెయిరీ ఆఫ్ ఏ వింపీ కిడ్’ ఫేమ్ ర్యాన్ గ్రాంథమ్.. కెనడా ప్రధాని ట్రూడో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. 2020 మార్చి 31వ తేదీన స్క్వామిష్ టౌన్హౌజ్లో తన ఇంట్లో తల్లి బార్బరాను తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసు బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తల్లిని హత్య చేసిన తర్వాత.. తన కారులో ఆయుధాలను, మందు గుండును, మ్యాప్ సాయంతో కెనడా రిడ్యూ కాటేజ్ వైపు బయలుదేరాడు గ్రాంథమ్. అక్కడే ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల స్టేట్మెంట్లో గ్రాంథమ్ నిర్ధారించాడు కూడా. ఇదిలా ఉంటే.. గ్రాంథమ్ మానసిక స్థితి బాగోలేదని, చాలా కాలంగా డిప్రెషనలో ఉన్నాడని, ప్రధాని నివాసంలో తాను సృష్టించాలనుకున్న నరమేధం తాలుకా ట్రయల్స్లో భాగంగానే.. తల్లిని హతమార్చి ఉంటాడని ప్రాసెక్యూటర్ డోన్నెల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే తాను వాన్కోవర్ పోలీసులకు లొంగిపోవాలనే వెళ్లినట్లు నిందితుడి తరపున ప్రాసిక్యూటర్ వాదించారు. రివర్డేల్లోనూ ర్యాన్ పాత్ర ‘కిల్లర్’ కావడం గమనార్హం. -
పిల్లలు ఎవరూ లేని సమయం చూసి.. ఇంట్లోకి చొరబడి..
మండ్య(బెంగళూరు): పట్టపగలే మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపారు. మండ్య జిల్లా కిక్కేరిలో చోటు చేసుకుంది. పట్టణంలో మెడికల్స్ స్టోర్ను నడుపుతున్న దివంగత శ్రీకాంత్ భార్య పుష్పలత (45) హతురాలు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బుధవారం ఇంట్లో పిల్లలు ఎవరూ లేని సమయంలో చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను గొంతుకోసి పరారయ్యారు. రక్తపు మడుగులో ఆమె మృతదేహం పడి ఉంది. పట్టపగలే హత్య కావడంతో కిక్కేరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి గొడవలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి. కిక్కేరి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. చదవండి: Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..
తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం, ఆహారంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం జిల్లా కొళత్తూరు సమీపంలోని కారైకాడు వీరభద్ర న్ కొట్టాయంకి చెందిన శక్తివేల్ (37) కార్మికుడు. ఇతను మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని తమ్ముడు ముత్తుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో శక్తివేలు భార్య పుగలరసి (37)కు అదే ప్రాంతానికి చెందిన ముత్తుకుమార్తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ సంగతి తెలుసుకున్న శక్తివేల్ భార్యను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి సోమవారం రాత్రి ఆహారంలో విషం కలిపి ఇచ్చి భర్తను పుగలరసి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పుగలరసి, ముత్తుకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
దారుణం: పెళ్లి చేయలేదని తండ్రి గొంతు కోసిన కొడుకు
సాక్షి,నిర్మల్చైన్గేట్(అదిలాబాద్): తనకు పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో ఓ కొడుకు. జిల్లాకేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ జీవన్రెడ్డి కథనం ప్రకారం.. పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి.. ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీస్లో ఉద్యోగం చేసి విరమణ పొందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య గొడవ జరిగింది. కోపాద్రికుడైన అన్వేష్ తండ్రి గణపతి మెడపై కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలిక హత్య.. మూడేళ్ల తరువాత..
తుమకూరు(బెంగళూరు): కొరటిగెరె వద్ద గొరవనహళ్ళి లక్ష్మిదేవి అమ్మవారి ఆలయం సమీపంలో మూడేళ్ల కిందట 17 ఏళ్ల బాలికను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసును ఇప్పటికి పోలీసులు ఛేదించారు. బెళగావికి చెందిన రూపేష్ (32) అనే నిందితున్ని అరెస్టుచేశారు. 2019లో రూపేష్ కారులో ప్రయాణిస్తుండగా బాలిక లిఫ్ట్ అడిగింది. ఆమె ఒంటిపై నగలు ఉండడంతో దుర్బుద్ధి పుట్టింది. ఆలయం వద్దకు వచ్చి బాలికను చంపి నగలు తీసుకున్నాడు. తరువాత ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టి వెళ్లిపోయాడు. కొరటిగెరె పోలీసులు విచారణ జరిపి నిందితున్ని గుర్తించి అరెస్టు చేశారు. మరో ఘటనలో.. దోపిడీకి యత్నం, అరెస్టు కెలమంగలం: దోపిడీకి యత్నించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఆదివారం సాయంత్రం అగ్గొండపల్లి ప్రాంతంలో ఒక వలస కార్మికుడు నడిచి వెళ్తుండగా బైక్పై వచ్చిన దుండగుడు అతన్ని కత్తితో బెదరించి సెల్ఫోన్, నగదును లాక్కొనేందుకు యత్నించాడు. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి దొంగను పట్టుకొని కెలమంగలం పోలీసులకు అప్పగించారు. విచారించగా అతడు వన్నలవాడికి చెందిన శివానందం లియాస్ కపాళి (25) అని తెలిసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
లాడ్జికి తీసుకెళ్లి.. ఆ రోజు రాత్రి..
బనశంకరి(బెంగళూరు): దీపా పదన్ (37) అనే ఒడిశాకు చెందిన మహిళ యశవంతపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఒక లాడ్జిలో హత్యకు గురైంది. ఈ నెల 9న ఆమెను స్నేహితుడు యశవంతపుర రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి వెనుక నుంచి ఆమెకుట ఊపిరాడకుండా చేసి హత్యచేసి పారిపోయాడు. మరుసటి రోజు సమాచారం తెలిసి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. హంతకుని కోసం గాలింపు చేపట్టారు. లాడ్జీ, చుట్టుపక్కల సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించారు. మరో ఘటనలో.. రౌడీ ముఠా అరెస్టు బనశంకరి: దోపిడీకి పథకం పన్నిన రౌడీ బాంబే సలీం, అతని నలుగురు అనుచరులను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. తలఘట్టపుర పోలీస్స్టేషన్ పరిధిలోని ఆవలహళ్లి గ్రామ గొట్టిగెరెరోడ్డు పెట్రోల్ బంక్ వెనుక రోడ్డులో దోపిడీకి పొంచి ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు దాడిచేసి రౌడీ బాంబే సలీం, నదీమ్, రియాజ్, ఇమ్రాన్, అష్రఫ్ను అరెస్ట్చేసి, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
Jammu and Kashmir: 100 నాటౌట్
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. దీంతో కశ్మీర్వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్లోయలోని ఆరు చోట్ల ఐఎస్ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు. -
కన్నతల్లి కొనఊపిరితోనే ఉన్నా.. దిగ్భ్రాంతికర విషయాలు
పబ్జీ కోసం కన్నతల్లిని తుపాకీతో కాల్చి చంపిన తనయుడి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని చంపిన తర్వాత స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. వాళ్లతో హ్యాపీగా దావత్ చేసుకున్నాడు మైనర్. అయితే తాజాగా విచారణలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. పబ్జీ విషయంలో కన్నతల్లిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్చి చంపాడు కొడుకు. ఈ కేసులో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని తుపాకీతో కాల్చేసిన తర్వాత ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి తాళం వేశాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోలేదు. అప్పుడే కాదు.. ఆ మరుసటి రోజు ఉదయం వరకూ కూడా ఆమె కొన ఊపిరితోనే ఉంది. ఘటన జరిగిన రాత్రి సమయం నుంచి ఉదయం వరకూ మధ్యమధ్యలో గది తాళం తీసి ఆమె పరిస్థితిని చూస్తూ ఉండిపోయాడు ఆ కొడుకు. ఈ మధ్యలోనే స్నేహితులను ఇంటికి పిలిచి ఆన్లైన్లో ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ పెట్టి మరో గదిలో హ్యాపీగా పార్టీ చేసుకున్నాడు. ఒకవేళ తల్లికి ఇలా జరిగిందనే విషయం ఎవరికైనా చెప్పి ఉంటే.. కనీసం ఆమె బతికి ఉండేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన స్నేహిడిని తల్లి శవం మాయం చేసేందుకు సాయం పట్టాలని తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు ప్రతిగా ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఉత్తర ప్రదేశ్లో లక్నోలో ఉంటున్న ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి.. తన సర్వీస్ రివాల్వర్ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు. కొడుకు పదే పదే పబ్జీ ఆడుతుండడంతో మందలించింది తల్లి సాధన(40). ఆ కోపంలో తుపాకీతో తల్లిని కాల్చేసి.. ఆమెను ఓ గదిలో, చెల్లిని(10) మరో గదిలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత వార్త: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్ -
ఏ కడుపున పుట్టాడో ఆ తల్లినే...
అమ్మ పంచిన సంతోషం మరిచిపోయాడు. గొడవలు మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. నాన్న ఇచ్చిన జీవితం మర్చిపోయాడు. కోపతాపాలు మాత్రం మెదడు నిండా నింపుకున్నాడు. తల్లి చేసిన త్యాగాలు, తండ్రి ఇచ్చిన తోడ్పాటు ఏవీ గుండెల్లో పెట్టుకోలేదు. వారితో వచ్చిన కాసిన్ని మాట పట్టింపులతో మనసును చేదు చేసుకున్నాడు. పెరిగిపోయిన మానసిక సమస్యకు తాగుడు ఆజ్యం పోసింది. ఇంకేముంది మనిషి మృగంలా మారిపోయాడు. తన జన్మకు కారణమైన తల్లిదండ్రులపై కత్తిదూశాడు. ఏ కడుపున పుట్టాడో ఆ తల్లి ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఏ రక్తం పంచుకున్నాడో ఆ తండ్రిని మరణం అంచుల వరకు తీసుకెళ్లాడు. సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం): పాతపట్నం మండలం కాపుగోపాలపురంలో బూసి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తల్లి భగవతమ్మ(65)ను మంగళవారం అర్ధరాత్రి కర్కశంగా నరికి చంపేశాడు. ఈ దాడిలో తండ్రి రామారావు తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరా డుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కాపు గోపాలపురం గ్రామంలో బూసి రామారావు, బూసీ భగవతమ్మ దంపతు లకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బూసి శ్రీనివాసరావు సీఆర్పీఎఫ్లో పనిచేసి రిటైరై పాతపట్నంలోని సాయి నగర్లో నివసిస్తున్నాడు. రెండో కుమారుడు బూ సి లోకేశ్వరరావు హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటున్నాడు. మూడో కుమారుడు బూసి జగదీశ్వరరావు జవాన్గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. కుమార్తె జ్యోతి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకు అతని భార్య కల్యాణికి మధ్య మనస్ఫర్థలు ఉన్నాయి. వీరు తరచూ గొడవపడేవారు. శ్రీనివాసరావు మానసిక స్థితి బాగుండేది కాదు. తల్లిదండ్రులతోనూ నిత్యం తగాదా పడేవాడు. అందరూ పడుకున్నాక.. శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తప్పతాగి కాపుగోపాలపురంలోని తల్లిదండ్రుల ఇంటి వ ద్దకు వచ్చాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో కత్తి, కర్ర తీసుకుని తల్లిదండ్రులపై కర్కశంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి భగవతమ్మ అక్కడికక్కడే కన్నుమూశారు. రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగాక తెల్లవారు జామున శ్రీనివాసరావే మరో వ్యక్తికి ఫోన్ చేసి తల్లిని చంపేశానని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పగా.. వారు వచ్చి చూసేసరికి భగవతమ్మ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. పక్కనే రామారావు తీవ్ర గాయాలతో ఉన్నారు. దాడికి పాల్ప డిన కత్తిని శ్రీనివాసరావు ఇంటి పెరట విసిరేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సీఐ ఎం.వినోద్బాబు, ఎస్ఐ మహ్మర్ అమీర్లు సంఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షత గాత్రుడిని అంబులెన్స్లో పాతపట్నం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తె లుసుకున్న కాశీబుగ్గ డీఎస్సీ శివరామిరెడ్డి, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భగవతమ్మ మృతదేహన్ని పాతపట్నం సీహెచ్సీ తరలించి, పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భగవతమ్మ మృతితో కాపుగోపాలపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! -
భయానకం: మహిళను చంపి, ముక్కలు చేసి.. ఆ తర్వాత..
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భయానక స్థితిలో మహిళల మృతదేహాలు కనిపించాయి. మొదట పాండవపుర తాలూకా బేబీ గ్రామానికి సమీపంలో చెరువులో కాళ్లు కట్టివేసి అర్ధనగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. రైతులు పొలాలకు వెళుతుండగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్, పోలీసులు చేరుకుని బయటకు తీసి పరిశీలించగా శిరస్సు, మొండెం లేని సగం మృతదేహం కనిపించింది. ఎరుపురంగు చుడీదార్, బిస్కెట్ రంగు లెగ్గింగ్ ఉంది. రెండు రోజుల క్రితమే హత్య చేసి చెరువులోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో అర్ధభాగం కోసం గాలిస్తున్నారు. పాండవపుర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. శ్రీరంగ పట్టణ వద్ద కాలువలో శ్రీరంగ పట్టణ తాలూకా అరకెరె గ్రామ శివార్లలోని చిక్కదేవరాయ సాగర కాలువ లో మహిళ సగం మృతదేహం తేలుతూ కనిపించింది. సుమారు 40–45 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహంగా అంచనా వేశారు. ఎక్కడో హత్య చేసి శరీరాన్ని, మొండెంను వేరు చేసి ఒక్క భాగాన్ని కాలువలో వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అరకెరె పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాల వెనుక ఒకే నేరం ఉందా, వేర్వేరా? అని దర్యాప్తు చేపట్టారు. రెండు చోట్లకు జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ సందేశ్ కుమార్, పీఐ ప్రభాకర్ చేరుకుని పరిశీలించారు. చదవండి: మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా. -
ప్రేమించలేదని యువతిని రాళ్లతో కొట్టి చంపాడు.. స్నేహితులు కూడా..
సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి ఓ యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో రాళ్లతో ఓ యువకుడు.. యువతిని కొట్టి చంపేశాడు. ఆమె సోదరిపై కూడా హత్యాయత్నం చేశాడు. సేలం ఆత్తూరులో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సేలం జిల్లా గంగ వళ్లి సమీపంలోని కుడుమలై గ్రామానికి చెందిన మురుగేషన్(45) రైతు. కడంబూరులో లీజుకు పంట పొలాల్ని తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు భార్య దయ(40), పెద్దకుమార్తె నందిని(21),చిన్న కుమార్తె రోజా(19), కుమారుడు విజయ్(18) ఉన్నారు. పంట పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమార్తె రోజా నర్సింగా పురంలోని కళాశాలలో బీఏ చదువుతోంది. ప్రేమ పేరిట వేధింపులు ఆత్తూరు తండయార్ పేటకు చెందిన స్వామిదురై(22) చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువు కుంటున్నాడు. కుడుమలైలోని బంధువు చిన్నదురై ఇంటికి ఇటీవల వచ్చాడు. ఆ సమయంలో రోజా అతడి కంట పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరిట వేధించడం మొదలెట్టాడు. ఆమె కోసం తరచూ చెన్నై నుంచి చిన్న దురై ఇంటికి వచ్చి వెళ్లే వాడు. తన సోదరి నందినికి ఈనెల 13న వివాహం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో స్వామిదురై వేధింపులు రోజాకు తలనొప్పిగా మారాయి. దీంతో వారం రోజు క్రితం అతడిని తీవ్రంగా మందలించింది. అయినా, అతడు వినలేదు. సోమవారం ఆమె చదువుకుంటున్న కళాశాల వద్దకు వెళ్లి తన ప్రేమను చెప్పడమే కాకుండా, అంగీకరించకుంటే హతమారుస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన రోజా ఈ విషయాన్ని సోదరి నందిని ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. పెద్దల పంచాయితీతో ఆగ్రహం ఈ వ్యవహారం గ్రామపెద్దల వరకు వెళ్లింది. దీంతో మంగళవారం రాత్రి పంచాయతీ పెట్టారు. ఇకపై స్వామిదురై గ్రామంలోకి రాకూడదని, రోజాను ప్రేమ పేరిట వేధిస్తే పోలీసులకు పట్టిస్తామని అతడి బంధువు చిన్నదురైకు గ్రామపెద్దలు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్వామిదురై ఉన్మాదిగా మారాడు. బుధవారం నందిని వివాహ ఆహ్వాన పత్రికల్ని అందించేందుకు రోజా తల్లిదండ్రులు, సోదరు డు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. తన మిత్రులతో కలిసి రోజా, ఆమె సొదరి నందినిపై దాడి చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. వీరి నుంచి అక్కచెల్లెలు తప్పించుకుని పంట పొలంలోని నీటి తొట్టెలోకి దూకేశారు. రక్షించాలని కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే, రోజాను వెంటాడి మరీ ఆ ప్రేమోన్మాది తన మిత్రుల సాయంతో రాళ్లతో కొట్టి పడేశాడు. నందిని కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రోజాను ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న చిన్నదురై, అతడి మిత్రులు సమీపంలోని అడవుల్లో ఉన్నారనే.. సమాచారంతో డీఎస్పీ రామచంద్రన్ నేతృత్వంలో గాలింపు చేపట్టారు. చదవండి: అమలాపురం అల్లర్లలో మరో ఇద్దరి అరెస్ట్ -
బార్లో బాయ్ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు
వాషింగ్టన్: యువతీయువకులు ప్రేమలో పడడం షరా మామూలే. అయితే ఇటీవల ట్రెండ్ చూస్తే అదే ప్రేమలో ఎవరో ఒకరు మోసపోవడం కూడా షరా మామూలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ జాబితాలోని కొందరు మాత్రం ఆ బాధని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమలో మోసం చేసిన వాళ్లు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ ఏదో ఓ రూపంలో వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ యువతి ప్రియుడు చేసిన మోసానికి ఏకంగా అతడిని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్లో ఈ దారుణ ఘటన జరిగింది. అమెరికాలో ఉంటున్న ఆండ్రీ స్మిత్, గేలిన్ మోరిస్ ఇద్దరు ప్రేమికులు. అయితే ఇటీవల కొంత కాలంగా తన బాయ్ఫ్రెండ్ ఆండ్రీ ప్రవర్తనలో మార్పుని గమనించింది గేలన్. ఆండ్రీ తనను చీటింగ్ చేస్తున్నట్లు ఆమె అనుమానించింది. ఇంకేం క్లారిటీ కోసం ఆపిల్ ఫోన్లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతను ఓ బార్లో ఉన్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లింది. బార్లో తన బాయ్ఫ్రెండ్ మరో అమ్మాయితో ఉండడం చూసి కోపంతో ఊగిపోయింది. ఖాళీ వైన్ బాటిల్తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు. కాగా, బార్ బయట స్మిత్పై మోరిస్ దాడి చేసింది. అంతటితో ఆగకుండా చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన స్మిత్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే అతను చనిపోయాడు. దీనికి కారకురాలైన ప్రియురాలు మోరిస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పబ్జీ దారుణం.. గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని -
పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పొలంలో..
మైసూరు(బెంగళూరు): జిల్లా పరిధిలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో పరువు హత్య వెలుగు చూసింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిన పాపానికి ఓ బాలిక పొలంలో శవమై తేలింది. పిరియాపట్టణ పోలీసుల కథనం మేరకు... కగ్గుండి గ్రామానికి చెందిన సురేశ్, బేబీ దంపతుల కుమార్తె శాలిని (17) పక్క గ్రామానికి చెందిన మంజు అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమను శాలిని తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి పట్టుకొచ్చారు. మైనర్ బాలిక కావడంతో శాలినిని బాలసదన్కు అప్పజెప్పారు. అయితే తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్తామని సురేశ్, బేబీ దంపతులు చెప్పడంతో బాలసదన్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ తర్వాత శాలిని పొలంలో శవమై కనిపించింది. తల్లిదండ్రులే హత్య చేసి పడేసినట్లు నిర్ధారిస్తూ నిందితులను పిరియాపట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..
సాక్షి,బీబీపేట(కామారెడ్డి): మహిళను లోబర్చుకున్నాడని ఓ వృద్ధుడిని మంత్రాల నెపంతో హత్య చేశారు. బీబీపేటలో శనివారం అర్ధరాత్రి జరి గిన ఈరోల్ల మల్లయ్య(62) హత్య కేసును పోలీసులు ఒక రోజు లోనే ఛేదించి నిందితులను రిమాండ్కు తరలించారు. మల్ల య్య హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ప్రత్యేక నిఘా ఉంచగా బీబీపేట బస్టాండ్ వద్ద దొరికారు. నిందితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సోమవారం భిక్కనూర్ సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. మృతుడు మల్లయ్య ఇంటి పక్కన ఉండే మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహిళ బంధువులు కొంగరి పోచయ్య, రాజ్కుమార్ నిందితుడిపై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు మల్లయ్య ను హెచ్చరించారు. అయినా తీరు మారకపోవడంతో మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మల్లయ్య, మహిళను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసుకున్నాడు. దీంతో కొంగరి పోచయ్య, రాజ్ కుమార్లు గడ్డపారతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బ యటకు లాక్కొచ్చారు. మల్లయ్య తలపై బండరాయితో మోది, ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్య అక్కడికకక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు మల్లయ్యకు మంత్రాలు వస్తాయని, దీంతో మ హిళను లోబర్చుకున్నట్లు నిందితులు పోలీసులతో పేర్కొన్నా రు. పోలీసులు, నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చ గా నిజామాబాద్ జైలుకు తరలించారు. చదవండి: Extra Marital Affair: వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. -
భర్తని చంపేందుకు సుపారీ.. అంతా అనుకున్నట్లే జరిగింది కానీ..
దొడ్డబళ్లాపురం: భర్తను హత్య చేయడానికి భార్య సుపారి ఇచ్చింది. కానీ అది విఫలమైంది. వివరాలు.. బెంగళూరు టీ దాసరహళ్ల నివాసి మమత తన భర్త ముకుందను హత్య చేయాలని సుపారీ ఇచ్చింది. ఈ కేసులో మమతతో పాటు ఈమె స్నేహితురాలు తస్లీమా, సుపారి కిల్లర్లు మౌలా, సయ్యద్ సలీం, సయ్యద్ అబీబ్, నయీమ్ అరెస్టయ్యారు. కారుపై దాడి ముకుంద బెంగళూరు గ్రామీణ జిల్లా శిక్షణ శాఖలో ఎఫ్డీఐ ఉద్యోగం చేస్తున్నాడు. నిత్యం తన శాంత్రో కారులో సహోద్యోగులతో కలిసి దేవనహళ్లి వద్ద ఉన్న కలెక్టర్ ఆఫీసుకు వచ్చేవాడు. మే 26న ముకుంద ఆఫీసు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా దొడ్డబళ్లాపురం పారిశ్రామికవాడలో జెన్ కారులో వచ్చిన కొందరు దుండగులు అతని కారు అద్దాలు పగలగొట్టి దాడికి పాల్పడ్డారు. అయితే కారు డోర్లు లాక్ అయి ఉండడంతో క్షేమంగా తప్పించుకున్నాడు. పోలీసులు జెన్ కారు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి విచారించగా అసలు సంగతి తెలిసింది. చీటీ గొడవలే కారణం మమత వల్ల సుమారు రూ.20 లక్షల వరకూ ముకుంద చీటీల్లో నష్టపోయాడు. దీంతో ఇద్దరూ గొడవపడేవారు. మమత దీనిని స్నేహితురాలు తస్లీమాతో చెప్పుకోగా భర్తను అంతు చూడాలని సలహా ఇచ్చింది. ఆస్తి కూడా నీదే అవుతుందనడంతో ఒప్పుకుంది. రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి హత్యకు పురమాయించినట్లు తేలింది. పని పూర్తయితే మరో రూ. 30 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది. కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. చదవండి: స్నేహితుని చెల్లితో ప్రేమ.. ఆపై పెళ్లి.. కానీ కొన్ని రోజులకే.. -
స్నేహితుని చెల్లితో ప్రేమ.. ఆపై పెళ్లి.. కానీ కొన్ని రోజులకే..
క్రిష్ణగిరి(బెంగళూరు): స్నేహితుని చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కొత్త వరుని హత్యకు కారణమని తేలింది. సొంత బావ అనే జాలి లేకుండా రక్తం కళ్లచూశారు. బి.కొత్తపల్లికి చెందిన సంతోష్ (23) హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. సంతోష్, హోసూరు కుముదేపల్లికి చెందిన మురుగేషన్ (24) మిత్రులు. గత ఏడాది క్రితం సంతోష్, మురుగేష్ సహోదరి మీనాను ప్రేమించాడు. అది తెలిసి మురుగేష్ సంతోష్ను నిలదీశాడు. అయినప్పటికీ సంతోష్ మీనాను ఇటీవల పెళ్లి చేసుకొన్నాడు. ఇది సహించని మురుగేష్... సంతోష్ను హత్యకు కుట్ర పన్నాడు. గత శనివారం అతని మిత్రుల సహాయంతో బి. కొత్తపల్లి వద్ద మామిడి తోటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులు మురుగేష్, అతని మిత్రుడు సంతోష్కుమార్ (24), 17 ఏళ్ల బాలున్ని అరెస్ట్ చేశారు. చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి.. -
బంధువుతో వివాహేతర సంబంధం.. దీని గురించి మాట్లాడేందుకు భర్త వెళ్లి..
మైసూరు(బెంగళూరు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బంధువును భర్త హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నంజనగూడు తాలూకా మాడ్రళ్లిలో శివణ్ణ (59) భార్యతో సిద్ధశెట్టి (47)కి వివాహేతరంసంబంధం ఏర్పడింది. దీనిపై ఇద్దరి భార్యాభర్తలకి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ఎన్ని సార్లు చెప్పినా శివణ్ణ భార్య సిద్ధశెట్టి తన సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త మాట పట్టించుకోలేదు. ఆదివారం కూడా దీని గురించి మాట్లాడేందుకు వెళ్లి వారి గొడవ జరగ్గా శివణ్ణ కత్తితో సిద్ధశెట్టిని పొడిచాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. శివణ్ణ పరారు అయ్యాడు. మరో ఘటనలో.. క్యాంటర్, బైక్ ఢీ.. ఒకరు మృతి దొడ్డబళ్లాపురం: క్యాంటర్– బైక్ ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు మృతి చెందిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మరళేనహళ్లి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప (48) మృతి చెందాడు. సోమవారం ఉదయం హనుమంతరాయప్ప మరళేనహళ్లి నుండి దొడ్డబెళవంగల వైపు బైక్పై వెళ్తుండగా క్యాంటర్ను ఎదురుగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
నాలుగు నెలల క్రితం పెళ్లి.. అర్థరాత్రి మామిడి తోటలో..
క్రిష్ణగిరి(బెంగళూరు): సూళగిరి సమీపంలో పెళ్లి జరిగిన నాలుగు నెలలకే యువకుడు హత్యకు గురయ్యాడు. సూళగిరి తాలూకా ఏణుసోణ వద్ద బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుందరేష్ కొడుకు సంతోష్ (23). నల్లరాళ్లపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి గత నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. శనివారం రాత్రి కొత్తపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో ఎవరో ఇతన్ని కత్తితో పొడిచి చంపారు. హోసూరు డీఎస్పీ అరవింద్కుమార్, సూళగిరి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని హంతకుల కోసం గాలింపు చేపట్టారు. మరో ఘటనలో.. ఎస్ఐ స్కాంలో గోకాక్ ముఠా బనశంకరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్ఐ పరీక్షల కుంభకోణంలో కలబురిగి వారే కాకుండా బెళగావి ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్లు అదనపు ఏడీజీపీ అలోక్కుమార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. బెళగావి జిల్లా గోకాక్ నగరంలో ఇలాంటి గ్యాంగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విజయపుర, బాగల్కోటే జిల్లాల్లోని కొందరూ భాగస్వాములైనట్లు తెలిసిందన్నారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. గతంలో నియామకాల్లో గోకాక్ నుంచి ఏడుమంది ఎంపికయ్యారని, అప్పుడే అనుమానం వచ్చినప్పటకీ దర్యాప్తు జరగలేదన్నారు. ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగినట్లు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి.. -
పార్కింగ్ గొడవ.. ముగ్గురిపై లారీ ఎక్కించి పరార్
తిరువళ్లూరు(చెన్నై): మద్యం మత్తులో జరిగిన గొడవలో లారీ ఎక్కించి ఒకరిని హత్య చేసి, ఇద్దరిని గాయపరిచిన ఉత్తరప్రదేశ్కు చెందిన లారీడ్రైవర్, క్లీనర్ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఉత్తరపెరుంబక్కం గ్రామం దగ్గరలో ఉన్న ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు లారీలను పార్కింగ్ చేస్తారు. బుధవారం రాత్రి స్థానిక గ్రామానికి చెందిన కమలకన్నన్, కుమరన్, నవీన్ తదితరులు లారీ యార్డు వద్ద మద్యం సేవిస్తుండగా, అక్కడే పార్కింగ్ చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన లారీని బయటకు తీయడానికి డ్రైవర్ లాల్సింగ్ యత్నించాడు. ఈ సమయంలో వారు తాము మద్యం సేవించిన తరువాతే లారీలను బయటకు తీయాలని లారీడ్రైవర్తో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ లాల్సింగ్ ఆ ముగ్గురిపై లారీ ఎక్కించి పరారయ్యాడు. ఈ సంఘటనలో అక్కడికక్కడే కమల కన్నన్ మృతి చెందగా, ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
వివాహేతర సంబంధం: భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..
సాక్షి,హుస్నాబాద్(సంగారెడ్డి): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకట్రెడ్డి(45) అనే వ్యక్తిని అతడి భార్య పెనుగొండ లక్ష్మి రోకలిబండతో కొట్టి హత్య చేసిన అనంతరం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గన్నెరువరం సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం..వెంకట్రెడ్డి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకట్రెడ్డి శుభకార్యాలకు వంటలు చేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి ఇంటివద్ద కిరాణం, బెల్ట్షాపు నిర్వహిస్తోంది. పొట్లపల్లికి చెందిన బొనగిరి వెంకటస్వామితో లక్ష్మి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వెంకట్రెడ్డి నిద్రపోతుంటే భార్య లక్ష్మి శుక్రవారం రాత్రి రోకలిబండతో కొట్టి హత్యచేసింది. రాత్రి వేళ ప్రియుడు వెంకటస్వామితో కలిసి కారులో మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చివేయించింది. వెంకటస్వామి, కారు డ్రైవర్ కుమార్ భయపడి గన్నేరువరం పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి నేరాన్ని అంగీకరించి లొంగిపోయారు. కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు నిందితురాలు లక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం ఘటన స్థలానికి వెళ్లారు. తహసీల్దార్ మహేశ్ సమక్షంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్ట్మార్టం నిర్వహించారు. పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన అనంతరం వెల్లడిస్తామని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. చదవండి: పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. ఇంతలో సడన్గా.. -
కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ దారుణ హత్య
చంఢీగడ్: కాంగ్రెస్ నేత, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వివరాల ప్రకారం .. జవహర్ కే గ్రామం వైపు సిద్ధూ జీపులో వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్ధూని అస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సిద్ధూ చికిత్స పొందుతూ మృతి చెందారు. పంజాబ్లో వీఐపీలకు భద్రతను శనివారమే ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటన పంజాబ్లో కలకలం రేపుతోంది. -
మహిళ ప్రాణం తీసిన రూ. రెండు వేలు
జియాగూడ(హైదరాబాద్): రెండు వేల రూపాయలు కనిపించకుండా పోయిన సంఘటనలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సరూర్నగర్లో ఉంటున్న రాములమ్మ (50)కు ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు) వారు అల్లుళ్లు నందు, రాజుతో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్లో ఉంటున్నారు.రాములమ్మ మరిది కె.రాజు కూడా సరూర్నగర్లోనే ఉంటున్నాడు. కె. రాజు అమ్ములుకు వరుసకు అన్న. కాగా ఇటీవల అమ్ములు సరూర్నగర్లో ఉన్న అన్న కె.రాజును చూసి చాలాకాలమైందని ఇంటికి రావాలని కోరింది. దీంతో కె.రాజు శుక్రవారం తాను వచ్చేటప్పుడు మద్యం (కల్లు) తెచ్చి చెల్లెలు అమ్ములు, విజయలక్ష్మి భర్త నందుతో కలిసి తాగారు. అనంతరం మధ్యాహ్నం ప్రాంతంలో కె.రాజు నిద్రపోయాడు. నిద్ర నుంచి లేచిన కె. రాజు తన వద్ద ఉన్న రెండు వేలు పోయాయంటూ అక్కడే ఉన్న ఓ సెల్ఫోన్ తీసుకుని సరూర్నగర్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న నందు సరూర్నగర్కు వెళ్లి కె.రాజు కోసం వెతకగా కనిపించలేదు. దీంతో అక్కడే ఉన్న అత్త రాములమ్మను ఏకలవ్యనగర్కు తీసుకువచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కె.రాజు వెంటనే ఏకలవ్యనగర్లో ఉంటున్న అమ్ములు దగ్గరకు వచ్చి నందుతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో అక్కడే ఉన్న జంగయ్య, సరిత, విజయలక్ష్మి, నందు, రాజు, ప్రేమ్ తదితరులు కూడా కె.రాజుతో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో నందు రోకలితో రాజుపై దాడి చేసేందుకు యత్నించగా అడ్డం వచ్చిన రాములమ్మ తలపగిలింది. దీంతో అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దారుణం: ఆన్లైన్లో రంపం కొన్నాడు.. ఏం జరిగిందో భార్యా పిల్లల్ని కిరాతకంగా..
చెన్నై: కన్నతండ్రి కసాయిగా మారాడు. ముక్కుపచ్చలారని కొడుకు కూతుర్ని, భార్యను ఎలక్ట్రిక్ రంపం మిషన్తో అతి దారుణంగా హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సైకో సాప్ట్ వేర్ తండ్రి. అసలు ఇంతటి దారుణానికి పాల్పడడానికి కారణాలేంటి..అప్పులు భాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నై పల్లవరం పక్కనే పొజిచలూరులో ప్రకాష్ (41) అతని భార్య గాయత్రి (39), కుమార్తె నిత్యశ్రీ (13), కుమారుడు హరి కృష్ణన్ (8)లను అతి కిరాతకంగా ఎలక్ట్రిక్ రంపపు మిషన్తో వారిని చంపి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ తండ్రి ఉదయం ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న కుటుంబాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిలంచాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. శంకర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకును క్లూస్ టీమ్కు సమాచారం అందించారు. చనిపోయే ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులకు లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పుల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని పరిశోధించి, క్రెడిట్ వేధింపులు లేదా బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఇంట్లో 3.50 లక్షల బాండ్ అందిందని, దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. చదవండి: రథోత్సవంలో అపశ్రుతి.. రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి -
రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకుని మరొకరిని..
వేలూరు(తమిళనాడు): తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఇందిరానగర్కు చెందిన దేవేంద్రన్(55) పశువుల వ్యాపారి. ఇతని మొదటి భార్య రేణుకాంబాల్ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో గ్రామానికి చెందిన సురేష్ మృతి చెందడంతో అతని భార్య ధనలక్ష్మిని 5 నెలల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. దీంతో ధనలక్ష్మి తరచూ భర్తను వదిలి పెట్టి ఆంబూరులోని బంధువుల ఇంటికి వచ్చేది. అదే తరహాలో వారం క్రితం ధనలక్ష్మి భర్తతో ఘర్షణ పడి ఆంబూరుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆంబూరు కంబికొల్లై గ్రామానికి చెందిన జాన్ భాషా అనే వ్యక్తి ఓ చోరీ కేసులో అరెస్ట్ అయ్యి వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని భార్య కౌసర్(36) ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. ఆంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని షూ కంపెనీ ఎదుట ఉన్న ఫుట్పాత్పై రోజూ రాత్రి వేళ ధనలక్ష్మి నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్కు తెలిసింది. శుక్రవారం రాత్రి ధనలక్ష్మి, జాన్ బాషా భార్య కౌసర్, ఈమె అత్త పర్వీన్ చిన్నారులతో కలిసి నిద్రించారు. వారందరూ బురకా ధరించి ఉండడంతో దేవేంద్రన్ తన భార్య అని భావించి కౌసర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. శబ్ధం విన్న ధనలక్ష్మి వెంటనే కేకలు వేయడంతో ఆగ్రహించిన దేవేంద్రన్ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు దేవేంద్రన్ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తాగిన మైకంలోనే నీరజ్ హత్యకు స్కెచ్.. చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ -
భర్తపై కోపం.. పిల్లల గొంతు నులిమి హత్య
తిరువొత్తియూరు(చెన్నై): భర్తతో ఏర్పడిన గొడవ కారణంగా.. ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కోట్టై జిల్లా పొన్ అమరావతి సమీపంలోని కరుప్పర్ కోయిల్ పట్టికి చెందిన పొన్నాడైకల్ (28) పొల్లాచ్చిలోని కొబ్బరి మండీలో పని చేస్తున్నాడు. అతని భార్య పంచవర్ణం (21). వీరిద్దరూ ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి జగదీష్ (2) అనే కుమారుడు, దక్షిత (8 నెలలు) అనే కుమార్తె ఉన్నారు. సొంత ఇల్లు కట్టాలని పంచవర్ణం భర్తను తరచూ కోరేది. అయితే పొన్నాడైకల్ మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరునాళ్లను పురస్కరించుకుని సోమవారం అదే ప్రాంతంలో ఉన్న అత్తింటికి భార్య పిల్లలతో కలిసి పొన్నాడైక్కల్ వెళ్లాడు. అక్కడ దంపతుల మధ్య మళ్లీ గొడవ ఏర్పడింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన పంచవర్ణం భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న ఇద్దరు బిడ్డల గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పంచవర్ణంను అరెస్టు చేశారు. చదవండి: ‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ -
వివాహేతర సంబంధం: తెల్లవారుజామున తలుపులు తెరవగానే..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితను ఇంట్లో హత్య చేసిన సంఘటన దొడ్డ తాలూకా వడగెరె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి చన్నబసవయ్య భార్య భాగ్యశ్రీ (35)కి ఇదే గ్రామానికి చెందిన రియాజ్ (27)అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం ఉండేది. కొన్నాళ్ల కిందట గొడవలు మొదలై దూరంగా ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున భాగ్యశ్రీ ఇంటికి వెళ్లిన ఒక వ్యక్తి తలుపులు తట్టాడు. తలుపులు తెరవగానే ఆమెను బయటకు లాగి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఆ సమయంలో భాగ్యశ్రీ పిల్లలు ఇద్దరూ అక్కడే ఉన్నారు. భర్త బంధువుల ఇంట్లో వేడుక ఉందని పొరుగూరికి వెళ్లాడు. భర్త ఫోన్ స్విచాఫ్లో ఉంది, మరోవైపు రియాజ్ కూడా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్దరి మీదా అనుమానం వ్యక్తం చేశారు. దొడ్డ బెళవంగల పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి.. -
బస్లో టిక్కెట్ గొడవ.. కండక్టర్ మృతి
సాక్షి, చెన్నై: టిక్కెట్ తీసుకోమన్న కండక్టర్ను ఓ మందుబాబు కొట్టి చంపేశాడు. మధురాంతకం సమీపంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. కోయంబేడు నుంచి విల్లుపురానికి ప్రభుత్వ బస్సు ఉదయం బయలుదేరింది. ఇందులో కళ్లకు రిచ్చికి చెందిన పెరుమాల్(56) కండక్టర్గా ఉన్నారు. మధురాంతకం బైపాస్లో ఓ యువకుడు బస్సులోకి ఎక్కాడు. టిక్కెట్టు తీసుకోవాలని కండక్టర్ ఆ యువకుడికి సూచించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తననే టిక్కెట్టు అడుగుతావా...? అంటూ కండక్టర్పై దాడి చేశాడు. ఇతర ప్రయాణికులు అడ్డుకుని.. మార్గం మధ్యలోని అయ్యనార్ ఆలయం వద్ద ఆ యువకుడిని కిందికి దింపేశారు. కాసేపటికే..మృతి బస్సు కొంత దూరం వెళ్లగానే కండెక్టర్ స్పృహ తప్పాడు. దీనిని గుర్తించిన డ్రైవర్, ఇతర ప్రయాణికులు మేల్ మరువత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కండెక్టర్ మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆయన ఛాతిపై ఆ మందుబాబు బలంగా కొట్టడం వల్లే మరణించి ఉంటాడని నిర్ధారించారు. మేల్ మరువత్తూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సమీప గ్రామానికి చెందిన మురుగన్(35)గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరుమాల్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చదవండి: వాట్ ఏ స్కెచ్: ప్రేమోన్మాది యాసిడ్ దాడి.. రెండువారాల తర్వాత సన్యాసి గెటప్లో.. -
యువతిని వెతికి ఇంటికి తీసుకొచ్చి, ఆపై.. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర దొరికిపోయారు!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): యువతిని హత్య చేసి శవాన్ని తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరి నగరలో రఘు, దుర్గ దంపతుల ఇంట్లో తమిళనాడుకు చెందిన సౌమ్య (22) అనే యువతి పనిచేసేది. డబ్బుల విషయమై గొడవ జరిగి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయింది. గత సోమవారం సౌమ్యను వెతికి ఇంటికి తీసుకువచ్చిన రఘు, దుర్గ ఆమెను దారుణంగా కొట్టి చంపేశారు. శవాన్ని శ్రీరంగపట్టణం వద్ద పారవేయాలని నాగరాజు, వినోద్ల సాయంతో శవాన్ని బైక్పై తీసుకెళ్లారు. రామనగర కలెక్టరేట్ ముందు స్పీడ్ బ్రేకర్స్ వద్ద శవం జారి కిందపడింది. అక్కడే ఉన్న పోలీసులు అనుమానంతో పరిశీలించగా గుట్టు రట్టయింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్పై వస్తుంటే అడ్డగించి.. -
వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్పై వస్తుంటే అడ్డగించి..
తుమకూరు(బెంగళూరు): గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లిలో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వల్ల మామే అల్లుణ్ని హత్య చేశాడు. చౌకెనహళ్లి మూడ్లయ్య(40) ఆరేళ్ల క్రితం జయణ్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వేరే మహిళతో మూడ్లయ్య సంబంధం పెట్టుకున్నాడు. ఇది తగదని మూడ్లయ్యకు అతని మామ నచ్చజెప్పినా వినలేదు. సోమవారం అర్ధరాత్రి బైక్పై వస్తున్న మూడ్లయ్యను అడ్డగించి కొట్టి చంపేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు జయణ్ణ, అతని కొడుకుతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఘటనలో.. తండ్రీ కొడుకు మృత్యువాత మైసూరు: బైక్– కారు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా హిరికాటి గేట్లో జరిగింది. మైసూరు జిల్లా నంజనగూడుకు చెందిన శశికుమార్ (35), కుమారుడు దర్శన్ (6) మరణించారు. శశికుమార్ భార్య చైత్ర, గగన్ అనే మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఈ నలుగురు బైక్లో వెళుతుండగా మైసూరు నుంచి గుండ్లుపేట వైపుగా వెళుతున్న కారు పెట్రోల్ బంక్లోకి హఠాత్తుగా టర్న్ తీసుకుంది. కారు వెనుకనే వస్తున్న శశికుమార్ బైక్ను అదుపుచేయలేక కారును ఢీకొట్టాడు. కారు డ్రైవర్ను బేగూరు పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే.. -
ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే..
తిరువొత్తియూరు(చెన్నై): తంజై జిల్లాలో ఆడిటర్ను హత్య చేసిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తంజై కరంద చేరవై కారన్ వీధికి చెందిన మహేశ్వరన్ (55) ఆడిటర్. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకె 5వ వార్డు ప్రతినిధి రుక్మిణితో విరోధం ఉంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మహేశ్వరన్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన రుక్మిణి కుమారుడు కార్తీక్తో సహా నలుగురు కత్తులతో అతని భార్య కళ్లముందే దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో మహేశ్వరన్ అదే చోట మృతి చెందాడు. తంజై వెస్ట్ పోలీసులు మృతదేహాన్ని తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. శిశువును విక్రయించిన వృద్ధురాలి అరెస్టు తిరువొత్తియూరు: మదురై సమీపంలో చిన్నారిని విక్రయించిన వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై మేలూర్ కోటై నత్తం పట్టికి చెందిన ఓ వివాహితకు శివగంగై జిల్లా కల్లల్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె గర్భం దా ల్చింది. ఈమె భర్త విదేశాలలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు గత వారం క్రితం మగబిడ్డ జన్మించింది. ఈ బిడ్డను వృద్ధురాలికి ఇచ్చి పెంచమని చెప్పినట్లు తెలిసింది. కానీ వృద్ధురాలు ఆ బిడ్డను విక్రయించారు. ఈ సంగతి తెలుసుకున్న వివాహిత ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి బిడ్డ ఎక్కడని ప్రశ్నించింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వృద్ధురాలి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: ఆమెకు 20, అతడికి 17.. బాలుడిని ఇంటికి పిలిచి.. -
మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని..
బొమ్మనహళ్లి(బెంగళూరు): తన మాజీ ప్రియురాలి ప్రియున్ని హత్య చేశాడో దుండగుడు. హతుడు శివమొగ్గ జిల్లాకు చెందిన సమర్థ్ నాయర్ (28). మాజీ ప్రియుడు కిరణ్, అతని స్నేహితులు అరుణ్, రాకేష్లను బొమ్మనహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి ఒక ప్రముఖ గార్మెంట్స్లో సమర్థ్ నాయర్ క్వాలిటీ కంట్రోలర్గా పని చేస్తున్నాడు. మూడు నెలలు ఢిల్లీలో ఉండి మళ్లీ ఏప్రిల్ 26వ తేదీన వచ్చాడు. చనువుగా ఉండడం చూడలేక అదే గార్మెంట్స్లో పనిచేసే భద్రావతికి చెందిన యువతిని సమర్థ్ ప్రేమిస్తున్నాడు. ఇతనికంటే ముందు గార్మెంట్స్లో ఉద్యోగం చేసిన కిరణ్ ఈ యువతిని ప్రేమించాడు, గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. తన మాజీ ప్రేయసితో సమర్థ్ చనువుగా ఉండడాన్ని కిరణ్ తట్టుకోలేకపోయాడు. స్నేహితులతో కలిసి ఈ నెల 8వ తేదీన డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చిన సమర్థ్తో గొడవపడ్డారు. అతని తలను గోడకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమర్థ్ను ఆస్పత్రికి తరలించగా, సోమవారం సాయంత్రం చనిపోయాడు. చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్లో పిస్టల్ కొన్న సురేష్రెడ్డి! -
పెళ్లి చేయలేదని.. రాత్రి ఇంటికి వెళ్లి..
సాక్షి, చెన్నై: వివాహం చేయలేదనే కోపంతో తండ్రిని హత్య చేసిన తనయుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పాలయంకోట కీల్పాది ప్రాంతానికి చెందిన వ్యక్తి లూర్థుస్వామి(60). అతనికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇతని పెద్దకుమారుడు జాన్సన్ (39) చదువుకోలేదు. మిగిలిన ఇద్దరు కుమారులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన జాన్సన్ రోజూ తల్లి, తండ్రి వద్ద తనకు వివాహం చేయమని గొడవ చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి కూడా తండ్రితో ఘర్షణకు దిగి.. బండరాయితో మోది చంపేశాడు. చోళత్తరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జాన్సన్ కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో.. ప్రాణం తీసిన ఫ్లెక్సీ చెన్నై: విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మరణించారు. మంగళవారం తిరుచ్చి సమీ పంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. తిరుచ్చి టోల్ గేట్ సమీపంలోని మేనకా నగర్లో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. ఇక్కడ ప్లాట్ల అమ్మకాలు, అద్దెకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక్కడ తెన్నకరైకు చెందిన షేట్(30), విమల్(28), లాల్గుడికి చెందిన చెల్లదురై(45) పనిచేస్తున్నారు. మంగళవారం ఈదురు గాలులకు ఫ్లెక్సీ నేలకొరిగింది. దీంతో దాన్ని తొలగించి మరో చోట నిలబెట్టేందుకు ఈ ముగ్గురూ సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఫ్లెక్సీ ఓవైపుగా ఒరిగి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో విద్యుదాఘాతం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే షేట్, చెల్లదురై మరణించారు. విమల్ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య.. -
వివాహేతర సంబంధం: అద్దెకు ఉంటున్న యువకుడితో...
శంషాబాద్ రూరల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో అతను నేరుగా కోర్టులో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీఐ శ్రీధర్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లో బీహార్కు చెందిన రాహుల్ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ సందర్భంగా ఆమెకు బీహార్కు చెందిన రేణు అలియాస్ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్ తరచూ తొండుపల్లి వచ్చి సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు తొండుపల్లి వచ్చిన అతడితో గొడవపడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. గత ఏడాది డిసెంబర్ తొండుపల్లికి వచ్చిన రాహుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన రేణు అతడిని వెంబడించి వెనక నుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్ మధ్యలో బోర్ల పడిపోయాడు. రాహుల్ చనిపోయినట్లు గుర్తించిన రేణు బీహార్కు పారిపోయాడు. కేసు మార్పిడితో.. అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్ పీఎస్కు బదిలీ చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం బీహార్ వెళ్లగా అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణు ఏప్రిల్ 25న రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. -
కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్.. కానీ..
సాక్షి,విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలిసిపోయిందనే ఉద్దేశంతో ఎలాగైనా భర్తను కడతేర్చాలని ప్రియుడితో కలిసి ఆ కాలాంతకురాలు పథకం పన్నింది. పథకంలో భాగంగా మరో ఇద్దరి సాయం తీసుకుని, భర్త ఎముకలు విరగ్గొట్టించి, రైలు పట్టాలపై పడేసేలా చేసింది. అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు, పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులకు బదలాయించారు. దీంతో విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేసి కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చినట్లు నిర్ధారించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ టీఎస్.మంగవేణి ఆదివారం వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిమ్స్ వైద్యకళాశాలలో క్లర్క్గా పనిచేస్తున్న అట్టాడ చంద్రశేఖర్ కుటుంబం నెల్లిమర్ల డైట్ కళాశాల సమీపంలో అద్దెకు ఉంటోంది. గతంలో నెల్లిమర్ల పట్టణంలోని గొల్లవీధిలో కిలాని సూరి ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ సమయంలో సూరి రెండో కుమారుడు రాంబాబుతో మృతుడు చంద్రశేఖర్ భార్య అరుణజ్యోతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం చంద్రశేఖర్కు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్ని అమలు చేసేందుకు ప్రియుడి స్నేహితుడు అదిలాబాద్ జిల్లాకు చెందిన, నెల్లిమర్లలో స్ధిరపడిన ఎర్రంశెట్టి సతీష్తో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భర్తను చంపేందుకు డబ్బులు అవసరమని తల్లి సత్యవతిని మృతుడి భార్య జ్యోతి అడగ్గా తన వంతుగా రూ.20వేలు ఇచ్చింది. డైట్ కళాశాల శివారుకు తీసుకువెళ్లి.. చంద్రశేఖర్ను గత నెల 24న రాత్రి డైట్ కళాశాల శివారు ప్రాంతానికి జ్యోతి ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్లు తీసుకువెళ్లి మద్యం తాగారు. అనంతరం పథకం ప్రకారం ఐరన్ రాడ్లతో పక్కటెముకలు, తలపై బలంగా కొట్టి కత్తిపోట్లు పొడిచి, ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్పై మృతదేహాన్ని పడేసి, సమీపంలో మృతుడి ఐడీకార్డులు విసిరేసి పరారయ్యారు. మరుసటిరోజు ఉదయం స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులకు కేసు అప్పగించారు. రూరల్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేయడంతో నిందితులు నేరం అంగీకరించారు. దీంతో మృతుడి భార్య అరుణ జ్యోతి, ఆమె తల్లి సత్యవతి, ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్లను అదుపులోకి తీసుకున్నారు. కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన నెల్లిమర్ల ఎస్సై పి.నారాయణరావు, ఏఎస్సై ఎ.త్రినాథరావు, హెచ్సీలు వి.శ్యామ్బాబు, ఆర్.రామారావు, కానిస్టేబుల్ షేక్షఫీలను సీఐ మంగవేణి అభినందించారు. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. -
ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!
సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్): మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని లోకాయుక్త కాలనీలో ఇటీవల వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన డబ్బులు ఐదు వేల రూపాయలను చోరీ చేయడంతో కోపోద్రిక్తుడై ఓ యువకుడు బండరాయితో తలపై మోది ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్పురా చంద్రనగర్కు చెందిన మాదారు ఉషయ్య అనురాధ (42) ఇళ్లల్లో పని చేస్తోంది. ఏప్రిల్ 24న రాత్రి 11 గంటలకు ఆమె సంతోష్నగర్ ఐఎస్సదన్ వద్ద నిలబడి ఉండగా బడంగ్పేట శ్రీవిద్యానగర్ టౌన్షిప్లో అద్దెకు ఉండే మహబూబ్నగర్ తిరుమలగిరి పెద్దబావి తండాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు జార్పుల మాంజానాయక్ (27) అక్కడికి వచ్చాడు. తనతో గడిపితే రూ.1000 లు ఇస్తానని బేరం కుదుర్చుకొని అనురాధను తన గదికి తీసుకెళ్లాడు. చెప్పినట్టే రూ.వెయ్యి చెల్లించాడు. అనంతరం అనురాధ మాంజా నాయక్ పర్స్ నుంచి రూ.5 వేలు తీసుకుని పారిపోతుండగా నాయక్ ఆమెను వెంబడించి బడంగ్పేట లోకాయుక్త కాలనీలోని ఒక ఓపెన్ ప్లాట్ వద్ద పట్టుకున్నాడు. తన డబ్బులు ఇవ్వాలని అడుగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నాయక్ ఆమెను తోసివేసి బండరాయితో తలపై మోది హత్యచేసి పరారయ్యాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా మాంజా నాయక్ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసును త్వరగా ఛేదించిన మీర్పేట ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి, డీఐ రామకృష్ణ, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు. చదవండి: Hyderabad Gang Rape: ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం -
సంతానం కలగలేదని.. భర్త ఎంత ఘోరం చేశాడు
బళ్లారిఅర్బన్(బెంగళూరు): సంతానం కలగలేదని ఓ కిరాతకుడు భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ఇక్కడి శాస్త్రినగర రెండో క్రాస్లో బీజాపుర జిల్లా ఇండి తాలూకా కేరవార గ్రామానికి చెందిన వీరేశ్, భార్య సునంద నివాసం ఉంటున్నారు. ఇతను ఆర్టీసీ డ్రైవర్. 15 ఏళ్లుగా సంతానం కలగలేదని దంపతుల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంపై గొడవపడ్డారు. క్షణికావేశంలో వీరేశ్, భార్య గొంతు నులిమి హత్య చేశాడు. శనివారం ఉదయం సునంద బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కౌల్బజార్ సీఐ సుభాష్, మహిళ పోలీస్ స్టేషస్ సీఐ వాసు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ఆన్లైన్ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో.. -
అర్ధరాత్రి ఇంటికి ప్రియుడు వచ్చి.. ఆ సమయంలో..
మండ్య(బెంగళూరు): జిల్లాలోని మద్దూరు తాలూకా ఆతగూరు హోబలి కెస్తూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్రామ పంచాయతీ డి గ్రూపు ఉద్యోగిని సుమ (38) హత్యకు గురైంది. శనివారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈమె భర్త రాజణ్ణ డి.గ్రూప్ ఉద్యోగిగా పనిచేసేవాడు. వీరికి యోగేశ్ అనే టెన్త్ చదివే కుమారుడు హాస్టల్లో ఉంటున్నాడు. రాజణ్ణ గతంలో చెరువులో చేపలు పడుతూ మునిగిపోయి మరణించాడు. తరువాత ఆమెకు భర్త ఉద్యోగం లభించింది. అర్ధరాత్రి ఆమె ఇంటికి ప్రియుడు వచ్చాడని, ఆ సమయంలో గొడవ పడి హత్యచేశాడని సమాచారం. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, 2017లో సుమ కొప్ప గ్రామ పంచాయతీలో జీపీ అధ్యక్షుడు చంద్రహాస్ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. మండ్య సెషన్స్ కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు వీగిపోవడంతో చంద్రహాస్ విముక్తుడయ్యాడు. చదవండి: హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్ -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి ఉండాలని..
సాక్షి,తిరుమలాయపాలెం(ఖమ్మం): తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త తాగే మద్యంలో విషం (కుక్కలను సంహరించే మందు) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు గ్రామానికే చెందిన పంచాయతీ వాటర్మెన్ ఓర పాపయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడటంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాపయ్యతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్యక్తి వద్ద కుక్కల మందు కొనుగోలు చేసి గతనెల 30న రాత్రి సమయంలో షేక్ మస్తాన్ ద్వారా ఓ మద్యం బాటిల్లో కలిపి కనకరాజుకి ఇవ్వాలని చెప్పి పంపించారు. ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్లాక కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, మద్యంలో విషం కలిపి ఉంటారని తల్లి భద్రమ్మ ఫిర్యాదు చేసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే విజయ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసుల వి చారణలో తేలింది. దీంతో ఓర పాపయ్య, దావా విజయను సోమవారం అరెస్టుచేసి రిమాండ్కు త రలించినట్లు కూసుమంచి సీఐ సతీశ్ తెలిపారు. చదవండి: ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట్యూబ్ చూసి.. ఆ తర్వాత -
పండుగ కోసం సొంతూరికి.. తమ్ముడి ప్రేమ వ్యవహారంలో..
మైసూరు: తమ్ముని ప్రేమ వ్యవహారానికి అన్న బలి అయ్యాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలోని హొసూరు లేఅవుట్లో జరిగింది. వివరాలు.. చిక్కరాజు (30) అనే వ్యక్తి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఉగాది పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. చిక్కరాజు తమ్ముడు తమ కూతురిని ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి మహదేవ నాయక్, సోదరులు కిరణ్, అభిషేక్లు చిక్కరాజుతో గొడవపడ్డారు. చిక్కరాజును కత్తితో పొడవడంతో అక్కడే మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. గుండ్లుపేటె పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. బైక్ ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి తుమకూరు(బెంగళూరు): పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్తున్న ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన కుణిగల్ తాలుకా హుందనగర గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ఒకే బైక్పై వెళ్తూ అదుపు తప్పి ప్రహరీను ఢీకొంది. ప్రమాదంలో నవీన్ గౌడ (15) మృతి చెందాడు. దర్శన్, శరత్గౌడ అనే ఇద్దరు గాయపడ్డారు. ఆ ఇద్దరినీ ఆదిచుంచునగిరి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా? -
తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..
హోసూరు(బెంగళూరు): హోసూరులో గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడు హోసూరు సీతారామ్దిన్న కాలేకుంట ప్రాంతానికి చెందిన యారబ్. కొన్ని సంవత్సరాల క్రితం శ్యానసంద్రంకి చెందిన సంతోష్ (20) సోదరి అశ్వినిని అదే ప్రాంతానికి చెందిన అవాస్ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లకు హత్య చేసి జైలుకెళ్లాడు. గత శుక్రవారం రాత్రి సంతోష్తో కలిసి మద్యం తాగుతూ యారబ్ మీ అక్క అశ్వినిని హత్య చేసేందుకు తాను సహకరించానని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన సంతోష్ యారబ్ మైకం నుంచి తేరుకునే లోపు ఆ పరిసరాల్లోని బండరాతితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో ఘటనలో.. సైబర్ మోసగాడు అరెస్టు హోసూరు: ఈ–మెయిల్ని హ్యాక్ చేసి ఎలక్ట్రికల్ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్ చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరుకు దినేష్కుమార్ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్ (24) అనే యువకున్ని అరెస్ట్ చేశారు. చదవండి: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో.. -
పూటుగా మద్యం తాగి.. సెల్ఫోన్ కోసం గొడవ..
సాక్షి, జగద్గిరిగుట్ట (హైదరాబాద్): సెల్ఫోన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద సోమవారం భూక్య భీమా(45), తన స్నేహితుడు ఫుల్గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. వైన్స్ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్ను చెక్ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు. చదవండి: న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు -
ఏమైందో తెలియదుగాని భార్య చేతిలో భర్త హతం
వివాహ సమయంలో ఏడడుగులు నడిచి జీవితాంతం సుఖసంతోషాలతో ఉంటామని ఒక్కటైన భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి కాస్త చినికిచినికి గాలివానయ్యాయి. వివాదం దిశ పోలీసుస్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి సంసారం సాగించాలని సూచించారు. అంతా మారినట్టే కనిపించింది. ఇంతలోనే ఏమైందో తెలియదుగాని భార్యే భర్తను హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ(విజయనగరం): విజయనగరం మండలం ధర్మపురి గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు డెంకాడ మండలంలోని చింతలవలస ప్రాంతంలో గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు, ఇతర వర్గాలు అందించిన వివరాలు... ధర్మపురం గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు(40)కు డెంకాడ మండలం చింతలవలస గ్రామానికి చెందిన రామయ్యమ్మతో 13 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో వీరి కేసు దిశ పోలీసుస్టేషన్కు వెళ్లింది. భార్యాభర్తల వివాదం కావడంతో సర్ది చెప్పి చక్కగా కాపురం చేసుకోవాలని సూచించి పంపించారు. ఈ క్రమంలో రామయ్యమ్మ కొంతకాలం కన్నవారి ఇంట, కొంతకాలం భర్త వద్ద ఉంటూ వస్తోంది. ఇలా వివాదాల నడుమే వీరి కాపురం సాగుతోంది. భార్య రామయ్యమ్మ ప్రస్తుతం కన్నవారి ఇంట చింతలవలసలో ఉంది. గురువారం రాత్రి రామయ్యమ్మను ధర్మపురికి రావాలని భర్త సూరిబాబు కోరడంతో వారి మధ్య మరోసారి వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. చివరకు సూరిబాబుతో కలిసి రామయ్యమ్మ గురువారం రాత్రి చింతలవలస నుంచి ధర్మపురికి బయలుదేరింది. మార్గమధ్యలో చింతలవలస శ్మశాన వాటిక రోడ్డు వద్దకు వచ్చేసరికి రామయ్యమ్మ తన అన్న సాయంతో సూరిబాబుపై కర్రలతో దాడి చేసి హతమార్చింది. దర్యాప్తు ముమ్మరం సూరిబాబును హత్య చేయడంలో భార్య రామయ్యమ్మతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై లోతైన విచారణ పోలీసులు చేస్తున్నారు. సూరిబాబు హత్య కేసులో రామయ్యమ్మ పాత్ర నిర్ధారణ కాగా, అన్న పరిశినాయుడుతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పద్మావతి తెలిపారు. రామయ్యమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ హత్యకు గురైన గేదెల సూరిబాబు మృతదేహాన్ని భోగాపురం సీఐ కేకేవీ విజయ్నాథ్, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు పద్మావతి, మహేష్ పరిశీలించారు. ఎస్ఐ పద్మావతి కేసు నమోదు చేయగా, సీఐ విజయ్నాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. -
భర్త వేధింపులు.. తమ్ముడితో కలిసి..
సాక్షి, మీర్పేట(రంగారెడ్డి): వేధింపులకు గురిచేస్తున్నారని బావను హతమార్చిన అక్కాతమ్ముడిని మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ సత్యసాయినగర్ కాలనీకి చెందిన సభావత్ సరోజ, జరుప్లావత్ శ్రీను అక్కాతమ్ముడు. సరోజ భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న టైల్స్ షాపులో పనిచేస్తున్నారు. చంపాపేట కృష్ణానగర్ కాలనీకి చెందిన కొడావత్ రెడ్యా (45) మొదటిభార్య చనిపోవడంతో పదేళ్ల క్రితం సరోజ, శ్రీనుల సోదరి అయిన లక్ష్మీని ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్యా కూడా టైల్స్ షాపులో పనిచేస్తుంటాడు. రెడ్యా కొంత కాలంగా సరోజతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రెడ్యా తరచూ మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న శ్రీను అనవసరంగా ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడని, మరోసారి వస్తే తగిన బుద్ధిచెబుతామని పలుమార్లు రెడ్యాతో పాటు కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. అయినప్పటికీ రెడ్యా తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ నెల 2న రాత్రి మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. దీంతో విసుగెత్తిన సరోజ, శ్రీనులు బావ రెడ్యాను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెడ్యాపై రోటీ కర్రతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇద్దరూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న బావ రెడ్యాను హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మధ్యాహ్నం రెడ్యా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సరోజ, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించగా రెడ్యా మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తాళలేకనే దాడి చేసి హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని సోమవారం రిమాండ్కు తరలించారు. -
దొంగతనం కోసం వచ్చి.. తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి..
సాక్షి,భీమడోలు(పశ్చిమగోదావరి): దొంగతనం కోసం వచ్చి నిద్రిస్తున్న మహిళను హత్య చేసిన దారుణ ఘటన గుండుగొలనులో శుక్రవారం పట్టపగలు జరిగింది. గుండుగొలనులోని వినాయకుని గుడి ఎదురు రోడ్డులో ఉద్దరాజు నాగమణి(54), సూర్యనారాయణరాజు దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సూర్యనారాయణరాజు ఆక్వా రైతు వద్ద గుమాస్తాగా ఉంటున్నాడు. దీంతో రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతూ బయట తలుపుకు గెడ పెట్టి వెళ్లిపోయాడు. దుండగుడు(లు) గెడ తీసుకుని లోపలకు ప్రవేశించి బీరువాను పగులగొట్టాడు. ఈ అలికిడికి నిద్రలేచిన నాగమణి కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతను ఆమె నిద్రిస్తున్నమంచంపైగల తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీనితో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఆమె మెడలోనినానుతాడు, గొలుసు, చెవిదిద్దులు 4 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.4 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ ఇంటి పనిమనిషి రాగా నాగమణి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న సీఐ ఎం.సుబ్బారావు, భీమడోలు, దెందులూరు ఎస్సైలు వీఎస్వీ భద్రరావు, ఐ.వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలూరు డీఎస్పీ దిలీప్కిరణ్ వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్యాడ్ టీమ్ హత్య అనంతరం పరారైన నిందితుడి మార్గాన్ని గుర్తించారు. ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ హత్య కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎస్సై భద్రరావు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితులు ఒకరా, ఇద్దరా అనేది తెలియాల్సి ఉందన్నారు. -
పక్కస్కెచ్ వేసి తండ్రిని చంపిన కూతురు
-
భార్య చేతిలో రియల్టర్ దారుణ హత్య.. అందుకే చంపానని లొంగిపోయింది
రెండో భార్య చేతిలో ఓ రియల్టర్ ను అతని రెండో భార్య ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది.అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కర్ణాటక లోని గళూరు జిల్లా మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి రాజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35)ని రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల తన భర్త తనకి శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే నేత్రను మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు నేత్ర అంగీకరించక పోవడంతో ఈ విషయమై వారిద్దరికి గొడవ కూడా జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన ఆమె అతను నిద్రిస్తున్న సమయంలో తన భర్త ని రాడ్ తో కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నేత్ర, రాజ్లకు ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఆస్తి తగాదాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయని, ఇదే హత్యకు కారణమని రాజ్ మొదటి భార్య సత్యకుమారి పోలీసులకు తెలిపారు. ఆమె మదనాయకనల్లి పోలీసులకు కేసు నమోదు చేసిందని దర్యాప్తు అధికారి తెలిపారు. -
సిరియాలో సైన్యం లక్ష్యంగా బస్ బాంబు పేలుడు
డమాస్కస్: సిరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన బస్ బాంబు దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని నగరం డమాస్కస్లో బుధవారం ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం రద్దీ సమయంలో డమాస్కస్లోని ఒక జంక్షన్ వద్ద ఈ పేలుడు జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న ఒక బస్కు ముందుగానే ఆగంతకులు రెండు శక్తివంతమైన బాంబులను అమర్చారు. సైనికులతో బస్సు కదులుతుండగా ఆ బాంబులను పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది సైనికులు మరణించారు. సిరియా అధ్యక్షుడు బషర్–అల్–అస్సద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష సాయుధ కూటములు, జిహాదీ సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అధీనంలోని ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఓ పట్టణంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు, ఒక మహిళ చనిపోయారు. -
శ్రీనగర్లో దారుణం
శ్రీనగర్: శ్రీనగర్లో ఉగ్రవాదులు సామాన్య పౌరులే లక్ష్యంగా మరో దారుణానికి తెగబడ్డారు. గురువారం ఉదయం నగరం నడి»ొడ్డున ఉన్న పాఠశాలలోకి చొరబడి మహిళా ప్రిన్సిపాల్, మరో టీచర్ను కాల్చి చంపారు. శ్రీనగర్లోని ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉదయం ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉండటంతో ఆ సమయంలో విద్యార్థులెవరూ పాఠశాలలో లేరు. క్లాసులు చెప్పడానికి సిద్ధమవుతున్న ప్రిన్సిపల్ సుపీందర్ కౌర్, మరో టీచర్ దీపక్ చాంద్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మైనారీ్టలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉండడంతో లోయలో భయాందోళనలు పెరిగాయి. ఉగ్రవాదులు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాంగ్ సింగ్ అన్నారు. లోయలో భయభ్రాంతుల్ని సృష్టించడానికే ఈ దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే నెలకొంటున్న శాంతిని భగ్నం చేయడానికి పాక్ ఆడిస్తున్నట్టుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని డీజీపీ అన్నారు. లోయలో వరుస దాడులు గత అయిదు రోజుల్లో కశీ్మర్ లోయలో జరిగిన వేర్వేరు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. ఈ ఏడుగురిలో నలుగురు మైనార్టీ వర్గానికి చెందినవారు. పాఠశాలలో ప్రాణాలు కోల్పోయిన సుపీందర్ కౌర్ శ్రీనగర్కు చెందిన సిక్కు కాగా, దీపక్ చాంద్ హిందువు. రెండు రోజుల క్రితం ప్రముఖ కశ్మీర్ పండిట్ మఖాన్లాల్ బింద్రూని కాల్చి చంపడం, అదే రోజు మరో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకోవడం కలకలం రేపింది. ఈ దాడులపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కశీ్మర్లో హింస పెరిగిపోతోంది. పెద్ద నోట్లు, ఆర్టికల్ 370 రద్దు ఉగ్రవాదుల్ని నిరోధించలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతని కలి్పంచడంలో పూర్తిగా విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు. -
మూడు నెలల క్రితం పెళ్లి.. భార్యను గొడ్డలితో నరికి, ఆపై..
బెర్హంపూర్(భువనేశ్వర్): కలకలాం కలిసుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలెట్టారు. అంతలో ఏమైందో.. భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ విషాద ఘటన ఒరిస్సా చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలోని సొడక్ గ్రామంలో.. బిపిన్, లలికి ఈ ఏడాది మే 24 న వివాహం జరిగింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కొంత కాలం నుంచి వారు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలీదు గానీ.. బిపిన్ తన భార్యను గొడ్డలితో నరికేసి, అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం బిపిన్ తండ్రి ఇంట్లోకి రాగానే వీరిద్దరూ విగతజీవులుగా ఉండడం చూసి పోలీసులకు, లిలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ హత్య, ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: తండ్రిపై పోలీస్స్టేషన్లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై తన ఇంట్లోనే..
సాక్షి, మాలూరు(బెంగళూరు): మైనర్ బాలికను యువకుడు అత్యాచారం చేసి ఉరివేసి చంపాడు. ఈ ఘోరం తాలూకాలోని మాస్తి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. భిన్నహళ్లి పంచాయతీ నిడమాకలహళ్లి గ్రామంలో 16 ఏళ్ల బాలికను అదే గ్రామవాసి మంజునాథ్ (27) అనే యువకుడు ఇంట్లో ఒక్కతే ఉండగా వచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలిపనుల కోసం వేరే ఊరికి వెళ్లారు. అత్యాచారం అనంతరం నేరం బయటపడుతుందని యువకుడు బాలికను ఇంట్లోనే చీరతో పైకప్పు కొక్కేనికి ఉరివేసి చంపినట్లు పోలీసులు చెప్పారు. నిందితునికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తూ కరోనా వల్ల వదిలేసి వచ్చాడు. హత్య విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు నిందితుని ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో డీఎస్పీ రమేశ్, సీఐ వసంత్, ఎస్ఐ అనిల్ వెళ్లి నిందితునిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చాడు
సాక్షి, మల్కన్గిరి: మద్యం మత్తులో ఏకంగా తన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన జిల్లాలోని మల్కన్గిరి సమితి, పలకొండ గ్రామానికి చెందిన ఇంగ మడకామి.. తన తండ్రి బీమా మడకామితో ఆస్తి విషయమై గొడవపడ్డాడు. ఇది క్రమక్రమంగా పెరిగి ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వచ్చింది. ఈ క్రమంలో ఒకానొక దశలో కోపోద్రేకుడైన ఇంగ మడకామి తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బీమా మడకామి కాసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహం తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
దారుణం: నిద్ర మాత్రలిచ్చి కుటుంబ సభ్యులనే కిరాతకంగా..
కోల్కతా: అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి కిరాతకంగా కడతేర్చాడు. ఈ ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం పశ్చిమ బెంగాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆసిఫ్ మొహమ్మద్ తన కుటుంబానికి కాలయముడిగా మారాడు. నాలుగు నెలల క్రితం ఆసిఫ్ తన తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేశాడు. కాగా ఈ సంఘటన నుంచి నిందితుడి సోదరుడు ఆరిఫ్ మొహమ్మద్ తప్పించుకున్నాడు.. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న అతని సోదరుడు.. కాలియాచోక్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28 న, ఆసిఫ్ కుటుంబ సభ్యులందరికీ నిద్ర మాత్రలు కలిపిన శీతల పానీయాలను అందించాడు. వారు అపస్మారక స్థితిలో చేరడంతో, అతి కిరాతకంగా హత్య చేసి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఆసిఫ్ నిత్యం తన తండ్రి డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ యాక్టర్స్ అరెస్టు -
వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..
నాగర్కర్నూల్ క్రైం: ఆలనాపాలనా చూడాల్సిన తండ్రే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న కొడుకులను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల మణికట్టు కోయగా.. ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నాగర్కర్నూల్ జిల్లా మంతటిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం మంతటికి చెందిన శివశంకర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి గడ్డంపల్లికి చెందిన స్వప్నతో ఎనిమిదేళ్ల కింద వివాహం కాగా, మల్లికార్జున్ (7), ప్రణయ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. శివశంకర్ మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధానికి అలవాటుపడటంతో స్వప్న 3 నెలల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకులను శివశంకర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఇద్దరి కుమారుల కుడిచేతి మణికట్టును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రి పుల్లయ్యకు ఫోన్చేసి చెప్పగా.. వెంటనే వారు పక్క గదిలోకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లికార్జున్ మృతి చెంది ఉన్నాడు. గాయపడిన ప్రణయ్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో చెరువుకట్ట వద్ద శివశంకర్ను గుర్తించిన గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐలు విజయ్కుమార్, రాజులు పరిశీలించి వివరాలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివశంకర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( చదవండి: బెంగళూరులో హత్య, హైదరాబాద్లో గాలింపు! ) -
బిడ్డను బావిలో తోసి హత్య.. తల్లికి యావజ్జీవం
తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03). రెండవ కుమారుడు అఖిల్ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది. చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం -
అడవి పంది.. చంపాలంటే ఇబ్బంది!
రాష్ట్రంలో పెద్ద పులి ఒక వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా కొన్ని శరీరభాగాలను భక్షించడం కలకలాన్ని సృష్టించింది. ఆ పులిని గుర్తించి బంధించేందుకు అటవీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. పులి దాడి చేసి చంపిన అదే (కొమురం భీం ఆసిఫాబాద్) జిల్లాలోని అదే దహెగాం మండలం చిన్న ఐనం గ్రామంలో తన పొలం లో పనిచేసుకుంటున్న కె.జితేందర్ (33) అనే రైతుపై ఈ నెల 15న అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అతడు చనిపోయాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అడవి పందుల బెడద విపరీతంగా పెరిగింది. అడవుల పక్కనుండే పల్లెల్లోని ప్రజలు తమ ప్రాణాలను, పంటలను వీటి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఈ సమస్య పెరుగుతోంది. ఈ అంశంపై వ్యవసాయ, అటవీ శాఖలు దృష్టి సారించాయి. షెడ్యూల్–3 నుంచి మార్చితేనే.. రక్షిత జంతువుల జాబితాలో అడవి పందిని చేర్చడంతో ప్రభావిత ప్రాంతాల్లో వాటిని సంహరించేందుకు అటవీ చట్టాలు అడ్డొస్తున్నాయి. వీటిని చంపడం ఈ చట్టాల మేరకు నేరం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్–3లో ఉన్న అడవి పందిని షెడ్యూల్–5లోకి (వెర్మిన్లోకి చేర్చి తే) మార్చితే పరిమిత ప్రాంతాల్లో హతమార్చే అవకాశాలుంటాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో వీటి వల్ల ఏయే జిల్లాల్లోని ఏయే ప్రాంతా ల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది? ఇతరత్రా రైతులు, ప్రజ లకు ఎదురవుతున్న సమస్యలేమిటి అన్న దాని పై నివేదిక సిద్ధం చేసే పనిలో అటవీశాఖ నిమగ్నమైంది. (ఆ రెండిటి మధ్య అత్యంత అరుదైన పోరు) ఏమిటీ వెర్మిన్..? పంటలు, వ్యవసాయంలో సహాయపడే పశువులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులకు నష్టం కలుగజేసే.. ఆస్తులు, ఇతర ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధులు, రోగాల వ్యాప్తికి కారణమయ్యే జంతువులు, పక్షులను ‘వెర్మిన్’గా ప్రకటించవచ్చు. ఈ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే, పరిమిత కాలం పాటు వేటగాళ్ల సాయంతో వెర్మిన్లను వేటాడేందుకు అనుమతి లభిస్తుంది. గతంలో పలు రాష్ట్రాలు తగిన సమాచారం, పంటలు, ఇతరత్రా జరుగుతున్న నష్టంపై సమగ్ర వివరాలు పంపకుండానే కొన్ని రకాల జంతువులను ‘వెర్మిన్’గా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తులపై కేంద్రం ఆ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా చాలా సమయమే పడుతోం ది. ఈ నేపథ్యంలో అటు వ్యవసాయశాఖ, ఇటు అటవీశాఖ ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీ గా జరుగుతున్న నష్టంపై వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. (లాప్టాప్ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..) ఈ నివేదిక సిద్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, సర్కార్ ఆమోదంతోనే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి అనుమతే కాకుండా రాష్ట్రప్రభుత్వ ఆమోదం మేరకు అడవి పందుల వల్ల అధిక నష్టం జరుగుతున్న ప్రాంతాల్లో, పరిమిత కాలానికి వీటిని వేటగాళ్లతో చంపించేందుకు అవకాశం కూడా ఉంది. ఈ వన్యప్రాణులు, పక్షులను ‘వెర్మిన్లు’గా ముద్రవేసి చంపడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. కూరమృగాలు, వన్యప్రాణుల నుంచి పంటల రక్షణ, రైతులపై ప్రాణాంతక దాడుల నివారణకు ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్ప్రదేశ్లకు కొన్ని జంతువులను వెర్మిన్లో చేర్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతినిచ్చిం ది. ఈ రాష్ట్రాలతో పాటు గతంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రైవేట్ షూటర్లు, వేటగాళ్లతో కొన్ని జంతువులను చంపేందుకు అనుమతినిచ్చాయి. వివరాలు రాగానే నివేదిక.. అడవి పందులను తాత్కాలికంగా వెర్మిన్ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.. అయితే దానికి కేంద్రం అనుమతి కావాలి. రాష్ట్రంలో అడవి పందుల సమస్యలపై కొన్ని జిల్లాల ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి నివేదికలొచ్చాయి. పూర్తి వివరాలు, సమాచారం వచ్చాక ఓ నిర్ణయం తీసుకుంటాం.. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కూడా నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.– అటవీశాఖ వైల్డ్లైఫ్ విభాగం ఓఎస్డీ శంకరన్ -
70 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం, హత్య
భోపాల్: ఎన్ని చట్టాలు చేసిన, నిందితులని ఉరి తీస్తున్న దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్లోని పురాతన నగరం విదిశలో 70 ఏళ్ల వృద్దురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. వృద్దురాలి సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు. బుధవారం రాత్రి పొలానికి కాపలాకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె శరీరంలోని రహస్యప్రదేశాలలో తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ధమ్కికి రూ. 1000.. లేపేస్తే రూ.55,000
లక్నో: హోటల్కి వెళ్లినప్పుడు మనం మెను కార్డులు చూస్తూ ఉంటాం. ఒక్కో ఆహారానికి ఒకే రేటు. అలానే ప్రయాణాల సమయంలో, హోటల్స్, సినిమా థియేటర్లు ఇలా పలు చోట్ల మనం వేర్వేరు సర్వీసులకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలిపే డిస్ప్లే బోర్డులను చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు నేరాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. లేదంటే ఓ సారి ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ వెళ్లండి. అక్కడ మీకు ఓ గ్యాంగ్ కనిపిస్తుంది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. కాకపోతే వారు డిసైడ్ చేసినంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఏ క్రైమ్కి ఎంత చార్జ్ చేస్తారో వివరిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.(చదవండి: 'ఆంటీ' అన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది) దాని మీద ధమ్కి(బెదిరించడానికి)కి 1000 రూపాయలు, కొట్టడానికి 5,000 రూపాయలు, ఎవరినైనా గాయపర్చడానికి 10,000 రూపాయలు.. హత్యకు 55,000 రూపాయలు మాత్రమే అంటూ ఈ గ్రూపు పోస్టర్ విడుదల చేసింది. దాని మీద ఓ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా.. పక్కనే మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరంతా చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరిలో ఓ యువకుడు పీఆర్డీ జవాన్ కుమారుడిగా తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కేసు నమోదు చేశాం. సదరు యువకులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
భారత సంతతి వ్యక్తికి 28 ఏళ్ల జైలు
లండన్: తనతో విడిపోయిన భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 23 ఏళ్ల జిగుకుమార్ సోర్తి అనే భారత సంతతి వ్యక్తి తన భార్య భవిని ప్రవీన్ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వీధిలో కనిపించిన ఒక పోలీసు అధికారితో తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా పెరోల్ ఇవ్వడానికి కంటే ముందు 28 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ‘ఇది భయంకరమైన, క్రూరమైన, కనికరంలేని హత్య. కేవలం 21 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక అందమైన, ప్రతిభావంతులైన యువతి ప్రాణాలను దారుణంగా తీశారు’ అని జస్టిస్ తిమోతి స్పెన్సర్ బుధవారం లీసెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణలో భాగంగా జిగుకుమార్ సోర్తితో అన్నారు. లీసెస్టర్ నగరంలో నివసించిన భవిని ప్రవీన్ కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 2వ తేదీ 12:30 నిమిషాల సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన జిగుకుమార్ కొద్ది సేపు ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి, ఆ కత్తిని అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. పోలీసులకు స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు భవినిని హాస్పటల్లో చేర్పించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్ట్మార్టంలో ఆమెను అనేక సార్లు పొడవడంతో గాయాలయ్యి మరణించినట్లు వెల్లడయ్యింది. చదవండి: తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు.. -
నాన్న చంపాలని చూస్తున్నారు : నటి వైరల్ వీడియో
సాక్షి, ముంబై: తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ టీవీ నటి పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపింది. ఈ మేరకు బరేలీకి చెందిన టీవీ, సినీ నటి తృప్తి శంఖధార్ (19) ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లితో కలిసి ఇనస్టా లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాలను పరిశీలిస్తే..తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని తన తండ్రి రామ్ రతన్ శంఖధార్ నిశ్చయించారనీ, అందుకు తాను నిరాకరించడంతో తనపై హత్యాయత్నం చేశారంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో వాపోయారు. తనపై దాడి చేసిన కొట్టాడని, తండ్రినుంచి తమ ప్రాణాలకు ముప్పుందని రక్షణ కల్పించాలని బరేలీ పోలీసులను వేడుకున్నారు. అంతేకాదు తనకిచ్చిన నగదును కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు తృప్తి తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్ రతన్ ఈ ఆరోపణలను ఖండించారు. కాగా టిక్ టాక్ స్టార్ కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న "ఓయ్ ఇడియట్'' సినిమాలో హీరోయిన్ గా తృప్తి నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
వడోదరలోని గ్యాస్ కర్మాగారంలో పేలుడు
వడోదర: గుజరాత్ వడోదర జిల్లాలోని ఓ మెడికల్ గ్యాస్ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్ గవాసద్ గ్రామంలోని ఎయిమ్స్ ఇండస్ట్రీస్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్ ఎస్పీ సుధీర్ చెప్పారు. -
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో అంటుకున్న కార్చిచ్చు ప్రస్తుతం ఆ దేశాన్ని అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా.. అయిదు రోజుల ప్రచారంలో భాగంగా ఆస్ట్రేలియాలోని 10వేల ఒంటెలను చంపాలని నిర్ణయించారు. కాగా బుధవారం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం కార్చిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయి. అందుకే వాటిని చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఒంటెలను చంపడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇదే అంశమై అనంగు పిజంజజరా యకుంనిజజరా(ఏపీవై) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ మరీటా బేకర్ స్పందిస్తూ.. ‘కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడిపోతుంది. దీనికి తోడు కార్చిచ్చు ద్వారా వస్తున్న వేడి , అసౌకర్య పరిస్థితులతో కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాము. ఒంటెలు మా కంచెలను పడగొట్టి ఇళ్ళలోకి ప్రవేశించి విచ్చలవిడిగా నీరు తాగడంతో పాటు ఏసీలను పాడు చేసి అందులోని నీటిని తాగుతూ తమ దాహర్తిని తీర్చుకొని వెళ్లిపోతున్నాయి. ఈ సమయంలో ఒంటెలు విడుస్తున్న వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనను మేము భరించలేకపోతున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.(కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే) గత నవంబర్లో కార్చిచ్చు అంటుకొని ఆస్ట్రేలియాలో పరిస్థితి అతలాకుతులమయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు కనీస నీటి అవసరాలు మిగల్చకుండా ఇళ్లపై దాడి చేస్తూ ఒంటెలు నీళ్లు తాగుతున్నాయి. అందుకే చట్ట బద్ద ప్రణాళికంగానే 10వేల ఒంటెలను చంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపానికి 12 మందికి పైగా తమ ప్రాణాలు పోగొట్టుకోగా, 480 మిలియన్ల జంతువులు కార్చిచ్చుకు బలైనట్లు తమ పరిశోధనలో తేలిందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశధకులు అభిప్రాయపడ్డారు. -
హొండురస్ జైల్లో 18 మంది ఖైదీల మృతి
టెగుసిగల్ప: సెంట్రల్ అమెరికాలోని హొండురస్ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. -
కిల్లర్ కోడలు
-
జెంయింట్వీల్ నుంచి జారిపడి యువతి మృతి
-
‘వాడి ఏడుపు వినలేకపోయాను.. అందుకే’
వాషింగ్టన్ : అమ్మా ఆకలి.. అమ్మా కడుపు నొప్పి అంటూ నోరు విప్పి చెప్పలేని పసిప్రాయం. తమకు ఏం జరిగినా ఏడుపు ద్వారానే వెల్లడిస్తారు చిన్నారులు. కానీ ఏడుపే ఆ చిన్నారి పాలిట యమపాశమయ్యింది. ఏడుస్తున్న బిడ్డను సముదాయించాల్సిన తల్లి కాస్తా బిడ్డను కడతేర్చింది. విషాదమేంటంటే ఇంటర్నెట్లో వెతికి మరి బిడ్డను చంపింది ఈ కసాయి తల్లి. ఈ విచారకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు. దాంతో ఆ పసివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. అయితే పిల్లాన్ని సముదాయించాల్సిన తల్లి కాస్తా ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్టబ్లో ముంచి చంపేసింది. అనంతరం ఆ పసివాడి మృతదేహాన్ని ఓ బ్యాగ్లో కుక్కి సమీపంలోని పార్క్లో వదిలేసి వచ్చింది. తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసలకు అరిజోనా మీద అనుమానం రావడంతో నిలదీశారు. అందుకు అరిజోనా తన కుమారుడు జారీ నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. కానీ ఆమె సెల్ఫోన్ పరిశీలించిన పోలీసులు అరిజోనానే హంతకురాలిగా గుర్తించారు. బిడ్డను చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్లో ‘అనుమానం రాకుండా చంపడం ఎలా.. కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి’ అనే అంశాల గురించి సర్చ్ చేసింది. దాంతో అరిజోనాను అరెస్ట్ చేసి విచారించిగా అసలు విషయం బయటకొచ్చింది. కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్టబ్లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది. నా కొడుకుకు సంబంధించి ఏ అచ్చటా.. ముచ్చటా చూడలేదు. ఈ నేరం చేసిన నా భార్యను జీవితాంతం జైలులోనే ఉంచాలి. అప్పుడే ఆమెకు నా బిడ్డ పడిన వేధన అర్థమవుతుంది అంటూ చిన్నారి తండ్రి విలపిస్తున్నాడు. -
మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య
రూస్ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో యూరోప్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బల్గేరియన్ మహిళా జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా దారుణంగా హత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను దుండగులు అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన రూస్ పట్టణంలో చోటుచేసుకుంది. మారినోవా బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని వెలికితీసి ఒక్కసారిగా ఐరోపాను ఉలిక్కిపడేటట్టు చేశారు మారినోవా. ప్రస్తుతం మారినోవా ‘డిటెక్టర్’ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దుండగలు మారినోవాను అమానవీయరీతిలో దారుణంగా హత్య చేశారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపిన కిరాతకులు, పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్కు సమీపంలో పడేశారు. అయితే మారినోవా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మారినోవా మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి. మారినోవా హత్య విషయం తెలిసిన బల్గేరియా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ కూడా బల్గేరియాను కోరాయి.