పార్కింగ్‌ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య | Scientist dies in Punjab after neighbour assaults him during parking dispute | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య

Published Thu, Mar 13 2025 12:57 PM | Last Updated on Thu, Mar 13 2025 1:17 PM

Scientist dies in Punjab after neighbour assaults him during parking dispute

మొహాలీ: పంజాబ్‌లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్‌-66లో బైక్‌ పార్కింగ్‌ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.

ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్‌ స్వర్ణకార్‌(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్‌. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్‌పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్‌ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్‌ కొనసాగుతున్నదని వారు తెలిపారు.

అభిషేక్‌ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్‌-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్‌పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్‌ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్‌  కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్‌​ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement